-
ఆడవాళ్లంటే వంట చేయడానికే కాదు
‘‘మా గత చిత్రం ‘వైశాఖం’ నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆడియన్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఆ సినిమాలో ఇచ్చిన మెసేజ్ అందరికీ నచ్చింది. అంతకుముందు తీసిన ‘లవ్లీ’ అప్రిషియేషన్స్తో పాటు కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అయింది. ‘లక్కీ ఫెలో’ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద íß ట్ అవుతుంది’’ అని దర్శకురాలు జయ బి. అన్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జయ బి. తన కొత్త చిత్రం వివరాలను, ఇతర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ►ప్రస్తుతం కొత్త సినిమా ‘లక్కీ ఫెలో’ ప్రీ–ప్రొడక్షన్ పనులు చేస్తున్నాం. ఇది ‘వైశాఖం’ అంత లేట్ అవ్వదు. జూన్లో స్టార్ట్ చేసి నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేస్తాం. మనలో కొంతమందికి అనుకోకుండా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఆ వ్యక్తిని అందరం ‘లక్కీ ఫెలో’ అంటాం. ఈ సినిమాలో హీరో లక్కీ ఫెలో. ఆ లక్ను అతను ఎలా తీసుకుంటాడు? అన్నది కథాంశం. హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకొని కథ తయారు చేశాం. ►హీరోయిన్ది కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సమాజంలో ఆడవాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగని పెద్దవి ఉండవని కాదు. చిన్న సంఘటన అయినా మానసికంగా బాగా డిస్ట్రబ్ చేస్తుంది. టీనేజ్ అమ్మాయిలకైతే మరీను. హీరోయిన్ ఇలాంటి సెన్స్టీవ్ క్యారెక్టర్ని డీల్ చేస్తుంది. ఇప్పటివరకూ ఎవరూ ఈ పాయింట్ని టచ్ చేయలేదు. ఇప్పుడున్న యంగ్ హీరో హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటాం. ►నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ నుంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్తో పాటు అండర్ కరెంట్లో మెసేజ్ ఉంటుంది. త్వరగా సినిమాలు తీసేసి ఆ తర్వాత జనంలోకి వెళ్లి సమాజానికి ఉపయోగపడే పనులేవైనా చేయాలని ఉంది. నేను జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయి, జర్నలిజంలోకి వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మహిళా దర్శకుల సంఖ్య పెరగాలి. మగాళ్లు ఇంకా ఆడవాళ్లు అప్పడాలు చేయడానికి, వండటానికి మాత్రమే అనుకుంటున్నారు. ఆ ఆలోచనలో మార్పు రావాలి. -
అందుకే ఈ విజయం
– జయ .బి యూనివర్సల్ పాయింట్తో తీసిన ‘వైశాఖం’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సెంటిమెంట్ నచ్చింది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైంది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ విజయానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్తో సినిమా తీశారని రిలీజ్ రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ జయ బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. 8 -
వైశాఖం నా జీవితంలోంచి వచ్చిన సినిమా!
‘ఇప్పటివరకు మేం తీసిన సినిమాల కథలన్నీ సినిమా కోసం సృష్టించినవి. కానీ, ‘వైశాఖం’ అలా కాదు. నా జీవితంలోంచి వచ్చిన సినిమా. కొన్నేళ్ల క్రితం నా లైఫ్లో జరిగిన ఓ సంఘటన చుట్టూ రాసుకున్న కథ ఇది’’ అన్నారు జయ బి. ఆమె దర్శకత్వంలో హరీశ్, అవంతిక ‘వైశాఖం’ హరీశ్, జంటగా బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రకథకు కీలకంగా నిలిచిన ఇన్సిడెంట్ గురించి, ఇతర విశేషాలను జయ ఈ విధంగా పంచుకున్నారు. ఆ ముద్దు సీన్ గురించి ఎవరికీ చెప్పలేదు కొన్ని సీన్స్ తీసేటప్పుడు యూనిట్ మొత్తానికి చెబితే, అలర్ట్ అయిపోయి పని మీద సరిగ్గా దృష్టి పెట్టరు. ఉదాహరణకు ఈ సినిమాలో ఓ కిస్సింగ్ సీన్ ఉంది. హీరో, హీరోయిన్, కెమెరామేన్, నాకు, రాజుగారికి మాత్రమే ఆ సీన్ తీయబోతున్నామని తెలుసు. సీన్లో భాగంగా మాట్లాడుకుంటూ.. హఠాత్తుగా హీరోని హీరోయిన్ ముద్దు పెట్టుకుంటుంది. దాంతో నిజంగానే ఇద్దరూ లవ్లో పడ్డారేమోనని యూనిట్ సభ్యులనుకున్నారు. నేను ‘షాట్ ఓకే’ అనగానే, సినిమా కోసమే అలా చేశారని అందరికీ అర్థమైంది. ► అపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో ‘వైశాఖం’ తీయాలని ఎందుకు అనిపించింది? ► ఆ మధ్య రాజోలు దగ్గర మా ఊరు వెళ్లినప్పుడు అపార్ట్మెంట్లు కనిపించడం చూసి, షాకయ్యాను. ఈ కల్చర్ కరెక్ట్ కాదనడంలేదు కానీ, కరెక్టయిన వ్యక్తులు ఉన్నప్పుడే అపార్ట్మెంట్ లైఫ్ బాగుం టుంది. లేకపోతే మంచివాళ్లు ఇబ్బందులు పడతారు. అదే ఈ సినిమాలో చూపించాం. లవ్, కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా తీశాం. ► కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఈ చిత్రకథకు మూలం అన్నారు.. ఏంటా ఇన్సిడెంట్? అమ్మానాన్నా.. నేను, నా ఇద్దరు చెల్లెళ్లు ఓ అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. టైమ్ ప్రకారం నీళ్లు వదిలేవాళ్లు. నాన్నగారు హార్ట్ ఎటాక్తో చనిపోయినప్పుడు ఇంటి నిండా బంధువులు. అంతిమ క్రియలు జరుపుతున్న సమయంలో వాటర్ లేదు. అడిగితే, టైమ్ ప్రకారమే వదులుతామన్నారు. ఇంటి పెద్ద పోయిన బాధలో ఉన్న మమ్మల్ని ఊరడించాల్సింది పోయి రూల్స్ మాట్లాడారు. ఆ రోజు మేం పడిన బాధను మరచిపోలేను. ఇప్పటివరకూ ఏ సినిమా తీసినా నా మనసులో ఉండిపోయిన ఆ బాధతో సినిమా చేయాలనే ఆలోచన వెంటాడేది. ► మీ నాన్నగారి గురించి... నేను డైరెక్టర్ అయ్యానంటే కారణం ఆయనే. నాన్న (గొట్టిముక్కల నరసింహరాజు) గారికి డైరెక్టర్ అవ్వాలని ఉండేది. కానీ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయారు. నాకు జర్నలిజమ్ అంటే ఇంట్రస్ట్. చెన్నై యూనివర్శిటీలో జర్నలిజమ్లో డిప్లొమా చేశాను. ఆ తర్వాత ‘సూపర్ హిట్’ పత్రిక పెట్టి, సక్సెస్ అయ్యాం. నాన్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే డైరెక్టర్ అయ్యాను. ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటనతో ‘వైశాఖం’ తీసి, మా అమ్మగారికి అంకితం ఇచ్చాను. ఈ సినిమా చూసి, మా అమ్మగారు ఎమోషన్ అయ్యారు. మంచి సినిమా తీశావని అభినందించారు. ► క్లైమాక్స్ ఎమోషనల్గా అనిపించింది.. రమాప్రభగారు ఆ సీన్స్లో చేయడానికి ఒప్పుకున్నారా? రమాప్రభగారికి కథ చెప్పినప్పుడు చనిపోయినట్లు చూపించడంతో పాటు అంత్య క్రియలు చేస్తున్నట్లు చూపిస్తా మంటే, ఆమె ఒప్పుకున్నారు. ఆ సీన్ తీసిన రోజు ఆమెకు 104 ఫీవర్. ఆ సీన్ సినిమాకి ఎంత ఇంపార్టెంటో ఆమెకు తెలుసు. అందుకే చేశారు. అద్భుతంగా నటించారు. సాయికుమార్గారు ఫైర్ ఆఫీసర్గా చేయడం ఓ ప్లస్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన గురించి, క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎమోషనల్గా ఉందని చెమర్చిన కళ్లతో అంటున్నారు. ఇన్నేళ్లుగా నన్ను వెంటాడిన సంఘటనను సిల్వర్ స్క్రీన్ మీద చూపించడం, దాన్ని అందరూ అభినందించడం హ్యాపీగా ఉంది. అపార్ట్మెంట్లో నివశిస్తున్న కుటుంబాలు కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పిన మెసేజ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే!
– నాగార్జున ‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి 31 ఏళ్లు. రాజు, జయగార్లు అప్పట్నుంచి తెలుసు. మనకున్న అతికొద్ది మంది మహిళా దర్శకుల్లో జయగారు ఒకరు. ఆమె ఎప్పుడు కొత్తవాళ్లతో సినిమా లు తీసినా... హిట్టవుతూనే ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే కొత్త కథలు, ఆలోచనలతో వచ్చే దర్శకులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కొత్త చిత్రాలు, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. రేపు విడుదల కానున్న ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున యూనిట్ సభ్యులకు షీల్డులు అందించారు. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘రాజుగారి గది–2’ షూటింగ్, మీటింగ్స్లో బిజీగా ఉన్నా నాగార్జునగారు ఈ వేడుకకు వచ్చారు. నేనిది ఎప్పటికీ మర్చిపోలేను. ఏయన్నార్గారు, నాగార్జునగారు, నాగచైతన్యగారు, అఖిల్... అక్కినేని ఫ్యామిలీ అంతా మాకెప్పట్నుంచో సపోర్ట్గా ఉన్నారు. ఈ సినిమాకీ సపోర్ట్ చేశారు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాగార్జునగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. హైదరాబాద్లో మా ఫ్యామిలీ లేదు. బట్, నాగార్జునగారు ఈజ్ మై ఫ్యామిలీ’’ అన్నారు జయ. బి.5 -
వైశాఖంలో కాదు... మైనస్ డిగ్రీస్ చలిలో డ్యాన్స్ చేశా!
‘‘మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు... చీరల్లోనూ అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే వల్గర్గా కాకుండా ఎంత అందంగా చూపిస్తారనేది కెమెరామెన్, దర్శకుల చేతుల్లో ఉంటుంది. గ్లామరస్ రోల్స్ చేయడానికి నేను రెడీ. అయితే వల్గర్గా ఉండే గ్లామర్ రోల్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు హీరోయిన్ అవంతిక. హరీశ్ హీరోగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’లో ఆమే హీరోయిన్. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అవంతిక చెప్పిన విశేషాలు... ⇒ నేను పుట్టింది ఢిల్లీలో. మా నాన్నగారు ఎయిర్ఫోర్స్ ఆఫీసర్. తరచూ ట్రాన్స్ఫర్లు కావడంతో ఇండియా మొత్తం తిరిగేశాం. బెంగళూరులోని కాలేజీలో చదువుకున్నాను. కాలేజ్ డేస్లో స్పోర్ట్స్ పర్సన్ లేదా పైలట్ అవ్వాలనుకున్నాను. నేను స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ని. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే మనసు మార్చుకుని, హీరోయిన్గా ట్రై చేద్దామనుకున్నా.గతంలో నీలకంఠ డైరెక్షన్లో ‘మాయ’ సినిమా చేశాను. ‘వైశాఖం’ నా ఫస్ట్ కమర్షియల్ మూవీ. ⇒ బీఏ రాజుగారు, జయ మేడమ్ నా ఫొటోలు చూసిన రోజే హారీశ్ కాంబినేషన్లో ఫొటోషూట్ చేసి కథ, వినిపించారు. కథ విన్నప్పుడు మంచి క్యారెక్టర్ చేయబోతున్నాననే ఫీల్ కలిగింది. నా రియల్ లైఫ్కి దగ్గరగా భానుమతి క్యారెక్టర్ ఉంటుంది. క్లైమాక్స్లోని ఎమోషనల్ సీన్లో నాకు ఐదు పేజీల డైలాగ్స్ ఉన్నాయి. కొంచెం కష్టమనిపించినా జయగారి ప్రోత్సాహంతో సీన్ కంప్లీట్ చేశాను. చిన్నప్పుడు కథక్ నేర్చుకున్నాను. కానీ ఫిల్మ్ డ్యాన్స్ కష్టం. కజకిస్థాన్లో మైనస్ 6 డిగ్రీస్లో సాంగ్ షూట్ చేశాం. అదో మంచి ఎక్స్పీరియన్స్. ఏడాదిగా ‘వైశాఖం’ జర్నీ సూపర్. ⇒ నా డ్రీమ్ రోల్వారియర్ ప్రిన్సెస్. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్, మిలటరీ బ్యాక్డ్రాప్ ఉన్న పాత్రలంటే ఆసక్తి ఉంది. తమిళంలో ‘నెంజమెల్లామ్ కాదల్’ అనే సినిమా చేస్తున్నా. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement