-
3 నెలల్లో ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండేళ్లకోసారి జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కారర్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మికక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతోపాటు పలువురిని ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చింది. అంతకు ముందు 2016లో ఎన్నికలు జరిగాయని, 2018లో ఆ సంఘం కాల పరిమితి ముగిసిందని వెల్లడించింది. వెంటనే టీఎస్ఆరీ్టసీ సంఘం ఎన్నికలు నిర్వహించేలా సర్కార్ను ఆదేశించాలని ఎంప్లాయీస్ యూనియన్ నేత కె.రాజిరెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా.. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు. చదవండి: విమాన ప్రయాణికులు @ 2.1కోట్లు -
తెలంగాణ ఆర్టీసీలో కొత్త లొల్లి
-
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై జాప్యం కొనసాగుతూనే ఉంది. గతవారం టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి టి.హరీశ్రావు రాజీనామా చేయడంతో మరోసారి ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు కూడా ముగియడంతో ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. గతేడాది ఆగస్టులోనే గుర్తింపు యూనియన్ టీఎంయూ పదవీకాలం ముగిసిందని.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మిగతా యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు త్వరలోనే ఎన్నికలు ఉంటాయన్న అంచనాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లోని తమ సంఘాల సభ్యులను ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేస్తున్నాయి. ఆగస్టులోనే ముగిసిన గడువు.. గతేడాది ఆగస్టు 7తోనే తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) పదవీకాలం ముగిసింది. దీంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని నాగేశ్వరరావు (ఎన్ఎంయూ), రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ) లేబర్ కమిషనర్కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయితే గతేడాది సెప్టెంబర్ 6న ప్రభుత్వం అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆర్టీసీలో ఎన్నికలు జాప్యమయ్యాయి. డిసెంబర్లో ఆ ఫలితాలు వచ్చాకైనా నిర్వహిస్తారని అనుకుంటే.. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో మరోసారి ఆర్టీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఇంకా ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అప్పట్నుంచి టీఎంయూదే హవా.. ఆర్టీసీలో 2012 నుంచి టీఎంయూ హవా కొనసాగుతోంది. 2012లో జరిగిన ఎన్నికల్లో టీఎంయూ పోటీ చేసి ఘన విజయం సాధించింది. 2013 జనవరిలో గుర్తింపు యూనియన్గా బాధ్యతలు స్వీకరించింది. 2015 జనవరిలో దాని పదవీకాలం ముగిసింది. తర్వాత 2016 జూలైలో ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపు ఏడాదిన్నర ఆలస్యమైంది. అప్పటిదాకా టీఎంయూనే అధికారిక యూనియన్గా కొనసాగింది. 2016లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీఎంయూనే ఎన్నికైంది. 2018 ఆగస్టు 7తో ఈ పదవీకాలం ముగిసింది. హరీశ్ నిష్క్రమణతో స్పీడ్ పెంచిన యూనియన్లు టీఎంయూ గౌరవాధ్యక్షుడి పదవి నుంచి హరీశ్రావు తప్పుకోవడంతో.. మిగిలిన యూనియన్లు ఎన్నికలపై సీరియస్గా దృష్టి సారించాయి. మాజీ మంత్రి, ఉద్యమ నాయకుడి నిష్క్రమణతో ఈ సారి టీఎంయూకి తాము గట్టిపోటీ ఇస్తామని అంటున్నాయి. యూనియన్ల నేతలు రాష్ట్రవ్యాప్తంగా తమ అనుచరులకు ఎప్పటికçప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎçప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు టీఎంయూ.. ఈసారీ తామే గెలిచేదని, హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. -
ఆర్టీసీలో ఎన్నికలు జాప్యం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జాప్యం కానున్నాయా.. ఇప్పట్లో నిర్వహణ సాధ్యం కాదా? ప్రస్తుతం సంస్థలో జరుగుతున్న ప్రచారం ఇది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందస్తుకు తాము సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీలో ఎన్నికల నిర్వహణ కష్టమేనంటూ సీనియర్ యూనియన్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధమవుతోందని, ఇదే నిజమైతే ప్రభుత్వం మిగిలిన విషయాలపై అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీలో ఎన్నికలు జాప్యం కావచ్చొని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాప్యం సహజమే... ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికల్లో జాప్యం జరగడం కొత్తేం కాదు. 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఘన విజయం సాధించి 2013 జనవరిలో గుర్తింపు యూనియన్గా బాధ్యతలు స్వీకరించింది. ఈ లెక్కన 2015 జనవరితో ఈ యూనియన్ పదవీకాలం ముగియాలి. కానీ 2016 జూలై వరకు కొనసాగింది. ప్రస్తుతం టీఎంయూ పదవీకాలం 2018, ఆగస్టు 7 నాటికి ముగిసింది. నిబంధనల ప్రకారం కొత్త యూనియన్ ఎన్నికయ్యే వరకు పాత యూనియనే ఆపద్ధర్మంగా కొనసాగుతుంది. మరోవైపు ఏపీలోనూ గుర్తింపు యూనియన్ పదవీకాలం 2018 ఫిబ్రవరితో ముగిసినా ఈ ఆగస్టులో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలకు యూనియన్ల పట్టు.. ఎన్నికల్లో ఈసారి జాప్యాన్ని సహించేది లేదని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు పలు యూనియన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఈయూ, టీజేఎంయూలు లేబర్ కమిషనర్కు విన్నవించాయి. గుర్తింపు సంఘం పదవీకాలం ముగిసిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో ఉన్న నేపథ్యంలో తమకు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంటుందని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపై అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నాయి. -
ఆర్టీసీలో ఎన్నికల వేడి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో విజయానికి యూనియన్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. కార్మికుల సంక్షేమం కోసం సాధించిన విజయాలను ప్రస్తుత గుర్తింపు సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుత గుర్తింపు సంఘం హ యాంలో కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన చ ర్యలు శూన్యమని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కార్మికులకు గుర్తు చేస్తోంది. ఈ దఫా కూడా తమ గుర్తింపును కాపాడుకోవాలని ఎన్ఎంయూ ప్రయత్నిస్తుండగా, ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఈయూ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సా ర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించడంతో ఎన్నికల సమీకరణలు మారుతున్నా యి. ఇదిలా ఉండగా కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంపై గుర్తింపు సంఘం ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్ర నాయకత్వంలో అభిప్రాయభేదాలు పొడసూపాయి. దీంతో ఎన్ఎం యూ రాష్ట్ర చైర్మన్ను సైతం దూరం చేసుకుంటోంది. సంఘాలెన్నో.. పోటీ రెండిటి మధ్యే రెండేళ్లకు ఒక సారి జరిగే యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించి గుర్తింపు పొందగలిగితే రెండేళ్లపాటు ఆర్టీసీ యాజమాన్యం ఆ యూనియన్కు చర్చలు, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పిస్తుంది. దీనికోసం యూనియన్లు తీవ్రంగా పోటీపడుతుంటాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎంఎంయూ, ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, వైఎస్సార్ మజ్దూర్ సంఘ్, ఆర్టీసీ కార్మిక పరిషత్, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయాస్ యూనియన్తోపాటు మరికొన్ని చిన్న యూనియన్లు కార్మిక హక్కుల కోసం పనిచేస్తున్నాయి. ఎన్ని సంఘాలున్నా పోటీ మాత్రం ఎప్పుడూ ఎన్ఎంయూ, ఈయూ మధ్యే ఉంటోంది. గత ఎన్నికల్లో ఎన్ఎంయూ విజయం ఆర్టీసీలో రాష్ట్ర స్థాయి, రీజియన్ స్థాయి గుర్తింపు కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. 2016, ఫిబ్రవరి 18న జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్ఎంయూ 186 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్ర గుర్తింపు కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్ఎంయూకు 1322 ఓట్లు పోలవగా ఎంప్లాయీస్ యూనియన్కు 1136 ఓట్లు వచ్చాయి. దీంతో రీజియన్ స్థాయితో పాటు రాష్ట్ర గుర్తింపు కూడా ఎన్ఎంయూ సొంతమైంది. కార్మికుల్లో విశ్వాసం కోల్పోతున్న ఎన్ఎంయూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కయ్యిందనే భావన కార్మికుల్లో బలంగా నాటుకుపోయింది. గన్నవరంలో సుమారు రూ.600 కోట్ల విలువైన 32 ఎకరాల ఆర్టీసీ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల స్థలాన్ని ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుని హెచ్సీఎల్ సంస్థకు కట్టబెట్టడాన్ని ఎన్ఎంయూ కనీసం వ్యతిరేకించ లేదనే విమర్శను ఎదుర్కొంటోంది. అలాగే విజయవాడ గవర్నర్ పేట 1, 2 డిపోలకు చెందిన సుమారు తొమ్మిదిన్నర ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టినా ఎన్ఎంయూ అడ్డగించలేదంటున్నారు. ఇదే కాక కార్మికుల జీతాల ఫిట్మెంట్ సాధించడంలో కూడా గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమయిందనే ఆగ్రహం కార్మికుల్లో కనిపిస్తోంది. గుర్తింపు సంఘంగా కార్మికుల హక్కుల సాధనలో, వారి సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు విఫలమౌతూ ప్రభుత్వానికి తొత్తుగా ఎన్ఎంయూ వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక ప్రశ్నిస్తున్న ఆ యూనియన్ రాష్ట్ర చైర్మన్ ఆర్వీవీఎస్డీ ప్రసాదరావును దూరం చేసుకోవడానికి యూనియన్ రాష్ట్ర నాయకత్వం వెనుకాడడం లేదు. ఆయనను యూనియన్ నుంచి తొలగించడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతోనే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేయిస్తూ జూలై నెల వరకూ పొడిగించిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రకటన ఆశలు రేపింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ చేసిన ప్రకటన కార్మికుల్లో ఆశలు రేపింది. సంస్థను నష్టాలబారి నుండి కాపాడాలంటే ఇంధనంపై పన్ను తగ్గించాలి. అన్ని కార్మిక సంఘాలు ఐక్య పోరాటం చేస్తేనే ఆర్టీసీ మనుగడను కాపాడుకోగలుగుతాం. ఎన్ఎంయూ గత ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వంతో కుమ్మక్కై కార్మికుల హక్కులను హరించివేసింది. – బొల్లినేని రాంబాబు, రీజనల్ కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ జగన్ ప్రకటనతో మారిన సమీకరణలు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రజా సంకల్పయాత్రలో ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికుల్లో నూతనోత్సాహం వచ్చింది. తాము ఎంత కష్టపడుతున్నా సంస్థ నష్టాలను తమకు ఆపాదించడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్మికులకు జగన్ ప్రకటన ఊరటనిచ్చింది. దీంతో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండే సంఘానికి మద్దతు పలికి గుర్తింపు ఎన్నికల్లో పట్టం కట్టడానికి కార్మికులు ఎదురు చూస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement