-
అమ్మను చంపేశారు.. అందుకే చనిపోతున్నా...
రాజేంద్రనగర్/పహాడీషరీఫ్: ‘అమ్మ చావుకు ఆస్పత్రి వైద్యులే కారణం, వారి నిర్లక్ష్యం కారణంగానే అమ్మ చనిపోయింది’అని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ తల్లి మరణాన్ని తట్టుకోలేని ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి వైద్య ఖర్చులకోసం శ్రీహరి తన స్నేహితుల వద్ద రూ.10 లక్షలు అప్పు చేసి ఆస్పత్రి బిల్లులు చెల్లించాడని, మరో రూ.3 లక్షలు చెల్లించాలని చెప్పడంతో అటు తల్లిని కోల్పోయి.. ఇటు మిగిలిన బిల్లు ఎలా కట్టాలో తెలియక శ్రీహరి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు అంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. డిగ్రీ చదువుతున్న శ్రీహరి (25) తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య, తల్లి రుక్మిణి (60)తో కలసి రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి మధుబన్ కాలనీలో నివసిస్తున్నాడు. వారం కిందట తల్లి రుక్మిణికి కరోనా సోకడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. కాగా, అంతకు కొద్ది సేపటి ముందు ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తానని చెప్పిన శ్రీహరి.. తన స్నేహితుడు సాయిని ఆస్పత్రి వద్ద ఉంచి వెళ్లాడు. అదే సమయంలో రుక్మిణి మరణవార్తను ఆస్పత్రి సిబ్బంది సాయికి చెప్పడంతో ఆ విషయాన్ని ఫోన్ చేసి శ్రీహరికి చెప్పాడు. అప్పటినుంచి శ్రీహరి ఆచూకీ లభ్యంకాలేదు. అయితే తన తల్లిని ఆస్పత్రి డాక్టర్లే చంపారని, వారి నిర్లక్ష్యమే తల్లిని బలితీసుకుందని ఆరోపిస్తూ అతను సెల్ఫీ వీడియో రికార్డు చేసి స్నేహితులకు పోస్ట్ చేశాడు. దీంతో వారు మైలార్దేవ్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో వెతికినా శ్రీహరి జాడ లభించలేదు. చివరకు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉందాసాగర్ చెరువులో శనివారం మధ్యాహ్నం శ్రీహరి మృతదేహం లభించింది. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు భార్య, ఇటు కుమారుడు.. గంటల వ్యవధిలో భార్య, కుమారుడు మృతిచెందడంతో రామచంద్రయ్య కుప్పకూలాడు. కుమారుడు శ్రీహరి ఏమైపోయాడో తెలియని పరిస్థితుల్లో శనివారం మధ్యాహ్నం భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో కుమారుడు కూడా మృతిచెందాడన్న వార్త విని రామచంద్రయ్య తట్టుకోలేకపోయాడు. బంధువులు అతడికి సపర్యలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీసులు శ్రీహరి మృతదేహాన్ని అప్పగించడంతో రాత్రి దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
వలస బతుకులు బుగ్గిపాలు
నగరంలోని ఎయిర్ కూలర్ల యూనిట్లో భారీ అగ్నిప్రమాదం - ఆరుగురు కార్మికుల సజీవదహనం - మృతుల్లో నలుగురు జార్ఖండ్వాసులు - రోజూలాగే గోదాం షట్టర్కు తాళం వేసి వెళ్లిన యజమాని - మంటలు చెలరేగడంతో బయటపడేందుకు కార్మికుల ప్రయత్నం... కాపాడాలంటూ యజమానికి ఫోన్కాల్ - కాపాడేందుకు యత్నించిన పెట్రోలింగ్ పోలీసులు - టిప్పర్ వాహనంతో షట్టర్ను ఢీకొట్టించిన వైనం - లోపలకు వెళ్లి చూడగా మృతదేహాలుగా మారిన కార్మికులు సాక్షి, హైదరాబాద్/అత్తాపూర్: పొట్టకూటి కోసం నగరానికి వలసవచ్చిన ఆరుగురు కార్మికుల బతుకులు తెల్లవారుతుండగానే తెల్లారిపోయాయి. రాజేంద్రనగర్లో చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఎయిర్కూలర్ల తయారీ యూనిట్లో బుధవారం తెల్లవారుజామున 5.00 గం. సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురిని ఓం ఎవోన్ ఎయిర్ కూలర్స్లో పనిచేస్తున్న ఇర్ఫాన్(19), షహద్ (20), ముజాయిద్ (19), సద్దాం (20)లుగా గుర్తించారు. వారంతా జార్ఖండ్ రాష్ట్రంలోని చైన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నెవ్రా గ్రామస్తులని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఎయిర్ కూలర్ యూనిట్ నిర్వహిస్తున్న కార్వాన్కు చెందిన ప్రమోద్ కుమార్పై ఐపీసీ 304 (బీ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. తెల్లవారుతుండగానే మంటలు... అత్తాపూర్లోని పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 159 వద్ద ప్రమోద్ కుమార్ తనకున్న 300 గజాల స్థలంలో రెండేళ్ల క్రితం అక్రమంగా గోదాం నిర్మించి ట్రైవీల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓం ఎవోన్ ఎయిర్ కూలర్స్ యూనిట్ నిర్వహిస్తున్నాడు. ప్రమోద్కు సుపరిచితుడైన ఇర్ఫాన్ తన దగ్గర పనిచేసేందుకు కార్మికులు కావాలని చెప్పడంతో తన స్నేహితులైన షహద్, ముజాయిద్, సద్దాంలను జనవరిలో పనికి కుదిర్చాడు. అయితే వేసవి రావడంతో ఎయిర్ కూలర్లకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని ప్రమోద్... ఎండిన గడ్డి, ప్లాస్టిక్తో తయారు చేసిన వందలాది కూలర్ ఫ్రేమ్లను తెప్పించాడు. దీనికితోడు ఆ యూనిట్లోనే కొన్ని ఈ–రిక్షాలూ ఉన్నాయి. రోజులాగే యజమాని ప్రమోద్ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో యూనిట్ షెట్టర్కు బయట తాళం వేసి వెళ్లాడు. ఇర్ఫాన్, షహద్, ముజాయిద్, సద్దాంలతోపాటు రాత్రి పడుకునేందుకు వచ్చిన వారి ఇద్దరు స్నేహితులు అందులోనే ఉన్నారు. వీరంతా గాఢనిద్రలో ఉండగా తెల్లవారుజామున 5.00 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు వెంటనే యజమానికి ఫోన్ చేసి తమను రక్షించాలని అక్రందనలు చేశారు. టిప్పర్తో 15 సార్లు ఢీకొట్టినా... అదే సమయంలో పెట్రోలింగ్కు వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు మంటలను చూసి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆపై అటుగా వెళ్తున్న టిప్పర్ను ఆపి షట్టర్ను 10 నుంచి 15 సార్లు ఢీకొట్టించారు. చివరకు షటర్ ధ్వంసమైనా అప్పటికే వ్యాపించిన మంటల్లో గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో 10 నిమిషాల్లోనే మంటల తీవ్రత పెరిగింది. హుటాహుటిన చేరుకున్న ఆరు ఫైరింజన్లు మంటలను ఆదుపులోకి తెచ్చాయి. అనంతరం లోపలకు వెళ్లి చూడగా ఆరు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోకపోవడంతోపాటు అగ్నిమాపక భద్రత పరికరాలు అమర్చకపోవడం, గోదాంలోంచి బయటపడేందుకు మరో దారి లేకపోవడం వల్లే ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, షట్టర్కు తాను బయటి నుంచి తాళం వేయలేదని... కార్మికులే లోపల నుంచి తాళం వేసుకున్నట్లు యూనిట్ యజమాని ప్రమోద్ విచారణలో తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవార్త తెలియగానే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా, శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: నాయిని ఘటనాస్థలిని పరిశీలించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి...మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ తరపున రూ.5 లక్షలు, ఆపద్బంధు కింద రూ. 50 వేలు, తక్షణ సాయం కింద రూ. 25 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా యజమాని ప్రమోద్ తరఫు నుంచి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా అంగీకారం కుదిరిందని హోంమంత్రి తెలిపారు. మృతుల బంధువులకు విమాన టికెట్లు అందించి మృతదేహాలను తీసుకెళ్లేందుకు కూడా ప్రభుత్వం సౌలభ్యం కల్పించిందన్నారు. దుర్ఘటన కారకులపై కఠిన చర్యలు ఉంటాయని, ఎంతటి వారినైనా వదలబోమన్నారు. మంత్రి మహేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా ఘటనాస్థలిని పరిశీలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement