-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రాసిక్యూషన్కు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ పేరుతో పవర్ మిస్ యూజ్ చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రణీత్ రావును డీజీపీ ఇప్పటికే సస్పెండ్ చేశారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావుపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం మారటంతో ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేసిన ప్రణీత్ రావు.. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశాడు. 42 హార్డ్ డిస్క్ల్లో డేటాను రిమూవ్ చేశారు. ఎస్ఐబీ ఆఫీస్లోని లాగర్ రూమ్లో ఉన్న లాప్టాప్, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఫోన్ టాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎమ్ఈఐ నంబర్ల వివరాల సైతం ధ్వంసం చేశాడు. డేటా బేస్ లో ఉన్న మొత్తం డేటాను ప్రణిత్ రిమూవ్ చేశాడు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశాడనే దర్యాప్తు చేపట్టారు. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్డిస్క్లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
ప్రణీత్ రావు చేసిన నిర్వాకమిది!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో విచారణాంతరం ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రణీత్ రావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు.. సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐబీ Special Intelligence Bureau (SIB)లోని ఎస్వోటీ లాగర్ రూమ్లో ప్రణీత్రావు విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు రాగానే లాగర్ రూమ్ ధ్వంసానికి ప్రణీత్ రావు వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది. ఎస్ఐబీలోని ఎస్వోటీ ఆపరేషన్కు హెడ్గా ఉన్న ప్రణీత్ రావు.. రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతల వ్యవహారాల వ్యవహారాలతో పాటు మావోయిస్టులు.. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణీత్ రావు పర్యవేక్షించారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగర్ రూమ్కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్ ల తో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. ఆ సమయంలో ఎస్వోటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారాయన. అంతేకాదు.. లాగర్ రూమ్ కరెంట్ సప్లైను నిలిపివేసి మరి ప్రణీత్ రావు లోపలికి వెళ్లినట్లు తేలింది. వేల సంఖ్యలో కాల్ డాటా రికార్డులతో పాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి.. ఎస్ఐబీ ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను కాల్చేసినట్లు వెల్లడైంది. మొత్తానికి లాగర్ రూమ్లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయారాయన. అయితే.. ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించుకోలేకపోతున్న అధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఆయన బంధువుగా.. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్డిస్క్లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సిట్ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమేనని, గతంలో సిట్ విచారించిన కేసులు ఎటు పోయా యని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణకు వెళ్లిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, నయీం భూముల కేసులు, గోల్డ్స్టోన్ ప్రసాద్ కేసు, హౌసింగ్బోర్డు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఎటు పోయిందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో సిట్ తాళాలు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో వాదనలు వినిపించిందని, టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తాము కోర్టును కోరామని చెప్పారు. పేపర్ లీకేజీ అంశంలో ప్రవీణ్, రాజశేఖర్లతో పరిమితం కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీ, కస్టోడియన్ శంకరలక్షి్మని కూడా బాధ్యులుగా చేర్చాలని కోరారు. ఈ విషయాన్ని సమగ్రంగా దర్యాప్తు జరపాలని అడిగితే తనకు సిట్ నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కొలువుల కలవరం -
బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన.. హైదరాబాద్లో మిల్లెట్స్పై పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023ను జరుపుకుంటున్న తరుణంలో వాటి సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. శ్రీఅన్న పథకం ద్వారా హైదరాబాద్లో చిరుధాన్యాలపై ప్రత్యేక పరిశోధనలు జరపాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) ఉన్న సంగతి తెలిసిందే. అందులోని పరిశోధనలకు పెద్దపీట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో అనుసంధానమై పనిచేస్తుంది. వేలాదిమందికి ఇందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. భవిష్యత్తులో మిల్లెట్ ఆహారపదార్థాలు అందుబాటులోకి తీసుకురావడం, మిల్లెట్ సాగు చేసే రైతులను ప్రోత్సహించడం, ఉత్పాదకత పెంచడం ఈ పరిశోధనల లక్ష్యం. ఐఐఎంఆర్ పరిధిలో 41 మంది సాంకేతిక సిబ్బంది, 21 అడ్మినిస్ట్రేటివ్, 27 సహాయక సిబ్బంది, 17 విభాగాలలో 48 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ప్రాధాన్యం ఏంటి? మిల్లెట్లు పోషక ఆహార ధాన్యాలు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి మిల్లెట్ల సాగు, వినియోగం కొనసాగుతోంది. మిల్లెట్లలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా, వచ్చినవారికి మంచి ఆహారంగా ఉంటుంది. మిల్లెట్ల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, వాటిని పండించడానికి తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి అవసరం. భారత ప్రభుత్వ విన్నపం మేరకు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. భారతదేశం చేసిన ప్రతిపాదనను 70 దేశాలు ఆమోదించాయి. రసాయన పురుగుమందులు, ఎరువులు వాడకుండా మిల్లెట్లను సులభంగా పండించవచ్చు. చిన్న కమతాల రైతులకు మిల్లెట్ పంటలు పండించడం ఉపయోగకరం. మిల్లెట్లను రొట్టెలు, ఉప్మా, గంజిగా ఉపయోగించవచ్చు. మిల్లెట్లలో 60 రకాల వరకు ఉన్నాయి. మన దేశంలో ప్రధానంగా జొన్న, సజ్జ, కొర్రలు, ఎండు కొర్రలు, ఊదలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాలు ఉన్నాయి. అయితే 1960లలో హరిత విప్లవం ద్వారా ఆహార భద్రతపై దృష్టి సారించడంతో చిరుధాన్యాల ఆహారాన్ని ప్రజలు మరిచిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. హరిత విప్లవానికి ముందు మిల్లెట్ల సాగు దాదాపు 40 శాతం ఉండగా, ఆ తర్వాత 20 శాతానికి పడిపోయింది. మన దేశంలో ప్రస్తుతం 1.70 కోట్ల టన్నుల మిల్లెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఆసియాలో 80 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం ఉంటుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా మిల్లెట్లను ఉత్పత్తి చేస్తాయి. మనదేశం నుంచి మిల్లెట్లను యూఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, యూకే, యూఎస్లకు ఎగుమతి అవుతాయి. ఆగ్రోస్ మిల్లెట్ ఆహార కేంద్రాలు: కె.రాములు, ఎండీ, ఆగ్రోస్ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆగ్రోస్ ఆధ్వర్యంలో మిల్లెట్ను ప్రజలకు చేరువ చేయాలని భావి స్తున్నాం. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది మిల్లెట్ కియోస్క్లను ఏర్పాటు చేయా లని నిర్ణయించాం. ఆసక్తి కలిగిన మహిళలకు మిల్లెట్ ఫుడ్పై ఐఐఎంఆర్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని కూడా మా ఆలోచన. శిక్షణ అనంతరం నిర్ణీత పద్ధతిలో తయారు చేసిన కియోస్క్లను ఏర్పాటు చేస్తాం. అందుకోసం ముందుకు వచ్చే వారికి రుణాలు ఇప్పించే ఆలోచన కూడా ఉంది. ఈ కియోస్క్ల్లో రెడీమేడ్ మిల్లెట్ ఫుడ్, మిల్లెట్తో తయారు చేసిన బిస్కెట్లు, ఐస్క్రీం, నూడిల్స్, మిల్లెట్ బిర్యానీ వంటివి కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాం. -
బీర్భూమ్పై సీబీఐ విచారణ
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లాలోని బోగ్తూయి గ్రామంలో 10 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడంతో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సజీవ దహనాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అనారుల్ హుస్సేన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement