-
సిమెంటు వరలు, హాలో బ్రిక్స్లో ఇంటిపంటలు!
పెద్దగా ఖర్చు పెట్టకుండానే రసాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సొంతంగా ఇంటిపైనే పండించుకోవచ్చని ఈ ఇంటిపంటల తోటను చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీ(బీహెచ్ఈఎల్ దగ్గర)లో ఇండిపెండెంట్ హౌస్లో నివాసం ఉంటున్న గృహిణి లత తన అభిరుచి మేరకు తమ ఇంటిపైన స్వల్ప ఖర్చుతోనే సేంద్రియ ఇంటిపంటలను గత మూడేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. 3 సిమెంటు వరలను ఆకుకూరల మడులుగా మార్చేశారు. 1500 చదరపు అడుగుల టెర్రస్ పైన మూడు కార్నర్లలో హాలోబ్రిక్స్తో మడులు ఏర్పాటు చేసి తీగజాతి కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. పాలకూర, తోటకూర, కీర, వంగ, సొర కాయలతోపాటు.. పైనాపిల్ పండ్లు, ఆపిల్ బెర్ పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. డ్రమ్ములో నాటిన ఆపిల్ బెర్ మొక్క ఏడాదికి 3 సీజన్లలోనూ మంచి ఫలసాయాన్ని ఇస్తున్నదని ఆమె తెలిపారు. అంజూర మొక్క కూడా నిరంతరం పండ్ల దిగుబడినిస్తున్నదని తెలిపారు. సీతాఫలం మొక్కలను కూడా పెంచుతున్నారు. చెట్టుచిక్కుడు కాస్తున్నది. కీర దోస కాయలను సైతం తమ ఇంటిపైనే లత(96032 32114) సాగు చేస్తుండడం విశేషం. -
కూరగాయల సాగుపై దృష్టి
– కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్ జాన్సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ ప్రారంభం కావడం, వర్షాలు కురుస్తున్నందున సీజన్లో పందిరి జాతి కూరగాయల పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. కాకర, బీర, సొర, దోస, గుమ్మడి పంటలు ఎంపిక చేసుకుని సాగు చేసుకోవచ్చన్నారు. తీగ జాతి కూరగాయల పంటలు + కాకర విషయానికి వస్తే పూసాదో మౌసమి, కోయంబతూర్ లాంగ్ గ్రీన్, కోలాంగ్ వైట్, అర్కహరిత, ప్రియ, మైకోగ్రీన్ లాంగ్, హైబ్రీడ్ ఎంఎస్–431, ఎంబీటీహెచ్–101, 102, శ్వేత, శ్రేయ, పాలీ విత్తన రకాలు అనువుగా ఉంటాయి. + బీరలో అయితే జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్, అర్క సుజాత, హైబ్రీడ్స్ ఎంఎస్–3, 401, 403 రకాలు ఎంపిక చేసుకోవాలి. + సొరలో పూసా మంజరి, కావేరి, శారద, స్వాతి, శ్రామిక విత్తన రకాలు అనువైనవి. + దోసలో జపనీస్ లాంగ్ గ్రీన్, పాసఖీర, కో–1, హైబ్రీడ్స్ మైకో–4, మాలిని, సోలాన్ హైబ్రీడ్–1 రకాలు అనువుగా ఉంటాయి. + గుమ్మడిలో శక్తి, కో–1, కో–2 వంటి బూడిద గుమ్మడి రకాలు ఎంపిక చేసుకోవాలి. విత్తే సమయం : అనప, దోస, కాకర పంటలు జూన్, జూలై చివరి వరకు.. అలాగే జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి ఆఖరు వరకు విత్తుకోవచ్చు. గుమ్మడి, పొట్ల పంటలు జూన్, జూలై, డిసెంబర్, జనవరిలో వేసుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి జూన్ నుంచి ఆగస్టు మొదటి వారం.. అలాగే డిసెంబర్ రెండో పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. దొండ పంట జూన్, జూలై వరకు నాటుకోవచ్చు. విత్తే పద్ధతి : భూమిపై పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోయేందుకు రెండు మీటర్ల దూరంలో కాలువలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కోసం బోదెలు చేయాలి. అన్ని రకాల పాదుల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో మూడు విత్తనాలు పెట్టాలి. దొండ విషయానికి వస్తే చూపుడు వేలు లావు ఉన్న నాలుగు కణుపుల కొమ్మలు రెండేసి నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలు వర్షాధార పంటలకు 15 X 10 సెంటీమీటర్లు కొలతలు ఉన్న పాలిథీన్ సంచుల్లో విత్తుకుని 15 నుంచి 20 రోజులు పెరిగిన తర్వాత అదను చూసుకుని పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్, 5 గ్రాముల ఇమిడిక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే ముందు ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఎరువులు వేయాలి. 32 నుంచి 40 కిలోల నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసుకుని విత్తిన 25 నుంచి 30 రోజుల సమయంలో చల్లాలి. అనంతరం పూత, పిందె దశలో రెండో సారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఎరువులు వేసిన వెంటనే నీటి తడులు ఇవ్వాలి. -
పొలాలపై ఏనుగుల దాడి
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయింది. రాత్రి అయితే సరి ఏనుగుల గుంపు పొలాలపై పడి విధ్వంసం సృషిస్తుండడంతో వారు భయంతో వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి 15 ఏనుగులు బోయ చిన్ననాగులపల్లె, చింతమాకుల పల్లె గ్రామాల్లోని పంటలపై దాడులు చేశాయి. బీట్రూట్, ఇతర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. వాటిని అడవిలోకి పారదోలేందుకు గ్రామస్తులు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ రెండు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉండడంతో ప్రతీ రోజు ఇవి పొలాలపై దాడులకు దిగుతున్నాయి. అటవీ అధికారులు ఏనుగులను కట్టడి చేయడానికి గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement