-
రెవెన్యూ కోర్టులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కోర్టులకు ఇక చెల్లుచీటీ పడనుంది. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఈ రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం శాసనసభ ముందుకు రానున్న భూ యాజమాన్య హక్కుల చట్టం–2020 (ఆర్ఓఆర్) బిల్లులో పొందుపరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు మండల స్థాయిలో తహసీల్దార్.. ఆపై అప్పిలేట్ అధికారిగా ఆర్డీవో.. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ భూ వివాదాలపై తీర్పులు చెప్పేవారు. ఈ క్రమంలో వివాదాల పరిష్కారానికి ఎడతెగని జాప్యం జరగడం, మితిమీరిన అవినీతి ఆరోపణలు రావడంతో వీటిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూశాఖ అధికారుల అధికారాలకు కత్తెరపడనుంది. ఈ క్రమంలోనే రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కొత్తగా ట్రిబ్యునల్... రెవెన్యూ కోర్టులకు రాంరాం చెబుతున్న ప్రభుత్వం దాని స్థానే జిల్లాకో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రిటైర్డ్ జడ్జి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ ట్రిబ్యునల్.. ఇకపై మండలం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని భూ వివాదాలను పరిష్కరించనుంది. దీంతో ఇప్పటివరకు మూడంచల వ్యవస్థకు కాలం చెల్లనుంది. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులపై సంతృప్తి చెందని కక్షిదారులు కలెక్టర్కు అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా కొత్త చట్టంలో ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అలాగే, సేవలను సులభతరం చేయడంలో భాగంగా ఇకపై తహసీల్దార్, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల పాత్రను కూడా పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి మరో అధికారి రెవెన్యూశాఖలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి (అర్జీలతో సహా) జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, విరాసత్, కల్యాణలక్ష్మి–షాదీముబారక్, కుల, ఆదాయ, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఆస్తుల భాగాల పంపిణీ వ్యవహారాలను కొలిక్కి తెచ్చే బాధ్యతను ఈ అధికారికి అప్పగించనున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చించి ఈ అర్జీలకు పరిష్కారమార్గం చూపేలా వ్యవహరించనున్నారు. పేర్లలోనూ మార్పులు... వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపైనా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పోస్టులను కూడా పునఃనిర్వచిస్తూ కొత్త చట్టంలో పొందుపరిచినట్లు సమాచారం. జిల్లా పాలనాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ అనే పదానికి బదులుగా ఇకపై జిల్లా మేజిస్ట్రేట్గా పిలవనుంది. అదనపు కలెక్టర్ను ఇకపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్గా వ్యవహరించనుంది. తహసీల్దార్ను తహసీల్దార్/ భూ మేనేజర్గా నిర్వచించే అంశాన్ని పరిశీలిస్తోంది. -
అమ్మానాన్న లేరు.. ఆదుకోండి సారు..
రెవెన్యూ దర్బార్లో అదనపు జేసీకి చిన్నారుల వినతి నవాబుపేట: ‘మా అమ్మ, నాన్న చనిపోయారు. ఎందుకు చనిపోయారో తెలియదు. ఇద్దరం మా నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాం.. మమ్మల్ని ఆదుకోండి సారూ..’’ అంటూ ఇద్దరు చిన్నారులు రెవెన్యూ దర్భార్లో అదనపు జేసీ బాలాజీ రంజిత్ప్రసాద్కు విన్నవించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం హన్మసానిపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన రెవెన్యూ దర్బార్కు చిన్నారులు వంశీ(11), మురళి(8) వచ్చారు. వీరి తల్లి యాదమ్మ నాలుగేళ్ల క్రితం ఉరేసుకుంది. తండ్రి యాదయ్య(41) రెండేళ్ల క్రితం పురుగుమందు తాగి చనిపోయాడు. ఆనాటి నుంచి ఆ పిల్లలను నాయనమ్మ అంజమ్మ చేరదీసి చదివిస్తోంది. అయితే ఆమెకు వయస్సు పైబడింది. దీంతో చిన్నారులు రెవెన్యూ దర్బార్కు వచ్చి మొరపెట్టుకున్నారు. దీనికి చలించిన ఏజేసీ ఆ చిన్నారుల ను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆ కుటుంబానికి అంత్యోదయకార్డు అందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement