-
పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..
యశవంతపుర (బెంగళూరు): టూత్పేస్ట్ అనుకుని ఓ యువతి ఎలుకల మందుతో బ్రష్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మంగళూరు జిల్లాలో జరిగింది. సూళ్యకు చెందిన శ్రావ్య (22) సోమవారం ఉదయం నిద్ర లేచింది. బాత్రూమ్ వెళ్లిన శ్రావ్య టూత్ పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కొద్ది క్షణాల్లోనే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: (పావనికి ఏం కష్టం వచ్చిందో? రాత్రికి రాత్రి ఏమైంది..) -
మనసు చలించి జడ దానం.. గ్రేట్ కదా..!
నేత్రదానం.. అన్నదానం.. కిడ్నీ దానం.. ఊపిరితిత్తుల దానం.. చివరకు ఇటీవల హృదయదానం కూడా చూశాం. అయితే ఓ నృత్యకారిణి ఏకంగా బారెడు పొడవున్న తన జుత్తును దానం చేసింది. క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోయి మానసికంగా బాధపడుతున్న వారిని చూసి చలించిపోయింది ఈ నృత్యకారిణి. అలాంటి వారికోసం తన జడను దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్లోని మోతీనగర్లో నివసించే శ్రావ్య మానస భోగిరెడ్డి కూచిపూడి నృత్యకారిణి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్డీ చేస్తున్న శ్రావ్య కేవలం నృత్యకారిణిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరొందింది. బీటెక్, ఎంటెక్ తర్వాత మాస్టర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన శ్రావ్య తాను పలు ప్రదర్శనలకు వెళ్లే క్రమంలో రేడియేషన్తో జుత్తు కోల్పోయిన వారిని చూసి బాధపడేది. ఎప్పుడైనా తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగు వెంట్రుకలు చిక్కితేనే బాధపడతామని.. అలాంటిది మొత్తం జుత్తు లేకపోతే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని, అందుకే జుత్తును సేకరించే హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్కు ఇటీవలనే అందజేసినట్లు చెప్పింది. క్యాన్సర్కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సుమధుర ఆర్ట్ అకాడమిని నడిపిస్తున్న శ్రావ్యలాగనే చాలామంది తమ జుత్తును ఈ సంస్థకు అందజేస్తున్నారు. ఆర్థికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందం ఉందని ఆమె తెలిపారు. ఇంకో రెండు నెలలు పోతే తనకు మళ్లీ జుత్తు పెరుగుతుందని, కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
వనవాసం పెద్ద హిట్ అవుతుంది
‘‘యాక్టర్ అవుదామని వచ్చిన సంజయ్ కుమార్గారు నిర్మాత అయ్యారు. ఈ సినిమాను నిర్మిస్తున్న తన ఫ్రెండ్ చనిపోవడంతో సంజయ్గారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ‘వనవాసం’ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’’అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నవీన్రాజ్ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి ముఖ్య తారలుగా భరత్.పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వనవాసం’. భవాని శంకర ప్రొడక్షన్స్ పతాకంపై బి.సంజయ్ కుమార్ నిర్మించారు. మోహన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్లో పరిచయమయ్యారు నరేశ్. ఇప్పుడు నా సినిమాని ప్రోత్సహించడానికి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత తుమ్ముళ్లపల్లి రామసత్యనారాయణ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. సంజయ్గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా తీశారు’’ అన్నారు భరత్.పి, నరేంద్ర. నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ∙ నవీన్,శ్రావ్య -
విలువలున్న ప్రేమకథ
మహీదర్, శ్రావ్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘నటన’. ఈ చిత్రంతో రచయిత భారతీబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కుబేర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నైతిక విలువలున్న ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇందులో సీనియర్ హీరో భానుచందర్ చేసిన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ. పోస్ట్ ప్రొడక్షన్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక, కెమెరా: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటేశ్వర్. -
నమ్మలేని కథలు నిజమైతే..
సాయిరోనక్, శ్రావ్య, శిరీష వంక ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘మసక్కలి’. నబి ఏనుగుబల(మల్యాల) దర్శకత్వంలో సుమిత్సింగ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, ‘‘కొన్ని కథలు నమ్ముతాం.. కొన్నింటిని నమ్మలేం. కొన్నింటిని నిజంగా చూసినా నమ్మలేం. నమ్మలేని కథలు నిజమైతే అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఓ కథతో రూపొందుతోన్న చిత్రమే ‘మసక్కలి’. ట్రైలర్ చూస్తుంటే మంచి లవ్స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమే ఇది. అందుకే ‘మసక్కలి’ టైటిల్ పెట్టాం’’ అన్నారు నబి ఏనుగుబల. ‘‘ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు. ఈ నెలలో ఆడియో, త్వరలో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు సుమిత్ సింగ్. దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిహిరామ్స్, కెమెరా: సుభాష్ దొంతి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement