-
సీపీఎంరాష్ట్ర కార్యదర్శివర్గంలోకి జూలకంటి
నర్సింహారెడ్డితో పాటు రంగారెడ్డికి చోటు మరో ఐదుగురికి రాష్ట్ర కమిటీలో స్థానం జిల్లా నుంచి పార్టీలో పెరిగిన ప్రాతినిధ్యం (సాక్షి ప్రతినిధి, నల్లగొండ) : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శివర్గానికి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 1 నుంచి 4 వరకు హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పార్టీ తొలి మహాసభల్లో ఆయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శివర్గంలో జిల్లా కార్యదర్శిగా నంద్యాల నర్సింహారెడ్డి ఉండగా, ఇప్పుడు కొత్తగా జూలకంటికి అవకాశం కల్పించారు. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు జిల్లా నేతలను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యులైన తుమ్మల వీరారెడ్డి, తిరందాసుగోపి, ముల్కలపల్లి రాములుకు మళ్లీ రాష్ట్ర కమిటీలో అవకాశం లభించగా, కొత్తగా ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, ఎం.డి.జహంగీర్లను కూడా రాష్ట్ర కమిటీలోకి తీ సుకున్నారు. దీంతో మొత్తం రాష్ట్ర కమిటీలో జిల్లాకు ఏడు బె ర్తులు దక్కినట్టుయింది. ఇందులో ఇద్దరిక కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి కార్యదర్శివర్గంలో స్థానం దక్కడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్ర కమిటీలో స్థానం ఉండేది. వీరిలో న ంద్యాల నర్సింహారెడ్డిని గతంలోనే ఏర్పాటు చేసిన తె లంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గంలోనికి తీసుకున్నారు. జిల్లా కార్యదర్శి హోదాలో మరోసారి ఆయన కార్యదర్శివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఈసారి రాష్ట్ర కమిటీలో మొత్తం ఏడుగురికి స్థానం దక్కడంతో సీపీఎంకు బలమైన జిల్లాగా పేరున్న నల్లగొండ ప్రాతినిధ్యం మొత్తం మీద ఆ పార్టీలో పెరిగినట్టయింది. కార్మిక నాయకుడి నుంచి శాసనసభా పక్ష నేత వరకు.... మిర్యాలగూడ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి 1994, 2004, 2009లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 కంటే ముందు ఆయన మిర్యాలగూడ మున్సిపల్ వైస్చైర్మన్గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పార్టీ శాసనసభాపక్ష నేత హోదాలో పనిచేశారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన సీఐటీయూ లో చురుకుగా పనిచేసి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన జూలకంటి జిల్లాలో జరిగిన అనేక ప్రజాపోరాటాల్లో తన వంతు పాలుపంచుకున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం పక్షాన ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష అప్పట్లో సంచలనం సృష్టిం చింది. సాగర్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలంటూ ఆయన 11 రోజుల పాటు మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేశారు. -
‘పెద్ద’పీట మనదే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పలు ప్రధాన రాజకీయ పక్షాలకు రాష్ట్రస్థారుులో నాయకత్వం వహించే అరుదైన అవకాశం జిల్లా నేతలకు లభిస్తోంది. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఖమ్మం నేతలను ఆయా రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకుని రాష్ట్రస్థాయి పదవులు, పార్టీ పగ్గాలను అప్పగించటం విశేషం. జిల్లాకు చెందిన వివిధ రాజకీయపక్షాల నేతలు ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీల్లో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జాతీయ పార్టీ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా నేత తమ్మినేని వీరభద్రానికి మరోమారు అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ తొలి రాష్ట్ర కార్యదర్శిగా సంవత్సరం పాటు ఆయన పనిచేశారు. ఆయనకే మరోమారు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. తమ్మినేని పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని సాధారణ కార్యకర్తగా ప్రారంభించి పార్టీ డివిజన్, జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై మహాప్రస్థానం పేరుతో పాదయాత్ర, దళితుల సమస్యలపై సైకిల్యాత్ర నిర్వహించి గుర్తింపు పొందారు. తమ్మినేని ఖమ్మం ఎంపీగా, ఖమ్మం శాసనసభ్యుడిగా పనిచేశారు. సీపీఎం భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య పార్టీ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కల్లూరు మండలం నారాయణపురం వాసి, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి విశేష సేవలు అందిస్తున్నారు. పార్టీని రాష్ట్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. యువజన, విద్యార్థి, శ్రామిక, రైతాంగంలో ఆయన చైతన్యం తీసుకొచ్చారు. తొలుత పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిండెంట్గా నియమితులైన పొంగులేటి, ఆ తర్వాత కొద్దికాలానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికయ్యూరు. ఇటు పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూనే అటు పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూనే ఉన్నారు. అటు పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యూరు. జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రస్థారుులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా జిల్లాకే చెందిన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క నియమితులయ్యూరు. వైరా మండలం స్థానాలలక్ష్మీపురం నివాసి అరుున భట్టి కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీ లో పలు కీలక పదవులు నిర్వహించారు. ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు అత్యంత కీలక పదవి లభించింది. సీపీఐ సైతం జిల్లాకు పెద్దపీటే వేసింది. కీలకమైన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెంకు చెందిన సీనియర్ నేత సిద్ది వెంకటేశ్వర్లు ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మాజీ శాసనసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు గత కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా సీనియర్ నేత, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యకు ఆ పార్టీ అవకాశం కల్పించింది. తాజాగా సీపీఎం ప్రకటించిన రాష్ట్ర కార్యదర్శివర్గంలోనూ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్లకు అవకాశం లభించటం విశేషం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement