-
కొండంత ధైర్యంతో...
సియాచిన్ పేరు వినబడగానే ఒంట్లో చలితోపాటు మృత్యుభయం కూడా దూరుతుంది. శత్రువుల జాడను కనిపెట్టడం ఒక ఎత్తయితే, ప్రకృతే శత్రువుగా మారి ప్రాణాలు కబళించే ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడడం మరో ఎత్తు. దేశం కోసం కొండంత ధైర్యంతో సియాచిన్ గ్లాసియర్లో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. సియాచిన్ గ్లాసియర్లో విధులు నిర్వహించబోతున్న ఫస్ట్ ఉమన్ మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ఫాతిమా వసీమ్ చరిత్ర సృష్టించింది... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. గడ్డకట్టే చలిలో మన సైనికుల సాహసం, అంకితభావం మాటలకు అందనివి. సముద్ర మట్టానికి 17,720 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్లో శీతాకాలంలో పగలు ఏడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడంతో సైనికులు ఎక్కువ సమయం నిద్ర పోవడానికి వీలుకాదు. షేవింగ్ చేసుకోవాలన్నా కష్టమే. ఒకవేళ చర్మం తెగితే గాయం మానడానికి చాలా సమయం పడుతుంటుంది. స్నానం చేయాలన్న కష్టమే. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకోగలవు. ఇక్కడ మూడు వేలమంది వరకు సైనికులు పనిచేస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ విధులు నిర్వహిస్తుంది. మంచుకొండ చరియలు విరిగి పడడం ద్వారా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతికూలత’ గురించి తప్ప ‘అనుకూలత’ గురించి ఒక్క మాట కూడా వినిపించని మృత్యుక్షేత్రంలోకి మెడికల్ ఆఫీసర్గా అడుగు పెట్టనుంది కెప్టెన్ ఫాతిమా వసీమ్. ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ పొందింది ఫాతిమా. ‘సియాచిన్ గ్లేసియర్పై ఆపరేషనల్ పోస్ట్లో విధులు నిర్వహించబోతున్న తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీమ్ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఇది చారిత్రక సందర్భం. కెప్టెన్ ఫాతిమా వసీమ్ ధైర్యసాహసాలు, అంకితభావాలకు అద్దం పట్టిన సందర్భం’ అంటూ ‘ఎక్స్’లో ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘ఐసే జాగోరే సాథియో... దునియా సే జాకో బోలుదో’ అనే పాట వినిపిస్తుండగా ‘మీట్ కెప్టెన్ ఫాతిమా, ఏ సియాచిన్ వారియర్. ఉయ్ సెల్యూట్ హర్’ అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోలో ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఫాతిమా వసీమ్ శిక్షణ తీసుకుంటున్న, సైనికులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ∙కెప్టెన్ ఫాతిమా వసీమ్∙శిక్షణలో... ∙వైద్య సేవలు అందిస్తూ -
హిమపాతంతో ఇద్దరు జవాన్ల మృతి
జమ్మూ: హిమపాతం కారణంగా ఇద్దరు ఆర్మీ జవాన్లు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. లద్ధాఖ్లోని దక్షిణ సియాచిన్ హిమానీనదం వద్ద సుమారు 18 వేల అడుగుల ఎత్తులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హిమపాతం సంభవించిందని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. హిమపాత సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుందని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి బయటకు తీయగలిగామని ఆయన చెప్పారు. హిమపాతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్య బృందాలు శాయశక్తులా ప్రయత్నించాయని, అయితే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు. -
సియాచిన్ ప్రాంతాన్ని చూసేందుకు మిలిటరీ ఏర్పాట్లు..
ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమి.. సియాచిన్ను ఇక మీరూ చూడొచ్చు.. మన వీరజవాన్ల కష్టాలు తెలుసుకోవచ్చు.. దీనికి తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. సాధారణ పౌరులు అక్కడికి వెళ్లేలోపు.. ఆ ప్రాంత విశేషాలు కొన్ని.. సియాచిన్ భారత్ అధీనంలో ఉన్నంత వరకు పాకిస్తాన్, చైనా నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం సాధ్యం కాదు. తద్వారా లదాక్పై మన పొరుగు దేశాల దృష్టిపడదు. చైనా అధీనంలోని షక్స్గామ్ లోయ, పాక్ అధీనంలోని బాల్టిస్తాన్కు మధ్యలో ఉంటుంది సియాచిన్. ఇది భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. సియాచిన్ హిమానీనదీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్ రోజుకు రూ.5 నుంచి రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. 3 వేల మంది జవాన్లు ఇక్కడి సరిహద్దులను కాపలా కాస్తుంటారు. 1984లో ఈ ప్రాంతాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి సియాచిన్లో సుమారు వెయ్యి మంది సైనికులు మరణించారు. వీరిలో పాక్ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య సుమారు 220 కాగా.. మిగిలిన వారు అననుకూల వాతావరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి కంటే ఈ సంఖ్య రెట్టింపు. సముద్రమట్టానికి 21 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ ఆర్మీ పోస్టుల్లో సాధారణంగా ఒక జవాన్ 3 నెలలు మాత్రమే పనిచేస్తారు. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు 28 రోజుల పాటు మంచు గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. మొత్తం 128 కిలోమీటర్ల దూరం నడిస్తేగానీ.. సియాచిన్ ఆర్మీ పోస్టులకు చేరుకోలేం. సియాచిన్లోని సాల్టోరో వద్ద పాక్ ఆర్మీ పోస్టులు సుమారు 3వేల అడుగుల దిగువన ఉంటాయి. సియాచిన్లో మిలిటరీ దళాల ఉపసంహరణ కోసం భారత్–పాక్ మధ్య చర్చలు జరిగాయి. ఆపరేషన్ మేఘ్దూత్ ద్వారా 1984లో సియాచిన్లో భారత్.. పాక్పై తొలిసారి దాడి చేసింది. 2003లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సియాచిన్ హిమానీనదిని సాధారణ పౌరులు సందర్శించడం దాదాపు అసాధ్యం. ఏటా మిలిటరీ అధికారులు ఒక యాత్ర నిర్వహిస్తారు. సుమారు 40 మందితో కూడిన బృందంతో ఈ సాహసయాత్ర నడుస్తుంటుంది. ఇందులో ఆర్మీ నిపుణులతో పాటు ఇద్దరు విలేకరులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు, స్కూల్ విద్యార్థులు, స్వచ్ఛందంగా ముందుకొచ్చే పౌరులు భాగస్వాములుగా ఉంటారు. జమ్మూకశ్మీర్లోని లేహ్ ప్రాంతం నుంచి సియాచిన్ యాత్ర మొదలవుతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తొలి రెండ్రోజులు కేవలం కడుపునిండా తినడం.. కంటి నిండా నిద్రపోవడంతో గడచిపోతుంది. వాతావరణ పరిస్థితులకు శరీరం అలవాటు పడేందుకు ఈ ఏర్పాటు. విస్తృత వైద్య పరీక్షల తర్వాతే సియాచిన్ యాత్ర ప్రయాణికుల తుది జాబితా సిద్ధమవుతుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు నుబ్రా నది సమీపంలోని మిలటరీ స్కూల్లో తగిన శిక్షణ ఇస్తారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సియాచిన్లో భారత సైనికుల తిండితిప్పలు
-
పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!
శ్రీనగర్ : ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్లో మైనస్ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే... మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ... ఓ జవాన్ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు. What it is like to save freedom of 1.3 billion people. #IndianArmy Jawans explains one part of it. Enjoy your freedom also be thankful to all our Jawans for making it happen. pic.twitter.com/uFEyoG1vQl — 👁️ INTEL ⚔️ Defence 🌏 OSINT ☢️ Conflict 💬 News (@Ind4Ever) June 8, 2019
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement