-
దొంగ ఓట్లన్నీ ఆ పార్టీ తమ్ముళ్లవే..
సాక్షి, అనంతపురం: 'తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కుతోంది. మైనర్లను ఓటర్లుగా చేర్పించడం.. అనుకూలమైన వారికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించడం చేస్తోంది. అవకాశమున్న చోట్ల భారీగా దొంగ ఓట్లను జాబితాలోకి చేరుస్తోంది. చేసేదంతా చేసి తమకే పాపమూ ఎరుగనట్టు వైఎస్సార్సీపీపైకి నెపం నెడుతోంది. జాబితాను పరిశీలిస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దొంగ ఓట్ల దందా ఇట్టే తెలిసిపోతుంది.' ఆత్మకూరు రాప్తాడు నియోజకవర్గం తమకు కంచుకోటగా భావిస్తూ వచ్చిన టీడీపీకి 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓటర్లు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రజల పక్షాన నిలిచి ఓటర్లను తమవైపు ఆకట్టుకోవడం మరచి.. తప్పుడుదారిని ఎంచుకున్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూరుతో పాటు మరికొన్ని మండలాల్లో కొంతమంది టీడీపీ నాయకులు తమకు తగ్గిపోయిన ఓట్ల స్థానంలో బోగస్ ఓటర్ల ద్వారా భర్తీ చేసుకోవాలని భావించారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి అవకాశమున్న చోట్ల డబుల్ ఓటు హక్కుకు దరఖాస్తు చేయించారు. చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లిళ్లయ్యి మెట్టినిళ్లకు వెళ్లిపోయినా.. వారి ఓట్లను స్థానికంగా తొలగించకుండా అలానే ఉంచారు. అంతేకాదు పద్దెనిమిదేళ్లలోపు వయసు కలిగిన వారిని ఓటరుగా చేర్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓటరు జాబితా సవరణలోనూ దొంగ ఓట్లను తొలగించడానికి టీడీపీ నాయకులు ససేమిరా అంటుండటం గమనార్హం. ► ఈ ఓటరు కార్డులో ఉన్న వ్యక్తి పేరు నరేంద్ర చౌదరి. ఈయనకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురం, అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ► ఈ బాలుడి పేరు మనేరి దేవ నంద. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామం. ఆధార్ వివరాల ప్రకారం 2007 సంవత్సరంలో పుట్టాడు. 16 ఏళ్ల వయసున్న ఈ బాలుడికి టీడీపీ కార్యకర్తలు ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేశారు. ► ఈ ఓటరు కార్డులో కనిపించే మహిళ పేరు సాయి గీత. ఈమెకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురంలోను, ఉరవకొండ మండలం 9వ వార్డులోను ఓటు హక్కు ఉంది. ► రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామంలో అలివేలమ్మ స్థానికంగాను, అనంతపురంలోను ఓటు హక్కు కలిగి ఉంది. అలాగే తిమ్మక్కకు గాండ్లపర్తి, అనంతపురంలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చోట్ల టీడీపీ సానుభూతి పరులు రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటమి భయంతోనేనా..? వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. ఉచితంగా పొలాల్లో బోర్లు వేయించారు. రైతులు, కూలీల వలసలు తగ్గించారు. అనారోగ్యంతో ఉన్న వారిని, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించి అండగా నిలిచారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అమ్మ డెయిరీ ఏర్పాటు చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందేలా చూశారు. ప్రజల్లో ప్రకాష్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం టీడీపీకి పట్టుకుంది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లను చేర్చడం ద్వారా ఓటమి నుంచి గట్టెక్కాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని వారికి కూడా రామగిరి మండలంలో ఓటు హక్కు కల్పించినట్లు గతంలో సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. ఇవి చదవండి: మానవత్వంతో స్పందించిన సీఎం -
రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడంతోనే సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్న ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో దాదాపు అన్ని పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. శుక్రవారం వికాస్రాజ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా చోట్ల సాయంత్రం 5 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా.. అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడిన వారందరికీ నిబంధనల ప్రకారం ఓటేసే అవకా శం కల్పించామని వికాస్రాజ్ వివరించారు. అందువల్ల ఆయాచోట్ల రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ జరిగిందని, అధికారులు ఈవీఎంలు, ఇత ర సామగ్రిని సర్దుకుని రిసెప్షన్ కేంద్రాలకు చేరు కునే సరికి మరింత ఆలస్యమైందని చెప్పారు. రిసె ప్షన్ కేంద్రాల్లో ఈవీఎంలకు ప్రాథమిక తనిఖీలు నిర్వహించి, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. ప్రాథమిక స్రూ్కటినీ తర్వాతే 70.6 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రాథమి కంగా అంచనాకు వచ్చామని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు కూర్చుని అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తుది స్రూ్కటినీ నిర్వహిస్తున్నారని వివరించారు. చాంద్రాయణగుట్ట సహా ఇతర స్థానాల్లో రిగ్గింగ్ జరిగినట్టు వచ్చిన ఫిర్యా దుల మేరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. స్క్రూటి నీ ముగిశాకే కచ్చితమైన పోలింగ్ శాతంతోపాటు రిగ్గింగ్ ఆరోపణల్లో నిజానిజాల పై స్పష్టత వస్తుందని.. ఆయా అంశాల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ప్రశాంతంగా పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్రాజ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలన్నీ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నట్టుగా ధ్రువీకరించుకున్నామ ని వివరించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 40 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు.158పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆయాచోట్ల కొత్త ఈవీఎంలను పెట్టి పోలింగ్ నిర్వహించామని.. దీనివల్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 45 నిమిషాల వరకు ఆలస్యమైందని అదనపు సీఈఓ లోకేశ్కుమార్ వివరించారు. నాగార్జున సాగర్ అంశానికి ఎన్నికలతో సంబంధం లేదు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సగభాగాన్ని ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న ఘటనకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని వికాస్రాజ్ స్పష్టం చేశారు. డీప్ ఫేక్, ఇతర తప్పుడు ప్రచారాల ఆరోపణలపై సోషల్ మీడియాలోని 120 లింక్లను తొలగించామన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై విశ్లేషణ జరుపుతామన్నారు. డబ్బులు పంచుతూ కొందరు అభ్యర్థులు, వారి బంధువులు పట్టుబడిన ఘటనలపై స్పందిస్తూ.. రాష్ట్ర మంత్రులపై కేసులు నమోదయ్యాయని, రికార్డు స్థాయిలో 13వేలకుపైగా కేసులు పెట్టామని వికాస్రాజ్ వివరించారు. భారీగా పెరిగిన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని వికాస్రాజ్ తెలిపారు. 16,005 మంది 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు, 9,459 మంది దివ్యాంగ ఓటర్లు, 1.80 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ రిజర్వ్డ్ బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. 500కుపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 14+14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. మిగతా స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. 119 స్థానాలకు సంబంధించి 1,766 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయని.. వీటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ ఉంటాయని వివరించారు. ఉదయం 10.30 కల్లా లీడ్పై స్పష్టత కౌంటింగ్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తర్వాత ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని వికాస్రాజ్ తెలిపారు. ఒకవేళ పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడితే.. సమాంతరంగా ఈవీఎం ఓట్ల లెక్కింపూ మొదలవుతుందన్నారు. ఉదయం 10.30 గంటలకల్లా కౌంటింగ్లో ముందంజలో ఉన్న అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని వికాస్రాజ్ అంచనా వేశారు. కొన్ని స్థానాల్లో అధిక పోలింగ్ జరగడం, చాలాచోట్లలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా?.. కో-కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు
Miss World 2000: గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రాపై మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్కానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మిస్ వరల్డ్ 2000 పోటీలో రిగ్గింగ్ చేసి ప్రియాంక గెలిచిందంటూ ఆమె షాకింగ్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్టాపిక్గా నిలిచాయి. కాగా ఇటీవల జరిగిన యూఎస్ఏ 2022(Miss USA 2022) పోటీల్లో రిగ్గింగ్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోటీలో టెక్సాస్కు చెందిన రాబోన్ గాబ్రియేల్ కిరీటం గెలుచుకుంది. చీటింగ్ చేసి ఆమె గెలిచిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందిస్తూ లీలానీ ఓ యూట్యూబ్ వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిస్ యూఎస్ఏ 2022 పోటీల్లో నిజంగానే రిగ్గింగ్ జరిగిందని, చీటింగ్ చేసి గాబ్రియేల్ని గెలిపించారని వ్యాఖ్యానించింది. అనంతరం ‘మిస్ వరల్డ్ 2000 పోటీలలో కూడా రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని గెలిపించారు. మిస్ వరల్డ్ 1999లో ఇండియా నుంచి యుక్తాముఖి గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2000 సంవత్సరంలో కూడా ఇండియా నుంచి ప్రియాంక చోప్రానే గెలిచింది. అప్పడు నేను కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాను. ఇలాంటి వాటిల్లో స్పాన్సర్స్ ఎవర్ని గెలిపించమంటే వారినే గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ వరల్డ్ 2000కి జీ టీవీ స్పాన్సర్. ఇది ఇండియాకి చెందినది. అందుకే భారత్కు చెందిన ప్రియాంక చోప్రాని గెలిపించారు. ఆ పోటీల్లో జరిగిన స్విమ్ సూట్ కాంపిటేషన్లో అందరూ బికినీలు వేసుకుంటే.. ప్రియాంక మాత్రం వేరే స్విమ్ సూట్ వేసుకుంది. అయినా న్యాయనిర్ణేతలు ఆమెను క్వాలిఫై చేశారు. అప్పుడే అనుమానం వచ్చింది’ అని పేర్కొంది. అలాగే ఈ పోటీలో ప్రియాంకను ప్రత్యేకంగా చూసేవారు. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్గా అనిపించింది: హీరోయిన్ ఈ పోటీల్లో పాల్గొన్న అందరికి జాసన్ వు డిజైనర్గా వ్యవహరించాడు. మా అందరికి ఒకే రకమైన ఫ్రాక్స్ డిజైన్ చేశాడు. కానీ ప్రియాంకకు మాత్రం స్పెషల్గా డిజైన్ చేశాడు. ఇక 1999లోనే యుక్తాముఖి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. అలాగే 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్ నిలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ గెలుచుకుంది. ఇలా చాలా అంశాల్లో ప్రియాంక చోప్రాని పైకి తీసుకొచ్చి తనని మిస్ వరల్డ్ చేశారు’ అంటూ బార్బడోస్ పేర్కొంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
డూయింగ్ బిజినెస్ నివేదిక నిలిపివేత
వాషింగ్టన్: వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులకు సంబంధించి విడుదల చేసే ’డూయింగ్ బిజినెస్’ నివేదికను నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇందుకు కారణం. 2018, 2020 నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి ఆరోపణలపై అంతర్గతంగా విచారణ నిర్వహించిన నేపథ్యంలో డూయింగ్ బిజినెస్ నివేదికను నిలిపివేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో క్రిస్టలీనా జార్జియేవా.. ఆమె సలహాదారు ఒత్తిడి మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయసేవల సంస్థ విల్మర్హేల్ నిర్ధారించింది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ వివాదంపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయతి్నస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement