-
ఈజ్ మై ట్రిప్ చేతికి ‘చెకిన్’
హైదరాబాద్: ఆన్లైన్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అయిన ఈజ్మైట్రిప్ ‘చెకిన్’ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. చెకిన్ అన్నది పర్యాటకులు ఎలాంటి బేరమాడే అవసరం లేకుండా హోటల్ బుకింగ్లపై డిస్కౌంట్కు వీలు కల్పించే రియల్టైమ్ మార్కెట్ ప్లేస్. ఆల్గోరిథమ్ ఆధారితంగా టాప్–5 హోటల్ చెకిన్ ఆఫర్లను ఇది అందించగలదు. చెల్లింపులు మాత్రం హోటల్ వద్దే చేయవచ్చు. మరోవైపు చెకిన్ యాప్ యాక్సెస్ను హోటల్ వారికి ఈజ్మైట్రిప్ అందించనుంది. దీని ద్వారా వారు ఎప్పటికప్పుడు త మ బుకింగ్లు, డిమాండ్ తీరును తెలుసుకుని, ధరలను నియంత్రించుకోవచ్చని ఈజ్మైట్రిప్ తెలిపింది. తద్వారా తమ ప్రాపర్టీలను వేగంగా విక్రయించుకోగలరని (బుకింగ్లు) పేర్కొంది. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
సాగర్ సిమెంట్స్ చేతికి ఆంధ్రా సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ ఇక సాగర్ సిమెంట్స్ పరం కానుంది. ఈ మేరకు విజయవంతమైన బిడ్డర్గా నిలిచింది. జేపీ గ్రూప్ కంపెనీ అయిన ఆంధ్రా సిమెంట్స్ ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. సాగర్ సిమెంట్స్ దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికకు అనుకూలంగా ఆంధ్రా సిమెంట్స్కు చెందిన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీవోసీ) మెజారిటీతో ఓటు వేసింది. సాగర్ సిమెంట్స్ ప్రణాళికను సీవోసీ ఆమోదించింది. పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్, సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ పిటిషన్ ఆధారంగా ఆంధ్రా సిమెంట్స్పై దివాలా ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గతేడాది ఏప్రిల్లో ఆదేశించింది. ఆంధ్రా సిమెంట్స్కు దాచేపల్లి సమీపంలో, అలాగే విశాఖపట్నం వద్ద ఒక్కో ప్లాంటు ఉంది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
అపుడు 4 లక్షలు, ఇపుడు 7 వేల కోట్లు: ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?
సాక్షి,ముంబై: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు కొనుగోలు చేసిన బిస్లరీ ఇపుడు 7 వేల కోట్లకు చేరింది. 1969లో 28 ఏళ్ల చౌహాన్ నేతృత్వంలో ని పార్లే ఎక్స్పోర్ట్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త నుండి బిస్లరీ కొనుగోలు చేశారు. అపుడు దీని రూ. 4 లక్షలు. బిస్లరీని టాటాలకు 6-7వేల కోట్ల రూపాయలకు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 1969-2022ల వరకు బిస్లరీ జర్నీని ఒకసారి చూద్దాం. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) 1969-2022 బిస్లరీ సక్సెస్ జర్నీ ► బిస్లరీ ఒక ఇటాలియన్ కంపెనీ, దీనిని 1965లో ఫెలిస్ బిస్లరీ స్థాపించారు. అలా కంపెనీకి ఆ పేరు స్థిరపడింది. ►1969లో ఇటాలియన్ వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లరీనుంచి చౌహాన్ కొనుగోలు చేశారు. ► Bisleriని తొలుత భారతదేశంలో గాజు సీసాలలో, బబ్లీ, స్టిల్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ► తమ పోర్ట్ఫోలియోలో గోల్డ్ స్పాట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి కానీ సోడా లేదు. అందుకే పాపులర్ బిస్లరీ సోడాను కొనుగోలు చేశానని చౌహాన్ చెప్పారు. అంతేకాదు అసలు నీళ్ల వ్యాపారంపై దృష్టి లేదట. ► 60వ -70వ దశకం ప్రారంభంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి సోడాకు మంచి డిమాండ్ ఉంది. 1993లో తన శీతల పానీయాల పోర్ట్ఫోలియోను రూ. 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించినప్పుడు మాత్రమే అతని దృష్టి బాటిల్ వాటర్ పరిశ్రమపై పడింది. ►ప్రారంభంలో రవాణాదారులు నీటిని రవాణా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే తానే స్వయంగా రవాణా చేయాలని చౌహాన్ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే బిస్లరీకి ఇప్పుడు 4,500 డిస్ట్రిబ్యూటర్లు ,వాటర్ బాటిళ్లను రవాణా చేసే 5,000 ట్రక్కులు ఉన్నాయి. ►2000ల ప్రారంభంలో టాటాకు చెందిన హిమాలయన్ బ్రాండ్తో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్తో బిస్లరీకి గట్టి పోటీ ఎదురైంది. ఇంకా అక్వాఫినా, కిన్లీ వంటి పోటీదారుల గట్టి పోటీ ఉన్నా తట్టుకొని టాప్లో నిలబడింది ► కోకా-కోలా (కిన్లే), పెప్సికో (ఆక్వాఫినా), కింగ్ఫిషర్ , నెస్లే వంటి పోటీదారుల మాదిరిగా కాకుండా, చౌహాన్కు ఇదొక్కటే ప్రధాన వ్యాపారం. అందుకే పట్టుదలగా సక్సెస్ను నిలుపుకున్నారు. ► కస్టమర్కు మెరుగైన విలువ, ప్యాకేజింగ్ లేదా పంపిణీని అందించే బ్రాండ్లు లేవు. ఏ బిజినెస్లోనైనా ముందు వచ్చినవారికే సక్సెస్.అయితే రెండవ లేదా మూడవ స్థానంలో వచ్చినట్లయితే, డిఫరెన్సియేటర్గా ఉంటే మంచిది. సో.. ఫస్ట్-మూవర్గా బ్రాండ్కోసం చాలా కష్టపడ్డాను అని 2007లో ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ వెల్లడించారు. (షాకింగ్: గూగుల్ పే, పోన్పేలాంటి యాప్స్లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ►తన శీతల పానీయాల పోర్ట్ఫోలియోను ఎందుకు విక్రయించారని అడిగినప్పుడు, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ ,రిమ్-జిమ్ వంటి బ్రాండ్లను ప్రకటనలకు తన వద్ద అంత డబ్బులేదు. అందుకే బాటిలర్లపై ఎక్కువగా ఆధారపడేవాడినంటారు చౌహాన్. ►కానీ వయసు,ఆరోగ్యం క్షీణించడంతోపాటు, అతని కుమార్తె జయంతికి వ్యాపారంలోఆసక్తి లేకపోవడంతో, కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్కు విక్రయించే నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీతో విడిపోవడం బాధాకరమైన నిర్ణయమే, కానీ టాటాలు దానిని చాలా జాగ్రత్తగా కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్. ► కంపెనీని నడపాలన్న ఉద్దేశం లేని కారణంగా మైనారిటీ వాటాను ఉంచుకోనని, పర్యావరణం , స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి పెడతానని 82 ఏళ్ల చౌహాన్ చెప్పారు. -
టాటాల గూటికి ‘మహారాజా’ చేరేది అప్పుడే
న్యూఢిల్లీ: వేలంలో కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కేంద్రం.. టాటా గ్రూప్నకు అప్పగించడంలో జాప్యం జరగనుంది. నిర్దిష్ట ప్రక్రియలు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే మరింత సమయం పట్టేస్తుండటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అప్పగింత ప్రక్రియ జనవరిలో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆఖరు నాటికి ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేయాల్సి ఉంది. రూ.18,000 కోట్ల డీల్ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను వేలంలో టాటా గ్రూప్ సంస్థ టాలేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది సుమారు రూ. 18,000 కోట్ల డీల్. ఇందులో రూ. 2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. కొనుగోలు ఒప్పందం ప్రకారం 8 వారాల్లోగా (డిసెంబర్ ఆఖరులోగా) అప్పగింత ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఇరు పక్షాల అంగీకారం మేరకు దీన్ని మరికాస్త పొడిగించుకోవచ్చు. ప్రస్తుత సందర్భంలో ఇదే జరుగుతోందని సంబంధిత అధికారి వివరించారు. రుణభారం రూ.61,562 కోట్లు హ్యాండోవర్ ప్రక్రియ పూర్తయితే టాటా గ్రూప్.. నగదు భాగాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. 2007–08లో ఇండియన్ ఎయిర్లైన్స్ను విలీనం చేసుకున్నప్పటి నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. కంపెనీని గట్టెక్కించడానికి గత దశాబ్ద కాలంలో రూ. 1.10 లక్షల కోట్లపైగా నగదు, రుణాల గ్యారంటీల రూపంలో ప్రభుత్వం అందించినప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. టాటా గ్రూప్నకు కంపెనీని అప్పగించడానికి ముందు ఇందులో 75 శాతాన్ని (దాదాపు రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్ఎల్కు బదలాయిస్తారు. టాటాలకు 141 ఎయిరిండియా విమానాలు దక్కుతాయి. అయితే, ప్రధాన వ్యాపారేతర అసెట్స్ మాత్రం లభించవు. చదవండి: ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు -
కూరగాయలమ్మే పొలిమేరాస్.. రూ.250 కోట్ల డీల్ !
కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్ల అమ్మకాలు సాగించే పొలిమేరాస్ రికార్డు సృష్టించింది. వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే కోట్ల రూపాయల విలువైన మార్కెట్ వ్యాల్యూని సృష్టించుకుంది. స్టార్టప్గా మొదలై హైదరాబాద్, బెంగళూరులలో విస్తరించిన పొలిమేరాస్ని హైదరాబాద్కి చెందిన జీఎస్ఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ రూ.250 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. పొలిమేరాస్లో వంద శాతం వాటాలను దక్కించుకుంది. పొలిమేరాస్కి బెంగళూరు, హైదరాబాద్లలో కలిసి ప్రస్తుతం 70 వరకు స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీకి నెలకు 21వేల మంది కస్టమర్ బేస్ ప్రస్తుతానికి ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్టోర్ల సంఖ్యను వందకు పెంచాలని నిర్ణయించారు. అతి త్వరలోనే టెక్నాలజీ ఉపయోగిస్తూ యాప్ ద్వారా డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement