-
రేపు ఎస్ఆర్ఐటీలో క్యాంపస్ డ్రైవ్
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కశాలలో ఈ నెల 5వ తేదీ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వారు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు టీపీఓ రంజిత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్కు ఈఈఈ, మెకానికల్ విభాగాల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించిన పాలిటెక్నికల్ విద్యార్థులు అర్హులన్నారు. పాల్గొనదలచినవారు తమ రెజూం, మార్కుల జాబితాలు తీసుకుని ఉదయం 9 గంటలకు ఎస్ఆర్ఐటీ కళాశాలకు రావాలన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.1.20 - 1.50 లక్షలు వేతనం ఉంటుందన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వైఎస్సార్ జిల్లాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 95052 83026, 95052 83037 నెంబర్లలో సంప్రదించి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
5 నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి కల్చరల్: టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ పీఆర్వో టి.రవి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న విజయనగరం జిల్లా గుమ్మా లక్ష్మీపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 7న విశాఖ జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలోని రామాలయంలో, 11న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 12న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 27న తమిళనాడు శివగంగ జిల్లా దేవకొట్టై మండల కేంద్రంలోని ఎన్ఎస్ఎంవీపీఎస్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారని తెలిపారు. -
'5వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల'
హైదరాబాద్: ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుపై తమ ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్లో తెలిపారు. వీలైతే ఆ బిల్లు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతామన్నారు. ఈ ఏడాది డీఎస్పీ, టెట్ ఒకే రోజు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఏటా ఇలాగే నిర్వహిస్తామని తెలిపారు. టెట్ రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సెప్టెంబర్ 6వ తేదీ తర్వాత తమిళనాడు విద్యా విధానాన్ని పరిశీలించడానికి అధ్యయన కమిటీ వెళ్తుందని పేర్కొన్నారు. ఎంసెట్పై కూడా ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 3న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారుల సమావేశంలో పాల్గొంటామన్నారు. సెప్టెంబర్ 5న విజయవాడలో టీచర్స్ డే నిర్వహిస్తామన్నారు. ఆ రోజే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement