-
రాజ్ జీవితంలో స్మిత ఓ కల
నదీరా జహీర్... కొన్ని హిందీ సినిమాల్లో కనిపించినా థియేటర్తోనే ఆమెకు ఎక్కువ అనుబంధం. నదీరాకు రాజ్తో పరిచయం అయిందీ ఆ వేదిక మీదే. ఈ ఇద్దరూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థులు. నదీరా గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే ఆమె అతనికన్నా నాలుగేళ్లు సీనియర్. నదీరా నాటకాలు రాసి, దర్శకత్వం వహించే నాటికి రాజ్ బబ్బర్ గుర్తింపు కోసం తాపత్రయం పడ్తున్నాడు. అప్పుడే రాజ్ లీడ్రోల్గా ఓ నాటకాన్ని రచించి దర్శకత్వం వహించింది నదీరా. ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి సందర్భమూ అదే అయింది. నదీరాలోని స్నేహ స్వభావం, నిర్మొహమాటత్వం రాజ్ను ఆమెకు దగ్గర చేస్తే రాజ్లోని పట్టుదల నదీరా అతణ్ణి ఇష్టపడేలా చేసింది. ఆ ప్రేమ ఆ ఇద్దరినీ పెళ్లితో ఒక్కటి చేసింది. వాళ్ల బసను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా క్యాంపస్ నుంచి ఢిల్లీలోని నదీరా వాళ్ల తల్లిదండ్రుల అపార్ట్మెంట్కు చేర్చింది. ఆమె తల్లిగారింట్లో ఒక గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారిద్దరూ. ముంబై ఏడాది దాటేసరికి(జుహీ బబ్బర్కు) తల్లిదండ్రులయ్యారు. రాజ్ బబ్బర్ యాక్టింగ్ కెరీరే ముందుకు సాగలేదు. ఆర్థిక ఇబ్బందులూ తొలగలేదు. ఆ సమయంలో నదీరా సహనం, సంయమనమే రాజ్లో ధైర్యాన్ని పెంచింది. సినిమాల్లో రాణించాలనే కలను వీడకుండా చేసింది. తన స్కూటర్ అమ్మేసి.. వచ్చిన ఆరువేల రూపాయలను నదీరా చేతిలో పెట్టి ముంబై చేరుకున్నాడు రాజ్. అక్కడతను అవకాశాల కోసం చాలానే పోరాడాల్సి వచ్చింది. కుటుంబ భారాన్ని భర్త మీద వేయకుండా థియేటర్ పనితో ఆ బాధ్యతను తీసుకుంది నదీరా. నాలుగేళ్లు గడిచాయి. బాలీవుడ్లో బ్రేక్ సాధించాడు రాజ్. ‘కూతురిని తీసుకొని ముంబై వచ్చేయ్’ అని నదీరాకు చెప్పాడు. వెళ్లింది. తర్వాత యేడాదికి ఆ జంట కొడుకు (ఆర్య బబ్బర్)ను కన్నది. ఏక్జుట్ ఒక్కసారికే ఇరవై నాలుగు సినిమాలను సైన్ చేసేంత స్టార్ అయిపోయాడు రాజ్ బబ్బర్. నదీరా కూడా పని కల్పించుకుంది ‘ఏక్జుట్’ అనే థియేటర్ గ్రూప్ పెట్టి. ఆ బిజీ షెడ్యూల్లోనే రాజ్ను ఆకర్షించి.. అతని మదిని ఆక్రమించింది స్మితా పాటిల్. ఆ ప్రేమ సహజీవనమూ మొదలుపెట్టింది. ఆ కబుర్లను మీడియా మోస్తున్నా భర్త మీదున్న నమ్మకంతో వాటిని వదంతులుగానే వదిలేసింది నదీరా. కాని స్మిత, రాజ్ల పెళ్లి వార్తతో మాత్రం షాక్ అయింది, షేక్ అయింది నదీరా. లేమి కూడా తెప్పించని కన్నీళ్లని ఆ కలత తెప్పించింది. భర్తను నిలదీసింది. ‘నిజమే’ అని ఒప్పుకున్నాడు రాజ్. మౌనంగా పక్కకు తప్పుకుంది నదీరా. ఆ ఇంట్లోంచి, ఆ కుటుంబంలోంచి వెళ్లిపోయాడు రాజ్ బబ్బర్. హోమ్ బ్రేకర్.. డోర్మ్యాట్ ‘అమ్మా..’ అంటూ రెండూ కాళ్లను పట్టేసుకున్న ఆ పిల్లలే ఆమె నవ్వులయ్యారు. వాళ్ల సహాయంతోనే మనసులోని శూన్యాన్ని పూరించుకుంది. వాళ్ల కోసం నిలబడింది. రాజ్ బబ్బర్ను పెళ్లి చేసుకున్నందువల్ల కాపురం కూల్చేసిన స్త్రీగా స్మితను ఎలా ముద్రేశారో.. కాపురం నిలబెట్టుకోలేని బలహీనురాలిగా నదీరానూ చూశారు. ‘ఆ టైమ్లో ఆ కామెంట్లను తట్టుకోవడానికి నాకు ఊరటగా, ఓదార్పుగా పిల్లలైనా ఉన్నారు. స్మితకు అదీ లేకుండింది’ అని చెప్పింది నదీరా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. నదీరా అన్నట్టుగా స్మితకు ఆ ఊరట దొరొకలేదు. ప్రాణంలా ఆమెను రాజ్ ప్రేమించనైతే ప్రేమించాడు కాని ఓదార్పు కాలేకపోయాడు. దాంతో స్మితను అభద్రత చుట్టముట్టేసింది. ఆ ప్రభావం తమ దాంపత్యం మీద పడకుండా చూసుకోవడం స్మితకు పెద్ద సవాలుగా మారింది. అందుకే ఓ బిడ్డను కని ఆ బంధాన్ని భద్రం చేసుకోవాలనుకుంది. బిడ్డను భర్తకు అందించి శాశ్వతంగా సెలవు తీసుంది. రాజ్ జీవితంలో స్మిత ఓ కలగా మిగిలిపోయింది. మళ్లీ చెంతకు.. రెండు వారాల పసిగుడ్డు ప్రతీక్ను స్మిత తల్లిదండ్రుల ఒళ్లో పెట్టి మళ్లీ నదీరా ఇంటి తలుపు తట్టాడు రాజ్ బబ్బర్. ఆహ్వానించింది నదీరా. ఆ చర్యే అందరినీ నిర్ఘాంతపరిచింది. ఇటు సంప్రదాయవాదులను, అటు స్త్రీవాదులనూ. నదీరా మీద విమర్శల వర్షం మళ్లీ మొదలైంది. ‘స్మిత మరణంతో ఒంటరైన రాజ్ను నేను యాక్సెప్ట్ చేస్తానని ఎవరూ ఊహించలేదు. ఫెమినిస్ట్లు నన్ను డోర్మ్యాట్ అన్నారు. ఆయనలా చేశాడని నేనూ అలాగే చేసి ఉంటే వాళ్లంతా నన్ను పొగిడేవాళ్లు. ఈ దశాబ్దపు మహిళ అంటూ నా మెడలో బంగారు పతకం వేసేవారేమో! కాని ఆ పొగడ్తలు, ఆ గోల్డ్మెడల్స్ నా సమస్యలను తీరుస్తాయా? పిల్లల మనసుకు అయిన గాయాలను మాన్పిస్తాయా? ఉన్నవాటిల్లో ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకున్నాను’ అంటూ స్పందించింది నదీరా. రాజ్ బబ్బర్ నటించిన ‘ప్రేమ్ గీత్’ సినిమాలో జగ్జీత్ సింగ్ ఆలపించిన గజల్ ఉంటుంది ‘హోఠోంసే ఛూలో తుమ్ .. మేరా గీత్ అమర్ కర్ దో’ అని. ఇందులో చివరగా ‘తుమ్ హార్ కే దిల్ అప్నా మేరీ జీత్ అమర్ కర్ దో.. ’ అని వస్తుంది. నదీరా చేసింది అదే.. ప్రేమించిన రాజ్ బబ్బర్ కోసం.. తన మనసును ఓడించి.. అతణ్ణి గెలిపించింది. ∙ఎస్సార్ ∙మొహబ్బతే -
ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా
భూమిక ‘అర్థ్’ (1982) తన జిందగీకి ప్రేరణే అంటాడు దర్శకుడు మహేశ్ భట్ (ఆ సినిమాకూ అతనే దర్శకుడు). కాని ఈ సినిమా స్మితాపాటిల్ జీవితం కూడా. అందులో ఆమెది పెళ్లయిన సినిమా దర్శకుడిని ప్రేమించే హీరోయిన్ భూమిక. తన లైఫ్ను పోలిన పాత్ర. అయితే ఆమె భర్త రాజ్బబ్బర్ మాత్రం దర్శకుడు కాదు కథానాయకుడు. స్మిత పాటిల్తో రాజ్తో ప్రేమలో పడేనాటికి అతను ఇద్దరు పిల్లల తండ్రి. ఈ జంట ప్రేమకథే నేటి మొహబ్బతేకి అంశం. కాని దీన్ని ముక్కోణంలో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్బబ్బర్ మొదటి భార్య నదీరా కూడా నటే. ఆ ఇద్దరిదీ ప్రేమ వివాహమే. కమర్షియల్ హిందీ సినిమాతోపాటు పారలెల్ సినిమాతో పరిచయం ఉన్న ప్రేక్షకులకు రాజ్బబ్బర్, స్మితా పాటిల్లు తెలిసే ఉంటారు. థియేటర్ అభిమానులకు నదీరా తెలియకపోయే ప్రసక్తే లేదు. ముందుగా స్మిత, రాజ్ల ప్రేమ ప్రయాణం.. గొడవతో మొదలైన స్నేహం.. రాజ్బబ్బర్, స్మితా పాటిల్ కలిసి నటించిన తొలి సినిమా ‘తజుర్బా’. అయితే ఒకరికొకరు అపరిచితులుగానే ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ ఇద్దరే కలిసి నటించిన తర్వాత చిత్రం ‘భీగీ పల్కే’. ఆ షూటింగ్లో ఒకరితో ఒకరికి పరిచయం అయింది. అది కూడా చిన్న గొడవతో. ‘ఆ సినిమా సెట్స్ మీద స్మితా పాటిల్ ఎవ్వరినీ లెక్కచేయనట్టుగా కొంచెం గర్వంగా కనిపించేది. ఆ ఆటిట్యూడ్కే ఆమెతో ప్రేమలో పడ్డా’ అని చెప్పాడు రాజ్బబ్బర్ ఓ ఇంటర్వ్యూలో. గొడవతో మొదలైన ఆ పరిచయం స్నేహంగా మారింది. భీగీ పల్కే షూటింగ్ పూర్తయ్యేలోపు వీళ్ల మధ్య ప్రేమా ఖరారైంది. మీడియాకు నిప్పందాలి కాని రాజేయడం ఎంతసేపు? అలా ఆ జంట ప్రేమను పేజీల్లో కాలమ్స్గా నింపేసుకుంది. అది రాజ్బబ్బర్ భార్య నదీరా కంటా పడింది. కాని భర్త మీదున్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. ‘స్మిత నా భర్తతో చాలా క్లోజ్గా ఉందన్న విషయం నాకు తెలుసు. ఆమె రాజ్ సాహచర్యాన్ని కోరుకుంటోందనీ అర్థమైంది. ఒకవేళ్ల అది అఫైరే అయినా నాకు, పిల్లలకు రాజ్ దూరమవడనే నమ్మకంతో ఉన్నా’ అని చెప్పింది నదీరా ఒక ఇంటర్వ్యూలో. హోమ్ బ్రేకర్ నదీరా అనుకున్నట్లు జరగలేదు. రాజ్ పట్ల ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. స్మితను విడిచి ఉండలేని స్థితికి వచ్చాడు రాజ్. స్మితా అంతే రాజ్కు జీవితభాగస్వామి కావాలనుకుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు రాజ్.. నదీరాకు విడాకులు ఇవ్వకుండానే. ఆ ఇంటిని విడిచి స్మితాతో వచ్చేశాడు. హతాశురాలైంది నదీరా. సామాజిక స్పృహ ఉన్న నటిగా, అలాంటి పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న స్మితా పాటిల్ మీద బాలీవుడ్ కుటుంబాలు ‘హోమ్ బ్రేకర్’ అనే ముద్రవేశాయి. ఆ రోజుల్లో ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందిస్తూ ‘కొన్ని విషయాలు అవతలివాళ్లకు అంత తేలికగా అర్థం కావు. అర్థం చేయించలేం కూడా. అందుకే సొసైటీ నన్నెట్లా చూస్తోంది.. ద్వేషిస్తోందా? శత్రువులా ట్రీట్ చేస్తోందా అని పట్టించుకోవట్లేదు’ అని చెప్పింది. విడాకులివ్వకుండా స్మితాపాటిల్ను పెళ్లి చేసుకోవడం పట్ల రాజ్బబ్బర్ కూడా స్పందించాడు... ‘స్మితాను ప్రేమించాను అంటే నదీరాతో నాకు స్పర్థలున్నాయని కాదు. ఇద్దరినీ ఇష్టపడ్డాను.. ఇద్దరినీ పెళ్లిచేసుకున్నాను. స్మిత పట్ల నాకున్న ఫీలింగ్స్ను నదీరా అర్థం చేసుకుంది. అది చాలు నాకు’ అని. అయితే.. ఆ ఇద్దరి దాంపత్య జీవితం ఊహించినంత సాఫీగా, సంతోషంగా సాగలేదు. బయట నుంచి పరుషమైన కామెంట్లను ఎన్ని ఎదుర్కొన్నా చిరునవ్వును చెదరనివ్వలేదు స్మితా. అభద్రత వెంటాడుతున్నా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఒక బిడ్డను కని రాజ్తో ఉన్న తన ప్రేమ బంధాన్ని మరింత భద్రం చేసుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే కొడుకును కన్నది కాని మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోయింది. అటు రాజ్బబ్బర్కూ కలకాలం తోడు కాలేకపోయింది. ప్రతీక్ పుట్టిన రెండు వారాలకు బ్రెయిన్ హ్యామరేజ్తో 31 ఏళ్లకే కన్ను మూసింది స్మతాపాటిల్. ఆ నిష్క్రమణ స్మిత తల్లిదండ్రులు, రాజ్బబ్బర్నే కాదు నదీరానూ షాక్ గురిచేసింది. ‘స్మిత మరణం జీర్ణించుకోలేని విషాదం. మా అందరన్నీ కుప్పకూల్చింది. ప్రతీక్తో పాటు తను కన్న కలలనూ వదిలేసి అర్ధంతరంగా వెళ్లిపోయింది. తను లేని లోటు పూడ్చలేనిది’ అని చెప్తుంది నదీరా. ‘తను లేని ఈ లోకంలో నేను జీవచ్ఛవాన్నే. పనిలో పడి ఆ వేదనను మరిచిపోయే ప్రయత్నం చేశా. మనసుకైన గాయాన్ని మాత్రం మాన్చుకోలేకపోయా’ అంటాడు రాజ్బబ్బర్. కాని గాయపడిన ఆ మనసుకు సాంత్వననిచ్చి.. మళ్లీ అండగా నిలబడింది నదీరానే. -ఎస్సార్ -
తొలి పరిచయం!
జయప్రద తొలి పరిచయానికి శ్రీకారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ., మలయాళం, హిందీ, భోజ్ పురి.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేసిన జయప్రద ఇప్పుడు తొలి పరిచయం ఏంటీ? అనుకోవచ్చు. ఆమె పంజాబీ తెరకు పరిచయం కానున్నారు. జయప్రద చేస్తున్న తొలి పంజాబీ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. అమితాబ్ బచ్చన్, జయప్రద కాంబినేషన్లో ‘ఆజ్ కా అర్జున్’ (1990), రజనీకాంత్, ప్రేమ్ చోప్రా, రేఖ కాంబినేషన్ లో ‘ఫూల్ బనే అంగారే’ ఇంకా ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, అజయ్ దేవగన్ వంటి హీరోలతోనూ సినిమాలు తెరకెక్కించిన కేసీ బొకాడియా ఈ చిత్రానికి దర్శకుడు. అతి తక్కువ సమయంలో 50 చిత్రాలు నిర్మించిన నిర్మాతగానూ బొకాడియాకి పేరుంది. తాజాగా పంజాబీలో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మేరీ వోతీ దా వ్యాహ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ బబ్బర్, జయప్రద జంటగా తన రెండో సినిమా ‘భూత్.. అంకుల్–తుసీ గ్రేట్ హో’ని ఆరంభించారు బొకాడియా. జయప్రదకు పంజాబీలో ఇది తొలి సినిమా కాగా, దాదాపు పదేళ్ల తర్వాత రాజ్ బబ్బర్ చేస్తున్న పంజాబీ సినిమా ఇదే కావడం విశేషం. -
ఓటమికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమికి గురైన కాంగ్రెస్ పార్టీకి.. ఫలితాలకు బాధ్యత వహిస్తూ సీనియర్ నేతలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నో అశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ కేవలం ఒకే ఒక్కస్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితాల అనంతరం తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఫతేపూర్ సిక్రీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రాజ్ బబ్బర్ బీజేపీ అభ్యర్థి రాజ్కుమార్ చహర్ చేతిలో దారుణ ఓటమిని చవిచూశారు. కాగా 80 లోక్సభ స్థానాల్లో యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం ఒకేఒక స్థానంలో గెలుపొందింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీలో మాత్రమే విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం 51 స్థానాలను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. -
‘మోదీ కుర్తా సైజ్ మమతాకు తెలుసు’
కోల్కత : మమతా బెనర్జీ తనకు ప్రతియేడు రెండు జతల కుర్తాలు, స్వీట్లు పంపుతారని బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. దీనిపై మమత భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే..‘ఈ సారి మోదీకి గులక రాళ్లతో చేసిన మిఠాయిలు పంపుతా.. అవి తిన్నవెంటనే ఆయన పళ్లు ఊడిపోవడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటుడు రాజ్బబ్బర్ మోదీ, దీదీ రాజకీయా దోస్తులు అంటూ విమర్శలు గుప్పించారు. ‘బెంగాల్లో తయారయ్యే కమ్మని నేతి మిఠాయిలు, కుర్తాలు ఫేమస్. తమ రాష్టానికి వచ్చిన అతిథులకు ఈ రెండు బహుకరించడం మామూలే. అయితే, ఇప్పటివరకు మమతా ఏ పొలిటీషియన్కి కుర్తాలు బహుకరిచంలేదు. కేవలం 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తికి మాత్రమే గిఫ్ట్గా ఇచ్చారు. వారిమధ్య రాజకీయ స్నేహం ఉందని మోదీ మాటల్లో తెలిసిపోయింది. ఆయన కుర్తా కొలతలు దీదీకి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. తనది 56 అంగుళాల ఛాతీ అని మోదీ అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని బబ్బర్ గుర్తు చేశారు. బెంగాల్లో బీజేపీ బలోపేతానికి తృణమూల్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. కాగా, బబ్బర్ వ్యాఖ్యలపై తృణమూల్ అధికార ప్రతినిధి పార్థ ఛటర్జీ మండిపడ్డారు. సినిమాల్లో మాదిరి ఇతరులపై అర్థపర్థం లేని వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.సినిమాలు రాజకీయాలు ఒకటి కావనే విషయం తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వామపక్ష నేత సీతారాం ఏచూరి కూడా టీఎంసీ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. బెంగాల్లో కుస్తీ పడుతున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి.. ఢిల్లీలో దోస్తీ కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ప్రజలు ఆమోదించరని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement