-
కోవిడ్-19 నియంత్రణకు వలంటీర్లు కావాలి
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్-19 వైరస్ నియంత్రణ కార్యక్రమాల్లో వలంటీర్లుగా పనిచేసేందుకు అన్ని కేడర్లు, ర్యాంకుల రిటైర్డు ఆర్మీ, పారామిలటరీ, పోలీసు, ఎక్సైజ్ ఉద్యోగుల దరకాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు రోగులకు వైద్య సేవలు అందించడం, రవాణా, భద్రత తదితర సేవల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోడానికి www.transport.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ఈ నెల 22తో దరఖాస్తుల గడువు ముగుస్తుందని చెప్పారు. (లాక్డౌన్ ఏయే రంగాలకు సడలింపు.. ) ట్రంప్ నిర్ణయం మంచిది కాదు : బిల్గేట్స్ -
మంచి.. అటెండర్ చెప్పినా ఆచరిస్తా!
♦ ప్రజల ప్రాధాన్యతలే నా ప్రాధామ్యాలు ♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ డా.జనార్దన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పునర్విభజన ముసాయిదా గందరగోళంగా, తలాతోక లేకుండా ఉందని వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. అడ్డగోలుగా ఓటర్లను జాబితాల్లోంచి తొలగించారని విమర్శలు... రూ. వేల కోట్లతో భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు... ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్గా డాక్టర్ బి.జనార్దన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. శనివారం సోమేశ్కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు.. ప్రాధాన్యతలు తదితర అంశాలపై జనార్దన్రెడ్డి ‘సాక్షి’ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు.. ప్రశ్న: కొత్త కమిషనర్ వస్తే అప్పటి వరకున్న ప్రణాళికలు, ప్రాజెక్టులు దారి మళ్లి కొత్తవి తెరపైకి రావడం జీహెచ్ఎంసీలో ఆనవాయితీ. అదే పునరావృతం కానుందా..! జవాబు: మంచి అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైనా పూర్తి చేస్తాను. ఎవరికి పేరు వస్తుందన్నది పట్టించుకోను. బాగుంటే అటెండర్ అభిప్రాయానికైనా విలువిస్తా. బాగలేకపోతే డెరైక్టర్ స్థాయి వారు చెప్పినా పట్టించుకోను. అవసరమైతే స్వల్ప మార్పులుంటాయేమో కానీ నా పథకం కాదని నిలిపివేయను. ప్రశ్న: నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలని మీ డ్రీమ్? జవాబు: పని పెద్దదా.. చిన్నదా అనే ఆలోచనుండదు. చేసే పని ప్రజాబాహుళ్యానికి, ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తాను. డ్రీమ్ అంటే స్కైవేలు.. భారీ నిధులతో చేపట్టే పనులే ఉండాలని లేదు. పనులు చిన్నవే కావచ్చు కానీ.. అప్రాధాన్యమైనవి మాత్రం కావు. వాటి వల్ల ఎక్కువ మందికి సమస్యలు తీరతాయి. అలాంటి వాటి గురించి ఆలోచిస్తాను. ప్రశ్న: మీ తొలి ప్రాధాన్యతలు.. ? జవాబు: ప్రజల ప్రాధాన్యతలే నా ప్రాధామ్యాలు. మొదటిది పారిశుద్ధ్యం. రెండోది రహదారులు. ఆ తర్వాత సదుపాయవంతమైన జీవనానికి కల్పించాల్సిన మౌలిక వసతులు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఇంటింటికి రెండు చెత్తడబ్బాలు అందుబాటులోకి తేనున్నాం. ఇక రహదారులు మన్నికగా ఉండేందుకు వైట్టాపింగ్ ఆలోచనలు చేశారు. వీలైనన్ని మార్గాల్లో వాటిని నిర్మిస్తాం. ప్రశ్న: పారిశుద్ధ్యం మెరుగుకు ఏం చేయనున్నారు? జవాబు: గ్రేటర్లోని కాలనీ సంఘాలు, ప్రజలతో పారిశుద్ధ్య కార్మికుల పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కార్మికులవి, సూపర్వైజర్లవి ఫోన్ నంబర్లు కూడా ప్రజలకిస్తాం. తద్వారా తమ ఇంటిముందు వీధి ఊడ్చేదెవరో ప్రజలకు తెలుస్తుంది. పనిచేయని రోజుల్లో అడిగేందుకు వీలుంటుంది. ప్రశ్న: క్షేత్రస్థాయి పర్యటనలు ఏ జోన్, డివిజన్ నుంచి ప్రారంభించనున్నారు ? జవాబు: గ్రేటర్లో 150 డివిజన్లున్నాయి. వాటి పేర్లతో లాటరీ తీస్తాను. ఏరోజు ఏ డివిజన్ వస్తే ఆరోజు అక్కడ తనిఖీలు చేస్తాను. ముందస్తు సమాచారం ఉంటే వాస్తవ పరిస్థితి తెలియకుండా జాగ్రత్త పడతారు. ప్రశ్న: తొలగించిన 1600 మంది కార్మికుల విషయంలో ఏంచేయనున్నారు ? జవాబు: ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఈ అంశం ఉంది. తగిన పరిష్కారం చూపుతాం. ప్రశ్న: డీలిమిటేషన్.. విశ్వనగర ప్రాజెక్టులు.. ఇతరత్రా సవాళ్ల తరుణంలో బాధ్యతలు చేపడుతున్నారు. ఎలా భావిస్తున్నారు ? జవాబు: సమస్యలున్నప్పుడు.. పరిష్కారమూ ఉంటుంది. స్థానిక సంస్థల్లో పాలకులు ఎంత ముఖ్యమో, పురజనులు అంతే ముఖ్యం. ప్రజలందరి సహకారంతో పనిచేస్తా. ప్రశ్న: సంక్షేమం.. అభివృద్ధి దేనికి ప్రాధాన్యం ? జవాబు: దేని దారి దానిదే. రెండూ జరగాల్సిందే. హైటెక్సిటీలోనూ స్లమ్స్ ఉన్నాయి. సంపన్న కాలనీలు, పేదల మురికివాడల మధ్య చాలా అంతరాలున్నాయి. పేదలకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఆ దిశగా కృషి చేస్తాను. ప్రశ్న: ఓట్ల తొలగింపుపై చెలరేగిన దుమారాన్ని ఎలా పరిష్కరిస్తారు. జవాబు: పోలింగ్కు ముందు వారం రోజులు మినహా ఎప్పుడైనా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఉంది. జాబితాలో లేనంత మాత్రాన ఓటు పోయిందనే భయం అవసరం లేదు. పేరు లేని వారు దరఖాస్తు చేసుకుంటే నమోదు చేస్తాం. వనరుల వినియోగం.. అంతకుముందు మీడియాతో మట్లాడుతూ.. లేఔట్లలోని ఖాలీ ప్రదేశాల్లో పార్కులు, ఆటస్థలాల ఏర్పాటుతో అవి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడతామని, మహిళలు, నిరుద్యోగులకు అధికమొత్తాల్లో బ్యాంకు రుణాలిప్పిస్తామని తెలిపారు. ఉన్న వనరుల్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకునే చర్యలు చేపడతామన్నారు. అంకితభావంతో పనిచేసేందుకు, సమయపాలన పాటించేందుకు బయోమెట్రిక్ వంటి విధానాల కంటే, కౌన్సిలింగ్ వంటి చర్యలు మంచి ఫలితాన్నిస్తాయన్నారు. బలవంతంగా రుద్దకుండా స్వచ్ఛందంగా స్వీయ సమీక్షతో ఉద్యోగుల పనితీరు మెరుగుపరచే ప్రయత్నం చేస్తామన్నారు. అన్నిశాఖల వారు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆ ఇళ్లను తనిఖీ చేయండి
డిప్యూటీ కమిషనర్లకు స్పెషలాఫీసర్ ఆదేశం ఆధార్ అనుసంధానంపై సమీక్ష సిటీబ్యూరో: తాళాలు ఉన్న ఇళ్లను తనిఖీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 17.91 శాతం ఓటర్ల సమాచారం లేదన్నారు. ఆధార్తో ఓటరు కార్డుల అనుసంధానంపై శుక్రవారం డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆధార్ అనుసంధానానికి 73.51 లక్షల మంది అర్హులు కాగా... వారిలో 57.75 లక్షల మంది పరిశీలన పూర్తయిందన్నారు. 10.34 లక్షల మందికి సంబంధించి ఇంటికి తాళాలు ఉన్నాయన్నారు. చిరునామా మార్పులు, తాళాలున్న ఇళ్లకు సంబంధించి డిప్యూటీ కమిషనర్లు స్వయంగా తనిఖీలు చేయాలని సూచించారు. అప్పటికీ ఓటర్ల సమాచారం లేనట్లయితే ఆ వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని సూచించారు. వీరిని జాబితాలోంచి తొలగించేందుకు నోటీసులు జారీ చేయాలన్నారు. పరిశీలన పూర్తయిన వారిలో కేవలం 20.28 లక్షల మందివి మాత్రమే ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం జరిగిందని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై అశ్రద్ధ చూపే బూత్లెవెల్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17 నుంచి స్వచ్ఛ కమిటీల పర్యటన గ్రేటర్లోని 400 యూనిట్లకు ప్రభుత్వం నియమించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన స్వచ్ఛ కమిటీలు ఈనెల 17వ తేదీ నుంచి స్థానికంగా పర్యటిస్తాయని సోమేశ్కుమార్ తెలిపారు. అంతకుముందే సంబంధిత అధికారులు గుర్తించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను రోజూ ఉదయం పూట తనిఖీ చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిటీలోకి మరిన్ని అంశాలు స్వచ్ఛ హైదరాబాద్కు సంబంధించి ప్రభుత్వ విభాగాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లో జీహెచ్ఎంసీ కమిటీని మరింత విస్తరించారు. ఈ కమిటీలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డులకు సంబంధించిన అంశాలున్నాయి. ట్రాఫిక్, ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిటీలో ఇప్పటికే ఉన్న ప్రతినిధులతోపాటు అదనంగా ఎమ్మెల్సీ ఎం.డి.సలీం పేరును చేర్చారు. -
ఇది తొలిపోరు
ప్లాస్టిక్ నిషేధంపై మలి పోరాటం రేపటి నుంచే ‘స్వచ్ఛ హైదరాబాద్’ ‘సాక్షి’తో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా చెత్త తొలగింపు తొలి దశ కార్యక్రమమని... మలి దశలో ప్లాస్టిక్ నిషేధంపై శ్రద్ధ చూపుతామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. తొలుత అన్నివర్గాల్లో అవగాహన క ల్పిస్తామని... పట్టించుకోకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షల కంటే ప్రజల్లో అవగాహన, చైతన్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ‘స్వచ్ఛ హైదరాబాద్’కు పూనుకున్నారని చెప్పారు. ప్రజల చైతన్యంతో ‘మన ఇల్లు- మన సరిసరాలు- మన సిటీ’ అనే తలంపు కలుగుతుందన్నారు. అప్పుడే ‘స్వచ్ఛ హైదరాబాద్’ సాధ్యమవుతుందని... విశ్వనగరంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారంనుంచి ఐదు రోజుల పాటు ‘స్వచ్ఛ హైదరాబాద్’ మహా క్రతువు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.ఆ విశేషాలు... సాక్షి : వీధుల్లో చెత్త తొలగింపు సరే.. ఇళ్లు, కార్యాలయాల్లో చెత్త లేకుండా చేసేందుకు ఏం చేస్తున్నారు? కమిషనర్: వీధుల్లోనే కాకుండా విధులు నిర్వహించే కార్యాలయాలు, ఇళ్లు, పరిసరాల్లోనూ చెత్త లేకుండా చేయాలనేది లక్ష్యం. కార్యాలయాల్లో చెత్తను సిబ్బంది, కార్మికులు తొలగిస్తారు. ఇళ్లకు సంబంధించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాల్సిందిగా గృహిణులకు అవగాహన కల్పించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటే సగం సమస్య సమసిపోయినట్లే. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం. సాక్షి : నగరంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ. ప్లాస్టిక్ క్యారీబ్యాగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్నాయి. ఈ-వేస్ట్, బయో మెడికల్ వేస్ట్, ఇతర వ్యర్ధాలను నిరోధించ కుండా.. వాటిపై అవగాహన కల్పించకుండా... చెత్త ఎంత తొలగించినా ప్రయోజనం ఉంటుందా? కమిషనర్: అన్నీ ఒకేసారి సాధ్యం కావు. మలిదశలో వీటిపై దృష్టి సారిస్తాం. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వాడరాదని కోర్టు ఆదేశాలు, నిబంధనలు ఉన్నాయి. గ్రేటర్ వ్యర్థాల్లో చెత్త తొలి శత్రువు. ప్రస్తుతం దీనిపైనే పోరాటం. దీన్ని అంతం చేస్తూనే మిగతా వ్యర్థాలపైనా అవగాహన కల్పిస్తాం. తర్వాత ప్లాస్టిక్ తొలగింపు చర్యలు చేపడతాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు వెనుకాడం. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా తమ వద్దకు వచ్చే వీవీఐపీలకు ప్రజలు సూచనలు, సలహాలు తెలియజేస్తారు. రోజువారీ నివేదికలొస్తాయి. మంచి సలహాలు, సూచనలు కార్యరూపంలో పెడతాం. సాక్షి : ఈ నెల 16 నుంచి 20 వరకు వీవీఐపీలందరూ పాల్గొంటున్నందున ‘స్వచ్ఛ హైదరాబాద్’ బాగానే సాగుతుంది. ఆ తర్వాత మాటేమిటి? కమిషనర్: ఇంతటితోనే ఈ కార్యక్రమం ఆగిపోదు. ఇది అవగాహనకు బాగా ఉపకరిస్తుంది. చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాల్లో అందుకు కారణాలేమిటో తెలుస్తుంది. దానిపై దృష్టి సారిస్తాం. పరిష్కారాలు ఆలోచించి అమలు చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం. ప్రజల్లో అవగాహన వస్తే సమస్య ఉండదు. దానిని సాధించాలి. ఇల్లు లాగే బస్తీ, కాలనీ అన్నీ ‘మనవి’ అనుకునే స్థితికి ప్రజలంతా రావాలి. అవగాహనతో పాటు.. ఆచరణలో దానిని చూపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఈ దిశగా ఆలోచిస్తున్నాం. పరిశుభ్ర, స్వచ్ఛ కాలనీలకూ ప్రోత్సాహకాలిస్తాం. సాక్షి : ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’లో పాల్గొనే సైనికులెందరు? కమిషనర్: అధికారులు, సిబ్బంది నేరుగా 36 వేల మంది ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. వీరితో పాటు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల వారు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భాగస్వాములు కానున్నారు. సాక్షి : తడి,పొడి చెత్తను వేరుగా వేసేందుకు గృహస్థులందరికీ రెండు రకాలైన డబ్బాలను అందిస్తున్నారా? కమిషనర్: ఇప్పుడే కాదు. అందుకు సమయం పడుతుంది. ఇప్పుడు వాటిని అందజేయలేం. ఆ దిశగా ఆలోచిస్తాం. కానీ ప్రజలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలనేస్పృహ రావాలి. దీనికి ‘స్వచ్ఛ హైదరాబాద్’ వేదిక అవుతుందనే విశ్వాసం ఉంది. అందుకే ఇప్పుడీ కార్యక్రమం చేపట్టాం. సాక్షి : ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడైనా జరిగిందా? కమిషనర్: ఇంతవరకు లేదు. ఇదే ప్రథమం. 400 మందికి పైగా రాజకీయ ప్రముఖులు, అఖిల భారత స్థాయి అధికారులు, ఇతరులు ప్రజలతో మమేకమై, వారితో కలిసి పనిచేసే అద్భుత దృశ్యం ఇంతకు ముందెప్పుడూ లేదు. ఇదే ప్రథమం. ఈ కార్యక్రమం ఇతరులకూ ఆదర్శప్రాయంగా మారనుంది. -
అధికారమే అ‘జెండా’!
జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్కారు దృష్టి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధం అధికారుల ఉరుకులు.. పరుగులు కాలనీ సంఘాలకు పనులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఆదేశాలు... టీఆర్ఎస్ ప్రభుత్వంలో కదలిక తెచ్చాయి. గ్రేటర్పై తమ జెండా ఎగురవేయాలన్న అజెండాతో అధికార పార్టీ ముందుకెళుతోంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా బస్తీలు... కాలనీల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాల అమలుకు.. మరోవైపు అభివృద్ధి పనులకు రంగం సిద్ధం చేసింది. వాటిపై దృష్టి సారించాల్సిందిగా నగరానికి చెందిన మంత్రులకు అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై వారు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అభివృద్ధి పనులను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, స్లమ్స్ డెవలప్మెంట్ సొసైటీలకే ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని ఎలా అమలు చేయాలి.. ఎంతమొత్తంలోని పనులను స్థానిక సంఘాలకు ఇవ్వాలి.. ఎంత గడువివ్వాలి? బిల్లుల చెల్లింపు విధానం తదితరమైనవి వీలైనంత త్వరగా ఖరారు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ మంగళవారం అధికారులకు సూచించారు. నివేదికల ఆధారంగా... మరోవైపు అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి కనబరిచే కాలనీ సంక్షేమ సంఘాల వివరాలు... వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నదీ..లేనిదీ... బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు తదితరమైనవి సేకరిస్తారు. అర్హతలున్న సంఘాలకు పనులను మౌలిక సదుపాయాలపై దృష్టి.. జనాభా ప్రాతిపదికన.. స్థానిక అవసరాల దృష్ట్యా పనులు వర్గీక రించాలని నిర్ణయించారు. ఇందులో భాగ ంగా అన్ని సర్కిళ్లలో 1000 లోపు జనాభా ఉన్న కాలనీ/బస్తీలను, 1000-2500 జనాభా ఉన్న ప్రాంతాలను... అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్నవాటిని గుర్తిస్తారు. వీటిలో తక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నవి.. ఫర్వాలేదనే స్థాయిలో ఉన్నవి... బాగున్నవి గుర్తిస్తారు. తక్కువ సదుపాయాలున్న వాటికి ప్రథమ ప్రాధాన్యమిస్తారు. ఇందులో భాగంగా సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు.. ఇలా అంశాల వారీగా సమస్యలు గుర్తించి నివేదికలు రూపొందిస్తారు. ఇదీ ‘సంక్షేమ’ స్వరూపం ►స్వయం సహాయక బృందాలకు రూ.1000 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ అందజే సేందుకు చర్యలు ప్రారంభించారు. రోజువారీ నివేదిక లు అందజేయాల్సిందిగా ఆదేశించారు. ►పేదల బస్తీలు, ఇతర ప్రాంతాల్లో 1500 నీటి శుద్ధి కేంద్రాలు (ఆర్ఓప్లాంట్లు) ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ►{yైవర్ కమ్ ఓనర్ పథకాన్ని 5వేల మందికి వర్తింపజేయాలని భావిస్తున్నారు. ►మరో ఐదువేల మంది నిరుద్యోగులను గుర్తించి... వారికి స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా పోలీసు ఉద్యోగాల వంటి వాటికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ►వివిధ కాలనీలు, బస్తీల్లో 1000 ఈ-లైబ్రరీలు. వీటిలో దినపత్రికలు, మ్యాగజైన్లే కాక, రెండేసి కంప్యూటర్లు ఉంటాయి. ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ►డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలో రెండేసి స్లమ్ల (మొత్తం 48 స్లమ్స్లో) ఎంపిక. ►యువత కోసం వెయ్యి జిమ్ల ఏర్పాటు. వాటిని వారే నిర్వహించుకునేలా అవకాశం. ►మరో వెయ్యి వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టుల నిర్మాణానికి చర్యలు. ►{పతి సర్కిల్లోనూ ఒక దోబీఘాట్ను సకల వసతులతో అభివృద్ధి చేస్తారు. ►177 శ్మశాన వాటికల్లో విస్తృతంగా మొక్కలు నాటి... హరిత వనాలుగా తీర్చిదిద్దనున్నారు. ►రూ. 5 భోజన కేంద్రాలు 50కి పెంపు. ►వీటిలో వీలైనన్ని కార్యక్రమాలను వంద రోజుల్లో చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ►మరోవైపు పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు నగరాన్ని 330 క్లస్టర్లుగా విభజించి... వాటి బాధ్యతలను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్సర్వీస్ అధికారులకు అప్పగించనున్నారు. ►ఇంకా.. వీలైనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకోవాలనేది సర్కారు లక్ష్యం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement