-
ట్రూజెట్ 3 కొత్త విమాన సర్వీసులు
సాక్షి, తిరుపతి: విజయవాడ-కడప, విజయవాడ-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్ మార్గాల్లో మంగళవారం నుంచి ట్రూజెట్ పేరుతో టర్బో మేఘా విమానయాన సేవలు అందిస్తున్నట్లు ఆసంస్థ ఎండీ వి.ఉమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సర్వీస్ కింద తిరుపతి-హైదరాబాద్ మార్గంలో ప్రతిరోజూ తిరుపతిలో 9.45కు బయలుదేరి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుటుందని చెప్పారు. రెండో సర్వీస్ తిరుపతి-హైదరాబాద్ మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి 2.05కు చేరుతుందని, 3వ సర్వీస్ తిరుపతి-హైదరాబాద్ మార్గంలో మంగళ, బుధ గురువారాల్లో సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి 7.35కు చేరుతుందని చెప్పారు. 4వ సర్వీస్ తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రతిరోజూ రాత్రి 8.20కి బయలుదేరి 9.45కు హైదరాబాద్కు చేరుతుందన్నారు. తిరుపతి-గోవా మార్గంలో శుక్ర ,శని, ఆది, సోమవారం మధ్యాహ్నం 12.45కు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 4.45కు గోవా చేరుతుందన్నారు. విజయవాడ-తిరుపతి మార్గంలో మంగళ, బుధ, గురవారాల్లో సాయంత్రం 4.35కు విజయవాడలో బయలుదేరి 5.50కి తిరుపతికి చేరుతుందన్నారు. కడప-తిరుపతి మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 11.35కు కడపలో బయలుదేరి 12.20కి తిరుపతికి చేరుతుందన్నారు. -
రేపు తిరుపతి-హైదరాబాద్ కు ప్రత్యేక రైలు
తెనాలి (గుంటూరు జిల్లా) : వారాంతంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం తిరుపతి-హైదరాబాద్ (వయా తెనాలి, గుంటూరు, నల్గొండ) జనసాధారణ్ ప్రత్యేక రైలును నడుపనుంది. పది బోగీలు కలిగిన ఈ ప్రత్యేక రైలులో అన్ని బోగీలు అన్ రిజర్వుడ్గా ఉంటాయి. నం.07269 తిరుపతి-హైదరాబాద్ జనసాధారణ్ ప్రత్యేక రైలు తిరుపతిలో ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం తెల్లవారుజామున 5.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి (రాత్రి 8.50 గంటలకు), గుంటూరు (రాత్రి 10 గం.), సత్తెనపల్లి (రాత్రి 11.15 గం.), పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్లో ఆగుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
సంజయ్ ఓ పొలిటికల్ టూరిస్ట్
లోఓల్టేజీ నియంత్రణకు డీటీఆర్ ఏర్పాటు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement