-
అలుముకున్న విషాదఛాయలు
గోపవరం: టి.సండ్రపల్లె గ్రామానికి చెందిన రాధాక్రిష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి మండల కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన కొంత కాలంగా బెంగళూరులో కాంట్రాక్ట్ పనులు చేస్తూ వస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం తెలిసిన వారి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చారు. గురువారం ఉదయం వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి రాత్రి నారాయణరెడ్డితో కలిసి బెంగళూరుకు కారులో బయలుదేరారు. నారాయణరెడ్డి కూడా కాంట్రాక్టరే. మైదుకూరు మండలం జాండ్లవరం వద్ద జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో రాధాక్రిష్ణారెడ్డితోపాటు నారాయణరెడ్డి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాత్రికి రాత్రే మైదుకూరుకు చేరుకున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం స్వగ్రామమైన సండ్రపల్లెకు తీసుకువచ్చారు. అప్పటికే మండల వ్యాప్తంగా బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామానికి చేరుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాధాక్రిష్ణారెడ్డికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బీటెక్, చిన్న కుమారుడు 10వ తరగతి చదువుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సాయంత్రం నిర్వహించిన రాధాక్రిష్ణారెడ్డి అంత్యక్రియలకు ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పాల్గొన్నారు. ముందుగా రాధాక్రిష్ణారెడ్డి, నారాయణరెడ్డి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ రాధాక్రిష్ణారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
మైదుకూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా మైదుకూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. గోపవరం మండలం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాధాకృష్ణారెడ్డి కె.రాధాకృష్ణారెడ్డి మైదుకూరులో జరిగే వివాహ వేడుకకు జీపులో వస్తుండగా జాండ్లవరం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాధాకృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. జీపు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రాధాకృష్ణారెడ్డి స్వగ్రామం గోపవరం మండలం సండ్రుపల్లి గ్రామం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
2014 ఎన్నికలు ఎందుకు చారిత్రాత్మకం?
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement