-
న్యూస్ మేకర్: జీవితం ఆమెతో ఫుట్బాల్ ఆడింది
మొన్న ఫుట్బాల్ వరల్డ్ కప్లో మన పురుషుల టీం కనిపించిందా? పురుషుల టీమ్ను తయారు చేసుకోలేని మనం స్త్రీల టీమ్ను మాత్రం ఏం పట్టించుకుంటాం? అసలు ఫుట్బాల్ ఆడే అమ్మాయిలకు మన దేశంలో ఏం మర్యాద, ప్రోత్సాహం ఉన్నాయి? కోల్కటా ఫుట్బాల్ క్రీడాకారిణి పౌలమి అధికారి ఒకప్పుడు దేశ జట్టులో ఆడింది. ఇప్పుడు? జరుగుబాటు కోసం జొమాటో డెలివరి గర్ల్గా పని చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈమె జీవిత అవస్థ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో ఆవేదన వ్యక్తం అవుతోంది. జొమాటో అని రాసి ఉన్న ఎర్రటి టీ షర్ట్ తొడుక్కుని కోల్కటాలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న 24 ఏళ్ల పౌలమి అధికారి ఒక ఫుట్బాల్ క్రీడాకారిణి అని ఎవరూ ఊహించరు. గత కొంతకాలంగా ఇల్లు గడవడానికి పౌలమి ఫుడ్ డెలివరీ చేస్తోంది. కోల్కటాకే చెందిన సంజుక్త చౌధురి అని ట్విటర్ యూజర్ పౌలమి గురించి చిన్న వీడియో తీసి ట్విటర్లో ఉంచడంతో గత రెండు మూడు రోజుల్లోనే చాలా రెస్పాన్స్లు వచ్చాయి. విస్తృతంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక ఫుట్బాల్ క్రీడాకారిణి నిస్సహాయ స్థితిలో ఉండటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అబ్బాయి అనుకునేవారు కోల్కటాలోని బెహలా ప్రాంతంలో నివసించే పౌలమి బాల్యంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి టాక్సీ డ్రైవర్గా పని చేస్తుంటే మేనత్త పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచే పౌలమి ఫుట్బాల్ ఆడేది. అయితే అబ్బాయిలాగా కనిపించే పౌలమిని చూసి అందరూ అబ్బాయి అనుకుని ఆడించేవారు. ‘ఆ తర్వాత నేను అమ్మాయి అని తెలిశాక ఆటలో రానివ్వలేదు. అమ్మాయిలు ఫుట్బాల్ ఆడితే వారికి ఏ మర్యాద లేదు. నేను ఫుట్బాల్ మానేసి కొన్నాళ్లు హాకీ ఆడాను. అయితే మా ప్రాంతంలోని అనిత సర్కార్ అనే ఫుట్బాల్ కోచ్ నన్ను చూసి ఫుట్బాల్లో ట్రయినింగ్ ఇచ్చింది. నేను మంచి ప్లేయర్ని అయ్యాను’ అంటుంది పౌలమి. పదిహేను ఏళ్లు వచ్చేసరికే పౌలమి మంచి ఫుట్బాల్ క్రీడాకారిణి అయ్యింది. దేశం తరఫున అండర్ 16 జట్టుకు ఎంపికయ్యి 2013లో జరిగిన అండర్ 16 ఛాంపియన్షిప్ కోసం శ్రీలంక వెళ్లి ఆడింది. అయితే ఆ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకోవడం కష్టమైంది. ఇంటివాళ్లుగాని, క్రీడా సంస్థలుగాని సరైన వైద్యం, ఫిట్నెస్ ట్రయినింగ్ ఇప్పించకపోవడంతో వెనుకబడింది. మళ్లీ కోలుకుని 2016లో జరిగిన స్ట్రీట్ ‘హోమ్లెస్ ఫుట్బాల్ వరల్డ్కప్’ కోసం దేశం తరఫున గ్లాస్గో వెళ్లి ఆడింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. వెంటాడిన పేదరికం 2017లో తండ్రి చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఇంకో చెల్లెలు, తను తప్ప సంపాదనకు ఎవరూ లేరు. 2019 నాటికి బతకడం దుర్భరమైంది. ‘అప్పుడే నేను జొమాటోలో చేరారు. ఆ రోజుల్లో రోజుకు 500 సంపాదించేదాన్ని. లాక్డౌన్ ఎత్తేశాక చాలామంది ఈ ఉద్యోగంలోకి వచ్చారు. ఆర్డర్లు తక్కువ. పైగా నాకు సైకిల్ తప్ప బండి లేదు. దాంతో దగ్గరి ఆర్డర్లే తీసుకుంటాను. అందువల్ల రోజుకు 400 వస్తాయి. ఒక్కో ఆర్డర్ మీద 20 లేదా 30 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి రోజుకు 300 రూపాయలకు మించి రావు. నాకు వేరే దారి లేదు... ఈ పని తప్ప’ అంది పౌలమి. రోజుకు 12 గంటలు పని చేస్తూ కూడా ఒక్కోసారి ఫుట్బాల్ను సాధన చేస్తుంటుంది పౌలమి. బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నదిగాని అది కూడా నత్తనడకన సాగుతున్నది. వెల్లువెత్తిన స్పందన పౌలమి కథనానికి స్పందన వెల్లువెత్తింది. దేశంలో ఫుట్బాల్ క్రీడాకారుల స్థితి ఆ మాటకొస్తే ఏ కొద్ది మందో తప్ప అందరు క్రీడాకారుల స్థితి ఇలాగే ఉందనే స్పందన వచ్చింది. ఫుట్బాల్ ఆటను ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నా పురుషులలోగాని, స్త్రీలలోగాని ప్రపంచ దేశాలతో తలపడే మెరుగైన టీమ్లు తయారు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ‘నాకు ఇప్పుడు కుదురైన ఉద్యోగం, ప్రాక్టీసు చేయడానికి మంచి స్పైక్స్ కావాలి’ అంటున్న పౌలమిలాంటి వారిని ఆ స్థితిలో ఉంచడం విషాదం. ఇప్పుడు వచ్చిన స్పందనతో ఆమెకు ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. -
ప్రపంచకప్ బెర్త్ గల్లంతు
కౌలాలంపూర్: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచ కప్ బెర్త్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్కు నిరాశే ఎదురైంది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) అండర్–16 చాంపియన్షిప్లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ 0–1తో కొరియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో యువ భారత్ ప్రపంచకప్లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఇందులో సెమీస్ చేరిన జట్లకు పెరూ వేదికగా 2019లో జరుగనున్న అండర్–17 ప్రపంచకప్ టోర్నీకి అర్హత లభిస్తుంది. 2017లో భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్–17 ప్రపంచకప్లో టీమిండియాకు ఆతిథ్య హోదాలో ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సారి క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించాల్సిన స్థితిలో భారత్ విఫలమైంది. ఆకట్టుకున్న నీరజ్... 16 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆడుతున్న యువభారత్... టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన కొరియాపై తుదికంటా పోరాడింది. మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ను ఆట 67వ నిమిషంలో జియాంగ్ సాంగ్బిన్ (కొరియా) సాధించాడు. ఈ మ్యాచ్లో గోల్కీపర్ నీరజ్ అడ్డుగోడలా నిలిచి కొరియన్ల సహనాన్ని పరీక్షించాడు. ఆట 14వ నిమిషంలోనే ప్రత్యర్థి గోల్ను అడ్డుకున్న నీరజ్... ఆట 34వ నిమిషంలో, 36వ నిమిషంలో కొరియన్లు చేసిన మెరుపు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొని వారిని నిలువరించాడు. కొద్ది క్షణాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా రవిరాణా షాట్ను కొరియన్లు అడ్డుకోవడంతో గోల్ లేకుండానే భారత్ విరామానికెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ దూకుడు పెంచిన భారత్ 52వ నిమిషంలో గోల్ చేసినంత పని చేసింది. భారత ఆటగాడు రిడ్గే డి మెలోస్ వ్యాలీని ప్రత్యర్థి రక్షణశ్రేణి అడ్డుకుంది. 2002లోనూ భారత్ 1–3తో కొరియా చేతిలోనే ఓటమి పాలైంది. -
అనంతపురం, కర్నూలు జట్ల విజయం
అనంతపురం న్యూసిటీ : ఏఎస్ఏ అండర్ –16 అంతర్ జిల్లాల పోటీల్లో అనంతపురం, కర్నూలు జట్లు ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. ఆదివారం అనంతపురం క్రికెట్ స్టేడియంలో కర్నూలు, వైఎస్సార్జిల్లా, అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి. అనంతపురంతో జరిగిన మ్యాచ్లో నెల్లూరు జట్టు 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. జట్టులో సింధూజ 58, అనూష 28 పరుగులు చేసింది. అనంతపురం జట్టు 23.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో పల్లవి 34, అనూష 29 పరుగులు చేశారు. దీంతో అనంతపురం జట్టు 5 వికెట్ల తేడాతో నెల్లూరుపై నెగ్గింది. కడప జట్టు బోల్తా.. లక్ష్య ఛేదనలో కడప జట్టు బోల్తాపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో అనూష 40, సుప్రజ 29 పరుగులు చేశారు. కడప బౌలర్ జ్యోతిక 3/19 వికెట్లు తీసుకున్నారు. 148 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన కడప జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో ఓబుళమ్మ 60 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్లలో అరుణ, సుప్రజ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. -
నేటి నుంచి అండర్–16 మహిళ క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలను ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 13 వరకు సాగుతాయన్నారు. ఈ పోటీల్లో సౌత్జోన్కు చెందిన అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జట్లు పోటీల్లో తలపడతాయన్నారు. అండర్–19 మహిళ క్రికెట్ పోటీలు ఈ నెల 15 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలోని బీ–గ్రౌండ్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అండర్–16 పోటీలు 25 ఓవర్ల ఫార్మాట్లోను, అండర్–19 పోటీలు 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతాయన్నారు. అండర్–16 మ్యాచ్ల వివరాలు తేదీ తలపడే జట్లు 9-07-17 కడప–కర్నూలు ఉదయం 9–07–17 అనంతపురం–నెల్లూరు మధ్యాహ్నం 10–07–17 చిత్తూరు–నెల్లూరు ఉదయం 10–07–17 అనంతపురం–కర్నూలు మధ్యాహ్నం 11–07–17 అనంతపురం–కడప ఉదయం 11–07–17 చిత్తూరు–కర్నూలు మధ్యాహ్నం 12–07–17 నెల్లూరు–కర్నూలు ఉదయం 12–07–17 కడప–చిత్తూరు మధ్యాహ్నం 13–07–17 చిత్తూరు–అనంతపురం ఉదయం 13–07–17 కడప–నెల్లూరు మధ్యాహ్నం అండర్–19 మ్యాచ్ల వివరాలు తేదీ తలపడే జట్లు 15–07–17 కడప–కర్నూలు 15–07–17 అనంతపురం–నెల్లూరు 16–07–17 చిత్తూరు–నెల్లూరు 16–07–17 అనంతపురం–కర్నూలు 18–07–17 అనంతపురం–కడప 18–07–17 చిత్తూరు–కర్నూలు 19–07–17 నెల్లూరు–కర్నూలు 19–07–17 కడప–చిత్తూరు 20–07–17 చిత్తూరు–అనంతపురం 20–07–17 కడప–నెల్లూరు -
సెమీస్లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ క్వార్టర్స్లో దేదీప్య 6-1, 6-3తో పూజా ఇంగ్లే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్లో తను ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్ఞానితతో తలపడుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
400 ఓ జోకు.. 200 సీట్లే కష్టం: బీజేపీపై ఎంపీ శశిథరూర్ సెటైర్లు
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
Advertisement