-
‘మీ అమ్మకు అలా మెసేజ్ చేస్తే ఓకేనా?’.. నెటిజన్పై శ్వేతవర్మ ఫైర్
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. వారిలో శ్వేతవర్మ కూడా ఒకరు. గతంలో పలు సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత బుల్లితెర ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రియులందరికి దగ్గరైంది. ఆ షో తర్వాత సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గాను నటించింది. అయితే అవకాశాలు రాలేకనో లేదా పాత్రలు నచ్చకపోవడంతో తెలియదు కానీ కొన్నాళ్లుగా శ్వేత వర్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వార మాత్రం ఫ్యాన్స్తో టచ్లోనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్తో షేర్ చేసుకునే శ్వేతకు సోషల్ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫ్రైవేట్ భాగాలపై నీచంగా కామెంట్ చేశాడు. తాజాగా సదరు వ్యక్తి పంపిన సందేశాలతో పాటు అతని ప్రొఫైల్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.‘ఒక మనిషికి ఇలాంటి మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలా చెబితే ఊరుకుంటాడా? ఇప్పటికీ ఇలాంటి వాళ్లు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’అంటూ శ్వేత రాసుకొచ్చింది. అలాగే అతని అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించానని, ఆ వివరాలు కూడా ఇన్స్టాలో పెట్టొచ్చు..కానీ మనిషిని కాబట్టి షేర్ చేయలేకపోతున్నానని చెప్పింది. ఇది అతనికొక గుణపాఠమని, ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదంటూ శ్వేత ఓ వీడియోని షేర్ చేసింది.శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Swetaa Varma (@swetaavarma) -
సరికొత్త టాక్ షోకు హోస్ట్గా టాలీవుడ్ హీరో.. ఏ ఓటీటీలో తెలుసా!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది బాబాయ్ వెంకటేశ్తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం రానా రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రానా ప్రధానపాత్రలో హిరణ్య కశ్యప అనే మూవీని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రానా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాలో ఈ షోను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి మొదలవుతుందని మాత్రం రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో నంబర్ వన్ యారీ టాక్ షో టాలీవుడ్ హీరో రానా గతంలో నంబర్ 1 యారీ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానున్న టాక్ షో ది రానా కనెక్షన్ అనే పేరును ఖరారు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. An exciting and curiosity-piquing talk show hosted by celebrated actor Rana Daggubati, featuring his friends and contemporaries from Indian cinema. #TheRanaConnectionOnPrime #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Gg7fcqqeNi — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
KBC 15: ముగిసిన కేబీసీ 15వ సీజన్.. అమితాబ్ ఎమోషనల్
కొన్ని రియాల్టీ షోల ద్వారా హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీలకు పేరొస్తుంది. మరికొన్ని రియాల్టీ షోలకు మాత్రం హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీ ద్వారానే మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి రియాల్టీ షోలలో`కౌన్ బనేగా కరోడ్పతి` ఒకటి. ఈ షో పేరు చెప్పగానే అందిరికి గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. ఈ షో సక్సెస్లో అబితాబ్ కీలక పాత్ర పోషించాడు. ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించి షో కాదు.. ఎన్నో అనుభూతులను కూడా పంచుతుంటుంది. హాట్సీట్లో కూర్చొని అబితాబ్ చెప్పే విషయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 15వ సీజన్ని కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న చివరి ఎపిసోడ్ ప్రసారమవ్వగా.. షోకి వచ్చిన ప్రేక్షకులతో పాటు అబితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారు. (చదవండి: Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ) `లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపట్నుంచి కనిపించదు. రేపట్నుంచి మేం ఇక్కడకు రావడం లేదు అని చెప్పాలనిపించడం లేదు. నేను, అమితాబ్ బచ్చన్, ఈ సీజన్లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’ అంటూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి: Rewind 2023: బడ్జెట్తో పనిలేని బంపర్ హిట్స్) అమితాబ్తో పాటు షోకి వెళ్లిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ‘మేం దేవుడిని చూడలేదు కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నాం’అంటూ ఓ ప్రేక్షకురాలు చెప్పడంతో వేదిక అంతా చప్పట్లతో మారుమ్రోగింది. కాగా, చివరి ఎపిసోడ్కి విద్యాబాలన్, షీలా దేవి, షర్మిలా ఠాగూర్, సారా అలీఖాన్ విచ్చేసి సందడి చేశారు. ఇదే చివరి ఎపిసోడ్. ఇకపై ఇక్కడకు రాలేము అనే మాటలు చెబుతున్నందుకు బాధగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ముందే తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాను’అని అమితాబ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
బిగ్బాస్ షో.. ఈ వారం స్పెషల్ కంటెస్టెంట్ ఎలిమినేట్!
బిగ్ బాస్ రియాలిటీ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. బుల్లితెరపై ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుతం బిగ్బాస్ హవా నడుస్తోంది. ఈ ఏడాది కన్నడలో సీజన్- 10 నడుస్తోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో.. ఈ వారంలో ట్రాన్స్జెండర్ మహిళ నీతూ వనజాక్షి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. దాదాపు 50 రోజులపాటు హౌస్లో ఉన్న నీతూ ఏడోవారంలో బయటకొచ్చేసింది. అయితే ఈ వారంలో ఆమెనే హౌస్కి కెప్టెన్గా వ్యవహరించడం విశేషం. ఎలిమినేషన్ తర్వాత ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతూ తన అభిప్రాయాలను వెల్లడించింది. బిగ్బాస్ హోస్లో 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కంటెస్టెంట్గా నేను ఎక్కువ రోజులు ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎన్నో అనుభవాలతో ఇంటికి వెళ్తున్నా. ఈ అనుభవాలతో మరింత ముందుకు సాగుతా. మీరు బయటకు వస్తారని నేను ఊహించా. గత రెండు వారాలుగా నా పనితీరు చాలా తక్కువగా ఉంది. కానీ కెప్టెన్సీ టాస్క్లో బాగా ఆడాను. కానీ దురదృష్టం నన్ను వెంటాడింది. హౌస్లో ఉన్న ప్రతాప్, తుకలి సంతోష్, సంగీత, కార్తీక్, తనీషా ఈసారి బిగ్ బాస్ టాప్ ఫైవ్లో ఉంటారు. ఈ సీజన్ విన్నర్గా ప్రతాప్ నిలుస్తాడంటూ నీతూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. బిగ్బాస్ అవకాశంపై మాట్లాడుతూ.. 'నాకు ప్రేమ కావాలి కానీ.. సానుభూతి అవసరం లేదు. బిగ్బాస్లోకి రావడం మంచి అవకాశం. ఇంట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఈ ఈ జ్ఞాపకాలను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. అలాగే ట్రాన్స్జెండర్ల జీవితం గురించి చాలా మందికి తెలియదు. మేం ఏమి కోరుకుంటున్నామో, సమాజం నుంచి ఏమి ఆశిస్తున్నామో కూడా తెలియదు. చివరికి మాకు కావలసింది ప్రేమ మాత్రమే. మాకు ఎవరీ జాలీ, దయ అక్కర్లేదు. ప్రేమను పంచితే చాలు. అది నాకు బిగ్ బాస్ హౌస్ ఇచ్చింది.' అని అన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement