-
పారదర్శకతకు అసలైన అర్థం
సాక్షి, అమరావతి: ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు పారదర్శకతకు అసలైన అర్థం చెబుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. టెండర్ల విధానంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా తీసుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు (న్యాయపరమైన ముందస్తు పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంపై సీఎం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు ఆమోదం అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగన్నారు. దేశానికి, అంతర్జాతీయ సమాజానికి సరైన సందేశం పంపించామన్నారు. రూ.100 కోట్లు, ఆపై ఏ టెండరైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జికి పంపుతామని, ఆయన ఆదేశాలను తప్పక పాటిస్తామని ఈ ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్గిల్ అమర వీరుల త్యాగాన్ని ఈ దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది కార్గిల్ యుద్ధ అమరవీరులు చేసిన త్యాగానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారి త్యాగాన్ని, ఆ వీరులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘భారతదేశ పరిరక్షణలో అమరులై కార్గిల్ యుద్ధంలో ఘన విజయం సాధించిన వీరులకు కృతజ్ఞతాంజలులను ఘటిస్తున్నాను. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ యోధుల త్యాగ నిరతిని, వీరోచిత సాహసాన్ని ఈ దేశం ఎన్నటికీ మరువదు’ అని జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. -
‘విమ్స్’లో కమీషన్ల దందా!
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాణదాతగా పేరుగాంచిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం ప్రైవేట్కు అప్పజెప్పారు. రాత్రికి రాత్రే నిబంధనలు మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారు. ఇప్పటిదాకా రూ.300 కోట్లు వెచ్చించి, అభివృద్ధి చేసిన ఆసుపత్రిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన తీరు అధికారవర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. విమ్స్ ప్రైవేటీకరణతోపాటు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రులపై అజమాయిషీ కోసం ‘క్లినికల్ ఆడిట్’ పేరుతో ఓ కాంట్రాక్టు, మాతా శిశుమరణాలు తగ్గించే మరో కాంట్రా క్టును బాగా కావాల్సిన వారికే అప్పగించారు. ఈ కాంట్రాక్టుల అప్పగింత వెనుకరూ.కోట్ల కమీషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువుకు ముందే కానిచ్చేశారు ఎక్కడైనా టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే, బిడ్లు దాఖలు చేసుకునేందుకు తగినంత గడువు ఇస్తారు. విమ్స్ ప్రైవేటీకరణలో భాగంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ పిలిచింది. బిడ్ల దాఖలుకు జూన్ 18వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. కానీ, తమకు బాగా కావాల్సిన బిడ్డర్లు బిడ్లు దాఖలు చేయగానే జూన్ 6వ తేదీనే టెండర్ ప్రక్రియ ముగించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నిబంధనల ప్రకారం ఒకసారి టెండర్ పిలిస్తే గడువుకు ముందే ముగించకూడదు. కావాలంటే టెండర్ గడువును ఇంకా పొడిగించుకోవచ్చు. అంతేతప్ప గడువుకు ముందే ముగించడం నిబంధనలకు విరుద్ధమే. ఏపీఎంఎస్ఐడీసీ నిర్వాకం వల్ల చాలామంది బిడ్లు దాఖలు చేయలేకపోయారు. రాత్రికి రాత్రే ఈఎండీ తగ్గింపు ఏ టెండర్లో అయినా ఎర్నెస్ట్ డిపాజిట్ మనీ(ఈఎండీ) నిబంధన ఉంటుంది. విమ్స్ ప్రైవేటీకరణ టెండర్లలో ఈఎండీ రూ.25 లక్షలుగా నిర్దేశించారు. జూన్ 5వ తేదీన ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్కు సచివాలయంలోని ముఖ్యకార్యదర్శి పేషీ నుంచి ఈ–మెయిల్ వెళ్లినట్లు సమాచారం. రూ.25 లక్షలున్న ఈఎండీని రూ.లక్షకు తగ్గించాలన్నదే ఆ ఈ–మెయిల్ సారాంశం. ముఖ్యమంత్రి కార్యాలయ ఒత్తిళ్ల మేరకే సదరు ఈ–మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించినట్లు ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చెప్పాయి. సీఎంఓ నుంచి ఆర్డర్ ఉందన్నారు ‘‘టెండర్ను గడువు కంటే ముందే ముగించిన విషయం వాస్తవమే. ఉన్నతాధికారులు చెప్పినందు వల్లే ఈఎండీని తగ్గించాం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్ ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య రాతపూర్వకంగా ప్రతిపాదన పంపిన తర్వాతే చేశాను. దీనిపై నా పాత్ర ఏమీ లేదు’’ – రోహిణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ రూ.కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్కు అప్పగిస్తారా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనల్లోంచి విమ్స్ పురుడు పోసుకుంది. దీన్ని హైదరాబాద్లోని నిమ్స్ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కలలుగన్నారు. విమ్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.300 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ చాలామంది సిబ్బంది పని చేస్తున్నారు. స్పెషలిస్టు డాక్టర్లున్నారు. ఇన్సోర్సింగ్ కింద వైద్యులు సేవలందిస్తున్నారు. మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ‘విమ్స్’ అద్భుతంగా తయారవుతుంది. ఎంబీబీఎస్ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం పెద్దలు తమ స్వార్థం కోసం ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఐదు రకాల సేవలను ప్రైవేట్కు ఇచ్చేశారు. గుండెజబ్బుల చికిత్సలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు, నియోనెటాలజీ అండ్ పీడియాట్రిక్, రీనల్ సర్వీసెస్ (కిడ్నీ సేవలు), స్పోర్ట్స్ ఇంజూరీ (ఎముకల శస్త్రచికిత్సలు, కీళ్ల మార్పిడి) చికిత్సలు ప్రైవేట్పరమయ్యాయి. ఈ సేవలను ధనుష్ టెక్నాలజీస్ అనే సంస్థకు కట్టబెట్టినట్టు సమాచారం. సాఫ్ట్వేర్ సేవలకు సంబంధించిన ఈ సంస్థకు ఆరోగ్య సేవల్లో ఎలాంటి అనుభవం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు అప్పగించారు. తాజాగా విమ్స్ కూడా అదే సంస్థ చేతుల్లోకి వెళ్లింది. పైన పేర్కొన్న సేవల్లో ఔట్పేషెంట్కు, ఇన్పేషెంట్కు, ఎక్స్రే, ఎంఆర్ఐ, ఎండోస్కొపీ ఇలా ఒక్కొక్క సేవకు ధర నిర్ణయించి ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇదంతా ఏటా రూ.కోట్లలోనే ఉంటుందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక్క ఏడాదిలో ప్రైవేట్ సంస్థకు చెల్లించే సొమ్ముతో విమ్స్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయొచ్చని అన్నారు. -
హైదరాబాద్లో లక్ష ‘డబుల్’ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోగా హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు 12 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసేందుకు పట్టుదలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో డబుల్ ఇళ్ల నిర్మాణంపై గురువారం జల మండలి కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే కాంట్రాక్టర్లకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నిబంధనల మేరకు పాటించాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని కోరారు. వీటి నిర్మాణానికి ఇసుక సరఫరా కోసం తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో నాలుగు ఇసుక డిపోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డబుల్ ఇళ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని, ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంలో ఏవైనా ఇబ్బం దులుంటే తెలపాలని కాంట్రాక్టర్లకు కేటీఆర్ సూచిం చారు. కాంట్రాక్టర్లు తెలిపిన సమస్యలతోపాటు పలు అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నవం బర్లోగా అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ సంద ర్భంగా నగర ఎమ్మెల్యేలు, అధికారుల సమావేశంలోనే ఫోన్ చేసి మాట్లాడారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్లకు బ్రేక్
⇒ ‘ఇన్సిటు’ నిర్మాణాలకు అభ్యంతరాలు ⇒ జోషివాడ, జియాగూడ, ఆర్కే నగర్లో వద్దంటున్న స్థానికులు గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. ఈ సంవత్సరం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న అవాంతరాల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. దాదాపు 30 వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా, స్థానికుల నుంచి అభ్యంతరాలతో కొన్ని చోట్ల, కోర్టు వివాదాల కారణంగా మరికొన్ని చోట్ల పనులు మొదలు కాని పరిస్థితి నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం క్లిష్టంగా మారుతోంది. ఈ సంవత్సరం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. సమస్యల్ని పరిష్కరించి, నిర్మాణం ప్రారంభించేందుకు జాప్యం జరుగుతోంది. మొత్తం లక్ష ఇళ్లకుగాను 90,104 ఇళ్లకు అవసరమైన రూ.7742.58 కోట్లకు పరిపాలనా పరమైన ఆమోదం లభించినా, దాదాపు 30 వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా, స్థానికుల నుంచి అభ్యంతరాలతో కొన్ని చోట్ల, కోర్టు వివాదాలతో కొన్ని చోట్ల పనులు మొదలు కాని పరిస్థితి నెలకొంది. 16 ప్రాంతాల్లో 9512 ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. లక్ష ఇళ్లకు సరిపడా అవసరమైనన్ని భూముల సేకరణ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్మంత్రి కేటీఆర్లు త్వరితంగా డబుల్ ఇళ్లు పూర్తిచేయాల్సిందిగా ఆదేశించినప్పటికీ, అధికారులు నిస్సహాయులవుతున్నారు. తాజాగా మూడు ప్రాంతాల్లో స్థానికుల అభ్యంతరాలతో 1624 ఇళ్ల నిర్మాణం డోలాయమానంలో పడింది. దశల వారీగా నిర్మించాలి.. జియాగూడలో సిల్ట్ ప్లస్ 5 అంతస్తుల పద్ధతిలో 840 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఇక్కడ ఇన్సిటు (ఎక్కడ ఉంటున్న వారికి అక్కడే..పాత ఇళ్లలో ఉంటున్న వారిని తరలించి, వాటిని కూల్చివేసి నిర్మించే పద్ధతి) విధానంలో డబుల్ ఇళ్లు నిర్మించేందుకు గతంలో నిర్మించిన, శిథిలావస్థకు చేరిన మున్సిపల్ క్వార్టర్స్ను కూల్చివేసి కొత్త ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకుగాను పాత ఇళ్లల్లో ఉంటున్న 563 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. అయితే కొత్త ఇళ్లు వెంటనే పూర్తవుతాయని తమకు నమ్మకం లేదని, ఎంతకాలం పడుతుందో తెలియనందున ఒక్కొక్క బ్లాక్కు ఎన్ని ఇళ్లు వస్తాయో..అంతమంది మాత్రమే తొలుత ఖాళీచేస్తారని, ఇళ్ల నిర్మాణం పూర్తయి వారు కొత్త ఇళ్లలో చేరాక మిగతా బ్లాక్లోని లబ్ధిదారులు ఖాళీ చేస్తామని వారు భీష్మించుకున్నారు. అంతేకాకుండా పొజిషన్ సర్టిఫికెట్లకు సంబంధించి అందరి పేర్లు ఒకే జాబితాగా పేర్కొని, వాటినే జిరాక్సులుగా ఇచ్చారని, అలా కాకుండా ఎవరి పేరు మీద వారికి విడివిడిగా పొజిషన్లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొజిషన్ సర్టిఫికెట్లు వ్యక్తిగతంగా జారీ చేసేందుకు ఇబ్బంది లేకున్నా విడతల వారీగా నిర్మాణం కుదరంటున్నారు అధికారులు. ఐదంతస్తుల్లో నిర్మించాల్సిన వీటిని విడతల వారీగా నిర్మిస్తే సిమెంటు, ఇనుము తదితర ధరల్లో తేడా వస్తుందని, ఏవిధంగా చూసినా సాధ్యం కాదంటున్నారు. ఇక వారిని ఒప్పించేందుకు మునిసిపల్మంత్రి కేటీఆర్తో తగిన హామీ ఇప్పించాలని భావిస్తున్నారు. ఖాళీ స్థలంలో నిర్మించాలి.. కార్వాన్ నియోజకవర్గంలోని అమ్లాపూర్ జోషివాడలో జీ ప్లస్ 3 అంతస్తుల్లో 400 ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. అందుకు మున్సిపల్ క్వార్టర్లలోని ప్రజలు ససేమిరా అంటున్నారు. నిర్ణీత వ్యవధిలో అధికారులు నిర్మిస్తారన్న నమ్మకం తమకు లేదని, ఉంటున్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయబోమంటున్నారు. పక్కనే ఉన్న ఖాలీస్థలంలో నిర్మించాలని డిమాండ్చేస్తున్నారు. ఇప్పటికే తమలో 235 మంది ఇళ్ల పట్టాలున్నాయని, తాముంటున్న ఇళ్లను ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. కొందరు ఔనంటూ.. కొందరు కాదంటూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆర్కే నగర్లో జీ ప్లస్ 3 అంతస్తుల పద్ధతిలో 384 ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. గుట్టమీద ఉంటున్న 150 మంది కావాలని, గుట్ట కింది భాగంలో ఉన్న దాదాపు 125 మంది వద్దని విభేదాలు తలెత్తడంతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎవరి వారుగా తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుండటం కూడా ఇక్కడ సమస్య కొలిక్కి రాకపోవడానికి ఒక కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఇలా.. ఇన్సిటు విధానంలో నిర్మించే ఇళ్లకు ఆటంకాలు ఎదురవుతుండటంతో గ్రేటర్లో డబుల్ ఇళ్ల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు చందంగా మారింది. -
ఐపీఎల్ టెండర్ల ప్రక్రియ నిలిపివేత
న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల ప్రక్రియను బీసీసీఐ నిరవధికంగా వారుుదావేసింది. షెడ్యూల్ ప్రకారం నేడు (మంగళవారం) టెండర్ల దాఖలుకు చివరి గడువు తేదీ. అరుుతే ఈ ప్రక్రియను పరిశీలించేందుకు జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ తమ స్వతంత్ర ఆడిటర్ను నియమించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డుకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలైనా లోధా ప్యానెల్ నియమించే ఆడిటర్ పర్యవేక్షణలోనే జరగాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిగా బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే.. ప్యానెల్కు లేఖ రాశారు. ‘పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెండర్ ప్రక్రియ కొనసాగాలని మేం కమిటీకి సమాచారమిచ్చాం. విదేశాల నుంచి బిడ్డర్లు భారత్కు వస్తారని కూడా తెలిపాం. అరుుతే ఆడిటర్ నియామకం గురించి కమిటీ నుంచి మాకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో టెండర్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రొఫెషనల్గా నిర్వహించే అవకాశం లేకుండా పోరుుంది. అందుకే వారుుదా నిర్ణయం తీసుకున్నాం. కమిటీ నుంచి స్పందన వచ్చాక అందరికీ తెలియజేస్తాం’ అని బీసీసీఐ వెల్లడించింది. బిడ్స దాఖలు చేసిన కంపెనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ తాజా పరిస్థితికి బీసీసీఐ క్షమాపణలు తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement