-
Santosham OTT Awards Photos: అంగరంగ వైభవంగా 'సంతోషం' ఓటీటీ అవార్డ్స్ (ఫొటోలు)
-
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాగార్జునతో అప్పుడలా ఇప్పుడేమో
ఈమెని మీరు కచ్చితంగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2002లో తెలుగులో ఫస్ట్ సినిమా చేసింది. అది కూడా నాగార్జునతో. కానీ బ్యాడ్ లక్. అదృష్టం కలిసి రాలేదు. సినిమా హిట్ కాలేదు. అయితేనేం మరో సినిమలో అవకాశమొచ్చింది. అదీ ఫెయిలైంది. దీంతో తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పట్టించుకోలేదు. మధ్యలో ఓ తెలుగు మూవీలో గెస్ట్ రోల్ చేసింది అంతే. అలాంటి ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇంతకీ ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు గ్రేసీ సింగ్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు, ఈమెని ఎక్కడో చూసినట్లు ఉంది కదా! అవును మీలో కొందరు కరెక్ట్గానే గెస్ చేశారు. 'సంతోషం' సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్గా చేసింది ఈమెనే. దిల్లీలో పుట్టి పెరిగిన ఈమె.. చిన్నప్పుడే భరతనాట్యం, ఒడిస్సీ లాంటి క్లాసికల్ డ్యాన్స్ నేర్చకుంది. అలా డాన్స్ గ్రూప్తో ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకుంది. పదిహేడేళ్లకే ఓ సీరియల్లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆ రూమర్స్పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) అయితే 2001లో ఆమిర్ ఖాన్ 'లగాన్' సినిమా గ్రేసీ సింగ్కి కాస్త పేరు తీసుకొచ్చింది. తెలుగులో ఒకే ఏడాది(2002)లో 'సంతోషం', 'తప్పు చేసి పప్పుకూడు' సినిమాలు చేసింది కానీ కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి వెళ్లిపోయింది. 2010లో మరోసారి టాలీవుడ్లో 'రామరామ కృష్ణ', 'రామ్ దేవ్' అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది గానీ బ్యాడ్ లక్. దీంతో మళ్లీ హిందీ, పంజాబీలో 2015 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈమె నటిగా చాలా పేరు తెచ్చుకున్నప్పటికీ డ్యాన్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. మొన్నీమధ్య ప్రధాని నరేంద్ర మోదీ ముందు బ్రహ్మకుమారీస్ తరఫున ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసీ.. వయసు పెరిగేకొద్ది చాలా మారిపోయింది. తాజాగా ఆమె ఫొటోలు చూసి తెలుగు ప్రేక్షకులు కాస్త తికమక పడ్డారు. ఎవరో గుర్తొచ్చి కింద కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Gracy Singh (@iamgracysingh) View this post on Instagram A post shared by Brahma Kumaris (@brahmakumaris) (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?) -
ఘనంగా సంతోషం అవార్డ్స్ కార్యక్రమం (ఫొటోలు)
-
డిసెంబర్లో ‘సంతోషం’
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డులలో ‘సంతోషం’ అవార్డ్సు ఒకటి. ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’కి తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 26న హైదరాబాద్లో ‘21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022’ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు ‘‘తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలకు అవార్డులు అందించనున్నాం. ఈ వేడుకలో భాగంగా 12 గంటలపాటు నాన్స్టాప్ వినోదం ఉంటుంది’’ అని సంతోషం పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. -
లిరిక్స్ మారిస్తే కానీ షూట్ చేయమన్నారు : ఆర్పీ పట్నాయక్
నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'సంతోషం'. గ్రేసీ సింగ్, శ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని ప్రతీ పాట సూపర్ హిట్టే. 2002లో విడుదలైన ఈ సినిమా ఇటీవలె 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంతోషం మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దేవుడే దిగివచ్చినా' సాంగ్ కంపోజింగ్ చాలా విచిత్రంగా జరిగింది. ముందు వేరే పాట ఇచ్చాను. కానీ ఆ పాటకి ఎలా కంపోజ్ చేయాలో తెలియడం లేదని రాజు సుందరం మాస్టర్ షూటింగ్ ఆపేశారు. లిరిక్స్ మారిస్తేనే చేస్తానని చెప్పారు. దీంతో చాలా టెన్షన్ పడిపోయాను. నేను వాష్ రూమ్కి వెళ్తే డైరక్టర్ దశరద్ బయటి నుంచి గడియ పెట్టి బంధించాడు. పల్లవి చెబితేనే గడియ తీస్తానన్నాడు. అదే టెన్షన్లో 'దేవుడే దిగివచ్చినా' అనే పల్లవి చెప్పాను. దీంతో మిగతా లైన్స్ వచ్చేస్తాయిలే అని దశరధ్ గడియ తీశాడు. అలా లిరిక్స్ మార్చి షూటింగ్ చేశాం' అంటూ చెప్పుకొచ్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement