-
సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్ లెజెండ్
ICC WC 2023- PM Modi Gesture: టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలిచిన తీరుపై పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తన చర్య ద్వారా దేశం మొత్తం జట్టుకు అండగా ఉందనే సందేశాన్ని ఇచ్చారని ప్రధానిని కొనియాడాడు. ఆటగాళ్లను తన సొంత బిడ్డల్లా ఆప్యాయంగా హత్తుకున్న విధానం ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. సెమీస్ వరకు అజేయంగా కొనసాగిన టీమిండియా అహ్మదాబాద్లో ఆదివారం నాటి తుదిపోరులో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. ఫలితంగా సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలన్న కల చెదిరిపోయింది. కళ్లలో నీళ్లు నింపుకొని ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక.. కళ్లలో నీళ్లు నింపుకొని మైదానాన్ని వీడారు. షమీని ఆత్మీయంగా హత్తుకుని దీంతో అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. టీమిండియాను ప్రేమించే వాళ్లంతా హృదయం ముక్కలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ భారత జట్టు డ్రెస్సింగ్రూంకు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. రోహిత్, కోహ్లిలను దగ్గరకు తీసుకుని.. ఆటలో గెలుపోటములు సహజమంటూ నచ్చజెప్పారు. మహ్మద్ షమీని ఆప్యాయంగా హత్తుకుని మరేం పర్లేదంటూ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సొంతబిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ జీ న్యూస్తో మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్రూంకి వెళ్లి.. వాళ్లకు తానున్నానంటూ ప్రధాని ధైర్యం చెప్పారు. దేశం మొత్తం మీ వెంటే ఉందనే సందేశాన్ని ఇచ్చారు. నిజానికి భారత్కు అదొక ఉద్విగ్న క్షణం. అలాంటి సమయంలో ప్రధాని మోదీ ఆటగాళ్లను తన సొంతపిల్లల్లా అక్కున చేర్చుకున్నారు. వాళ్లకు నైతికంగా మద్దతునిచ్చి తలెత్తుకోవాలంటూ స్ఫూర్తి నింపారు. ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో గొప్పగా వ్యవహరించారు’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? -
భారత్ అద్బుతంగా ఆడుతోంది.. మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు: అక్తర్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు 8 సార్లు పాకిస్తాన్ను భారత జట్టు ఓడించింది. 1992 వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్పై భారత్ ఆదిపత్యం చెలాయిస్తోంది. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2011 వరల్డ్కప్ విజయాన్ని పునరావృతం చేసే దిశగా టీమిండియా అడుగులు వేస్తుందని అక్తర్ కొనియాడాడు. భారత్ 2011 ప్రపంచకప్ చరిత్రను పునరావృతం చేయబోతోందని నేను నమ్ముతున్నాను. సెమీ-ఫైనల్స్లో వారు విజయం సాధిస్తే.. కచ్చితంగా ఛాంపియన్స్గా నిలుస్తారు. ప్రస్తుత భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఈ టోర్నీలో మమ్మల్ని ఓడించి కోలుకోలేని దెబ్బ కొట్టారు. పాకిస్తాన్కు ఇది ఘోర పరాభావం. భారత జట్టు మమ్మల్ని ఓ పసికూనలా ఓడించింది. మా రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడని తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ పేర్కొన్నాడు. చదవండి: Eng Vs Afg: ముజీబ్ను హత్తుకుని ఏడ్చేసిన బుడ్డోడు.. మ్యాచ్ కోసం ఏకంగా! వీడియో వైరల్ -
‘టీమిండియా నిర్ణయం సరైంది కాదు’.. అవునా? తెలివి తక్కువోళ్లు ఎవరంటే!
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఇప్పటికే మ్యాచ్కు ముందు తన పోస్టుతో నెటిజన్లకు దొరికిపోయిన అక్తర్.. దాయాదుల మ్యాచ్లో టాస్ సందర్భంగా తన వ్యాఖ్యలతో మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పాక్తో మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ పిచ్పై ఇదే సరైన నిర్ణయమన్న విశ్లేషణల నడుమ.. షోయబ్ అక్తర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘ఈ వికెట్ చాలా బాగుంటుంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం నాకెందుకో సరైన నిర్ణయం అనిపించలేదు. అంతేకాదు.. వాళ్లు అదనపు స్పిన్నర్ను కూడా తీసుకోలేదు. పాకిస్తాన్ ఇక్కడ తొలుత బ్యాటింగ్కు దిగడం నాకైతే సంతోషంగా ఉంది. వాళ్లు కచ్చితంగా మంచి స్కోరు చేస్తారు. టీమిండియా తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నదనిపిస్తోంది. పాకిస్తాన్ భారీగా పరుగులు చేసేందుకు వాళ్లు అవకాశమిచ్చారు’’ అని ఎక్స్ ఖాతాలో వీడియో షేర్ చేశాడు. అయితే, అక్తర్ అంచనాలు తలకిందులైన విషయం తెలిసిందే. తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యాఖ్యలకు సమర్థింపుగా.. టీమిండియా బౌలర్లు అద్భుతం చేసి.. పాక్ను 191 పరుగులకే కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. భారత బౌలర్ల దెబ్బకు 42.5 ఓవర్లకే పాక్ బ్యాటర్లు తోకముడిచారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ(86), శ్రేయస్ అయ్యర్(53- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో విజయం అందించారు. వరల్డ్కప్ చరిత్రలో మరోసారి హిస్టరీని రిపీట్ చేస్తూ పాక్పై భారత్ పైచేయి సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తాజా ఎడిషన్లో హ్యాట్రిక్ గెలుపు అందుకుంది. ఈ నేపథ్యంలో.. షోయబ్ అక్తర్ను ట్రోల్ చేస్తూ టీమిండియా ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘తెలివి తక్కువ వాళ్లు ఎవరో అర్థమైందా? అక్తర్?’’ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ ఆరంభానికి ముందు చరిత్ర పునరావృతం అంటూ చేసిన కామెంట్ను ప్రస్తావిస్తూ.. ‘‘థాంక్యూ నీ మాట నిజమైంది’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం Ahhh. That quietness on our boundaries. I remember this from the 90's. pic.twitter.com/Sl4IBlz5Vl — Shoaib Akhtar (@shoaib100mph) October 14, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Pak: హిస్టరీ రిపీట్.. పాక్ ఓటమిని ధ్రువీకరించిన అక్తర్! థాంక్యూ..
ICC ODI WC 2023- Ind Vs Pak: haar manli: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ను టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ‘‘నిజాలు ఒప్పుకొంటున్నందుకు థాంక్యూ’’ అంటూ సెటైర్లు వేస్తూ మీమ్స్తో సందడి చేస్తున్నారు. కాగా దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తానికి మహా ఇష్టం. హోరాహోరీకి సిద్ధం! నువ్వా- నేనా అంటూ చిరకాల ప్రత్యర్థులు హోరాహోరీ తలపడితే చూడటానికి ఫ్యాన్స్కు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. అలాంటి హై వోల్టేజీ మ్యాచ్ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్లో తొలిసారి భారత్- పాక్ అక్టోబరు 14న పరస్పరం ఢీకొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘‘రేపు.. చరిత్ర పునరావృతమవుతుంది’ అంటూ వికెట్ తీసిన సంబరంలో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. కాగా.. ఇది సచిన్ టెండుల్కర్ను అవుట్ చేసినప్పటి సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలా కనిపించింది. హిస్టరీ రిపీట్.. థాంక్యూ అక్తర్ ఈ నేపథ్యంలో అక్తర్.. ‘హిస్టరీ రిపీట్’ కామెంట్ను భారత జట్టు అభిమానులు హైలైట్ చేస్తూ పాకిస్తాన్ ఓటమిని నువ్వే ఖరారు చేశావు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘నీకు నువ్వుగా.. ఓటమిని అంగీకరించావు.. టీమిండియాను సపోర్టు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ మాట నిజం కావాలి. ఎందుకంటే మీరన్నదే నిజం కాబట్టి’’ అంటూ అక్తర్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు టీమిండియాను పాకిస్తాన్ ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. రెండేసి విజయాలతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అత్యుత్సాహం ప్రదర్శించిన అక్తర్కు దిమ్మతిరిగేలా నెటిజన్లు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ మాజీ ఫాస్ట్బౌలర్ తన పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్కప్-2023లో ఆడిన రెండు మ్యాచ్లలో టీమిండియా.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్లపై గెలుపొందగా.. పాకిస్తాన్ .. నెదర్లాండ్స్, శ్రీలంకను ఓడించింది. ఇరు జట్లు రెండేసి విజయాలతో మూడో మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. Khud hi haar manli🤣 — Shivani (@meme_ki_diwani) October 13, 2023 Thank you for Supporting India sir 🙌🏻🇮🇳 1992 - India Win 1996 - India Win 1999 - India Win 2003 - India Win 2011 - India Win 2015 - India Win 2019 - India Win 2023 - India win (According to Shoaib Akhtar History will Repeat) 😌 https://t.co/cUiTS0aA03 — Diwakar Singh (@realdiwakar) October 13, 2023 Thank you for confirming. https://t.co/p2Wfqah7a8 — Srinivas R (@srini_r_twit) October 13, 2023 It really seems tough for you to choose your favourite one.. let me help you.. We too wish the history repeat 😜#ThandRakh https://t.co/dbPJjt1eXL pic.twitter.com/QMYCaUXhYu — RAHUL S BELAKOPPAD (@rahulsbelkoppad) October 13, 2023 చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ -
అందరూ కోహ్లిని మాత్రమే ప్రశంసిస్తున్నారు.. అతడి సంగతి ఏంటి మరి?
వన్డే ప్రపంచకప్-2023ను టీమిండియా విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి కంటే రాహుల్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు. "కేఎల్ రాహల్ బ్యాటింగ్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు వరల్డ్కప్ టోర్నీలో కాకుండా వేరే లీగ్ క్రికెట్లో ఆడినట్లు అన్పించింది. విరాట్ కోహ్లి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ విరాట్కు ఈ మ్యాచ్లో ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ రూపంలో ఓ అవకాశం ఇచ్చారు. విరాట్ కోహ్లి క్యాచ్ మాత్రం టర్నింగ్ పాయింట్. కాగా రాహుల్ మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. అవసరమైనప్పుడు షాట్లు ఆడుతూ రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రాహుల్ ప్రతీ మ్యాచ్లోనూ తన వంతు సహకారం అందిస్తూ ఉంటాడు. అతడికి ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అదే విధంగా వికెట్ కీపింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అందరూ కోహ్లి ఫిట్నెస్ను, వికెట్ల మధ్య అద్భుతంగా పరిగెడతాడని అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ రాహుల్ కూడా అతడితో పాటు పరిగెత్తున్నాడు. అదే విధంగా 50 ఓవర్లపాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి రాహుల్ వంటి ఆటగాడికి అందరూ సపోర్ట్ చేయాలని" తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ పేర్కొన్నాడు. చదవండి: CWC 2023 ENG vs BAN: బంగ్లాదేశ్కు చుక్కలు చూపించిన ఇంగ్లండ్.. 364 పరుగుల భారీ స్కోర్
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
Advertisement