-
విద్యావ్యవస్థలో పేద ధనిక తారతమ్యం ఉండకూడదు: సీఎం జగన్
-
ట్యాబ్లు దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదు: టీచర్లు
-
పేద పిల్లల భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలు సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తుంటే కొన్ని మీడియా సంస్థలు వక్రబుద్ధితో లేనివి ఆపాదించి తప్పుడు రాతలు రాస్తున్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేదింటి పిల్లలు ప్రగతి సాధిస్తుంటే వారి భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలను సహించబోమని హెచ్చరించారు. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే వార్తలు ప్రచురించడం దారుణమైన చర్య అని అన్నారు. మంత్రి గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్లపై ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద పిల్లలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభను మెరుగు పరుచుకుని, చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ట్యాబ్లు అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు, టోఫెల్ అమలు చేసినప్పుడు ఇదే పత్రిక వ్యతిరేక కథనాలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంపై కోపం ఉంటే మరో రకంగా చూపాలేగానీ, ఇలా పేద పిల్లలపై చూపడం దిగజారిన పాత్రికేయానికి నిదర్శనమని అన్నారు. విద్యారంగంలో ఎక్కడా ట్యాబ్లు ఉపయోగించడంలేదా? ట్యాబ్లు ఇవ్వొద్దని ఏ తల్లిదండ్రులు కోరారో ఈనాడు చెప్పాలన్నారు. రామోజీరావు కొడుకు, మనవలు ట్యాబ్లు, కంప్యూటర్లు ఉపయోగించాలి గానీ పేదవాళ్లు ఉపయోగించకూడదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఓ వర్గం రాజకీయ ప్రయోజనాలు, స్వార్థం కోసం పేద పిల్లలను బలిచేయాలనుకోవడం ఇదేం పాత్రికేయం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోందని అన్నారు. ఈనాడు పనికిమాలిన పత్రికగా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అవి బైజూస్ ట్యాబ్స్ కావు.. ఒక్క రూపాయి ఖర్చు కాలేదు ఈనాడు పేర్కొన్నట్టు అవి బైజూస్ ట్యాబ్లు కావని మంత్రి చెప్పారు. కేవలం బైజూస్ కంటెంట్ ఉచితంగా అప్లోడ్ చేసి ఇచ్చామని, ఈనెల 21న ఇవ్వనున్న ట్యాబ్స్లోనూ ఇదే విధానం పాటించామని తెలిపారు. కంటెంట్ కోసం బైజూస్కి ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదని, అలాంటప్పుడు అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ట్యాబ్ల ఖర్చంతా ప్రభుత్వమే భరించిందన్నారు. పిల్లలకిచ్చిన ట్యాబ్లలో ఎడ్యుకేషన్ కంటెంట్ కాకుండా మరేవీ రాకుండా లాకింగ్ సిస్టమ్ ఉందని, ఎన్ని గంటలు వాడుతున్నారో కూడా తెలుస్తుందన్నారు. ఎక్కడైనా తప్పుగా వినియోగించినా ఆ సమాచారం తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు. 21న ట్యాబ్ల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4.35 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఐదేళ్ల వారంటీతో గత ఏడాదికంటే మెరుగైన పరిజ్ఞానంతో ఇంటర్మీడియట్ వరకు ఉపయోగపడేలా వీటిని రూపొందించినట్లు తెలిపారు. విద్యపై అవగాహన లేని సెలబ్రిటీ పార్టీ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, విద్యా పథకాలపై కనీస అవగాహన లేకుండా సెలబ్రిటీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని జనసేన నాయకులనుద్దేశించి మంత్రి బొత్స అన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలను ఏ ప్రాతిపదికన ప్రభుత్వం అందిస్తుందో కూడా వారికి తెలియడంలేదన్నారు. సీబీఎస్ఈ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, ఎవరు రాస్తారో తెలుసుకోకుండా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారన్నారు. విద్యా కానుక ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చదివితే అందరికీ (42 లక్షలు) అందిస్తామని, అమ్మ ఒడి తల్లుల అకౌంట్లో ఒక విద్యార్థికి మాత్రమే జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లల్లో ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ అమల్లోకి వచ్చిందని, ఈ విద్యార్థులు 2025 మార్చిలో సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారని వివరించారు. గత నాలుగున్నరేళ్లల్లో విద్యా సంస్కరణలకు దాదాపు రూ.60 వేల కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇందులో కేంద్రం ఇచ్చింది రూ.6 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఇది కూడా తెలియకుండా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తాము మరో 25 ఏళ్లు అధికారంలో ఉంటామని, పేద విద్యార్థులకు ఏటా ట్యాబ్లు ఇస్తామని, విద్యా సంస్కరణలు అమలు చేస్తామని, విద్యార్థులకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. -
పేదల చదువులపై పిచ్చి ప్రేలాపనలు
సాక్షి, అమరావతి: పేద పిల్లలు విద్యలో ఉన్నతంగా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ట్యాబ్ల పైనా ‘ఈనాడు’ విషం చిమ్మింది. ఈ ట్యాబ్లు చాలా సురక్షితమైనవి. విద్యార్థుల మెదళ్లకు పదును పెట్టేలా పాఠ్యాంశాలు, విద్యా పరమైన కంటెంట్ మాత్రమే ఉంటుంది. దీనికి లాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది. నిరంతర పర్యవేక్షణా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇతరత్రా విధానాలతో తప్పుగా వినియోగించినా లాక్ అయిపోతుంది. ఇంత సురక్షితౖమెన, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్న ట్యాబ్లపై ఈనాడు పత్రికలో తప్పుడు ఆరోపణలతో పసి మనసులను కలుషితం చేసేలా దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం రామోజీరావుకు మాత్రమే చెల్లింది. ‘జగన్ బర్త్డే బహుమతి..చెడగొడుతోంది మతి!’ అంటూ పేద పిల్లలకు ఏవోవో ఆపాదిస్తూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. మనసున్న ఏ మనిషీ ఇలా పసి మనసులపై విషం చిమ్మే ప్రయత్నం చేయరు. ఈ ఆధునిక యుగంలో అసలు ఏ సంస్థ అయినా, వ్యక్తులైనా విద్యార్థులకు అత్యాధునిక విద్యా పరికరాలను అందించవద్దని చెబుతారా? రామోజీరావు నడిపిస్తున్న రమాదేవి స్కూల్లో ట్యాబ్లు, అత్యాధునిక పరికరాలు లేకుండానే విద్యా బోధన జరుగుతోందా? అక్కడి విద్యార్థులు వాడుతున్నప్పుడు పేదింటి పిల్లలు వాడితే తప్పెలా అవుతుంది? సమాజంలో పిల్లలందరూ ఉన్నత స్థితికి చేరాలని ఎవరైనా కోరుకుంటారు.. ఒక్క రామోజీ తప్ప. ఆయన తన వర్గం, చంద్రబాబు మాత్రమే బాగుండాలని, మిగతా అందరూ తక్కువ స్థాయిలో ఉండాలన్న యావలో ఉంటారు. మరీ ముఖ్యంగా పేదలు బాగు పడుతుంటే చూడలేని కళ్లు అవి. పేదలు పేదలుగానే ఉండాలని, వారికి మంచి చదువులు అందకూడదన్నది ఆయన దృక్పథం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రవేశపెట్టినప్పుడు, టోఫెల్æ శిక్షణ అమలు చేసినప్పుడు కూడా ఈనాడు ఇదే విధమైన వ్యతిరేక కథనాలు అచ్చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై నిత్యం తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, దానికి మహర్దశ తీసుకువస్తోంది. ఇదే ఈనాడుకు కడుపుమంట. సంపన్నుల పిల్లలకు మాత్రమే వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తే అందే నాణ్యమైన విద్యను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నదనే ఏడుపు. అందుకే చీటికిమాటికి పేద పిల్లల విద్యపై తప్పుడు రాతలు రాస్తోంది. ట్యాబ్స్కు పటిష్ట రక్షణ వ్యవస్థ ► విద్యార్ధులు ట్యాబ్లను నిర్దేశిత పాఠ్యాంశాలకు తప్ప, విద్యేతర అంశాలకు వాటిని వినియోగించకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ట్యాబ్లోనూ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ (ఎండీఎం) ను పొందుపరిచింది. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన 5 యాప్స్ మాత్రమే పనిచేస్తాయి. అంతేకాక నిర్వహణ, మరమ్మతుల విషయంలో కూడా విద్యాశాఖ స్పష్టమైన ఎస్ఓపీని నిర్దేశించుకుంది. ► ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బలవంతంగా ట్యాబ్ను రీసెట్ చేసి, మరో యాప్ డౌన్లోడ్ చేసేందుకు యత్నిస్తే ఇంటర్నెట్ కనెక్టయిన వెంటనే ఆ ట్యాబ్ లాక్ అయిపోతుంది. దీన్ని అన్లాక్ చేయాలంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు. వారు కూడా గూగుల్ అథంటికేటర్తో వారికి వచ్చిన ఓటీపీ ద్వారా మాత్రమే తిరిగి ఓపెన్ చేయగలరు. ► ట్యాబ్స్ నిర్వహణలో మూడంచెల రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్యాబ్స్లో లోపాలు వస్తే సరిచేయడానికి ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ఇచ్చారు. హార్డ్వేర్ సమస్యలను సరిదిద్దేలా గ్రామ/వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు శిక్షణ ఇచ్చారు. లోపాలు ఉన్న ట్యాబ్ను విద్యార్థి లేదా తల్లిదండ్రులు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు అందజేస్తే రసీదు ఇచ్చి మూడు రోజుల్లో వాటిని బాగుచేసి తిరిగి ఇస్తున్నారు. ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థ ఉన్న ట్యాబ్లపై పిచ్చి ప్రేలాపనలు రామోజీ తప్ప మరెవరూ చేయలేరు. పునశ్చరణ, మెరుగైన బోధన కోసం ట్యాబ్లు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా మలచడంతోపాటు మెరుగైన విజ్ఞానం పొందేందుకు ట్యాబ్లను ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. అందుకోసమే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకునేందుకు, పునశ్చరణకు, మెరుగైన బోధనలో భాగంగా వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇవి వారికి ఇంటర్ వరకు ఉపయోగపడతాయి. 2021–22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో 5.18 లక్షల ట్యాబ్లను గతేడాది డిసెంబర్ 21న ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ ఏడాది కూడా మరో 4.35 లక్షల ట్యాబ్లను ఈ నెలలో సరఫరా చేస్తోంది. గత ఏడాది ట్యాబ్ల పంపిణీ కోసం రూ.660 కోట్లను ఖర్చు చేసింది. పిల్లలు పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా బైజూస్ యాప్ డిక్షనరీ, సందేహాల నివృత్తికి మరో యాప్, ఏపీ ఈ–పాఠశాల యాప్లను ట్యాబుల్లో ఇన్స్టాల్ చేసి విద్యార్థులకు, టీచర్లకు ఇచ్చారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులు వారికి ఇష్టమైన విదేశీ భాషను నేర్చుకునేందుకు డ్యులింగో యాప్ను అదనంగా చేర్చారు. దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ ట్యాబ్స్ను అందించారు. ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ జాతీయ పరీక్షల్లో చాలామంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారికి ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు మెరిట్ స్కాలర్షిప్ లభిస్తోంది. విద్యార్థులు ఆన్లైన్లో చదువుకోవాలంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు నేర్చుకునేందుకు చాలా సమయం పడుతుంది. దీనికోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కంటెంట్ తయారు చేసి ట్యాబ్స్లో అప్లోడ్ చేశారు. -
ఈనాడు ట్యాబ్ కథనంపై మంత్రి బొత్స ఫైర్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ చదువులపై యెల్లో మీడియా అక్కసు ప్రదర్శించింది. ట్యాబ్ల వల్ల పిల్లలు తప్పుదోవ పడుతున్నారని.. చదువులు గాడి తప్పుతున్నాయంటూ కథనం ప్రచురించింది. దీనిని తీవ్రంగా పరిగణించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పేద పిల్లల భవిష్యత్పై ఈ పిచ్చారాతలేంటని?.. ఈనాడు, ఆ పత్రిక అధినేత రామోజీరావుపై తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు మంత్రి బొత్స. గురువారం విజయవాడలో మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో దురదృష్టకర వాతావరణం ఏర్పడింది. ట్యాబ్లపై ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. విద్యారంగంలో ఎక్కడా ట్యాబ్లు ఉపయోగించడం లేదా?. ట్యాబ్లు ఇవ్వొద్దని ఏ పేరెంట్స్ కోరారు?.. ఇవన్నింటికి ఈనాడు సమాధానం చెప్పాలి. రామోజీరావు కొడుకు, మనవడు ట్యాబ్లు కంప్యూటర్లు, ట్యాబ్లు ఉపయోగించాలి కానీ పేదవాళ్లు ఉపయోగించకూడదా? అని ప్రశ్నించారు మంత్సి బొత్స. ఒక్క రూపాయి ఖర్చుకాలేదు అవి బైజూస్ ట్యాబ్లు కావు. కేవలం బైజూస్ కంటెంట్ అందులో అప్లోడ్ చేసి ఇచ్చాం. అదీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాం. ఈ కంటెంట్ కోసం బైజూస్కి ప్రభుత్వం ఒక్కరూపాయి చెల్లించలేదు. అలాంటప్పుడు అవినీతి జరిగింది అని ఎలా ఆరోపిస్తారు?. ట్యాబ్ల కోసం ఖర్చంతా ప్రభుత్వమే భరించింది. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన వాటా చాలా తక్కువే అని బొత్స చెప్పారు. వేరే కంటెంట్ రాదు ట్యాబ్ల్లో ఎడ్యుకేషన్ కంటెంట్ కాకుండా మరేవి రాకుండా లాకింగ్ సిస్టమ్ఉంది. ట్యాబ్ లు ఎన్ని గంటలు వాడుతున్నారో కూడా తెలుస్తుంది ఎక్కడైనా గేమ్స్ ఆడాలని.. వీడియోలు చూడాలని ప్రయత్నించినా కూడా పేరెంట్స్కి సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశాం. కనీస అవగాహన లేదా? పేదవాడి పిల్లల భవిష్యత్తుపై ఇలా తప్పుడు వార్తలు రాసే బదులు ఈనాడు నుంచి ఉద్యోగం మానివేయడం మంచిదని రామోజీరావుకు పరోక్షంగా సూచించారు మంత్రి బొత్స. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయద్దని హితవు పలికిన మంత్రి బొత్స.. ట్యాబ్ లే ఇవ్వొద్దని ఎలా రాస్తారని, పేదపిల్లలకు అన్యాయం చేయమంటారా? అని ప్రశ్నించారు. ఇలాంటి పనికిమాలిన వార్తలు మళ్లీ రాయొద్దు. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయద్దు. అసలు ప్రభుత్వ విధానాలపై కనీస అవగాహన, అధ్యయనం చేయకుండా తప్పుడు విమర్శలు ఎలా చేస్తారన్నారు. అమ్మ ఒడికి, విద్యా కానుకకి కూడా తేడా తెలియదని.. విమర్శలు చేసే ముందు కనీస అవగాహన అలవర్చుకోవాలని ఈనాడు-రామోజీలకు మంత్రి బొత్స చురకలటించారు . పాజిటివ్ఓటుతో అధికారంలోకి వస్తాం సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకీ మేలు చేసింది, వందకు 80 శాతం ప్రజలు ప్రభుత్వం వెంటే ఉంటారన్న నమ్మకం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పు పరిణామాలపైనా ఆయన స్పందించారు. ‘‘గత ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేశారుకాబట్టే చంద్రబాబు ఓడిపోయారు. జగన్ హయాంలో సంతృప్తికర పాలన సాగింది. విద్య, వైద్య రంగాలలో ఎంతో అభివృద్ది చేశాం. అంచెలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్నాం.. అదే చేస్తున్నాం. అందుకే పాజిటివ్ ఓటుతో మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారాయన ‘‘మంచి ఫలితాల కోసమే అభ్యర్ధులని మార్చాం. మా పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గాజువాక, మంగళగిరిలలో బీసీలకే కదా ఇచ్చాం. టిక్కెట్ల కేటాయింపులో మా స్టైల్ మాది.. మా విధానం మాది. చంద్రబాబుకి కుప్పం సీటుపైనే గ్యారంటీ లేదు. అసలు చంద్రబాబు రెండు చోట్ల ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు?’’.. ►పదిహేను మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ చెప్పడం పెద్ద జోక్. మూడు నెలలు తర్వాత ఏపీలో టీడీపీ ఉండదు. ఉగాది తర్వాత ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ విషయం నేను ఆరు నెలల క్రితమే చెప్పా.. ►.. గత ప్రభుత్వంలో అంగన్వాడీల జీతాలు పెరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పెంచాం. సమస్యలు ఏమున్నా.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అంగన్ వాడీలు ఆందోళన విరమించాలని కోరుకుంటున్నాం.. ►తుపాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుంది. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు.. అని మంత్రి బొత్స మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement