-
ఇరాన్లో జంట పేలుళ్లు.. వందకుపైగా మృతులు!
టెహ్రాన్: ఇరాన్లో బుధవారం జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందగా.. 170 మంది తీవ్రంగా గాయడినట్లు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. దివంగత ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ సమాధి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్కు ఖాసీం సులేమానీ నేతృత్వం వహించేవాడు. 2020లో అమెరికా జరిపిన వైమానికి దాడిలో ఖాసీం సులేమానీ మరణించారు. బుధవారం ఖాసీం సులేమానీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో నిమిషాల వ్యవధిలో వరసగా పేలుళ్లు జరిగాయి. ఖాసీం సులేమానీ జయంతి రోజే సమాధి వద్ద ఈ పేలుళ్లు జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని కెర్మాన్ ప్రావిన్స్ చెందిన అధికారులు తెలిపారు. మరోవైప మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. Pics | 73 Dead In Twin Blasts Near Grave Of Iran's Top General Qassem Soleimani https://t.co/EbzhuEE70t pic.twitter.com/x7lIs1vtjD — NDTV (@ndtv) January 3, 2024 చదవండి: అమెరికాపై ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12 మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
రైలు, బస్సు ఢీ : 20 మంది మృతి
కరాచి: పాకిస్తాన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సింద్ ప్రావిన్స్లో రైలు, బస్సు ఢీకొట్ట ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. సుక్కూర్ నగరంలోని రోహ్రి ప్రాంతంలో రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సుక్కూర్ పోలీసు ఏఐజీ జమీల్ అహ్మద్ డాన్ అందించిన సమాచారం ప్రకారం గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న తమ సిబ్బంది హుటాహుటిన రక్షణ, హాయక చర్యలు చేపట్టారని తెలిపారు. 45 పాకిస్తాన్ ఎక్స్ప్రెస్ రైలు కరాచీ నుండి రావల్పిండికి వెళుతుండగా, మానవరహిత రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. మరోవైపు రైలులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదమనీ సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మహేసర్ వెల్లడించారు. రైలు మూడు భాగాలుగా విడిపోయి, దాదాపు 150-200 అడుగుల మేర బస్సును రైలు లాక్కుపోయిందని తెలిపారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 7గురి మృతి
బుద్వాన్: ఉత్తరప్రదేశ్లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. బుద్వాన్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. స్థానికుల అందించిన సమాచారం ప్రకారం, పేలుడు కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో దీపావళిని పురస్కరించుకుని టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బాణసంచా పేలుళ్లతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకు పోయింది. సంఘటా స్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారులు కూడా సహాయక చర్యల్నిపర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గాయపడిన వారికి సమీప ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. బాధితులకు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement