-
టెంపర్ రీమేక్ వాయిదా!
పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టెంపర్. టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను ప్రస్తుతం కోలీవుడ్లో అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించిన చిత్రయూనిట్ ఈ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అయోగ్య రిలీజ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇటీవల షూటింగ్లో విశాల్ గాయపడటం, తరువాత నిశ్చితార్థం పనుల్లో విశాల్ బిజీగా కావటంతో షూటింగ్ ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 19న కాకుండా మే 10న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా అయోగ్య వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. -
కన్ను కొట్టలేక...
‘సింబా’ సినిమా షూటింగ్ లొకేషన్ అది. కెమెరా లెన్స్ను అటూ ఇటూ మారుస్తున్నారు కెమెరామేన్. ఓ షాట్ కోసం టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఎందుకంటే సారా అలీఖాన్ మాత్రం టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. ‘సింబా’ టీమ్ ఇంతలా ట్రై చేస్తున్న ఆ సీన్ ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ బాబు. సారా అలీఖాన్ కన్ను కొట్టే సీన్. ఈ సినిమాలో ‘ఆంఖే మారే’ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్లో హీరోయిన్ కుడికన్ను కొట్టే ఓ సీన్ ఉందట. ఈ సీన్ కోసం సారా కష్టపడ్డారట. కానీ ఏం లాభం ఎడిట్లో అది పోయిందట. సారాకు కన్ను కొట్టడం రాదని ‘సింబా’ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి ఓ సందర్భంలో పేర్కొన్నారు. రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించిన ‘సింబా’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తెలుగు హిట్ ‘టెంపర్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
విశాల్ చిత్ర షూటింగ్ రద్దు
చెన్నై, పెరంబూరు: నటుడు విశాల్ చిత్ర షూటింగ్ అనూహ్యంగా రద్దయ్యింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అయోగ్య. తెలుగు చిత్రం టెంపర్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణలో ఉన్నా ఈ చిత్ర షూటింగ్ను గురువారం విళిపురం జిల్లా, మరకానం సమీపంలోని కూనిపాడులో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంది. దీంతో చెన్నై నుంచి చిత్ర యూనిట్ కూనిపాడు చేరుకుంది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలోని వినాయకుడి విగ్రహం ముందు పూజ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి చిత్ర వర్గాలు సిద్ధం అయ్యారు. ఆ సమీపంలో మసీదు ఉంది. గురువారం బాబ్రీ మసీదు కూల్చివేసిన దినం కావడంతో ముస్లీంలు బ్లాక్ డేను పాటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతానికి చెందిన ముస్లీంలు కొందరు విశాల్ చిత్ర షూటింగ్ను అడ్డుకున్నారు. బ్లాక్డేను పాటిస్తున్న రోజును తమ ప్రాంతంలో వినాయకుడికి పూజలు చేసేలా షూటింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరకానం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ మైఖెల్హృదయరాజ్ పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని అనుమతి లేకుండా షూటింగ్ చేయడం నేరం అని హెచ్చరించి బాబ్రీమసీదు కూల్చివేసిన రోజున మసీదు సమీపంలో షూటింగ్ చేయరాదని, వెంటనే నిలిపేయాలని చెప్పారు. దీంతో అయోగ్య చిత్ర వర్గాలు మరో దారి లేక షూటింగ్ను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని షూటింగ్ కోసం చెన్నై నుంచి బయలు దేరిన విశాల్కు తెలియజేయడంతో ఆయన మధ్యలోనే తిరిగి చెన్నైకి వచ్చేశారు. -
ట్రైలర్: ‘టెంపర్’ చూపించిన రణ్వీర్ సింగ్
తెలుగులో ఎన్టీఆర్ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాను తమిళంలోనూ .. హిందీలోను రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’పేరుతో వస్తుండగా.. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్తో రీమేక్ చేశారు. బాలీవుడ్లో రణ్వీర్ సరసన సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ నటిస్తోంది. ఈ సినిమాను ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ఫేమ్’ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేశాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా ‘సింబా’ మూవీని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిచినట్టు కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ అజయ్ దేవగన్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైంది. అంతేకాకుండా అజయ్ దేవగన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఇక బాలీవుడ్లో మూర్తి క్యారెక్టర్లో అశుతోష్ రాణా నటిస్తుండగా, విలన్గా సోనూసూద్ ఒదిగిపోయాడు. ఈ చిత్ర ట్రైలర్ను చూస్తుంటే తెలుగు టెంపర్ క్లైమాక్స్ను మాత్రమే మార్చకుండా.. మిగతాదంతా బాలీవుడ్కు తగ్గట్టుగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో రణ్వీర్, దీపికా పదుకొనేతో పాటు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సన్నీ స్టెప్పేస్తే!
సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్కి డ్యాన్స్ వేస్తే సినిమాకో క్రేజ్ ఏర్పడుతుంది.. సన్నీ స్టెప్పేస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం. ఆల్రెడీ హిందీలో ‘పింక్ లిప్స్, లైలా మే లైలా’ వంటి స్పెషల్ సాంగ్స్తోపాటు రాజశేఖర్ ‘పీయస్వీ గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో..’ వంటి సాంగ్తో సన్నీ ఎంతటి సెన్సేషన్ సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు అదే క్రేజ్ తమ సినిమాకి తోడవ్వాలనుకుంటున్నారు ‘అయోగ్య’ చిత్రబృందం. తెలుగు సూపర్హిట్ చిత్రం ‘టెంపర్’ను హీరో విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాశీ ఖన్నా కథానాయిక. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం సన్నీ లియోన్ని సంప్రదించారట. ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా’ అనే సాంగ్కు నోరా ఫతేహి స్టెప్స్ వేశారు. ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్కే తమిళంలో సన్నీ స్టెప్పులు వేయనున్నారట. ఈ చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ కానుందని సమాచారం. ఈ చిత్రాన్మి ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement