-
ఓటమి దిశగా సౌత్జోన్
కోయంబత్తూర్: వెస్ట్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్జోన్ ఓటమి దిశగా సాగుతోంది. 529 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన సౌత్జోన్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. నేడు చివరిరోజు సౌత్జోన్ గెలవాలంటే మరో 375 పరుగులు చేయాలి. వెస్ట్జోన్ నెగ్గాలంటే మరో నాలుగు వికెట్లు తీయాలి. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్లు) తన ఓవర్నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. -
Duleep Trophy: రికీ భుయ్ సెంచరీ
సేలం (తమిళనాడు): ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో దులీప్ ట్రోఫీలో నార్త్జోన్ తో జరుగుతున్న మ్యాచ్లో సౌత్జోన్ భారీస్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 324/2తో శుక్రవారం రెండో రోజు ఆటకొనసాగించిన సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 172.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఓవర్నైట్ స్కోరుకు 27 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. అనంతరం రికీ .. కృష్ణప్ప గౌతమ్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (42; 4 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిసి జట్టు స్కోరును 600 పరుగుల పైచిలుకు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నార్త్జోన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. -
ఆలిండియా ఎఫ్సీఐ టోర్నీకి సౌత్జోన్ జట్టు
హైదరాబాద్: భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అఖిల భారత ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్జోన్ జట్టును ప్రకటించారు. ఈనెల 4 నుంచి సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో సౌత్జోన్లోని వివిధ రీజియన్ల నుంచి 29 మంది ప్రాబబుల్స్కు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. హైదరాబాద్ రీజినల్ స్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ (ఆర్ఎస్పీసీ) అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ ఎ.రాజగోపాల్, ఆర్ఎస్పీసీ సెక్రటరీ, పీఆర్ డీజీఎం విక్టర్ అమల్రాజ్ ఈ ట్రయల్స్ను పర్యవేక్షించారు. ట్రయల్స్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆలిండియా ఎఫ్సీఐ టోర్నీలో పాల్గొనే 16 మంది సభ్యులతో కూడిన సౌత్జోన్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు డీఎస్ శ్రీధర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఆలిండియా ఎఫ్సీఐ టోర్నీ చండీగఢ్లో ఈనెల 16 నుంచి 20 వరకు జరుగుతుంది. సౌత్జోన్ ఎఫ్సీఐ జట్టు: డి.ఎస్. శ్రీధర్ (కెప్టెన్), సుమిత్ అహ్లావత్, వై. అముల్ పాల్, కె.శ్రీకాంత్, ఎ.సెంథిల్ కుమారన్, జి.శ్రీకాంత్, ప్రవీణ్ సోనీ, ఎస్.గంగాధరన్, నవీన్ నైన్, జి.బాలకుమార్, ప్రమోద్ కుమార్, ఎస్.యోగేశ్, ఎం.ఎ.రషీద్, జె.ఆర్.శ్రీనివాస్, వెంకటేశ్ సాగర్, హెచ్.చంద్ర శేఖర్. -
కెప్టెన్గా అంజలిశర్వాణి
కడప స్పోర్ట్స్: కడప నగరంలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన సౌత్జోన్ అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారిణులను ఎంపికచేసి సౌత్జోన్ జట్టునుశనివారం ప్రకటించారు. 5 (కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం) జిల్లాల జట్ల నుంచి క్రీడాకారిణులను ఎంపికచేయగా కర్నూలు క్రీడాకారిణి అంజలి శర్వాణిని సౌత్జోన్ కెప్టెన్గా నియమించారు. ఎంపికైన జట్టు రాష్ట్రస్థాయిలో సత్తాచాటాలని సౌత్జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సౌత్జోన్జట్టు : కె. అంజలిశర్వాణి (కెప్టెన్) కర్నూలు, డి. ప్రవళ్లిక (వైస్ కెప్టెన్) చిత్తూరు. ఎన్. అనూష, వి. అనూషారాణి (కర్నూలు), కె.మాధురి (నెల్లూరు), పి.పల్లవి (అనంతపురం), ఎన్.రోజా, వికెట్కీపర్ (కడప), జి.శరణ్య (కర్నూలు), జి.చంద్రలేఖ (కర్నూలు), ఎస్. నాగమణి (కడప), బి.యామిని (నెల్లూరు), ఎ.శ్రీలక్ష్మి (కడప), జి.శరణ్య (చిత్తూరు), బి. అనూష (అనంతపురం), ఎన్. మౌనిక(కడప), ఇ. పద్మజ (చిత్తూరు). స్టాండ్బై : జి. సింధుజ (నెల్లూరు), కె. ఓబులమ్మ (కడప), కె.హంస (చిత్తూరు), సీహెచ్ అనూష (చిత్తూరు), వి.శ్రావణి (కర్నూలు). జట్టు మేనేజర్ కమ్ కోచ్గా పద్మావతి వ్యవహరించనున్నారు. -
రాహుల్ అజేయ సెంచరీ
ఆధిక్యంలో సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (205 బంతుల్లో 168 బ్యాటింగ్; 18 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ శతకంతో అదరగొట్టగా... మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (97 బంతుల్లో 80; 13 ఫోర్లు; 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సెంట్రల్ జోన్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకు 308 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం 32 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓపెనర్లు రాహుల్, ఉతప్ప చెలరేగడంతో తొలి వికెట్కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్తో పాటు హైదరాబాద్ బ్యాట్స్మన్ హనుమ విహారి (48 బంతుల్లో 38 బ్యాటింగ్; 7 ఫోర్లు) ఉన్నాడు. పంకజ్ సింగ్కు మూడు వికెట్లు పడ్డాయి. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 100 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వినయ్, ఓజా, అపరాజిత్లకు రెండేసి వికెట్లు దక్కాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement