-
సరళాసాగర్ ఖాళీ..!
వనపర్తి: రెండు రోజుల క్రితం వరకు నిండుకుండలా.. జలకళతో తొణికిసలాడిన సరళాసాగర్ ప్రాజెక్టు బుధవారం ఖాళీగా మారి మట్టి మేటలతో దర్శనమిచ్చింది. కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి ఊర్లూ, వాగులు వంకలు దాటుతూ వందలాది కిలోమీటర్లు పరుగులెడుతూ.. వచ్చిన కృష్ణమ్మ కొమ్మిరెడ్డిపల్లి చెరువులో నుంచి నేటికీ కొద్దిపాటి నీటిధార సరళాసాగర్ ప్రాజెక్టులోకి వస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులోకి వచ్చిన ప్రతీ నీటిచుక్క గండిపడిన ప్రదేశం నుంచి దిగువన ఉన్న రామన్పాడు జలాశయంలోకి వెళ్తున్నాయి. ఖాళీ అయిన సరళాసాగర్ ప్రాజెక్టులోని గుంతల్లో బురదలో ఉన్న చెపలు పట్టేందుకు మత్స్యకారులు, చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నీరుపోయి.. మట్టిమేటలు దర్శనం 771ఎకరాల వైశాల్యం గల సరళాసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నల్లని మట్టి మేటలు, చేపలు పట్టే మనుషులతో దర్శనమిస్తోంది. ప్రాజెక్టులో నీటిని చూసి నారుమడులు వేసుకున్న రైతులు రెండవ రోజు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోకుండా మా కొంప ముంచారంటూ వారు శపనార్థాలు పెట్టడం కనిపించింది. ఇదిలాఉండగా, మంగళవారం సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపడి సుమారు 0.5 టీఎంసీల నీరు వృథాగా దిగువునకు వెళ్లటంతో పాటు రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద సైతం నీటితో పాటు దిగువకు వెళ్లిపోయింది. టన్నుల కొద్ది చేపలు నీటి ప్రవాహంలో ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చి కాల్వ పొడవునా.. మట్టిలో మృతి చెంది పడ్డాయి. చనిపోయిన చేపల వలన దుర్వాసన వెదజల్లుతోంది. రెండోరోజు కొనసాగిన సర్వే సరళాసాగర్ కట్ట పునఃనిర్మాణం, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు ఏర్పాటు చేయాల్సిన రింగ్ బండ్, సమాంతరల కాల్వను తవ్వేందుకు ఇరిగేషన్ బోర్డు అధికారులు రెండవ రోజైన బుధవారం సర్వే చేశారు. కొమ్మిరెడ్డిపల్లి వాగు నుంచి వచ్చే కేఎల్ఐ నీటిని సరళాసాగర్ ప్రాజెక్టులోని కుడి,ఎ డమ కాల్వలకు ఆయకట్టును బట్టి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐబీ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశం రింగ్బండ్, ప్రాజెక్టులో తాత్కాలిక సమాంతర కాల్వను తవ్వేందుకు మంత్రి నిరంజన్రెడ్డి సూచన మేరకు మరో రెండు రోజుల్లో అధికారులు పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. కానీ ఎన్ని రోజులు వస్తాయో తెలియని పరిస్థితి కాబట్టి రైతులు అధికారుల మాటలను నమ్ముకుని యాసంగి పంట సాగు చేసేందుకు ముందుకు వస్తారా అన్నది ప్రశ్నార్థమే. -
రైతుల ఆశలకు గండి
వనపర్తి: ఆసియాలోనే సైఫన్ సిస్టంతో పనిచేసే రెండో ప్రాజెక్టు సరళాసాగర్కు దశాబ్దకాలం తర్వాత పూర్తిస్థాయిలో నీరు చేరిందన్న అన్నదాతల ఆశలకు గండి పడింది. రెండు నెలలుగా భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులతో సరళాసాగర్కు రెండు వైపుల నుంచి నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వనపర్తి జిల్లాలోని 16 గ్రామాల్లో వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరుగా పేరొందిన సరళాసాగర్ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం గండిపడటంతో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాజెక్టు చుట్టుపక్కల వ్యవసాయ పొలాలకు రెండుసార్లు పుష్కలంగా సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఖాళీ అవడంతో ప్రస్తుత యాసంగికి నారుమడులు సిద్ధం చేసిన రైతులు నిరాశకు గురయ్యారు. నిర్దేశిత ఆయకట్టు.. సరళాసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద 4,600 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా నీరు పుష్కలంగా ఉండటంతో నిర్దేశిత ఆయకట్టు కంటే ఎక్కువనే సాగు చేస్తారు. సుమారు 5 వేల ఎకరాల్లో యాసంగి వరి నాటేందుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రాజెక్టుకు గండిపడటంతో సరళాసాగర్ ప్రాజెక్టు కింది రైతులు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రాజెక్టుకు గండిపడినప్పుడు ఉధృతంగా దిగువకు పారిన నీరు కొద్ది కొద్దిగా గండి వెడల్పును పెంచుతూ వచ్చింది. ఉదయం 9.30 గంటల సమయానికి గండి 30 మీటర్ల వెడల్పునకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ ఉన్న 0.5 టీఎంసీల నీరు పూర్తిగా దిగువకు వెళ్లటంతోపాటు ఇంకా సరళా ప్రాజెక్టులోకి కొమిరెడ్డిపల్లి వాగు నుంచి వస్తున్న కేఎల్ఐ నీరు సైతం గండిపడిన ప్రదేశం నుంచి రామన్పాడ్ ప్రాజెక్టుకు వెళ్తోంది. మంత్రి అప్రమత్తతతో.. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఉదయం 8 గంటలకు సరళాసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. నీరు ఉధృతంగా దిగువకు వెళ్తుండటంతో రామన్పాడ్ జలాశయం అధికారులను అప్రమత్తం చేసి గేట్లను ఎత్తింపజేశారు. అధికారులు పది గేట్ల నుంచి రామన్పాడ్ నుంచి నీటిని కృష్ణానదిలోకి ఊకచెట్టువాగు నుంచి వదిలేశారు. దీంతో ముప్పు తప్పింది. లేదంటే భీమా ప్రాజెక్టు లిఫ్టులు, సరళాసాగర్ లిఫ్టు, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరందించే.. ఇంటెక్వెల్స్ సైతం మునిగిపోయేవి. నాలుగు గంటలపాటు దిగువకు.. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సుమారు నాలుగు గంటలపాటు సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు పారింది. సరళాసాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు 0.5 టీఎంసీలు పూర్తిగా ఖాళీ అయ్యింది. 22 అడుగులకు చేరినా.. సరళాసాగర్ జలాశాయం సామర్థ్యం 22 అడుగుల వరకు నీరు చేరినా.. సైఫాన్లు తెరుచుకోలేదు. ప్రాజెక్టులోని సైఫాన్ల పక్కన ఉన్న మట్టికట్టపై చెట్లు పెరిగి కట్టబలహీనంగా మారింది. ఏదైనా మరమ్మతు చేయాలని గడిచిన నెల రోజుల నుంచి ప్రాజెక్టుకు సమీప గ్రామాల రైతులు ఇరిగేషన్ అధికారులకు విన్నవించినా వారు అధికారులు స్పందించలేదు. రైతులు చెప్పిన వెంటనే అప్రమత్తమై ఉంటే.. ఇంత పెద్ద నష్టం జరిగేది కాదని స్థానికులు భావిస్తున్నారు. సాగుపై తీవ్ర ప్రభావం.. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి చుట్టుపక్కల 16 గ్రామాల రైతులు వ్యవసాయం చేసుకుంటారు. ప్రాజెక్టు పైభాగంలో వర్నె, ముత్యాలపల్లి, కనిమెట్ట, పాతజంగమాయపల్లి, చిలకోటినిపల్లి, బలీదుపల్లి, కన్మనూరు ఉండగా.. నిర్దేశిత ఆయకట్టు గల దిగువ ప్రాంతంలో అజ్జకొల్లు, శంకరంపేట, రామన్పాడ్, తిరుమలాయపల్లి, కొన్నూరు, నెల్విడి, నర్సింగాపుర్ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం గండి పడటంతో సాగునీటిపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. రెండోసారి గండి.. వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు రాజారామేశ్వర్రావు తన తల్లి సరళాదేవి పేరున ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏడు దశాబ్దాల క్రితం రూ.35 లక్షల వ్యయంతో అంతర్జాతీయ ఆటోమెటిక్ సైఫాన్ సిస్టంతో ఈ ప్రాజెక్టును నిర్మించి 1959లో ప్రారంభించారు. ఆ తర్వాత 1964లో ఒకసారి భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండి సైఫాన్స్ పక్కనే కుడివైపు కట్టకు గండిపడింది. నీటి ప్రవాహానికి కొన్నూరు, మదనాపురం గ్రామాల మధ్యలోని రైల్వేలైన్ సైతం పెకిలిపోయి.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మళ్లీ 55 ఏళ్ల తర్వాత ఈసారి ఎడమవైపు సైఫాన్స్కు పక్కనే కట్టకు గండిపడంది. పరిశీలించిన మంత్రి, కలెక్టర్ వనపర్తి జిల్లాకే తలమానికంగా చెప్పుకొనే సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపండిందని తెలుసుకున్న మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్పీ అపూర్వరావు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు సరళాసాగర్ ప్రాజెక్టు గండిపడిన ప్రదేశాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి ఎలాంటి సాంకేతిక లోపాల కారణంగా గండిపడిందో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని సూచించారు. సమీప గ్రామాల్లోని ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి గండి పడిన ప్రాంతాన్ని చూశారు. కొందరు స్థానికులు చేపలు పట్టేందుకు ఆసక్తి చూపారు. అధికారులకు విన్నవించా.. ఇరిగేషన్ అధికారులకు సరళాసాగర్ ప్రాజెక్టు కట్ట బలహీనంగా మారింది. రోజురోజుకు నీటి నిల్వ పెరుగుతోంది. ఒక్కసారి పర్యవేక్షణ చేయాలని గత పదిరోజుల క్రితం చెప్పాను. అధికారులు స్పందించి రెండు తూముల నుంచి నీటిని దిగువకు విడుదల చేసి కట్టకు మరమ్మతు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.– కురుమూర్తి, రైతు, శంకరంపేట, మదనాపురం మండలం -
సరళాసాగర్ ప్రాజెక్ట్ కరకట్టకు గండి
-
సాగర్ కాంట్రాక్టర్ పరార్...!
‘వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పనులను ఇక పరుగెత్తిస్తా..! నిధులు మంజూరయ్యాయి. ఇక కొద్ది రోజుల్లో సాగునీరు అందిస్తాం...’ ఇవీ మంత్రి పదవి వచ్చిన వెంటనే సుజయకృష్ణ రంగారావు రైతులకు ఇచ్చిన హామీ. అయితే ఈ పనులు ఇప్పుడు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులకు సంబంధించి ఇటు మంత్రిగాని, అటు ప్రభుత్వంగాని పట్టించుకోవడం లేదు. దీంతో సాగునీటి కోసం అదనపు ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి : వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్ పనులను 20 శాతం కూడా చేయకుండానే కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. పనులు ప్రారంభించి కొన్ని చోట్ల చేపట్టిన పనులను ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేయడమే తప్ప వాటిని పట్టించుకోవడం లేదు. సరికదా కనీసం వారు చేసిన ఫోన్లనూ లిఫ్ట్ చేయడం లేదు. వెంగళరాయ సాగర్ పనులు ఈ ఖరీఫ్కే కాదు వచ్చే ఖరీఫ్కు కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 2013లో శంకుస్థాపన చేసినపుడు ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా రైతులకు కేవలం 18 నెలల్లో సాగునీరు అందిస్తామని మంత్రి సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యే హోదాలో హామీ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై ఆ తరువాత పార్టీ మార్చి మంత్రి అయిన తరువాత జూట్ ఫ్యాక్టరీని తెరిపించడమే కాకుండా అదనపు జలాల ప్రాజెక్టునూ పరుగులెత్తిస్తామన్నారు. కానీ ఏ పనీ సాగడం లేదు. మంత్రి పదవి వచ్చాక ఇచ్చిన హామీ కనుక ఇక మాకు భయం లేదు...సాగునీరు అందుతుందనుకుంటున్న రైతులు ఇప్పుడు మా నోట్లో మట్టికొట్టారని వాపోతున్నారు. వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులను చేపడుతున్న ఆర్ఆర్ కనస్ట్రక్షన్స్ పనులను నిలిపివేసి ఏడాదవుతున్నా అధికారులుగానీ, ఇటు పనులు ప్రారంభించి సాగునీరందిస్తామన్న మంత్రి సుజయకృష్ణ రంగారావుగానీ పట్టించుకోకపోవడంతో అదనపు ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 శాతం లెస్సుకు వేసినపుడే అనుమానం రావాలిగా! వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ టెండర్ను 17 శాతం లెస్సుకు వేశారు. అప్పుడైనా ప్రజాప్రతినిధులు, అధికారులకు అనుమానం రావాలి. కానీ ఎంచక్కా పనులు ప్రారంభించారు. ఇప్పుడు నష్టాలొస్తున్నాయంటూ పనులు నిలిపివేశారు. నిధులేమో మూలుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. ప్రారంభంలో కాంట్రాక్టర్కు ప్రతీ 15 రోజులకూ నోటీసులు జారీ చేస్తున్నప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయన్న కాంట్రాక్టర్ ఇప్పుడు ఏకంగా ఫోన్లు కూడా ఎత్తడం లేదని అధికారులు చెబుతున్నారు. భూ సేకరణే పూర్తి కాని వైనం 2013లో రూ.12.67 కోట్లతో ప్రారంభించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని రైతాంగం ఎదురు చూస్తున్నది. సీతానగరం మండలంలోని 5 గ్రామాలు, బొబ్బిలి మండలంలోని 13 గ్రామాల్లో 4,996 ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ఈ పనులకు సంబందించి ఇంకా భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. రాముడువలస, చింతాడ తదితర గ్రామాల్లో రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్కు ఇచ్చిన గడువు పలుమార్లు దాటిపోయింది. ఇప్పటికి రెండుసార్లు గడువు పూర్తయినా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడం కానీ మరో కాంట్రాక్టర్కు అప్పగించడం కానీ చేయాలి. ఆ తరువాత కొత్తగా టెండర్ వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ నేటికీ కాంట్రాక్టర్ను మార్చే ప్రతిపాదనలు కానీ ప్రభుత్వానికి నివేదించడం కానీ చేయకపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రైతులు ఆరోపిస్తున్నారు. వెన్నెల బుచ్చెంపేట నుంచి కలువరాయి వరకూ గల 3.45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి చింతాడ వరకూ గల కాలువ నిర్మాణం కోసం 23.78 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ కాంట్రాక్టర్కు రూ.2.43కోట్లు చెల్లించారు. బిల్లుల పెండింగ్తో పాటు భూ సేకరణ అడ్డంకిగా మారింది. ఇంకా రాముడువలస, చింతాడ, కలువరాయి గ్రామాలకు చెందిన 26 మంది రైతుల నుంచి 22 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనిపై కనీసం కదలిక లేదు. మరో పక్క సీతానగరం మండలం ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రూ.3కోట్లతో వయాడెక్ట్ నిర్మించేందుకు భూసార పరీక్షలు చేసేందుకు సుమారు పది నెలలవుతోంది. ఎస్ హయాంలోనే శంకుస్థాపన జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుగా పేరొందిన వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ద్వారా 24వేల పైచిలుకు ఎకరాలకు సాగునీరందుతున్నా జలాశయ సామరŠాధ్యన్ని బట్టి మరో 8వేల ఎకరాలకు సాగునీరందించవచ్చని గతంలో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొల్లపల్లిలో రూ.5కోట్లతో కిందట అదనపు ఆయకట్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు వరుసగా అంచనాలను పెంచుకుంటూ పోయి నేటికి రూ.12.67 కోట్లకు చేరింది. ఈ పనులను చిత్తూరుకు చెందిన కాంట్రాక్టర్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేపట్టింది. కేవలం 13 నెలల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పనులు సాగుతూనే ఉన్నాయి. నేటికి కేవలం 20 శాతం పనులు అయ్యాయని అధికారులు చెబుతున్నా అంతకన్నా తక్కువే అయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి రాస్తాం.. కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. ఎన్నోమార్లు నోటీసులు ఇచ్చాం. స్పందన లేదు. ఇప్పుడు ఫోన్లు చేసినా ఎత్తడం లేదు. కొత్తగా మరే కాంట్రాక్టర్ కూడా లెస్సుకు ఉండటం వల్ల రావడం లేదు. ఈ విషయమే ప్రభుత్వానికి రాస్తున్నాం. – కె.బాలసూర్యం, డీఈఈ, బొబ్బిలి డివిజన్ -
రేపటినుంచి సాగర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
- తొమ్మిది రోజులపాటు పరిశీలించనున్న ప్రపంచబ్యాంకు ప్రతినిధులు - మధ్యంతర నివేదిక కోసం వస్తున్నారని పీడీ మల్సూర్ వెల్లడి నాగార్జునసాగర్ : ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించనున్నట్లు సాగర్ ప్రాజెక్టు డెరైక్టర్ మల్సూర్ తెలిపారు. సోమవారం విజయవిహార్ అతిథిగృహంలో డ్యాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఆధునికీకరణ పనుల వివరాలను ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అందజేసేందుకు వీలుగా అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అవసరమైన అన్ని వివరాలను తెలియజేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన డ్యాం అధికారులను కోరారు. అనంతరం మల్సూర్ విలేకరులతో మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు నిర్వహించిన, ఆలస్యమైన పనులను వేగవంతం చేసేందుకు, భవిష్యత్లో చేపట్టాల్సిన పనుల వివరాలకు సం బంధించి మధ్యంతర నివేదిక పొందుపరచడానికి ప్రపంచబ్యాంకు ప్రతిని ధులు వస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ప్రధానకాలువకు సంబంధిం చి మూడు ప్యాకేజీలు నూరు శాతం పూర్తయినట్లు చెప్పారు. నాలుగు ప్యాకేజీలు 90శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలినవి 60శాతం వరకు జరిగినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ పనులు 40శాతం పూర్తయినట్లు తెలిపారు. ఆధునికీకరణ పనులకు ఇప్పటివరకు రూ.3,300 కోట్లు వ్యయం చేసే పనులు ప్రతిపాదించగా 2,300కోట్ల రూపాయల విలువచేసే పనులను ప్రారంభించామని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.1450కోట్లు ఖర్చయినట్లు వివరించారు.సాగర్ కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో డ్యాం ఎస్ఈ విజయభాస్కర్రావు, ఈఈ విష్ణుప్రసాద్, డీఈ చందునాయక్ తదితరులున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement