-
ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడు
సాక్షి, కర్నూలు : కిరణ్ అనే వ్యక్తి తన ఇంటిని అద్దె తీసుకున్నాడు. అద్దె ఇవ్వడంలేదు. ఖాళీ చేయమంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని శ్రీశైలంకు చెందిన సయ్యద్ ఫర్వీన్బీ జిల్లా ఎస్పీకి విన్నవించింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప అధ్యక్షతన స్పందన (ఫిర్యాదుల దినోత్సవం) కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు నేరుగా తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. సమస్యలపై ఆయన స్పందిస్తూ విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు గోపాలకృష్ణ, వెంకట్రామయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ వాసుకృష్ణ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. తన భర్త చేసిన అప్పులకు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని, ఇద్దరు కుమార్తెలున్న తనకు న్యాయం చేయాలని గడివేముల మండలం గని గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ అనే వ్యక్తి కారుకు లోన్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశాడని కర్నూలు నరసింహారెడ్డి నగర్కు చెందిన కరుణాకర్ ఫిర్యాదు చేశారు. రూ.95 లక్షల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఫారిన్ వెళ్తుందని చెప్పి డబ్బులు అప్పుగా తీసుకొని 15 రోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని కర్నూలు గణేశ్ నగర్కు చెందిన వైవీఎన్ రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులు ఫిర్యాదు చేశారు. ఐస్క్రీమ్స్ తయారు చేయడానికి పెట్టుబడి పెట్టించి ఒక సంవత్సరం తర్వాత మాకు తెలియకుండానే ఖాళీ చేసి వెళ్లి పోయారని ఆదోనికి చెందిన ఉసేనప్ప ఫిర్యాదు చేశారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: 7వ వేతన సంఘం అనుమతుల కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుకు తీపి కబురు అందించనుంది. మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్ లేదా హెచ్ఆర్ఏ(హౌస్ రెంట్ అలవెన్స్ )ను 30 శాతం పెంచేందుకు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం సమర్పించనున్న తన నివేదికలో ఈ మేరకు సిఫారసు చేసిందట, 7వ వేతన సంఘం ఉద్యోగుల హెచ్ఆర్ఏపై అందించిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బేసిక్ జీతంపై 30శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని పేర్కొన్న ట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగుల హెచ్ ఆర్ఏ పెంచేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆర్థిక కార్యదర్శి అశోక్ ఉష్ణ ద్రవాల నేతృత్వంలోని అనుమతులు కమిటీ 7 వ వేతన సంఘం ఆధ్వర్యంలో అనుమతులను సమీక్షించింది. ఈ సిఫార్సులను ప్రకటించే అవకాశంఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఏ తప్ప మిగిలిన అలవెన్సులపై సమీక్షించే నిమిత్తం 2016 జూలైలోఈ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత ఈ కమిటీనివేదికను అందించేకు నాలుగు నెలలు సమయం ఇచ్చారు. అనంతరం ఈ గడువును ఫిబ్రవరి 22, 2017 వరకు పొడిగించారు. కాగా ఉద్యోగులకు చెల్లించే డీఏ 50శాతానికి చేరుకునప్పుడు ఇంటి అద్దె అలవెన్సు 27, 18, 9శాతానికి పెంచాలని ప్యానల్ గతంలో తన నివేదికలో పేర్కొంది. డీఏ 100 శాతానికి పెంచినపుడు హెచ్ఆర్ఏ 30శాతంగా ఉండాలని 7వ వేతన సంఘం పేర్కొంది. 30శాతం డీఏఅమలైతే వరుసగా X, Y, Z నగరాలకు 20, శాతం 10శాతంగా ఉండాలని తెలిపింది. దీంతో పాటు కొన్ని అలవెన్సులు రద్దుచేయడంతోపాటు, మరికొన్నింటిలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement