-
‘సాయిచరణ్ మృతికి యాజమాన్యమే కారణం’
చిత్తూరు: కాలూరు నారాయణ మెడికల్ అకాడమి స్కూల్లో చదువుతున్న సాయిచరణ్ నాయక్ మృతి ఘటనతో తోటి విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. సాయిచరణ్ను విద్యా సంస్థే పొట్టనపెట్టుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంజిరెడ్డి అనే టీచర్ బూటు కాలుతో తన్నడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఇందుకు నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ గదుల అద్దాలు ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యా సంస్థ సిబ్బందిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మంత్రి నారాయణను బర్త్రఫ్ చేయాలని కోరుతున్నారు. -
బాలకృష్ణ గన్మెన్ కుమారుడి ఆత్మహత్య
తిరుపతి : ఓ ప్రయివేట్ విద్యా సంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలూరులో విద్యాసంస్థ హాస్టల్ భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా టీచర్ మందలించడం వల్లే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. కాగా మృతుడు సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు. మృతదేహాన్ని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరోవైపు తమ కుమారుడిని విద్యాసంస్థే పొట్టన పెట్టుకుందని సాయిచరణ్ తల్లిదండ్రులు ఆరోపించారు. మంత్రి నారాయణ అధికార బలంతో పేట్రేగిపోతున్నారని, సాయిచరణ్ మృతి విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందన్నారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. స్కూల్ వద్దకు వెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ విద్యాసంస్థ యాజమాన్యానికి శిక్ష పడేవరకూ పోరాటం చేస్తామని సాయిచరణ్ కుటుంబసభ్యులు తెలిపారు. -
ఎంసెట్–3లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్అర్బన్ : ఎంసెట్–3 ఫలితా ల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. గత ఆదివారం పరీక్ష జరగగా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో 1,702 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,150 మంది పరీక్షకు హాజరయ్యారు. 552 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మాక్లూర్ మండలం వల్లభపూర్కు చెందిన న్యాలకంటి సాయిచరణ్రావు 82వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు లత, రాజేశ్వర్రావులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన డి.ఈశ్వర్ 150వ ర్యాంకు, నిజామాబాద్ నగరానికి చెందిన డి.సహన 259వ ర్యాంకు, మేఘ శ్రావణ్ 268వ ర్యాంకు , ఎ.నిహారిక 538వ ర్యాంకు సాధించారు. అలాగే ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సంతోష్–2,500, అంజలి–2,839, నమిరా–3,331, రిధ–3,862 ర్యాంకులు సాధించారు. కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన శ్రీకాంత్–1,925 ర్యాంకు సాధించారు. శ్రీకాంత్ను కళాశాల చైర్పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజనీకాంత్లు అభినందించారు. భీమ్గల్ విద్యార్థినికి 542వ ర్యాంకు భీమ్గల్ : మండల కేంద్రానికి చెందిన ముప్పిడి సుస్మిత గురువారం విడుదలైన ఎంసెట్–3 ఫలితాల్లో సత్తా చాటాంది. 160 మార్కులకు గాను 139 మార్కులతో 542 ర్యాంకు సాధించింది. ఎంసెట్–2లో కూడా సుస్మిత 884 ర్యాంకు సాధించగా ఈసారి మరింత మెరుగైన ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ముప్పిడి ఝాన్సీలక్ష్మి, ముప్పిడి లింబాద్రి స్వామిలు ఆనందం వ్యక్తం చేశారు. 969 ర్యాంక్ సాధించిన సుదీప్తిరెడ్డి తాడ్వాయి : మండలంలోని ఎర్రాపహడ్ గ్రామానికి చెందిన సుదీప్తిరెడ్డి ఎంసెట్–3 ఫలితాల్లో 969వ ర్యాంక్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు సునీత, రాజిరెడ్డిలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు విద్యార్థిని సుదీప్తి రెడ్డిని అభినందించారు. కాచాపూర్ విద్యార్థికి 732 ర్యాంక్ భిక్కనూరు : మండలంలోని కాచాపూర్ విద్యార్థి గోగుల నవ్యకు ఎంసెట్–3లో 732 ర్యాంక్ వచ్చింది. గురువారం వెలువడిన ఫలితాల్లో నవ్య 136 మార్కులు సాధించింది. గత ఎంసెట్–2లో గోగుల నవ్య 136 మార్కులు సాధించి 418 ర్యాంక్ సాధించింది. ప్రభుత్వం ఎమ్సెట్–2ను రద్దుచేసి ఎంసెట్–3ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్లో దోమకొండ విద్యార్థుల ప్రతిభ దోమకొండ : రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఎంసెట్–3 ఫలితాల్లో దోమకొండ విద్యార్థులు ప్రతిభ చూపారు. దోమకొండకు చెందిన పన్యాల సంకీర్తన 143 మార్కులతో 223వ ర్యాంకును సాధించింది. అదే విధంగా దోమకొండకు చెందిన సబ్బని వంశీ 138 మార్కులతో 568వ ర్యాంకును సాధించాడు. వీరు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బాల్కొండ విద్యార్థికి 124వ ర్యాంకు బాల్కొండ : ఎంసెట్–3 ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన కేఆర్ నిశ్విత్రెడ్డి 124వ ర్యాంకు సాధించాడు. 160 మార్కులకు గాను 147 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. ర్యాంకు సాధించడంలో తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నితీశ్కు 571 ర్యాంకు నిజామాబాద్అర్బన్ : ఎంసెట్–3 ఫలితాల్లో నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన మాడవేడి నితీశ్ 571 ర్యాంకు సాధించాడు. దీంతో విద్యార్థి తండ్రి శ్యాం ఆనందం వ్యక్తం చేశారు. -
గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున బోరబండలోని సైట్-౩ వీకర్ సెక్షన్ కాలనీ దేవయ్యబస్తీలో ఇంటి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు సాయి చరణ్ (4), నవ్య (3)గా గుర్తించారు. తల్లిదండ్రులకు తీవ్రంగా గాయలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న రాజు సోమవారం రాత్రి బోరబండలో ఓ గది అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. వెంటనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవటంతో స్థానికంగా విషాదం నెలకొంది. కాగా గాయపడిన రాజు పరిస్థితి విషమంగా ఉండగా, అతని భార్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement