-
టెక్ మహీంద్రాకు రూపీ దెబ్బ
* 23 శాతం క్షీణించిన నికర లాభం * ఒక్కో షేర్కు రూ.6 డివిడెండ్ న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్కు 23% తగ్గింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, వేతనాల పెంపు, ఇటీవల కొనుగోలు చేసిన కంపెనీల పనితీరు పేలవంగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మిలింద్ కుల్కర్ణి చెప్పారు. 2013-14 క్యూ4లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 క్యూ4లో రూ.472 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.5,058 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.6,117 కోట్లకు పెరిగిం దని పేర్కొన్నారు. ఒక్కో షేర్కు రూ.6 డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల పరంగా అత్యధిక వృద్ధి సాధించిన క్వార్టర్లలో ఇదొకటని వివరించారు. డాలర్ల పరంగా ఆదాయం 19% వృద్ధితో 98 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.2,628 కోట్లకు తగ్గిందని, ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.22,628 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా నికర లాభం 43 కోట్ల డాలర్లుగా, ఆదాయం 19 శాతం వృద్ధితో 368 కోట్ల డాలర్లకు చేరిందని వివరించారు. కొత్తగా చేరిన 13,840 మంది ఉద్యోగులతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,03,281కు పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.700 కోట్ల రుణభారం, రూ.3,212 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ధర మంగళవారం ఎన్ఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.640 వద్ద ముగిసింది. -
టెక్ మహీంద్రా లాభం 20% డౌన్
1:1బోనస్ ఇష్యూ, షేరు విభజన ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం (కన్సాలిడేటెడ్) 20% క్షీణించి రూ. 805 కోట్లుగా నమోదైంది. కరెన్సీ మారకం విలువపరృమెన నష్టాలు, వేతనాల పెంపు ఇందుకు కారణం. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిృో లాభం రూ. 1,010 కోట్లు. ఇక తాజా క్యూ3లో ఆదాయం రూ. 4,899 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ. 5,752 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు, కరెన్సీ హెచ్చుతగ్గులు, పన్నులకు అధిక ప్రొవిజనింగ్ తదితర అంశాలు లాభాలపై ప్రభావం చూపినట్లు సంస్థ సీఎఫ్వో మిలింద్ కులకర్ణి తెలిపారు. కరెన్సీపరమైన ఒత్తిళ్లు ఇకపైనా కొనసాగే అవకాశం ఉందని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. మరోవైపు మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు మరింత అవకాశం ఉందని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాణీ చెప్పారు. 240 మిలియన్ డాలర్లతో తలపెట్టిన లైట్బ్రిడ్జి కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ కొనుగోలు ప్రక్రియ ఫిబ్రవరిలో పూర్తి కావొచ్చని ఆయన వివరించారు. మరోవైపు, ప్రతి ఒక్క షేరుకి మరో షేరును(1:1) బోనస్గా ఇవ్వాలని, ఒక్కో షేరును రెండు కింద విభజించాలని బోర్డు నిర్ణయించింది. కంపెనీ ఆదాయాల్లో రూ. 5,254 కోట్లు ఐటీ వ్యాపారం నుంచి రాగా, మిగతాది బీపీవో విభాగం నుంచి వచ్చిందని గుర్నాణీ వివరించారు. మరోవైపు, క్యూ3లో కొత్తగా మరో 2,700 మందిని రిక్రూట్ చేసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 98,000కి చేరినట్లు ఆయన తెలిపారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 15 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్లు గుర్నాణీ పేర్కొన్నారు. కంపెనీ షేరు శుక్రవారం బీఎస్ఈలో సుమారు 1 శాతం క్షీణించి రూ. 2,878.30 వద్ద ముగిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement