-
షాకింగ్.. క్లాస్లో తోటి విద్యార్థులతో గొడవ.. రెండో తరగతి బాలుడు మృతి..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా కిషన్పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చనిపోయిన బాలుడి పేరు శివం(7). తరగతి గదిలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడు. దీంతో వారంతా ఒక్కసారిగా అతని ఛాతిపై దూకారు. ఫలితంగా అతనికి ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. జిల్లా అధికారులు పాఠశాల చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక ప్రిన్సిపల్తో పాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్ప్రెస్లుగా, పండుగ స్పెషల్గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
చిన్నారిపై ప్రైవేటు ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
పోలీస్స్టేషన్లో తల్లిదండ్రుల ఫిర్యాదు కీచకుడిపై నిర్భయ కేసు నమోదు వైరా : ఆరేళ్ల బాలికపై ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పాఠశాలలో కొణిజర్ల మండలం కొత్తకాసారం గ్రామానికి చెందిన తేళ్లూరి విజయ్కుమార్ రెండేళ్ల నుంచి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న అదే పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వరుసగా రెండు రోజులపాటు తరగతి గదిలోనే చివరి బెంచీలో కూర్చోమని చెప్పి వేధించ సాగాడు. కాగా.. చిన్నారి నాన్నమ్మకు విషయాన్ని చెప్పి.. ఆ పాఠశాలకు వెళ్లనని.. తనను మరో పాఠశాలలో చేర్పించమంటూ ఆందోళన చెందుతూ చెప్పింది. ఆ సమయంలో తండ్రి ఇంట్లో లేకపోవడం.. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆందోళనకు గురైంది. మంగళవారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని యాజమాన్యానికి చెప్పడంతో.. వారు సదరు ఉపాధ్యాయుడిని మందలించి.. పాఠశాల నుంచి వెళ్లగొట్టారు. దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. సీఐ చేరాలు.. ఏఎస్సై ఖాజాను పాఠశాలకు పంపించి వివరాలు సేకరించారు. విజయ్కుమార్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై కరస్పాండెంట్ను వివరణ కోరగా.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, కీచక ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు. -
రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం
బెంగళూరు: ఆరేళ్ల బాలికపై స్కూల్లో అత్యాచార ఘటనను మరువక ముందే బెంగళూరులో మరో చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. రెండో తరగతి చదువుతున్న బాలిక(7)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సుంకదకట్ట మొయిన్రోడ్డులోని శాంతిధామ స్కూల్లో ఓ బాలిక రెండో తరగతి చదువుతోంది. బాలిక ఇంటిలో ఓ మహిళ పనిచేస్తూ వారి ఇంటిలోనే ఉంటోంది. ఈ నెల 27న బాలికను ఇంటిలో వదిలి తల్లి బయటకు వెళ్లింది. తర్వాత పని మనిషి కూడా బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న పనిమనిషి కుమారుడు శ్రీనివాస్ (28) బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడితో పాటు అతడి తల్లిని అరెస్ట్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement