-
ప్రజలు పట్టించుకోవట్లేదు.. కరోనా ఉధృతి తగ్గలేదు
ముంబై: కరోనా రెండో వేవ్ ఇంకా తగ్గలేదని అందరూ జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పినా ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్నారని కరోనా టాస్క్ఫోర్స్ ప్రధాన అధికారి డా.సంజయ్ ఓక్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఇంకా కరోనా ఉధృతి కొనసాగుతోందని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య స్థిరంగా ఉంటున్నా కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, రాయ్గఢ్, పుణే, రత్నగిరి, సింధుదుర్గ్, పాల్ఘర్, బుల్డాణా జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపారు. రోజుకు పదివేల కేసులు.. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం ప్రతిరోజు 9 నుంచి 10 వేల వరకు కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అందులో కొల్హాపూర్ జిల్లాలో పాజిటివిటీ రేట్ అత్యధికంగా 10.24 శాతంగా ఉండగా, సతారా 9.94, సాంగ్లీ 8.81 ఉంది. మరోవైపు రాయగఢ్ 7.88, పుణె 7.68, రత్నగిరి 7.29, సింధుదుర్గ్ 6.55, పాల్ఘర్ 5.26, బుల్డాణా 4.57 శాతం పాజటివిటీ రేటుతో కరోనా సంక్రమణ కొనసాగుతోంది. కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, పుణే జిల్లాల్లో కరోనా సంక్రమణ రేటు జూన్ చివరి వారంలో కాస్త తగ్గినట్లు అనిపించినా, జూన్ 27 నుంచి మళ్లీ పెరుగుదల కనిపిస్తోందని డా. సంజయ్ ఓక్ అన్నారు. ఈ జిల్లాల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించే బాధ్యతను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్థానిక పరిపాలనా సంస్థలకే అప్పగించారు. గురువారం నిర్వహించిన జిల్లాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొదటి వేవ్ మార్చ్ 2020లో ప్రారంభమై అక్టోబర్ వరకు తగ్గుముఖం పట్టింది. నవంబర్ 2020 వరకు మొదటి వేవ్ నిమ్నస్థాయికి తగ్గిపోయింది. అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్యకాలంలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు 70 శాతం వరకు తగ్గింది. కరోనా రెండో వేవ్ ఫిబ్రవరి 2021 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్లో ఇది తీవ్రంగా వ్యాపించింది. మే నుంచి కాస్త తగ్గుదల కనిపించినప్పటికీ జూన్ నుంచి మాత్రం కరోనా బాధితుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. పరీక్షలు తగ్గిస్తే కేసులు పెరుగుతున్నాయి.. దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ వేగం తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. రాష్ట్రంలో అన్లాక్ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన అలసత్వం మొదలైంది. మాస్క్లు ధరించకుండానే బయటకు వెళ్లడం, రద్దీ ప్రాంతాల్లో తిరగడం, సురక్షిత దూరాన్ని పాటించకపోవడం కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కరోనా ప్రొటోకాల్స్ను పాటించాలని, ముఖ్యమంత్రితో సహా ప్రముఖులంతా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదని టాస్క్ఫోర్స్ సభ్యులు డా. సంజయ్ ఓక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కరోనా బాధితుడి వెనక కనీసం 20 మందిని ట్రేస్ చేయాల్సి ఉంటుందని, కానీ అది అమలు కావడం లేదన్నారు. కరోనా పరీక్షలు తగ్గించడం వల్ల కూడా సంక్రమణ వేగం పెరుగుతోందని తెలిపారు. ఈ రెండు అంశాలపై అత్యధిక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కరోనా నిబంధనలను కూడా కఠినంగా అమలు చేయాలని డా.సంజయ్ ఓక్ అన్నారు. -
ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు, మరో 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళవారం ఆయన కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ జనరేషన్, స్టోరేజ్ల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ విజయరామరాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు పాల్గొన్నారు. చదవండి: అవాస్తవాలు నమ్మొద్దు: ఎ.కె.సింఘాల్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
కుళ్లిన మాంసం..నాసిరకం అల్లం
అవి మంచిర్యాలలోని ప్రముఖ రెస్టా రెంట్లు... కాబట్టి ఆహార పదార్థాల్లో నాణ్యతను పాటిస్తారని ప్రజలు నమ్ము తారు. కానీ నాణ్యతలేని పదార్థాలు, కుళ్లిన మాంసం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యా లతో చెలగాటమాడుతున్నారు. బుధ వారం పలు రెస్టారెంట్లలో టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వాటి బండారం బయట పడింది. అలాగే కళాంజలి పేరుతో తయార వుతున్న అల్లంపేస్ట్, మసాలా దినుసుల్లో నాణ్యత లోపాన్ని అధికారులు గుర్తించారు. మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రముఖ రెస్టారెంట్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పంజా విసిరారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో ఏ–1, సురభి గ్రాండ్, మాధవి, బాబా రెస్టారెంట్లలో ఆకస్మిక దాడులు చేసి ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, మటన్, చికెన్ లభించండంతో కేసు నమోదు చేశారు. వాటి నిర్వా హకులకు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. తదుపరి చర్యల నిమిత్తం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారికి అప్పగించారు. అల్లం పేస్టు.. మసాలాలు సైతం.. జిల్లా కేంద్రంలోని కళాంజలి అహార పదార్థాల తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కళాంజలి బ్రాండ్ పేరుతో తయారీ చేసిన నిత్యావసర ఆహార పదార్థాలను నాణ్యత లేకుండా వివిధ కిరాణాలకు సరఫరా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి వాటిని పరిశీలించారు. అల్లం పేస్టు తయారు చేసి శుభ్రంగా లేని డ్రమ్ములో నిలువ ఉంచగా.. వాటి నమూనాలను సేకరించారు. ప్యాకెట్లపై ఎమ్మార్పీ లేకపోవడం, ప్యాకెట్పై సూచించిన విధంగా పరిమాణం లేకపోవడం, అల్లం తయారు చేసే మిషనరీ తుప్పు పట్టి ఉండటం, ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్ లేకపోవడంపై అధికారులు ప్రశ్నించారు. సరుకు వివరాల రికార్డులు లేకపోవడంతో మందలించి, పలు రకాల ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. పరీక్షల తర్వాత కల్తీ, నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ బుద్దె స్వామి, ఎస్సై సమ్మయ్య, సిబ్బంది సంపత్కుమార్, భాస్కర్గౌడ్, సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. -
తిరుపతిలో పేలుడు పరికరాల స్వాధీనం
చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ అధికారులకు సోమవారం రాత్రి పేలుడు పరికరాలు లభ్యమవ్వడం కలకలం సృష్టించింది. అధికారుల కథనం మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద టాస్క్ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక బ్యాగును గుర్తించారు. బ్యాగులో పేలుడుకు ఉపయోగించే సర్క్యుట్ బోర్డులు, సెల్ఫోను, వాక్మెన్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కండెన్సర్లు ఇతర పరికరాలను అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆర్ఎస్సై వాసు ఐజీ కాంతారావుకు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పేలుడుకు ఉపయోగించే పరికరాలుగా నిర్ధారించారు. అనంతరం కాంతారావు బాంబు స్య్వాడ్కు సమాచారం అందించారు. వారూ ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు మీడియాతో మాట్లాడుతూ, ఇవి పేలుళ్లు సృష్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అడవిలో ఎవరూ లేనిచోటుకు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకొచ్చి వాటిని సిద్ధంచేసినట్లు తెలుస్తోందన్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులతో పాటు ఇతర వీఐపీలు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తుంటారని, అయితే.. ఎవరిని టార్గెట్ చేసి వీటిని తయారుచేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని దర్యాప్తులో తేలుతుందని కాంతారావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సంచీపై తమిళనాడు తిరుచ్చికి చెందిన చిరునామా ఉందని.. లభ్యమైన ఆధారాలకు అనుగుణంగా కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను తిరుమల టూటౌన్ పోలీసుస్టేషన్కు బదిలీ చేస్తామన్నారు. అనంతరం కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
కదిలిన ఐపీఎం యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్ : పాలల్లో నాణ్యతా లోపాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’బ్యానర్ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లు స్పందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రి కె.లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం(ఎఫ్ఎస్ఎస్) సమగ్రంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు.. పాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగనున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ కె.శంకర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 154 రకాల పాల ప్యాకెట్ల నమూనాలను సేకరించి నాణ్యతను తనిఖీ చేశామని.. ఇందులో 123 నమూనాలను జీహెచ్ఎంసీ పరిధిలోనే సేకరించామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 16, ఇతర ప్రాంతాల్లో 10 బ్రాండ్లకు చెందిన పాల ప్యాకెట్లు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిర్దేశించిన ప్రకారం లేవని తెలిపారు. వీరిపై ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కేసులు నమోదు చేశామని.. ఇందులో 14 కేసులు విచారణలో ఉన్నాయన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
Advertisement