-
ఎస్టీ మహిళపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్బీ నగర్ ఎస్హెచ్వోకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
HYD: మహిళపై థర్డ్ డిగ్రీ..! సీపీ వివరణ
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. ఒక ఎస్ఐను బదిలీ చేశాం. హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పిస్తాం. బాధితురాలి దగ్గర డబ్బులు, గోల్డ్ తీసుకున్నారనడంలో వాస్తవం లేదు. హైకోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని సీపీ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. వరలక్ష్మీ అనే మహిళ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్డులో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ స్థానికంగా ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆగస్టు 15న దేవరకొండలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆ మహిళ రాత్రి తిరిగి వస్తూ ఎల్బీ నగర్లో బస్సు దిగింది. ఆటోలు, బస్సులు లేకపోవడంతో రోడ్డు పక్కన నిలబడింది. పెట్రోలింగ్కు వచ్చిన ఎల్బీ నగర్ పోలీసులు ఆ మహిళను ప్రశ్నించారు. ఆమె వద్ద డబ్బులు కూడా ఉండటంతో అనుమానించి స్టేషన్ కు తీసుకెళ్లారు. తన కుమార్తె పెళ్లి కార్డును కూడా చూపినా వదల్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారని, ఉదయానే ఆటోలో ఇంటికి పంపినట్లు ఆమె తెలిపింది. చదవండి: మీర్పేట్లో అమానుషం.. గ్యాంగ్రేప్ నిందితుల అరెస్ట్ -
థర్డ్ డిగ్రీలకు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీనిపై సూచనలు, సలహాలు సేకరించి హోంశాఖకు పంపాలన్నారు. శిక్షా కాలం ఏడేళ్లు అంతకు మించిన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రీయ విధానాలను అనుసరించాలి ‘ఫోరెన్సిక్ ఆధారాలను సైతం జత చేస్తూ పోలీసులు సమగ్రవంతమైన చార్జ్షీటును కోర్టుకు సమర్పిస్తే నిందితుల తరపు న్యాయవాదులకు వాదించడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. శిక్ష పడే అవకాశాలు సైతం బాగా పెరుగుతాయి. నేరగాళ్లు, నేర ప్రవృత్తి వ్యక్తుల కన్నా పోలీసులు నాలుగు అడుగులు ముందు ఉండటం అత్యవసరం. పోలీసులు వెనకపడకూడదు. బలగాల ఆధునికీకరణతోనే ఇది సాధ్యం. ఇది థర్డ్ డిగ్రీలు ప్రయోగించే కాలం కాదు. దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఫోన్ల ట్యాపింగ్ సత్ఫలితాలు ఇవ్వదు. పౌర పోలీసింగ్, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో చాలా ప్రయోజనాలున్నాయి. బీట్ కానిస్టేబుళ్ల విధానాన్ని బలోపేతం చేయాలి’ అని అమిత్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ వర్సిటీ జాతీయ స్థాయిలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోందని అమిత్ షా వెల్లడించారు. వర్సిటీకి ప్రతి రాష్ట్రంలో అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తరగతి తరువాత పోలీస్ దళాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఈమేరకు బీపీఆర్డీ అందచేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుజరాత్లో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఫోరెన్సిక్ వర్సిటీల నుంచి పట్టా పొందిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా నిరుద్యోగిలా మిగిలిపోలేదన్నారు. -
‘థర్డ్ డిగ్రీ’పై రాజీయత్నం!
- రంగంలోకి దిగిన అధికార పార్టీ నేతలు - జైలులో బాధితులతో చర్చలు - ఉద్యోగాలు.. పరిహారం.. కేసుల ఎత్తివేతకు సై సిరిసిల్ల: జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల దళితులపై పోలీసుల ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగంపై ‘రాజీ’ యత్నాలు మొదలయ్యాయి. ముఖ్య నాయకుల ఆదేశాలతో అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగారు. ఆందోళనలకు ముగింపు పలికేలా తమతో సహ కరించాలంటూ బాధితు లతో చర్చలు జరిపారు. కేసులు ఎత్తి వేయిస్తామని, పరిహారం మంజూరయ్యేలా చూస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, అధికార పార్టీ నాయకులు ఆలస్యంగా స్పందించడంపై నిందితులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్లకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు శుక్రవారం కరీంనగర్ జైలుకు వెళ్లివచ్చారు. పోలీసుల తీరును తప్పు పడుతూనే.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ‘విపక్షాల ఆందోళనకు సహ కరించవద్దు.. వాళ్లు ఇవ్వాల వస్తారు.. పోతారు.. మనమే ఇక్కడ ఉండేది.’అంటూ రాజీ ప్రయ త్నాలు చేసినట్లు సమాచారం. ‘మా పానాలు పోతున్నయి. బొక్కబొక్కకూ పోలీసోళ్లు నీళ్లు పోసిండ్రు.. మాగతి మీకొస్తే తెలుస్తది..’ అంటూ నిందితుల్లో ఒకరు తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. ‘గిప్పుడా మీరు వచ్చేది’ అంటూ మరొకరు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులతోనూ చర్చలు.. నిందితుల కుటుంబ సభ్యులతో తంగళ్లపల్లి మండల ప్రజాప్రతినిధులు కొందరు చర్చలు జరిపి నట్లు తెలిసింది. నేరెళ్ల, రామచంద్రాపూర్, జిల్లెల్ల గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లా డగా కొందరు రాజీకి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విపక్షాలకు దూరంగా ఉంటే పరి హారం ఇస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామ నడంతో కొందరు అంగీకరించినట్లు సమాచారం. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది బాధితుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. పెంట బాణయ్య, చీకోటి శ్రీనివాస్, కోరుగంటి గణేశ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. పోరుబాటలో విపక్షాలు థర్డ్ డిగ్రీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కాంగ్రెస్ సహా బీజేపీ, దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. హైకోర్టులోనూ కేసు ఫైల్ చేశారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పోలీసులపై చర్యలు..! థర్డ్ డిగ్రీ ప్రయోగంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్నట్లు సమాచా రం. ప్రభుత్వపరంగా గ్రీన్సిగ్నల్ రాగానే బాధ్యు లపై చర్యలు చేపట్టనున్నారు. బాధ్యు లపై చర్యలు తీసుకుని, నిందితులను ఆదుకునే పక్రియను ఏకకాలంతో చేపట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. -
అమ్మో లాకప్
సాక్షి, విజయవాడ బ్యూరో: లాకప్కెళ్తే ప్రాణాలతో తిరిగిరావడం కష్టమేనా. అక్కడికెళ్తే యమపురిలో అడుగుపెట్టినట్టేనా? విజయవాడ పోలీస్ స్టేషన్లలో నిందితులపై హింస బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే దుర్గాప్రసాద్ పోలీసుల చేతిలో చనిపోయిన రెండో వ్యక్తి. గతంలో వ¯Œæటౌన్ పీఎస్లోని సీసీఎస్ భవనంలోని పై అంతస్తు నుంచి రాజమండ్రికి చెందిన ఓ వ్యాపారి పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విజయవాడ జక్కంపూడి కాలనీలో నివాసం ఉంటున్న మారిశెట్టి దుర్గాప్రసాద్ (23) పోలీసు చిత్రహింసల వల్లే చనిపోయాడని అతనికుటుంబ సభ్యులు, ఓపీడీఆర్ నిజనిర్ధరణ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. జూలై 20వ తేదీ రాత్రి ఇంటికి రాలేదు. ఆయన మిత్రులు నాగరాజు, హరిబాబు కూడా ఇంటికి చేరలేదు. తల్లి, భార్యలకు పోలీసులపైనే అనుమానం వచ్చింది. ఎందుకంటే గతంలోనూ ఇలాగే దుర్గాప్రసాద్ను స్టేషన్కు తీసుకెళ్ళి వారం రోజుల తరువాత పంపించేవారు. పోలీసుల దెబ్బల నుంచి తేరుకునేందుకు కనీసం నెలరోజులు పట్టేది. తల్లి, భార్య తమ పరిధిలోని స్టేషన్లకు వెళ్ళారు. నీ భర్తను తాము తీసుకు రాలేదంటూ పోలీసులు చెప్పారు. జూలై 30న పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. నీ భర్తకు బాగోలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే దుర్గాప్రసాద్ శవాన్ని భార్య, తల్లికి అప్పగించారు పోలీసులు. ఏం జరిగింది.... జూలై 20 సాయంత్రం దుర్గాప్రసాద్, అతని స్నేహితులు నాగరాజు, హరిబాబులు బుడమేరు కట్టపై నడుచుకుంటూ వస్తున్నారు. ఇరువురు కానిస్టేబుళ్ళు పని ఉంది అంటూ ముగ్గురినీ పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్ళారు. వన్టౌన్ పోలీస్స్టేçÙన్ కాంపౌండ్లోని సీసీఎస్ స్టేషన్లో వీరిని ఉంచారు. 20 నుంచి 28 వరకు సీసీఎస్ స్టేషన్లోనే ఉంచి దుర్గాప్రసాద్పై నిత్యం థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఆ తరువాత సీసీఎస్ పోలీసులు నాగరాజు, హరిబాబులను వేరే కేసుల్లో నిందితులుగా పేర్కొని రిమాండ్కు పంపించారు. తీవ్రమైన దెబ్బల వల్ల దుర్గాప్రసాద్ పేగులు, గుండె డ్యామేజీ కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో పోలీసులు వన్టౌన్లోని ఒక ప్రైవేట్ వైద్య శాలకు (నిత్యం పోలీసులు నిందితులకు వైద్యం చేయించే ప్రైవేట్ ఆస్పత్రి) జూలై 30 తరలించారు. అప్పటికే చావుకు దగ్గరైన దుర్గాప్రసాద్కు వైద్యం చేయడం సాధ్యం కాదంటూ వైద్యుడు తేల్చి చెప్పారు. æహడావుడిగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు. దుర్గాప్రసాద్ రాత్రి తొమ్మిది గంటలకు చనిపోగా 11 గంటలకు బంధువులు ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. కొందరు పోలీసు పెద్దలు వారిని నయానో భయానో నచ్చజెప్పి శవాన్ని ఇంటికి తీసుకుపోయేలా చేశారు. 31వ తేదీన శవాన్ని ఖననం చేసే సమయంలోనూ పోలీసులు మోహరించారు. బంధువులతో సెటిల్మెంట్... చనిపోయిన వ్యక్తి తిరిగి రాడని, అల్లరి చేస్తే పోలీసుల నుంచి మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బందువులకు పోలీసులు సర్దిచెప్పారు. మృతుని భార్యకు రూ. 2.50 లక్షలు, తల్లికి రూ. లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం చేసి గుట్టుచప్పుడు కాకుండా కేసును మూసివేశారు ఖాకీలు. అనుమానాస్పద మరణంలో కచ్చితంగా నిర్వహించాల్సిన పోస్టుమార్టం కూడా జరపలేదు. పీఎం చేస్తే నిజాలు బయటపడతాయనే భయమే కారణం. గతంలో గన్నవరం యువకుడు కూడా ఏడాది కిందట పెనమలూరు పోలీసులు దొంగతనం కేసులో గన్నవరానికి చెందిన పుల్లా రమేష్ అనే యువకుణ్ని తీవ్రంగా హింసించడంతో అతడు చనిపోయాడు. తాము పట్టుకోబోతే కొంగల మందు మింగాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగానే మరణించాడని అప్పటి సీఐ సీహెచ్ జగన్మోçß毌æరావు చెప్పారు. దర్యాప్తు తీరుల్లో ఎన్నో ఆధునిక విధానాలు వస్తున్నా వాటిని పాటించకుండా, తమకు తెలిసిన చిత్రహింసలనే నిందితులపై ప్రయోగిస్తున్నారు సిటీ పోలీసులు. ఫలితంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మాకు సంబంధం లేదు సీసీఎస్ ఏడీసీపీ వెల్లడి దుర్గాప్రసాద్ మరణంతో పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని విజయవాడ క్రైమ్స్ (సీసీఎస్) అదనపు డిసిపి రామకోటేశ్వరరావు చెప్పారు. దుర్గాప్రసాద్ లాకప్డెత్ విషయమై సాక్షి డిసిపిని వివరణ కోరగా అతని మరణంతో పోలీసులకు ప్రమేయం లేదని చెప్పడం గమనార్హం. అతన్ని పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్ళలేదని, అతను ఎలా మరణించిందీ తమకు తెలియదని ఆయన చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement