-
బైక్పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆకతాయి పని..
సాంకేతిక ప్రపంచంలో సంచలనం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని వివిధ రకాలుగా, వివిధ పనుల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆకతాయి పని చేసి అరెస్ట్ అయి కటకటాలపాలయ్యాడో వ్యక్తి. ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ చాట్జీపీటీని ఉపయోగించి ఫేక్ వార్తలను రాసినందుకు చైనాలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. రైలు ప్రమాదం జరిగి 9 మంది మృతి చెందారని ఫేక్ వార్తా కథనాన్ని పోస్ట్ చేశాడు నిందితుడు. ఈ కథనం బైజియావో అనే బ్లాగ్ కు సంబందించిన ఖాతాలలో ప్రచురితమైంది. 15 వేల మంది ఈ తప్పుడు వార్తను చూశారు. క్లిక్బైట్ ద్వారా డబ్బు సంపాదించేందుకే తప్పుడు కథనాలను పోస్ట్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేయడం చైనాలో మొదటిసారిగా జరిగింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! హాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఓ వ్యక్తి తప్పుడు సమాచారాన్ని రూపొందించడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకున్నాడని దానిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసాడని ఉత్తర గన్సు ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో WeChatలో పోస్ట్ చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిందితుడు చేసిన ఆకతాయి పనికి అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సంఘటన చాట్ జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని మరోసారి తెలియజేసింది. -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
సెల్ టు హెల్
సాక్షి, హైదరాబాద్ : యువతను సెల్భూతం పట్టిపీడిస్తోంది. చేతిలో పెద్ద అణుబాంబుగా తయారైంది. అవసరం లేకపోయినా సెల్ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడటం.. గంటల తరబడి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో చాటింగ్స్ చేయడం...రాత్రంతా ఫోన్ను పక్కన పెట్టుకుని యూటూబ్లో వీడియోలు వీక్షించడం వల్ల అనేక రకాల ఎలర్జీ సమస్యలు తలెత్తుతున్నట్లు హైదరాబాద్లోని అశ్వినీ ఎలర్జీ సెంటర్ సర్వేలో తేలింది. ఇందుకోసం దాదాపు వంద మందిపై పరిశోధన చేశారు. వీరిని నాలుగు వారాల పాటు సెల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉంచి శారీరకంగా, మానసికంగా చోటు చేసుకున్న మార్పులను పరిశీలించారు. ఎన్నో సమస్యలు.. సెల్ఫోన్ వాడేవారిలో తలనొప్పి, ఏకగ్రాతను కోల్పోవడం, చికాకు, ముక్కు, కంటి నుంచి నీరు కారడం వంటి ఎలర్జీలను గుర్తించారు. ఫోన్కవర్ తయారీలో వాడే నికెల్ రసాయనంతోపాటు సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషనే ప్రధాన కారణమని గుర్తించారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఈ పరిశోధనా ఫలితాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. దెబ్బతింటున్న చర్మం.. సెల్ఫోన్ వాడకం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడుతుండగా, నిత్యం స్క్రీన్పై చేతివేళ్లు టచ్ చేస్తుండటం వల్ల అవి స్పర్శను కోల్పొతున్నారు. బాధితుల్లో 40 శాతం మంది ఎలర్జీ రైనటీస్(ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు బిగుసుకు పోవడం)తో బాధపడుతుంటే, 10 నుంచి 15 శాతం మంది ఎటోపిక్ ఆస్తమా(శ్వాస నాళాలు మూసుకు పోవడం)తో బాధపడుతున్నారు. సెల్ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఫేస్మేకర్ అమర్చుకున్న హృద్రోగులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పిల్లలపై తీవ్ర ప్రభావం... హైదరాబాద్ నగరంలో 1.20 కోట్ల జనాభా ఉండగా.. వీరిలో కోటి మందికిపైగా సెల్ఫోన్స్ వినియోగిస్తున్నట్లు ఓ అంచనా. వీరిలో పిల్లలు కూడా ఉంటున్నారు. అవలీలగా పిల్లలు సెల్ఫోన్ ఆపరేటింగ్ చేస్తున్నాడని చాలా మంది తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. వాళ్లు ఆపరేట్ చేస్తుంటే చెప్పుకొని మురిసిపోతుంటారు. నిజానికది చాలా ప్రమాదం. పిల్లల సున్నితమైన శరీరంపై సెల్ఫోన్ రేడియేషన్ తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మొబైల్ కవర్స్ తయారీలో నికెల్ రసాయనంతో కూడిన పూత రాస్తుంటారు. సెల్పోన్ను చెవులవద్ద, దవడ భాగంలో పెట్టుకుని మాట్లాడడం వల్ల చెవిపోటు, వినికిడి సమస్యతోపాటు దురద, దద్దుర్లు, తలనొప్పి, ముక్కుకారడం, ఆయాసం, చర్మం పొడిబారటం, వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొంత మంది తాము చాలా ఖరీదైన ఫోన్ వాడుతున్నాం కాబట్టి తమకు ఎలాంటి రేడియేషన్ సమస్యలు ఉండవని భావిస్తుంటారు. నిజానికి అది తప్పు. ఎంతటి ఖరీదైన ఫోనైనా రేడియేషన్ తప్పదు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కేవలం ప్రజారోగ్యంపైనే కాకుండా పక్షులు, పిచ్చుకలు, తేనేటీగలు, తుమ్మెదలు వంటి చిరు జీవులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సూచనలు పాటించండి.. సెల్ ఈజ్ హెల్ అని తేలిపోయినప్పటికీ..ప్రస్తుతం ఇది జీవితంలో భాగమైంది. ప్రస్తుతం దీన్ని వాడకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే, ఈ ముప్పు నుంచి కొంత వరకు బయటపడొచ్చు. నిరవధికంగా ఎనిమిది గంటల పాటు ఫోన్ మాట్లాడే వారికి చెవుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండు మూడు నిమిషాలకు మించి సెల్ఫోన్లో మాట్లాడరాదు. సాధ్యమైనంత వరకు ఎస్ఎంఎస్ చేయడం అలవాటు చేసుకోవాలి. వైర్లెస్ హెడ్ ఫోన్స్, బ్లూటూత్స్ వాడటం ఉత్తమం. చెవికి ఫోన్ దూరంగా ఉంచి మాట్లాడాలి. కారు నడుపుతున్నప్పుడు కానీ, బండి నడుపుతున్నపుడు కానీ సెల్ ఫో న్ యూజ్ చేయకూడదు. లౌడ్ స్పీకర్ను ఆన్ చేసి మాట్లాడ కూడదు. పడుకునేప్పుడు సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోవద్దు. – డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్రావు, అశ్విని ఎలర్జీ సెంటర్ -
ఇంటర్నెట్ను ఎక్కువగా వాడితే...
ఇంటర్నెట్ ఎక్కువగా వాడితే మనిషి సంతోషంగా ఉంటాడంటూ ఒక సర్వే తెలిపింది. అయితే అది వాడే విధానంపై ఆధారపడి ఉంటుందనీ, ఎంతసేపు ఇంటర్నెట్ బ్రౌజ్ చేశామన్నది కాదు, దేని గురించి సెర్చ్ చేశాం అన్నది ముఖ్యమంటున్నారు పరిశోధకులు. నెట్ను ఎక్కువగా వాడేవారు చాలా సంతోషంగా ఉంటున్నారనీ యూరప్లో దాదాపు లక్ష మందిపై సర్వే చేశామని వారు పేర్కొన్నారు. మనిషి ఎప్పుడూ ఆశావాదే. సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. జీవితంలో సంతోషమనేది యూ(U) ఆకారంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక వయసు వరకు సంతోషంగా ఉంటారనీ, వయసు పెరిగే కొద్దీ సంతోషంగా ఉండలేరనీ, మళ్లీ వృద్దాప్యంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో తేలింది. ఆన్లైన్లో ఉండడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయని, వారి స్నేహితులు, బంధువులతో నిత్యం టచ్లో ఉండటంతో వారు హ్యాపీగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. యూరప్లోని లక్షమందిపై చేసిన ఈ సర్వేలో వీరి వ్యక్తిగత వివరాలను పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం ఆన్లైన్లో ఉండే సమయం, వయసులను మాత్రమే తీసుకున్నామని నార్వేలోని కల్చరల్ యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో పరిశోధకులు వెల్లడించారు. యవ్వన వయస్కుల్లో ఈ తేడా కనిపించలేదట. మధ్య వయస్కుల్లోనే ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారు ఆనందంగా ఉన్నారు. ఏం చేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు? బాధను దరిచేరనీయకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, సమయపాలన, పాజిటివ్ థింకింగ్ చేయడం. నీతో నువ్వు స్నేహితుడిగా ఉండటం. మద్యపానానికి దూరంగా ఉండటం. మంచి డైట్ను పాటించటం. సమయానికి నిద్ర పోవడం. కష్ట సమయాల్లో తమ విషయాలను స్నేహితులు, ఆత్మీయులతో పంచుకుంటే చాలా ఉపశమనం ఉంటుంది. ఇంటర్నెట్ వాడకం వల్ల మధ్య వయస్కుల్లో సంతోషంగా ఉండేవారి సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. జర్మనీకి చెందిన మరో శాస్త్రవేత్త పైన చెప్పిన విషయాలతో ఏకీభవించలేదు. ఇంటర్నెట్ వాడకం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. మంచి, చెడు విషయాలకు వాడుకోవచ్చని ఇలా అన్నింటిని కలిపి ఇంటర్నెట్ అనే గొడుగు కిందకు చేర్చి కేవలం మంచి మాత్రమే జరుగుతుందని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement