-
Road Accident : ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం...
(కాకినాడ జిల్లా): కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ముగ్గు రు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తొండంగి ఎస్సై రవికుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురానికి చెందిన పోలవరపు కిరణ్ (23), పసుపులేటి దుర్గా శివప్రసాద్ (20), కాకర వీరబాబు(21) స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి బుధవారం రాత్రి బైకుపై స్వగ్రామం నుంచి బీచ్రోడ్డు మీదుగా అన్నవరంలో జరిగే స్నేహితుని వివాహానికి బయలుదేరారు. వేమవరం, యర్రయ్యపేట మీదుగా ముగ్గురూ వస్తుండగా జి.ముసలయ్యపేట వద్ద వీరి బైకు ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో పోలవరపు కిరణ్, కాకర వీరబాబులు సంఘటన స్ధలంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గా శివప్రసాద్కు తీవ్రగాయాలై ప్రాణాపా య స్ధితిలో ఉండగా స్ధానికులు తుని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కన్నవారికి కడుపు కోత ఒకరికి తల్లిదండ్రుల్లేరు. మరొకరికి తండ్రి లేడు. ఇంకొకరికి తండ్రి ఉన్నా.. అతని అండ లేదు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడై ఉండేవారు. కష్టపడి పనిచేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా ఉన్నారు. వయసులో వారి మధ్య ఏడాది, రెండేళ్ల వ్యత్యాసమే. ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం. అలాంటి మిత్రులను మృత్యువు కూడా ఒకేసారి కాటేసింది. దీంతో ఒకే రోజు మూడు కుటుంబాల్లో విషాదం నెలకొని, గ్రామం మూగబోయింది. దుర్గాశివప్రసాద్కు తల్లిదండ్రుల్లేరు. చిన్నప్పటి నుంచి మేనత్త రమణమ్మ వద్దే ఉంటున్నాడు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే మిల్లర్ పని చేస్తూ, ఆమెకు భరోసాగా ఉన్నాడు. ఇతని మరణంతో మేనత్త రమణమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కిరణ్కుమార్కు తల్లి లక్ష్మి, సోదరి హరిణి ఉన్నారు. తండ్రి బతికే ఉన్నా.. ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. తల్లి స్థానికంగా ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలిపని చేస్తుంది. సోదరి దివ్యాంగురాలు కావడంతో ఆశలన్నీ కిరణ్మీదే పెట్టుకున్నారు. కిరణ్ గ్రామంలో కూలి పనులతోపాటు, పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూస్తున్నారు. అలాంటి సమయంలోనే తమకు అందరాని దూరాలకు పోయిన కిరణ్ను తలచుకుంటూ ఆ తల్లి, కూతుళ్ల శోకం ఊరంతటినీ పట్టి కుదిపేస్తోంది. కాకర వీరబాబు మిల్లర్ పనితోపాటు, వ్యాన్ డ్రైవింగ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. తండ్రి దారబాబు ఇంటి వద్దనే ఉంటాడు. తల్లి మేరీ గల్ఫ్లో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. కొడుకు మరణవార్త తెలుసుకుని ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరినట్టు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి
చేవెళ్ల: ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా బాల్య స్నేహితులే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్ (30), గారెల రవీందర్ (32), ఎన్కేతల రఘు (30) అక్కడికక్కడే మృతి చెందారు. నర్కుడ నవీన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. 2005 సంవత్సరం టెన్త్ బ్యాచ్కు చెందిన వీరు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామం నుంచి నరేశ్కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు గ్రామానికి పయనమయ్యారు. 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటారనగా.. మార్గమధ్యలో మీర్జాగూడ బస్ స్టేజీ దాటిన తర్వాత అతివేగంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన మర్రిచెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నవీన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలుష్యం నుంచి కళాఖండాల సృష్టి
వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల ప్రమాదమే తప్ప ప్రయోజనం ఏమీ లేదని మనం ఇంతకాలం భావిస్తూ వచ్చాం. కానీ వాహనాల గొట్టాల నుంచి వెలువడే పొగను పట్టి, బంధించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడమే కాకుండా బంధించిన కర్బన ఉద్గారాల నుంచి కళాఖండాలను సృష్టించేందుకు, పెన్నులో సిరాగా నింపుకొని రాసుకునేందుకు వీలుందని బెంగళూరుకు చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక మిత్రులు నిరూపించారు. అనిరుధ్ శర్మ, నిఖిల్ కౌషిక్, నితేష్ కండ్యన్ అనే ఆ ముగ్గురు మిత్రులు గ్రావికీ ల్యాబ్స్ను ఏర్పాటుచేసి కర్బన ఉద్గారాలను పెయింటింగ్ సిరాగా ఎలా మార్చవచ్చో నిరూపించి చూపారు. వాహనాల గొట్టాల నుంచి పొగల రూపంలో వెలువడే కర్బన ఉద్గారాలను సేకరించేందుకు వారు 'కాలింక్' అనే గుడ్రటి ఆకారం గల ఓ గొట్టాన్ని తయారు చేశారు. వీటిని వాహనాల పొగగొట్టాలకు అమరుస్తారు. వీటి గోడలు కర్బనాలను పీల్చుకొని మిగతా గాలిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దానివల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు కలవవు. అనంతరం కాలింక్లను వాహనాల నుంచి తొలగించి ల్యాబ్కు పంపిస్తారు. అక్కడ కాలింక్ల నుంచి కర్బన ఉద్గారాలను సేకరించి రసాయనిక ప్రక్రియ ద్వారా సిరాగా మారుస్తారు. ఆ సిరాను పెన్నుల్లో రాసుకునేందుకు, పెయింటింగ్స్కు వాయిల్స్ రూపంలో వినియోగించవచ్చు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మహారాష్ట్ర పర్యావరణ శాఖ ట్రాఫిక్ కూడళ్ల వద్ద కాలుష్యం పీల్చుకునే పరికరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని, వాతావరణంలో కర్బన ఉద్గారాలు కలిశాక మాత్రమే ఆ పరికరాలు వాటిని పీల్చుకుంటాయని, వాతావరణంలో కలవడాని కన్నా ముందే వాహనాల వద్దనే ఈ కర్బన ఉద్గారాలను సేకరించడం మంచిదనే ఆలోచనలో నుంచి తమ ప్రాజెక్టు మొదలైందని నిఖిల్ అనే యువకుడు వివరించారు. ఈ ముగ్గురు 2,500 గంటలపాటు వాహనాల నుంచి వెలువడిన కాలుష్య ఉద్గారాల నుంచి 150 లీటర్ల ఎయిర్-సిరాను తయారుచేశారు. పెద్ద ఎత్తున ఈ సిరాను ఫ్యాక్టరీల స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలు తప్పనిసరని వారు చెప్పారు. తమ సిరాను ఉపయోగించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ముందుకొచ్చారని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విషయంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయని వారు చెప్పారు. ఏ దేశ ప్రభుత్వాలు సహకరించినా తాము పెట్రోలు బంకుల వద్ద ఈ 'కాలింక్'లను విక్రయించగలమని, మళ్లీ వాటివద్దే కర్బన ఉద్గారాలతో కూడిన కాలింక్లను సేకరించగలమని వారు చెప్పారు. ఈ ఆధునిక టెక్నాలజీ ఆలోచన వాస్తవానికి అనిరుధ్దని, ఆయన అమెరికాలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నప్పుడు మూడేళ్ల క్రితం కలిగిందని, ఇప్పుడు ముగ్గురం కలసి ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయడం ద్వారా ఇప్పుడు ఈ టెక్నాలజీ విషయంలో విజయం సాధించామని మిగతా ఇద్దరు మిత్రులు వివరించారు. నిఖిల్ చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, అనిరుధ్, నితేష్లు ఇంజనీర్లు. -
వీళ్లు.. 100 పర్సెంట్ బెస్ట్ ఫ్రెండ్స్!
బాల్యం, పాఠశాల విద్య, కాలేజీ.. ఆ తర్వాత ఉద్యోగం, వ్యాపారం లేదా ఏదైన వృత్తి.. ఇలా ఓ మనిషి జీవిత ప్రయాణంలో ఊళ్లు మారాల్సి రావచ్చు. ఈ క్రమంలో ఎందరో స్నేహితులవుతారు. చిన్ననాటి స్నేహం జీవితాంతం కొనసాగించవచ్చు.. కానీ వందో పుట్టినరోజు వేడుకలు చేసుకునే బాల్యమిత్రులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అమెరికాలో ముగ్గురు స్నేహితురాళ్లు వందో జన్మదిన వేడుకలు చేసుకుని తమ స్నేహం 100 పర్సెంట్ బెస్ట్ అని చాటిచెప్పారు. వీరి కొడుకులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు అందరూ ఒక్క చోటకు చేరి గ్రాండ్గా సెలెబ్రేషన్స్ చేశారు. అరుదైన స్నేహితురాళ్లు రుత్ చాట్మన్ హామ్మెట్, గ్లాడీస్ వేర్ బట్లర్, బెర్నిసె గ్రౌమ్స్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18న వాషింగ్టన్లోని ఓ చర్చిలో ఈ అపూర దృశ్యం ఆవిషృతమైంది. కాగా మరో స్నేహితురాలు లియోనా బార్నెస్ గత నెలలో మరణించింది. ఆమె లేకపోవడం ఈ ముగ్గురికి లోటుగా అనిపించింది. తమ బర్త్ డే వేడుకల్లో లియోనా ఫొటోను తమ పక్కన పెట్టుకుని నివాళులు అర్పించారు. ఈ నలుగురూ 1916లో జూన్ లేదా జూలైలో జన్మించారు. వందేళ్లుగా వీరి స్నేహం కొనసాగుతోంది. 16వ స్ట్రీట్ హైట్స్లోని చర్చికి వీరు క్రమం తప్పకుండా వచ్చేవారు. నలుగురూ కలసి వందో బర్త్ డేను గ్రాండ్గా చేసుకోవాలని భావించారు. అయితే లియోనా మే నెలలో మరణించింది. ఆమె మరణించడం మిగిలిన మగ్గురు స్నేహితరాళ్లను కలచివేసింది. లియోనా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రుత్ చాట్మన్ హామ్మెట్, గ్లాడీస్ వేర్ బట్లర్, బెర్నిసె గ్రౌమ్స్ వందో జన్మదిన వేడుకలు చేసుకున్నారు. చర్చిలో ఎప్పటిలాగా ఈ స్నేహితులు వరుసలో కూర్చుని తమ పక్క సీటుపై లియోనా ఫొటో ఉంచి పుష్పగుచ్చాలు ఉంచారు. లియోనా లేకపోవడం బాధాకరమైనా ముగ్గురం కలసి వందో జన్మదిన వేడుకలు చేసుకోవడం మధురానుభూతిని కలిగించిందని చెప్పారు. ఈ అపురూప స్నేహితులకు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. -
మరణంలోనూ వీడని స్నేహం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల దుర్మరణం హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలైన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణాపురానికి చెందిన సుంకరి సురేశ్(20), పట్టం వెంకటేశ్(21), ప్రభుదేవ్(19) స్నేహితులు. పదో తరగతి వరకు కలసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం సురేశ్, వెంకటేశ్ నగరానికి వచ్చారు. సురేశ్ నాగారంలో తన అన్న తిరుపతి వద్ద ఉంటూ తార్నాకలోని ప్రైవేట్ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. వెంకటేశ్ ఘట్కేసర్లోని మేథ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ.. నాగారంలో స్నేహితులతో కలసి ఉంటున్నాడు. ప్రభుదేవ్ సూర్యాపేటలోని ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. స్నేహితులను చూడటానికి ప్రభుదేవ్ మంగళవారం నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా నాగారంలోని వెంకటేశ్ రూమ్లో ముగ్గురూ కలసి పార్టీ చేసుకున్నారు. కాగా, బుధవారం తెల్లవారు జామున ఎస్పీనగర్ ప్రధాన రహదారిపై డివైడర్ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గూరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అతి వేగంతో బైక్ నడపడంతో అదుపుచేయలేక డివైడర్ను ఢీ కొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగారం నుండి తార్నాక వైపు వెళుతుండగా ప్రమాదం జరిగిందని, ప్రభుదేవ్ను బస్టాండ్లో దించడానికి వె ళుతుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాకు కూడా తెలియదు: రూమ్మేట్ ప్రసాద్ వారు ముగ్గురూ తెల్లవారుజామున బయటకు వెళ్లిన విషయం తనకు కూడా తెలియదని వెంకటేశ్ రూమ్మేట్ ప్రసాద్ చెప్పాడు. తన బైక్ తాళం తీసుకెళ్లారని, రూమ్ తలుపు కూడా వేసిఉండటంతో ఇరుగుపొరుగువారు తలుపు తీశారని తెలిపాడు. సురేశ్ అన్న తిరుపతి మాట్లాడుతూ.. తన వద్దనే ఉండి సురేశ్ చదువుకుంటున్నాడని, అప్పుడప్పుడు వెంకటేశ్ రూమ్కు వెళ్లి వచ్చేవాడని చెప్పాడు. మంగళవారం రాత్రి ఇంటికి రాలేదని, ఆ రోజే తన తమ్ముడికి చివరిరోజు అవుతుందని ఊహించలేదని అతను రోదించాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement