-
రిలీజ్ కి ముందే రికార్డులు
-
రాజస్థాన్లో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగించి
రాజస్థాన్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య(21) పట్ల భర్త దుర్మార్గంగా ప్రవర్తించాడు. భార్యపై దాడి చేసి, ఆమె బట్టలు విప్పి గ్రామంలో నగ్నంగా ఊరేగించాడు. ఈ దారుణం ప్రతాప్గఢ్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం. 21 ఏళ్ల గిరిజన యువతికి ఇంతకుముందే పెళ్లి అయ్యింది. అయితే ఆమె పక్కింటి యువకుడితో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడితో వివాహిత పరారయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అత్తమామలు ఆగ్రహించి..మహిళను కిడ్నాప్ చేసి వాళ్ల గ్రామానికి తీసుకొచ్చి ఆమెపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. అంతేగాక మహిళ సాయం కోసం అర్తించినా అక్కడ ఉన్న వాళ్లు ఆమెకు హెల్ప్ చేసేందుకు ముందుకు రాకపోగా.. ఈ తతంగాన్ని మొత్తం సెల్ఫోన్లో రికార్డు చేశారు..దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిలో అందరిముందే మహిళను ఆమె భర్త దుస్తులు విప్పిందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. బాధితురాలు సాయం కోసం వేడుకోవడం, అక్కడున్న వారంతా విడ్డూరం చూసినట్లు చూస్తుండటం కూడా కనిపిస్తోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మొత్తం 10 మందిపై పోలసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఆరు బృందాలుగా వీడి దర్యాప్తు చేపట్టారు. ప్రతాప్గఢ్ ఎస్పీ అమిత్ కుమార్ గ్రామంలోనే ఉండి విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొంతమందిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: జేడీఎస్ నేత యువతులతో రాసలీలలు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్ प्रतापगढ़ जिले में पीहर और ससुराल पक्ष के आपसी पारिवारिक विवाद में ससुराल पक्ष के लोगों द्वारा एक महिला को निर्वस्त्र करने का एक वीडियो सामने आया है। पुलिस महानिदेशक को एडीजी क्राइम को मौके पर भेजने एवं इस मामले में कड़ी से कड़ी कार्रवाई के निर्देश दिए हैं। सभ्य समाज में इस… — Ashok Gehlot (@ashokgehlot51) September 1, 2023 కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్రంగా స్పందించారు. దీనిని ఖండిస్తూ గురువారం అర్థరాత్రి ట్వీట్ చేశారు. ప్రతాప్గఢ్ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసిన వీడియో కలవరానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ఏడీజీపీని సంఘటనా స్థలానికి పంపి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నీచమైన చర్యకు పాల్పడిన ఇలాంటి నేరగాళ్లకు సమాజంలో చోటు లేదని, వీరిని వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టి విచారణ చేపడతామని చెప్పారు. राजस्थान में अब महिलाओं पर अमानवीयता की सारी सीमाएं पार हो चुकी हैं। धरियावद में एक नारी को निर्वस्त्र कर पीटा गया है, जिसका वीडियो वायरल है, लेकिन महिला सुरक्षा पर बड़े-बड़े दावे करने वाले गहलोत जी जाने किस राज्य के मुख्यमंत्री और गृहमंत्री हैं? दो दिन बीत गए पुलिस ने रिपोर्ट… pic.twitter.com/iQUt0PIdNQ — Gajendra Singh Shekhawat (@gssjodhpur) September 1, 2023 బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ.. ఈ సంఘటన కాంగ్రెస్ వంచనను బయటపెట్టిందని విమర్శించారు. అశోక్ గహ్లోత్ను రాజీనామా చేయాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. అలాగే రాజస్థాన్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సైతం కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళలపై జరిగే నేరాల్లో రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట
గ్వాటెమాలాలో విహారయాత్రకు వెళ్లిన అమెరికాకు చెందిన ఓ జంటకు ఉబెర్ చుక్కలు చూపించింది తమరైడ్కు ఏకంగా 24 లక్షలు వసూలు చేయడం చూసి పాపం గుడ్లు తేలేసారు. ఎంతో ఆనందంగా తమ వివాహ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వివరాలను పరిశీలిస్తే.. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం ఆస్ట్రేలియన్ జంట డగ్లస్ ఆర్డోనెజ్ డొమినిక్ ఆడమ్స్ గ్వాటెమాలాకు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా సుందరమైన పర్యాటక ప్రాంతం గ్వాటెమాలా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి నిర్దేశిత బిల్లు 55 డాలర్లు (దాదాపు రూ. 4,500) దీనికి దాదాపు 600 శాతం ఎక్కువగా 29,994 డాలర్ల (సుమారు రూ. 24 లక్షలు) వసూలు చేసింది. దీంతో ఏకంగా అకౌంట్మొత్తం ఖాళీ అయిపోయింది. (AI Anchor Lisa: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) ఈ విషయాన్ని డెబిట్ కార్డ్తో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నో సఫీషియంట్ ఫండ్స్ అని మెసేజ్ వచ్చినపుడు గానీ గమనించలేదు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుని 24 లక్షల రూపాయలు ఖతం కావడంతో లబోదిబోమన్నారు. ఇది తమ ఉత్సాహాన్ని నీరు గార్చేసిందని డగ్లస్ ఆర్డోనెజ్ వాపోయాడు. అయితే కొన్ని రోజుల తరువాత అదృష్టవశాత్తూ మొత్తం రీయింబర్స్మెంట్ అయినప్పటికీ, ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఆందోళనలో మునిగి పోయాయని సంస్థ కస్టమర్ సర్వీస్పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆడమ్స్. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) ఈ ఎర్రర్ను గుర్తించి, రీయింబర్స్మెంట్ చేశామని ఉబెర్ ప్రతినిధి తెలిపారు. బ్యాంక్ లోపం కారణంగా పొరపాటుగా కాలన్లలో కాకుండా డాలర్లలో ఫీజు వచ్చిందని తెలిపింది. కస్టమర్లు ఫిర్యాదును సీరియస్గా తీసుకుంటామని, స్వీకరించిన, వారి సమస్యను తమ టీం త్వరగా సరిదిద్దిందని వెల్లడించారు. నిర్దిష్ట బ్యాంకుల విధానాల ఆధారంగా రీఫండ్ సమయం మారుతుందని ప్రతినిధి పేర్కొన్నారు. -
కీర్తి, కృతీ.. ఇద్దరిది ఒకే స్థితి… ఏమిటి ఈ పరిస్థితి?
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ల జాబితాలో కీర్తిసురేష్ ఉన్నారు. ఆమె ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ మెరుస్తున్నారు. ఆమె గత సినిమాలు కాస్త నిరాశపర్చినా.. ప్రస్తుతం ఆమె చేతుల్లో చాలా వరకు తమిళ ప్రాజెక్టులే ఎక్కువున్నాయి. దీంతో అవకాశాలు వచ్చిన చోటుకే వెళ్లే ఆలోచనలో కీర్తి ఉందట. టాలీవుడ్లో స్కీన్ షో చేసినా అంతగా అవకాశాలు రాకపోవడంతో మద్రాస్ ఫ్లైట్ ఎక్కడమే బెటర్ అనుకుంటుందట. తమిళంలో ఆమె చేతిలో సుమారు నాలుగుకు పైగా చిత్రాలున్నాయి. (ఇదీ చదవండి: Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారా?) తెలుగులో మాత్రం చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో మాత్రమే కనిపించనుంది. అది కూడా చెల్లెలు పాత్రలో.. కానీ నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో రాబోతున్న సినిమాకు కోసం కీర్తి సురేష్ను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా ఎక్కడ అవకాశాలు పిలిస్తే అక్కడికి వెళ్లడంలో తప్పులేదని నెటిజన్స్ అంటున్నారు. మరోవైపు 'ఉప్పెన'తో నటిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి కృతీశెట్టి పరిస్థితి కూడా దాదాపు కీర్తి మాదిరే ఉంది. ఈమెకు చాలానే ఛాన్స్లు అయితే వచ్చాయి కానీ హిట్లు మాత్రం రాలేదు. వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి చిత్రాలు వరుస డిజాస్టర్లు వచ్చాయి. దీంతో ఆమెకు టాలీవుడ్లో కొంత మేరకు అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం భారీగానే ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. మలయాళంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా 'అజయంతే రాండమ్ మోషణం'లో కృతిశెట్టికి ఛాన్స్ దక్కింది. ఇందులో '2018' సినిమాతో సంచలనం రేపిన టోవినో థామస్ హీరో. తమిళ్ నుంచి రెండు సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఈ ఇద్దరు భామలు టాలీవుడ్కు గుడ్ బై చెప్పనున్నారా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: వాళ్లు నన్ను అడ్వాంటేజ్గా తీసుకున్నారు.. పాయల్ సంచలన కామెంట్స్) -
Bad News: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్లో ఉద్యోగులు!
సాక్షి, ముంబై: భారతీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ఉద్యోగులకు చేదువార్త. 2022-23 ఆర్థిక సంవత్సరం క్యూ4లో తన ఉద్యోగులకు సగటున 60 శాతం వేరియబుల్ వేతనాన్ని అంద జేయనుంది. (ఇదీ చదవండి: Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) ఆర్థిక మాంద్యం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఐటీ మేజర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో ఉద్యోగులకు 60 శాతం వేరియబుల్ పే మాత్రమే అందించనుంది. మాంద్యం ఆందోళనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావంతోనే కంపెనీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఐటీ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడికి ఇది సూచిక అని నిపుణుల అంచనా. ఇన్ఫోసిస్ గతంలో (2022-23 ఆర్థిక సంవత్సరం) మొదటి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే ప్రకటించింది. రెండో త్రైమాసికంలో దీన్ని 65 శాతం శాతానికి తగ్గించింది. కాగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ల ప్రకారం, డిసెంబర్లో 24.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు మార్చి త్రైమాసికంలో 20.9 శాతానికి దిగి వచ్చింది. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) మరిన్ని బిజినెస్వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement