-
పారదర్శక ఎన్నికలే లక్ష్యం
తిరుపతి అర్బన్: పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. గురువారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, డీఆర్వో పెంచల కిషోర్తో కలసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో గురువారం నుంచే నామినేషన్లు వేయడానికి వీలుంటుందని, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్కు ఈ నెల 25వ తేదీ నామినేషన్లకు చివరి గడువుగా పేర్కొన్నారు. అనంతరం పరిశీలించి 29న ఉపసంహరణ ఉంటుందన్నారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థితోపాటు మరో నలుగురు రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వేయడానికి వీలుంటుందని వెల్లడించారు. నామినేషన్లను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. ఇక ఖర్చులన్నీ పక్కాగా గణిస్తామని తెలిపారు. ఫెయిడ్ న్యూస్ విషయంలో కచ్చితమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18 నుంచి 22 వరకు గడువు ఉందని చెప్పారు. వీరికి ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పౌరసంబంధాలశాఖ జిల్లా అధికారి బాలకొండయ్య పాల్గొన్నారు. -
ప్రారంభమైన నామినేషన్ల పర్వం
సమరోత్సాహంలో ఎన్నికల యుద్ధానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అధికార, కూటమి అభ్యర్థులు నువ్వా..నేనా అనే రీతిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మొదట ఆలయాల్లో పూజలు, ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదాలు తీసుకుని నామినేషన్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ పత్రాలు సమర్పించి, ఆపై ప్రచారం పర్వంలో నిమగ్నమయ్యారు.● దశమి, తేదీ 18 కావడంతో ఓ సెట్ నామినేషన్ దాఖలు ● ఆలయాల్లో పూజలు.. తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదాలు ● కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద పోలీసుల పహారా ● నలుగురికే అనుమతి సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు మొదటి రోజే నామినేషన్ల పర్వం అట్టహాసంగా ప్రారంభమైంది. దశమి ఓ వైపు.. తేదీ 18.. కలిపితే తొమ్మిది అంకె కావడంతో అధికారపార్టీ అభ్యర్థులతో పాటు కూటమి, స్వతంత్ర అభ్యర్థులు కూడా గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో తిరుపతి పార్లమెంట్కు ఒకరు, మిగిలిన 15 మంది తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, సత్యవేడు, చంద్రగిరి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆయా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. తిరుపతి నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభినయ్రెడ్డి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు తల్లిదండ్రులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, రేవతి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. వెంకటగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్రెడ్డి తరఫున తల్లి మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య పార్టీ నాయకులు సత్యనారాయణరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, వేనాటి సుమంత్రెడ్డితో కలిసి నాయుడుపేట శ్రీవిజయగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కిలివేటి సంజీవయ్య నియోజకవర్గ కేంద్రం సూళ్లూరుపేటలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సత్యవేడులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ తరఫున ఆయన భార్య చైతన్య భాను నామినేషన్ దాఖలు చేశారు. కూటమి తరఫున శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా తిరుపతి పార్లమెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ విజయకుమార్ రిటర్నింగ్ అధికారి ప్రవీణ్కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. తిరుపతి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థులుగా పెంచలప్రసాద్ వాసల్లి, ఆర్.క్రిష్ణచైతన్య, బండ్ల చంద్రశేఖర్, నవీన్ బృంగి, పీ.సోమశేఖర్రెడ్డి, శేఖర్ సోదిశెట్టి నామినేషన్లు దాఖలు చేశారు. బీసీవై పార్టీ నుంచి శ్రీకాళహస్తి అభ్యర్థిగా దినడ్ బాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు అభ్యర్థిగా బాలగురవం బాబు నామినేసన్ దాఖలు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నామినేషన్ సందర్భంగా కేవలం నలుగురికి మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారు వంద మీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు. లోనికి వెళ్లే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి పంపుతున్నారు. -
తిరుపతి @ 42
తిరుపతి తుడా: మండే ఎండలతో తిరుపతి జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తిరుపతిలో గురువారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోవు రోజుల్లో ఎండలు మరింత తీవ్రవరూపం దాల్చుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉక్కపోత మండే ఎండలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతతో పాటు ఉక్క పోత మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం నుంచి మూడు గంటల వరకు తీవ్ర ఎండలు నమోదవుతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతూ దూసుకొస్తున్నాడు. జనం వీధిలోకి రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చిరువ్యాపారులపైనా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి చేరుకునే క్రమంలో ఎండదెబ్బకు గురవుతున్నారు. రోడ్లపై ఎండమావులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల దాటే వరకు ఉక్కపోత ప్రజల్ని వేధిస్తోంది. మండుతున్న ఎండలు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు -
● కలిమిలిని కలసిన నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ● గతంకంటే అత్యధిక మెజార్టీ సాధిస్తామని వెల్లడి
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలంగా ఉందని, భవిష్యత్లో టీడీపీ టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితికి వస్తుందని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఎద్దేశా చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర పరిశీలకులు ఎమ్మార్సీరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డితో వెంకటగిరిలోని కలిమిలి నివాసంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి ఎంపీపీలు గూడూరు భాస్కర్రెడ్డి, రాజశేఖర్, రూరల్ నాయకులు తంబిరెడ్డి శివారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత కలిమిలి నివాసానికి విచ్చేసిన నేదురుమల్లికి డక్కిలి జెడ్పీటీసీ కలిమిలి రాజేశ్వరి శాలువ కప్పి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన దిశగా రాష్ట్రంలో 175కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి సేవలు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో గత మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు. అనంతరం వెంకటగిరి రాజాలు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వీబీ.సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్రలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతుశారద, పట్టణ కన్వీనర్ జీ.ఢిల్లీబాబు, కౌన్సిలర్ ఆరి శంకరయ్య, నాయకులు దొంతు బాలకృష్ణ, బొల్లంపల్లి కృష్ణ, పేచీరాజ్, తలపల మల్లికార్జున్, అల్లంసాయి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం
40 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక 150 కటుంబాలు చేరిక టీడీపీకి టూలెట్ బోర్డు తప్పదు నెరబైలు: వైఎస్సార్సీపీలో చేరిన వారితో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి తిరుపతి రూరల్: ఎర్రావారిపాళెం మండలం, నెరబైలు పంచాయతీ వైఎస్సార్సీపీకి కంచుకోటగా మారుతోంది. పంచాయతీలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి 20 కుటుంబాలు చేరాయి. గురువారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో గంటా నారాయణ, నాగేంద్రబాబు, రెడ్డెప్ప, చిరంజీవి, నాగులయ్య, సుబ్బయ్య, మణి, చిట్టిబాబు, ఎం.సుబ్బయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ పంచాయతీ అధ్యక్షులు హరినాథ్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగార్జున, తలకోన బోర్డ్ మెంబర్ జయంత్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు పంచాయతీ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు నాగోలు శ్రీనివాసులురెడ్డి సారథ్యంలో 40 కుటుంబాలకు పార్టీతీర్థం పుచ్చుకున్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెంచయ్య యాదవ్, పుల్లూరు చెంచురామిరెడ్డి, నెల్లూరు ప్రతాప్, ముండే వెంకటేష్, తాటిపర్తి కిరణ్కుమార్రెడ్డి, బుడతొట్టి చిరంజీవి, మనవాసి నరసింహయాదవ్, పుల్లూరు చెంగారెడ్డి, పాదం సునీల్, రాజు తదితరులు ఉన్నారు. 21వ వార్డులో 30 మంది చేరిక శ్రీకాళహస్తి పట్టణంలోని 21వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు 30మంది వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటగిరి రూరల్: బాలాయపల్లి వైఎస్సార్సీపీ కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి, బాలాయపల్లి వైస్ ఎంపీపీ వాన పార్వతి, సర్పంచ్ ఒప్పతొట్టి అంకయ్య ఆధ్వర్యంలో కడగుంట గ్రామం నుంచి సుమారు 150 కుటంబాలు వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి రామ్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. జేసీఎస్ కన్వీనర్ బాబిచౌదరి, వైఎస్సార్సీపీ నాయకులు ఆరి కోటేశ్వరరెడ్డి, రామలచేను మాధవయ్య, సొడారం వజ్రం, వాన చినకాటయ్య, కృష్ణయ్య, ప్రసాద్, పెద్దగంగయ్య, నాగువులు, మేకల చిన్నయ్య, ఒప్పతొట్టి చిన అంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు పెద్దిరెడ్డి, మిఽథున్రెడ్డి నామినేషన్లు
పుంగనూరు : వైఎస్సార్సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. స్థానిక హనుమంతరాయునిదిన్నెలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో పెద్దిరెడ్డి ముందుగా పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి రామసముద్రం రోడ్డు, ఎన్ఎస్ పేట, పుంగమ్మ చెరువు కట్ట, బ్రాహ్మణవీధి, సెంటర్ లాడ్జి, నాగపాళ్యెం, ఇందిరా సర్కిల్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అలాగే ఎంపీ మిథున్రెడ్డి తరఫున సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జి ఫకృద్దీన్షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లింలు రాయచోటికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రతి రోగికీ నాణ్యమైన వైద్యం దొరవారిసత్రం: గ్రామాల్లోని రోగులకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లలో జాతీయ స్థాయి స్టాండ్స్తో పాటు క్వాలిటీ వైద్యం అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని కేంద్రం బృందం అధికారులు సూచించారు. గురువారం నెలబల్లి గ్రామ పరిధిలో ఉన్న వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ను కేంద్రం బృందం అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందే ప్రతి సేవను, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. క్లినిక్ పరిసర ప్రాంతాలను పరిశీలించడమేకాకుండా సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. హెల్త్ సెంటర్కు అవసరమైన అన్ని వసతులు కల్పించారని, ఇవన్నీ సంబంధిత వైద్య సిబ్బంది వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం కేంద్రం బృందం అధికారులు డాక్టర్లు ప్రసాద్సోమనాథ్బండారి, ఇంద్రదిప్దాస్ పలు రికార్డులను, ఆన్లైన్లో మందులు, రోగుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట వైద్యాధికారి చైతన్య, డాక్టర్ చంద్రకళ ఉన్నారు. ‘లెక్క’లు పక్కా!● ఖర్చుల జాబితా రికార్డులు తప్పనిసరి ● వ్యయ పరిశీలకులు వీజీ శేషాద్రి తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు పెడుతున్న ఖర్చులకు సంబంధించి పది పైసలకు కూడా లెక్కలుండాలని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలకులు వీజీ.శేషాద్రి తెలిపారు. గురువారం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖర్చుల జాబితా రికార్డులను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనల మేరకు ఖర్చుల వివరాలను లెక్కించాలని చెప్పారు. నోటిఫికేషన్ వరకు పార్టీ లెక్కలోను, నోటిఫికేషన్ తర్వాత ఆయా ఆపార్టీల అభ్యర్థుల లెక్కల్లో ఖర్చులు గణించాలని వివరించారు. జిల్లా ఎక్స్పండిచర్ నోడల్ ఆఫీసర్ చరణ్ రుద్రరాజు నేటి వరకు చేపట్టిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమెకు వివరించారు. సమావేశంలో తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ అసిస్టెంట్ ఎక్స్పండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ టీమ్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
కోడ్ ఉంది.. జాగ్రత్త
తిరుపతి అర్బన్: ‘సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉంది.. కోడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి’అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఇప్పటి వరకు కోడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చేపట్టిన చర్యలను వివరించారు. అనధికార రాజకీయ ప్రకటనలు 30,861 తొలగించామని చెప్పారు. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులు 8 మందిని తొలగించామని, అలాగే శాశ్వత ఉద్యోగులు 11 మందిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఏడుగురిని తొలగించామని, మరో ముగ్గురిపై విచారణ జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులు 9 మందిని తొలగించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.9.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
సూళ్లూరుపేట రూరల్: ఎన్నికల నియమావళిని అఽభ్యర్థులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల ఆర్వో చంద్రముని తెలిపారు. సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అందజేసిన ఎన్నికల నియమావళి పత్రాలను ఆర్వో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులతో వచ్చే వ్యక్తులు నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 22వ తేదీలోపు సబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
గూడూరు రూరల్: నెల్లూరు నుంచి గూడూరు వైపు వచ్చే రైలు మార్గంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్కు ఉత్తరం వైపున సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ కొండప్పనాయుడు తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈమేరకు గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మహిళ అనుమానాస్పద మృతి శ్రీకాళహస్తి : ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఒకటవ పట్టణ సీఐ నరసింహారావు అందించిన వివరాల మేరకు.. శ్రీకాళహస్తి మండలం, టీఎంవీ కండ్రిగకు చెందిన వెంకటేష్రెడ్డి, వాణి దంపతుల కుమార్తె గౌరి(28)ని పట్టణంలోని ముత్యాలమ్మ గుడివీధికి చెందిన పురం అనిల్కుమార్కు ఇచ్చి 2019లో వివాహం జరిపించారు. అనిల్కుమార్ పట్టణంలో ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతున్నాడు. ఈ దంపతులకు భరత్(7), హర్షవర్దన్(5) ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం షాపు నుంచి ఇంటికి వెళ్లి చూడగా గౌరి ఇంట్లో ఉరివేసుకుని ఉన్నట్లు అనిల్కుమార్ చెబుతుండగా.. మృతురాలు గౌరి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపట్ల అనుమానం ఉందని అంటున్నారు. దీంతో గౌరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. పూరిల్లు దగ్ధం వాకాడు : వాకాడు ముస్లిం కాలనీలో గురువారం పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం.. గ్రామంలో ఎస్కే అల్లాబాషా నివాసం ఉంటున్నాడు. ఆయన శుక్రవారం పనిమీద బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల వారు గమనించి ఇంటి యజమానికి తెలియజేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం కోట అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్క డి కి చేరుకుని మంటలను ఆర్పేశారు. సుమారు రూ. 50 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. -
తిరుమలలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సహస్రదీపాలంకారసేవ నిర్వహించారు. ఆ తరువాత శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం సుగ్రీవుడు, అంగధుడు ఉత్సవమూర్తులను వేంచేపు చేసి, వారితోపాటు ఆంజనేయస్వామివారికి పుష్పమాలలు సమర్పించారు. -
చంద్రబాబు కూటమి
వంచించడానికే● ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే ● తిరుపతి ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రధాతగా అభినయ్ ● 31వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన తిరుపతి మంగళం: మాయమాటలతో ప్రజలను వంచించడానికే చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి 31వ డివిజన్లో గురువారం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగుంట రవి, దుద్దేల బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతోపాటు మేయర్ డాక్టర్ శిరీష ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో భూమనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం బొమ్మగుంట రవి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రపంచ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధే పరమావధిగా జగనన్న పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పెత్తందారులకు కొమ్ముకాయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని మండిపడ్డారు. తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. తిరుపతిలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కూటమి నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్రెడ్డి, దేవదానం, తొండమనాటి వెంకటేష్రెడ్డి, కంకనాల రమేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, కార్పొరేటర్లు శేఖర్రెడ్డి, పొన్నాలచంద్ర, నరేంద్ర, ఆరణి సంధ్య, ఆధిలక్ష్మి, దూదికుమారి, కల్పనా యాదవకృష్ణ, మట్లి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు తిమ్మారెడ్డి, చిరంజీవి, చెంగల్రాయులు, కన్నయ్య, దాము, ఊతుకుంట మోహన్, ఇమ్రాన్, యాదవకృష్ణ, పుష్పలత, గల్లా కవిత, పుణీత, శారద పాల్గొన్నారు. -
మోసాల బాబు మాకొద్దు
హిందూ ధర్మంలో పసుపు, కుంకుమకు ఎంతో ప్రాధ్యానత ఉంది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పసుపు, కుంకుమ పేరుతో అరకొరగా డబ్బులు ఇచ్చి మోసం చేశాడు. మహిళల గౌరవాన్ని అపహాస్యం చేసి అవమానించారు. అదే పసుపు, కుంకుమని ఆయనకే పూసి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాం. అలాగే 2014 నుంచి 2019దాకా అధికారంలో ఉన్న చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. పొదుపు మహిళలకు రుణమాఫీ చేసి ఆదుకున్నారు. వైఎస్సార్ ఆసరా కింద నాకు సుమారు రూ.32 వేలు దాకా వచ్చింది. ఇచ్చిన మాటమీద నిలబడి ఏటా రుణమాణీ చేశారు. మోసం చేసే చంద్రబాబుకి, ఇచ్చిన మాటమీద నిలబడే జనన్నకు ఉన్న తేడా అదే. అందుకే జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నాం. – ఎస్డీ ఫర్వీన్, కోటపోలూరు గ్రామం, సూళ్లూరుపేట మండలం -
నమ్మించి.. వంచించిన బాబు
2014 ఎన్నికలకు ముందు మెనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు అబద్ధాలు చెప్పి మహిళల చేత ఓట్లు వేయించుకున్నారు. బ్యాంకుల్లో ఎవ్వరూ అప్పు కట్టొద్దు.. నేనొస్తా.. తీర్చేస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత ఐదేళ్లు పట్టించుకోలేదు. నా అప్పు బ్యాంక్లో వడ్డీతో కలిపి రూ.2 లక్షలు పేరుకుపోయింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ పేరుతో మహిళలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పాదయాత్రగా వస్తున్న జగనన్నకు మా బాధలు చెప్పుకున్నాం. ఆ సందర్భంలో ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ రుణ మాఫీ చేయడంతోపాటు బ్యాంక్ ద్వారా కొత్త రుణాలను ఇచ్చారు. దీంతో నేను చిన్నపాటి టీ స్టాల్ పెట్టుకుని సంతోషంగా జీవిస్తున్నాను. జగనన్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబానికి ఏడాదికి రూ.1.92 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. ఈ సారి నా ఓటు జగనన్నకే. – ఎంబేటి నాగభూషణమ్మ, నెల్లిపూడి జగనన్న మాటంటే మాటే గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబునాయుడు మోసం చేశాడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేదు. ప్రశ్నించిన గొంతులు నొక్కాడు. మహిళలను అవమానించాడు. ఎన్నికల ముందు పసుపు– కుంకుమ పేరుతో మోసం చేయాలని చూశాడు. ప్రస్తుతం చంద్రబాబును ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు ఇక ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా నమ్మము. ఆయన్ను నమ్మి మోసపోయింది చాలు. ప్రతీసారీ మోసపోవడానికి సిద్ధంగా లేము. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రక్రారం జగనన్న రుణమాఫీ చేశాడు. వైఎస్సార్ ఆసరా పేరుతో నాలుగు విడతలుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేశాడు. వచ్చే సార్వత్రి ఎన్నికల్లో కూడా జగనన్న వెంటే ఉంటాం. ఆయన గెలుపునకు కృషి చేస్తాం. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తాం. – పీ.రోజారమణి, లక్ష్మీగణపతి డ్వాక్రా సంఘం, పాకాల మండలంనిన్ను నమ్మలేం బాబూ గత ఎన్నికలకు నెల ముందు పసుపు, కుంకుమ అంటూ.. ఖాతాలలో 10 వేల నగదు వేసినట్టు నమ్మ బలికాడు. తీరా ఎన్నికలు అయినాక చూస్తే నా ఖాతాలో నగదు జమకాలేదు. ప్రస్తుత ఎన్నికల సమయంలో మళ్లీ ఆరు గ్యారెంటీలంటూ ప్రచారాలలో ఊదరగొట్టే మాటలు చెబుతున్నారు. గతంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు.. మళ్లీ ఆయన చెబుతున్న గ్యారెంటీలపై మాకు నమ్మకం లేదు. ప్రజలు ఎవ్వరూ ఆయన్ని నమ్మలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. నాకు ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 నాలుగు విడతలు అందింది. అలాగే వితంతు పింఛన్ నెలకు రూ.3వేలు ఇస్తున్నారు. హామీలు నెరవేర్చిన ప్రభుత్వానికి మా మద్దతు తెలియజేస్తున్నాం. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుంటాం. – లక్ష్మమ్మ , చిన్నపాండూరు అరుంధతివాడ, వరదయ్యపాళ్యం మండలం -
భర్త ఆత్మహత్య
సూళ్లూరుపేట: భార్య అలిగిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూళ్లూరుపేట పట్టణంలోని నాగరాజుపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. సత్యవేడు మండలం, ఆంబాంకం గ్రామానికి చెందిన సతీష్కు రెడ్హిల్స్కి చెందిన అశ్వినితో ప్రేమవివాహం జరిగింది. సతీష్ శ్రీసిటీలో బస్సు డ్రైవర్గా పనిచేస్తూ నాగరాజపురంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆయన భార్య అశ్విని కూడా శ్రీసిటీలో ఓ కంపెనీలో పనిచేస్తోంది. సోమవారం ఇద్దరూ డ్యూటీకి వెళ్లి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చిన కొద్ది సేపటికి ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంతో అశ్విని బయట కూర్చుని ఉండగా సతీష్ తన లుంగీని కిటికీకి తగిలించుకుని ఉరివేసుకుని తనువు చాలించాడు. విషయం తెలుసుకున్న సతీష్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రహంరెడ్డి తెలిపారు. ప్రమాదంలో వ్యక్తి మృతి బాలాయపల్లి(సైదాపురం) : వెంకటగిరి–నాయుడుపేట రోడ్డులోని పెరిమిడి గ్రామ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం.. తొట్టంబేడు మండలం, చిన కనపర్తికి చెందిన పులిమస్తాన్(38) బైక్లో వెంకటగిరి బయలుదేరాడు. పెరిమిడి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. -
No Headline
‘రాబోయేది మన ప్రభుత్వమే. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం. ఏం అక్కచెల్లెమ్మలూ..! మీరెవ్వరూ బ్యాంక్ల్లో రుణాలు చెల్లించొద్దు. అంతేకాదు.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. ప్రతి మహిళనూ లక్షాదికారిని చేస్తాం. ప్రతి రైతునీ రారాజుని చేస్తాం’ అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రజలందర్నీ బురిడీ కొట్టించారు. 2014 నుంచి 2019 వరకు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఎన్నికల ముందు మేల్కొన్నారు. మహిళల పవిత్రతకు ప్రతీకై న పసుపు–కుంకుమ పేరుతో ముష్టివిదిల్చినట్టు చిల్లర వేసి మహిళల ఓట్లు దండుకోవాలని చూసి బోల్తాపడ్డారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో మరో మారు మాయచేసేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై మహిళలు మండిపడుతున్నారు. మాయలోడి మాటలు నమ్మబోమని తేల్చిచెబుతున్నారు. ఇచ్చినమాటకు కట్టుబడిన జగనన్నకే మా మద్దతు అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని కేఎంఎం కళాశాల వెనుక భాగంలో మహిళ మృతినట్టు గుర్తించి కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ రామయ్య తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళగా గుర్తించారు. హత్య కేసులో జీవిత ఖైదు చిల్లకూరు: మండలంలోని కడివేడు పంచాయ, గుత్తావారిపాళెం సమీపంలో వాచ్మన్ని హత్య చేసిన ఘటనలో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం గూడూరు ఏడో అదనపు జిల్లా అడిషనల్ జుడీషియల్ న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుహాసిని వివరాల మేరకు.. ఓజిలి మండలానికి చెందిన కుడుముల రామసుబ్బయ్య గుత్తావారిపాళెంలోని ఓ ఆగ్రోఫాంలో వాచ్మెన్. ఈ క్రమంలో అక్కడికి పనికి చేరిన గూడూరు రూరల్ మండలం, వేములపాళెంకు చెందిన తుపాను వెంకటేశ్వర్లు 2021 జూలై 7వ తేదీన వాచ్మన్ రామసుబ్బయ్యపై కర్రతో దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో న్యాయమూర్తి అతనికి జీవిత ఖైదు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు పీపీ తెలిపారు. -
నామినేషన్లకు సర్వం సిద్ధం
● రేపు ఎన్నికల నోటిఫికేషన్ ● ఆ రోజు నుంచే నామినేషన్ల ఘట్టం ● ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ నామినేషన్లను స్వీకరించు రిటర్నింగ్ ఆఫీసర్లు తిరుపతి అర్బన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల కోడ్ను తూచాతప్పకుండా పాటించాల్సి ఉంటుంది. మార్చి 16వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జూన్ 6వ తేదీ వరకు కోడ్ నిబంధనలు వర్తిస్తాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. అదే రోజు ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 25 వరకు గడువు ఉందని చెప్పారు. 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువు ఉంటుందని వెల్లడించారు. మే 13న పోలింగ్ ఉంటుందని, జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం–2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం–2బీ సమర్పించాలని, నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్లు స్వీకరించమని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచి చేస్తున్న ఖర్చులు అతని ఖాతాలో లెక్కిస్తామన్నారు. తిరుపతి పార్లమెంట్కు ప్రవీణ్కుమార్–కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటగిరి హెచ్ఎం.ధ్యానచంద్ర–జాయింట్ కలెక్టర్ తిరుపతి అదిత్ సింగ్–కార్పొరేషన్ కమిషనర్ చంద్రగిరి ఏ.నిషాంత్రెడ్డి–తిరుపతి ఆర్డీఓ గూడూరు కిరణ్కుమార్–గూడూరు ఆర్టీఓ సూళ్లూరుపేట ఆర్.చంద్రముని, సూళ్లూరుపేట ఆర్డీఓ శ్రీకాళహస్తి ఎన్.రవిశంకర్రెడ్డి–శ్రీకాళహస్తి ఆర్డీఓ సత్యవేడు నరసింహాలు–స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఏపీఐఐసీ, సత్యవేడు -
వలసల జోరు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీలోకి వలసల జోరు ఆగడంలేదు. ఇందులో భాగంగా 24వ వార్డుకు చెంందిన బీజేపీ నాయకులు రామిశెట్టి మురళి, అద్దంకి రాజేష్, వారి మిత్రబృందం సాయి, షకీల్, ప్రవీణ్, ఖలీల్, శ్రీను, వవిరి, ఇర్ఫాన్, అజ్గర్, సాగర్ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిదంగా శ్రీకాళహస్తి మండలం, వెలంపాడుకు చెందిన 21 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, నాయకులు అంజూరు తారక శ్రీనివాసులు, మిద్దెల హరి, పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు వెల్లువెత్తాయి. మంగళవారం తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి సమక్షంలో కొటబైలు గ్రామ పంచాయతీ పరిధిలోని గుల్లావాండ్లపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పవీ.రమణ, మాజీ ఎంపీటీసీ బాబాసాహెబ్ వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. అలాగే అదే పంచాయతీకి చెందిన సాయిబూలపల్లెకు చెందిన 23 ముస్లిం కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. చెన్నారెడ్డిగారిపల్లెకు చెందిన మరో 6 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందజేసిన పార్టీని ఆధరిస్తారనేందుకు ప్రతి పక్ష పార్టీ టీడీపీ నేతలు స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరుతున్న పరిణామాలే నిదర్శనమన్నారు. పార్టీలో చేరిన వారిలో గుల్లా వాండ్లపల్లె నుంచి రాజన్న, సాహెబ్పీర్, యాసిన్, నజురుల్లా, సాయిబూలపల్లె నుంచి మాబుసాహెబ్, హుస్సేన్, కాసింసాహెబ్, బావాజీ, వల్లి, సుబాన్సాబ్, హబీబ్, యాసిన్, అల్లాభక్షు, ఖాసీం, అహ్మదుల్లా, ఖాసింసాబ్, నసీబ్, అక్బర్ఖాన్, అహ్మద్, షరీప్, అబ్బాస్వల్లి, ముస్తపా, షపీ, చెన్నారెడ్డిగారిపల్లె నుంచి రెడ్డెప్ప, నాగభూషణ, మోహన్, రమణ, రెడ్డెమ్మ, తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులురెడ్డి, ఎంపీపీ బాలం యుగంధర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సహదేవరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కొండారెడ్డి, సర్పంచ్ రెడ్డెమ్మ, మాజీ సర్పంచ్ చిన్నబాబు, మహేంద్రరెడ్డి, రామ్మూర్తి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు అక్బర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక సైదాపురం: మండలంలోని రాగనరామాపురం గ్రామంలో మంగళవారం దేవరవేమూరు, అనంతమడుగు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. దేవరవేమూరు గ్రామానికి చెందిన 18 కుటుంబాల నేతలు రాధకృష్ణారెడ్డి, మస్తాన్రెడ్డిల సారధ్యంలో.. అలాగే అనంతమడుగు పంచాయతీ నుంచి లేబాక పెంచలయ్య, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో దేవరవేమూరు గ్రామానికి చెందిన వారు సూరపాక పెంచలమ్మ, పెంచల దాసరయ్య, సుబ్బమ్మ, సుజాత, చినపెంచలయ్య, విజయమ్మ, బీ.మొగిలయ్య, పసపల మస్తానమ్మ, పెద్దమస్తానమ్మ, మందాలక్ష్మమ్మ, పందిటి తిరుపతయ్య, మంగళపూరి లక్ష్మణ్, తలమాల డాన్, బుజ్జా సుబ్రమణ్యం, షేక్ మహమ్మద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ రవికుమార్, సభ్యులు ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ భాస్కర్, ఎంపీటీసీ వెంకటరమణయ్య, సర్పంచ్ వరప్రసాద్రాజు, రామ్గోపాల్రెడ్డి, మోహన్రావు, అబ్బిరాజు, మాలకొండారెడ్డి, ఉసామధు, ఏడుకొండలు, హరియాదవ్, వెంకటేశ్వర్లుయాదవ్, శ్రీధర్, వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి.. సత్యవేడు: వైఎస్సార్సీపీలోకి వలసల జోరు పెరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సత్యవేడు మండల ఎస్సీసెల్ మాజీ కన్వీనర్ ఉషా తన అనుచరులు 20మందితో కలిసి వైఎస్సార్సీపీలో చేశారు. మంగళవారం సత్యవేడు దళితవాడలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేశారు. పార్టీలో చేరిన వారిలో ఉషా డేవిడ్, చిన్న, మురళి, అయ్యప్ప, జ్ఞానం, తరుణ్, అన్బు, కుమార్, శివ, తుల్ కాఫేయన్, మణికంఠ, జ్ఙానయ్య, జయరాయాజ్ మురళి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తాడిపత్రి పరిశీలకుడు బీరేంద్రవర్మ, సర్పంచ్ రమేష్, జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్, మండల కన్వీనర్ కే.సుశీల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గురుప్రసాద్, సచివాలయ కన్వీనర్ కే.సోమశేఖర్, పళణి, జోషప్, ఎంపీ రవి, కేఎం.సురేష్ పాల్గొన్నారు. సాయిబూలపల్లిలో 23 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక గుల్లావాండ్లపల్లె మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ కూడా సాదరంగా స్వాగతించిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి -
ముష్టి వేసి ఓట్లు దండుకున్న బాబు
2009లో టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు డ్వాక్రా మహిళలను మ భ్యపెట్టారు. రుణ మాఫీ పేరుతో బురిడీ కొట్టించారు. అలాగే 2014 నుంచి 2019 ఎన్నికల వరకు పొదుపు మహిళల పైన చిన్నచూపు చుశారు. రుణమాఫీ చేయకుండా వారిని దగా చేశారు. ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ పేరుతో ముష్టి వేసినట్టు చిల్లర వేసి ఓట్లు దండుకున్నారు. ఈ ఏడాది కూడా మరో సారి పొదుపు మహిళలను చంద్రబాబు మోసం చేసేలా భూటకపు మాటలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాకు అండగా నిలిచారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఆదుకున్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డికే మా మద్దుతు. – పసుమర్తి బాలపరమేశ్వరి, బంగారుపేట, వెంకటగిరి -
అద్దెకు తీసుకున్న కార్లు కుదువబెట్టి పరార్
తడ: అద్దెకు తీసుకున్న కార్లు ఇతరులకు కుదువబెట్టి వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి పలాయనం చిత్తగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్ఐ పీ.నరశింహారావు కథనం.. తడకు చెందిన గుణశేఖర్ వద్ద ఉన్న ఓ కారుని శ్రీసిటీ పరిధిలోని ఇరుగళం గ్రామానికి చెందిన బాబు నెలవారి అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత తడకే చెందిన మరో వ్యక్తి రాజశేఖర్కి చెందిన మరో కారును కూడా అద్దెకు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తమ కార్లను కుదువబెట్టి బాబు పారిపోయాడని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు నాయుడుపేట టౌన్: పట్టణ పరిధిలోని స్వర్ణముఖి నది కాజ్వేపై వెళుతున్న మీని లారీ మంగళవారం అదుపు తప్పి స్వర్ణముఖి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వెంకటెశ్వర్లుకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు.. నాయుడుపేట పట్టణం నుంచి మేనకూరు పరిశ్రమల కేంద్రం వద్దకు లోడింగ్ చేసుకునేందుకు మీని లారీ తీసుకుని వెళుతున్నారు. మార్గ మధ్యలో పట్టణ పరిధిలోని స్వర్ణముఖి కాజ్వే వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి అదుపు తప్పి కాజ్వే దిమ్మెలను ఢీకొంది. ఆపై నది ఒడ్డున మీనిలారీ పడిపోయింది. లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లు చేతికి గాయాలయ్యాయి. పెళ్లకూరులో విషాదం పెళ్లకూరు: రోడ్డు ప్రమాదంలో పెళ్లకూరుకు చెందిన పులి మస్తాన్(38) మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు... తొట్టంబేడు మండలం, కనపర్తి గ్రామానికి చెందిన మస్తాన్, మానస దంపతులు జీవనోపాధి కోసం పెళ్లకూరులో చిరు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డారు. మస్తాన్ పనుల నిమిత్తం మోటారు బైక్లో వెంకటగిరికి వెళుతుంగా మార్గ మధ్యంలో పెరిమిడి క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
సుపరిపాలనకే మా మద్దతు
తిరుపతి రూరల్: ప్రజా సంక్షేమానికి, సుపరిపాలన అందజేస్తున్న సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డికే తమ మద్దతు ఉంటుందని తిరుమల నగర్ పంచాయతీ పరిధి, కోళ్ల ఫారంకు చెందిన ప్రజలు స్పష్టం చేశారు. మంగళవారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి సమక్షంలో 23 మంది టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోళ్లఫారం నుంచి ఈశ్వరయ్య, దామోదర్నాయుడు, రామోజీనాయక్, రమేష్, మారయ్య, సిద్ధార్థ్, నవీన్, టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి, మురళి, నాగరాజ, శివ, ఈశ్వర్రెడ్డి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పంచాయతీ పార్టీ అధ్యక్ష్యలు మొదలియార్ రమేష్, ఎంపీటీసీ శ్రావణ్, వంశీవర్మ, మోహన్రెడ్డి, యశ్వంత్, జానకిరామిరెడ్డి, సందీప్ పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యపై తక్షణం స్పందించండి
తిరుపతి అర్బన్: జిల్లాలో తాగునీటి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ఏపీ సచివాలయం నుంచి సీఎస్ జవహర్రెడ్డి తాగునీటి సమస్యలతోపాటు, విద్యుత్ సమస్యలకు తావు లేకుండా చేపట్టాల్సిన అంశాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. -
సీఎంపై దాడి హేయమైన చర్య
తిరుమల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం హేయమైన చర్య అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆయన సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. బస్సు యాత్ర కొనసాగకుండా భయపెట్టాలని.. హత్యాయత్నం చేయాలని ఒక రకమైన కుట్రతో దాడి చేశారన్నారు. సీఎంకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడ్డారన్నారు. రాళ్లతో కొట్టమని ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కూటమి ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఓడిపోతామన్న భయంతో సీఎం జగన్పై దాడిచేయించారని, ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ పథకాలను కాపీ కొట్టి తాను ఇస్తానంటే ప్రజలు నమ్మరన్నారు. ఈ సారి 175 కు 175 వైఎస్సార్సీపీ గెలవడం ఖాయమన్నారు. పురంధేశ్వరి, పవన్కల్యాణ్, లోకేష్, సుజనాచౌదరి, సీఎం రమేష్ ఓడిపోవడం కూడా ఖాయమని జోస్యం చెప్పారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 77,511 మంది స్వామివారిని దర్శించుకోగా, 26,553 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.28 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. మద్యం రహిత ఎన్నికలే లక్ష్యం సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా నగదు డంపింగ్లు, మద్యం నిల్వలు ఉన్నాయని తెలిసిన వెంటనే సిబ్బంది దాడులు నిర్వహించాలని, అలాగే మద్యం రహిత ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషనర్ ఆదేశాలను అందరూ పాటించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేసీ హెడ్క్వార్టర్స్ మంగళగి బీ.ఆరుణారావు తెలిపారు. మంగళవారం ఆయన సూళ్లూరుపేటకు విచ్చేసి తడ ఇంటిగ్రేటెడ్ వద్ద, బూదనం టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం సూళ్లూరుపేట సెబ్ కార్యాలయాన్ని పరిశీలించారు. తర్వాత ఆయన స్థానిక విలేకరులతో మాట్డాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో డీపీఎల్, ఎన్డీపీఎల్, ఐడీ, ఎండీపీఎస్కు సంబంఽధించి పక్కా సమాచారంతో డంపింగ్, అధిక మద్యం నిల్వలపై దాడులు నిర్వహించాలన్నారు. డీపీఎల్కి సంబంధించిన కేసుల్లో ముద్దాయిలను విచారించి సంబంఽధిత జీఆర్ఓ నుంచి అధికంగా మద్యం కొనుగోలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏఈఎస్ జీ.నరసింహారావు, తిరుపతి అడిషినల్ ఎస్పీ ఏ.రాజేంద్ర, సెబ్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
నాయుడుపేట టౌన్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన మండల పరిధిలోని మర్లపల్లి జాతీయ రహదారి కూడలి సమీపంలో స్వర్ణముఖి నది వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, కడియనల్లూరు గ్రామానికి చెందిన కుమార్రాజేష్(31) ఓజిలి మండలం, పెదపరియ గ్రామ సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పరిశ్రమలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. పరిశ్రమ వద్దే నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం రాజేష్ అదే పరిశ్రమలో పనిచేస్తున్న తన స్నేహితులు శ్రీనివాస్, శశికుమార్తో కలిసి మండల పరిధిలోని మర్లపల్లి జాతీయ రహదారి కూడలి సమీపంలో స్వర్ణముఖి బ్రిడ్జి కింద నదిలో సరదగా ఈత కొట్టేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు నది వద్దే ఉన్నారు. శ్రీనివాసన్, శశికుమార్ ఇద్దరూ అక్కడి నుంచే వచ్చేశారు. రజేష్ మాత్రం ఈత కొడుతూ నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. సోమవారం రాత్రి నైట్డ్యూటీకి సైతం రాకపోవడంతో స్నేహితులు మంగళవారం ఉదయం స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి చూడగా రాజేష్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ గోపి స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి రమేష్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆపై మృతుడి తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement