-
ఏపీకి వెళ్లాల్సిందే.. సోమేశ్ కుమార్కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని తేలి్చచెప్పింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ పరిధి క్యాట్కు లేదని స్పష్టం చేసింది. కేంద్రం జారీ చేసిన కేటాయింపులను సమర్థించింది. అఖిల భారత సరీ్వసు అధికారుల కేటాయింపులు, కేడర్ నియంత్రణ, నిర్ణయాధికారం కేంద్రానిదేనన్న వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన వాటితో పాటు ఇతర అన్ని అంశాలను క్యాట్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందాతో కూడిన ధర్మాసనం 89 పేజీల తీర్పును వెలువరించింది. కాగా అప్పీల్ కోసం తీర్పు అమలును మూడు వారాలు నిలిపేయాలన్న సోమేశ్కుమార్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని అంశాలను వివరంగా పరిశీలించిన తర్వాతే తీర్పు ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీకి సంబంధించిన వివాదాలపై గతంలో క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను.. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ హైకోర్టులో సవాల్ చేసింది. సుదీర్ఘ కాలం ఇరుపక్షాల వాదనలు విని, గత జూలైలో తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. మాకెలాంటి పక్షపాతం కనిపించడం లేదు.. ‘కేంద్రానికి క్యాట్ అప్పిలేట్ అధికారిగా వ్యవహరించలేదు. అది చట్టప్రకారం సమర్ధనీయం కాదు. ఆలిండియా కేడర్ ఉద్యోగులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. ఫలానా రాష్ట్రంలోనే పని చేస్తానని చెప్పడం సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధం. సోమేశ్ను ఏపీకి కేటాయించడంలో మాకు ఎలాంటి పక్షపాతం కనిపించడం లేదు. సీరియారిటీ, కేడర్ దెబ్బతింటుందన్న వాదనలో వాస్తవం లేదు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం కేడర్ విభజన చేసింది. పరస్పర బదిలీకి సంబంధించి సోమేశ్ చేసిన అభ్యర్థనను మార్గదర్శకాల మేరకు కేంద్రం తిరస్కరించింది. 1989 బ్యాచ్ అధికారి సోమేశ్కు, 1990 బ్యాచ్ అధికారి రజత్భార్గవ్తో పరస్పర బదిలీ సాధ్యం కాదంది. విభజన సమయంలో సీఎస్గా ఉన్న మొహంతి.. ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉండటం సరికాదని, కుమార్తె, అల్లుడికి ప్రయోజనం కలుగుతున్నందున కమిటీలో ఆయన ఉండొద్దన్న క్యాట్ నిర్ణయం సమర్ధనీయం కాదు. కేంద్రాన్ని ఆయన ఎలా ప్రభావితం చేశారో ఎవరూ చెప్పలేదు. 60 ఏళ్లు నిండటంతో 2014 ఫిబ్రవరిలో మొహంతి పదవీకాలం ముగిసింది. అయినా విభజన దృష్ట్యా 4 నెలలు పదవీ కాలాన్ని పొడిగించారు. జూన్ 1న పదవీ విరమణకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను నాటి సర్కార్ అంగీకరించింది. విరమణ రోజును పని దినంగా పేర్కొనరాదని నిబంధనలున్నా.. క్యాట్ ఆ రోజును కూడా పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుబట్టాల్సిందే. ఈ కేసులో సోమేశ్ తరఫున నాటి జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ కౌంటర్ దాఖలు చేశారు. సోమేశ్ అఫిడవిట్ ఎందుకు వేయలేదన్నది సందిగ్ధం..’ అని తీర్పులో ధర్మాసనం పేర్కొంది. క్యాట్లో ఒకలా..హైకోర్టులో మరోలా.. సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే కేడర్ కంట్రోలింగ్ అథారిటీ. ఇష్టం వచి్చన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు అధికారులకు లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదు. తెలంగాణలో సోమేశ్ కొనసాగింపు చట్ట వ్యతిరేకం. ఆయన కంటే సమర్థులు లేరని తెలంగాణ భావిస్తే ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి డెప్యుటేషన్ మీద మళ్లీ రప్పించుకోవచ్చు. ఈ కేసుపై క్యాట్లో విచారణ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. హైకోర్టు ఎదుట మాత్రం వైఖరిని మార్చుకుంది. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డే అయిన జూన్ 2, 2014కు ఒకరోజు ముందు పీకే మొహంతి రిటైరయ్యారు. అందుకే ఆయనను ఇరు రాష్ట్రాల మధ్య విభజన అధికారుల జాబితాలో చేర్చలేదు. అలా చేర్చి ఉంటే తనకు తెలంగాణ వచ్చేదన్న సోమేశ్కుమార్ వాదన సరికాదు. అధికారుల విభజనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీలో పీకే మొహంతి ఎక్స్అఫీíÙయో మెంబర్ మాత్రమే. మిగతా సభ్యులు ఉండగా ఆయన వివక్ష చూపడానికి అవకాశం లేదు. క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలి. సోమేశ్కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే. – ఏఎస్జే టి.సూర్యకరణ్రెడ్డి సోమేశ్ అవకాశాలను మొహంతి దెబ్బతీశారు రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీలో సమైక్యాంధ్ర చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించలేదు. ఆయన తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు ఒక్కరోజు ముందు పదవీ విరమణ చేసిన మొహంతి పేరిట 2014, జూన్ 1న కూడా ప్రభుత్వ జీవోలు జారీ అయ్యాయి. దీని ప్రకారం అప్పటివరకు సరీ్వస్లో ఉన్న మొహంతిని ఏపీ లేదా తెలంగాణకు కేటాయించక పోవడం చట్ట వ్యతిరేకం. చివరిరోజు వరకు విధుల్లో ఉండి ఆపై రాజీనామా చేయడం ద్వారా కావాలని సోమేశ్కుమార్ అవకాశాలను దెబ్బతీశారు. లబి్ధదారుడైన మొహంతి కమిటీలో సభ్యుడిగా ఉండటం చెల్లదు. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలి. – సోమేశ్కుమార్ తరఫు న్యాయవాదులు రాష్ట్ర ఏర్పాటు నుంచే వివాదం.. రాష్ట్ర విభజన (2014) నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సరీ్వస్ ఉద్యోగుల విభజనలో భాగంగా సోమేశ్ను ఏపీకి కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ను ఆశ్రయించగా, తెలంగాణకు కేటాయిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. సోమేశ్కు సంబంధించి క్యాట్ ఇచి్చన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జే) టి.సూర్యకరణ్రెడ్డి, సోమేశ్కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారాంమూర్తి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, ఏపీ తరఫున పి.గోవింద్రెడ్డి వాదనలు వినిపించారు. కాగా సోమేశ్కుమార్తో పాటు మరో 14 మంది ఆలిండియా కేడర్ సరీ్వస్ అధికారులు కాŠయ్ట్ ద్వారా అనుమతి పొంది తెలంగాణలో పనిచేస్తుండటం గమనార్హం. వీరందరికీ సంబంధించి కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. -
సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ రిలీవ్
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా బదిలీ అయిన నాగులపల్లి శ్రీకాంత్ సీఆర్డీఏ కమిషనర్ బాధ్యతల నుంచి గురువారం రిలీవ్ అయ్యారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అదనపు కమిషనర్ వీ రామమనోహరరావు, ల్యాండ్స్కేప్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ కే సూర్యనారాయణ, సీఈ డీ కాశీవిశ్వేశ్వరరావు తదితర ఉద్యోగులు ఆయనకు వీడ్కోలు పలికారు. శ్రీకాంత్ మాట్లాడుతూ సీఆర్డీఏ అధికారులు, ఉద్యోగులు తనకు ఎంతో సహకరించారన్నారు. ఇదేlవిధంగా శ్రీధర్కూ తోడుండి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. టీమ్ వర్క్తో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పాటుపడాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, ఫైనాన్స్ తదితర విభాగాలు ఎంతో కషి చేశాయని శ్రీకాంత్ ప్రశంసించారు. రానున్న కాలంలో 20 నుంచి 30 స్మార్ట్ సిటీలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి నగరాల నిర్మాణంలో ఏపీ సీఆర్డీఏ భాగస్వామికావాలని ఆకాక్షించారు. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ విభాగంలో చెరుకూరి శ్రీధర్ బాగా కషి చేశారని, ఉద్యోగులు తమ వ్యక్తిగత సమయాన్ని కూడా వెచ్చించారని శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో డెవలప్మెంట్ కంట్రోల్ డైరెక్టర్ రాముడు, ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ నాగిరెడ్డి, ప్రొక్యూర్మెంట్ డైరెక్టర్ అంజనేయులు, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మురళీధరరావు, ఎస్టేట్స డైరెక్టర్ మోహనరావు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్ అరవింద్, ఇన్ఫ్రా ప్రిన్సిపల్ ప్లానర్ గణేష్బాబు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, ప్లానింగ్ ఆఫీసర్లు నాగేశ్వరరావు, వీవీఎల్ఎస్ శర్మ, హెచ్ఆర్ జాయింట్ డైరెక్టర్ సీ రోహిణి, భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డీ మనోరమ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సాగనంపారు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత (పుట్టిన ప్రాంతం) కలిగిన ‘స్టేట్ కేడర్’ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల నుంచి తక్షణమే రిలీవై ఏపీ ప్రభుత్వంలోని సంబంధిత విద్యుత్ సంస్థకు రిపోర్టు చేయాలని సూచిస్తూ ఆఘమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ట్రాన్స్కోలో 262 మంది, జెన్కోలో 522 మంది, ఎస్పీడీసీఎల్లో 393 మంది, ఎన్పీడీసీఎల్లో 168 మంది కలిపి మొత్తం 1,345 మంది ఏపీ ‘స్థానికత’గల స్టేట్ కేడర్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆయా సంస్థల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఈ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు అనుమతించబోరని తెలుస్తోం ది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుది కేటాయింపులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో విభజన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు అడ్డుకాక ముందే టీ.సర్కార్ యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు ఇచ్చింది. ఆలస్యం చేస్తే హైకోర్టు స్టే ఆర్డర్ వచ్చే అవకా శం ఉండటంతో ఈ ప్రక్రియను ముగించింది. ఆర్డర్ టు సర్వ్కు మంగళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల విభజన జరిగి ఏడాదైనా ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులందరూ ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. టి.ట్రాన్స్కో, టి.జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో రాష్ర్ట, జోనల్, జిల్లా కేడర్ స్థాయిల్లో వేల మంది ఏపీ స్థానికతగల ఉద్యోగులున్నారు. ప్రభుత్వోద్యోగుల విభజన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కమల్నాథన్ కమిటీ ప్రభుత్వ సంస్థ (కార్పొరేషన్)ల ఉద్యోగుల విభజన తమ పరిధిలోకి రాదని గతంలోనే తేల్చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 88 కేవలం ఏడాది వరకే ‘ఆర్డర్ టు సర్వ్’లో పనిచేసేందుకు అనుమతిస్తోంది. విభజన జరిగి ఏడాది పూర్తై నేపథ్యంలో ‘రాష్ట్ర స్థాయి’ విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయిం పులు జరపాలని ఈ నెల 6న తెలంగాణ ఇంధనశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. తక్షణమే తుది కేటాయింపులు జరపాలని ఈ నెల 9న విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఏపీ స్థానికతగల ఉద్యోగుల తుది జాబితాలను అదే రోజు ఆన్లైన్లో ప్రదర్శించాయి. మార్గదర్శకాలపై ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేయగా కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై బుధ, గురువారాలు విచారణ జరగగా తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులను ఈ నెల 10న జారీ చేసినట్లు గురువారం బయటపడింది. తప్పు డు స్థానికత సమాచారమిచ్చిన విద్యుత్ ఉద్యోగులపై క్రిమినల్చర్యలు తీసుకునేలా మార్గదర్శకాల్లో నియమాలను చేర్చాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత జె.రఘు ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్కు గురువారం వినతిపత్రం అందజేశారు. విద్యుత్ సౌధకు పోలీసు భద్రత! విద్యుత్ ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఖైరతాబాద్లోని ‘విద్యుత్ సౌధ’ కార్యాలయానికి భద్రత కల్పించాలని టి.విద్యుత్ సంస్థలు పోలీసులను కోరాయి. ఏపీ ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సదరు ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలుండటంతో ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement