-
‘కళ్ల ముందే కాలి బూడిదయ్యాయి..’
‘‘కళ్లముందే అంతా కాలి బూడిదైపోతున్నా చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరూ ఏమీ చేయలేపోయారు. ఆరు కార్లతో మొదలుపెట్టి నేడు 100 కార్ల వరకు డీలర్షిప్ తీసుకునే స్థాయికి చేరుకున్నాం. ఒక్కోమెట్టు ఎక్కుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. మేము కూడా మైనార్టీలమే. మాకు అసలు దీనితో సంబంధం లేదు. ఏం తప్పు చేశామో అర్థం కావడం లేదు. అయినా మాకే ఎందుకు ఇలా జరిగింది? గత కొన్ని రోజులుగా నా కుటుంబం కన్నీళ్లు కారుస్తూనే ఉంది’’ అంటూ భారత సంతతికి చెందిన, కెనోషా నివాసి అన్మోల్ ఖింద్రీ అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన పూర్వీకులు వలస వచ్చిన నాటి అమెరికా ఇది కాదని, అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని తాను కనీసం ఊహించలేకపోయానని ఉద్వేగానికి లోనయ్యారు. తమ కార్ల డీలర్షిప్ ప్లేస్కు నిరసనకారులు నిప్పంటించడంతో భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్లు శనివారం స్థానిక మీడియాకు తెలిపారు. 100 వాహనాలు కాలి బూడిదయ్యాయని ఆవేదన చెందారు. పెట్రోలు బంకులు, రెస్టారెంట్లలో పనిచేసిన తమ పూర్వీకుల కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయిందని భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి: ‘ఇండియన్లు, చైనీయులు దేశం విడిచి వెళ్లిపోండి’) కాగా ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విన్కొన్సిన్ రాష్ట్రంలోని కెనోషాలో కూడా ఆగష్టు 23న ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాకోబ్ బ్లేక్ అనే 27 ఏళ్ల నల్ల జాతీయుడిని పోలీసులు చుట్టుముట్టి కాల్చేసిన ఘటన నిరసనలకు దారి తీసింది. దీంతో అతడికి న్యాయం జరగాలంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు భారత సంతతికి చెందిన కుటుంబ కార్ల షాపునకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఫైరింజన్కు ఫోన్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఘటనాస్థలికి పొరుగున నివసించే జోసీ రోడ్రిగెజ్ అనే మహిళ స్థానిక మీడియాకు తెలిపారు. తాను ఎమర్జెన్సీ నంబర్కు ఫోన్ చేశానని, అయినా అటు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని, ఫైర్ఫైటర్లను అక్కడకు పంపించడం సురక్షితం కాదని సమాధానం వచ్చినట్లు పేర్కొన్నారు. (చదవండి: ‘ఆ పదవికి హారిస్ కన్నా ఇవాంకనే ఉత్తమం’) ఇక ఈ ఘటనలో బాధిత కుటుంబానికి 2.5 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు కెనోష్ న్యూస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు గో ఫండ్ మీ పేజ్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకీ జాత్యహంకార దాడులు పెరిగిపోతుండటంతో వలసదారులు భయాందోళనలకు గురవుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా (డెమొక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్ను ఉద్దేశించి)జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం ఇలాంటి ఘటనలను మరింత ప్రోత్సాహమిచ్చేలా ఉందని వాపోతున్నారు. కాగా ఆగష్టు 23 నాటి ఘటనపై స్పందించిన ట్రంప్.. ‘‘రెండు రోజుల క్రితం జాతీయ భద్రతా దళాలను విన్కోన్సిన్కు తరలించాం. అప్పటి నుంచి ఎలాంటి హింస చోటుచేసుకోలేదు. చిన్న సమస్య కూడా తలెత్తలేదు’’ అని ఆగష్టు 28న ట్వీట్ చేశారు. జాకోబ్ బ్లేక్ ఉదంతంపై తీవ్ర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కెనోషీలో పర్యటించి అల్లర్ల కారణంగా సంభవించిన నష్టం గురించి అధికారులతో చర్చించేందుకు మంగళవారం షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే రాష్ట్ర గవర్నర్, డెమొక్రటిక్ పార్టీ నేత టోనీ ఎవర్స్ మాత్రం సమస్యాత్మక ప్రాంతానికి రావొద్దని, అధ్యక్షుడి రాక కారణంగా దిద్దుబాటు చర్యలు మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్రంప్నకు లేఖ రాసినట్లు సమాచారం. ఇక డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి సైతం సోమవారం అక్కడ పర్యటించాలని భావించారు. అయితే చివరి నిమిషంలో పెన్సిల్వేనియాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లడం గమనార్హం. -
అమెరికాలో మరో విద్వేషం
న్యూయార్క్: అమెరికాలో జాత్యహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సబ్వే రైలులో ప్రయాణిస్తున్న ఓ సిక్కు మహిళను శ్వేతజాతీయుడు దూషించిన ఘటన వెలుగుచూసింది. ఆమెను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళగా భావించి ‘ఈ దేశానికి చెందిన వ్యక్తివి కావు. లెబనాన్కి తిరిగి వెళ్లిపో..’ అంటూ ఆ దుండగుడు తీవ్రంగా దూషించాడు. ఈ ఘటనను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే ‘దిస్ వీక్ ఇన్ హేట్’లో ఆమె వివరించింది. స్నేహితురాలి బర్త్డే వేడుకలో పాల్గొనేందుకు రాజ్ప్రీత్ హైర్ అనే మహిళ మన్హట్టన్ వైపు వెళ్లే సబ్వే రైలు ఎక్కింది. ఆ సమయంలో రైలులోని ఓ శ్వేతజాతీయుడు ఆమెను దేశం విడిచి వెళ్లాలంటూ పెద్దగా కేకలు వేశాడు. పరుష పదజాలంతో తీవ్రంగా దూషించాడు. కాగా, తాను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళను కాదని, ఇండియానాలోని ఓ నగరంలో జన్మించినట్లు పేర్కొంది. అయితే ఆ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఆ దుండగుడు తనను దూషించి ఉండవచ్చని ఆమె పేర్కొంది. అనంతరం ఇద్దరు మహిళలు తనకు ధైర్యం చెప్పారని, మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొంది. ఇది మా దేశం... ఇక్కడే ఉంటాం వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా ఇండో–అమెరికన్లు గళమెత్తారు. ‘ఇది మా దేశం. ఇక్కడ నివసించడానికే వచ్చాం. ఈ దేశంలో మా న్యాయ, సమాన హక్కులను డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ టౌన్హాల్ సమావేశంలో దక్షిణాసియా అమెరికన్ లీడింగ్ టుగెదర్(సాల్ట్) ప్రతినిధి సుమన్ రఘునాథన్ అన్నారు. ఇటీవల పెరిగిన విద్వేష దాడులకు వ్యతిరేకంగా యూదులు, ముస్లింలు నిర్వహించిన శాంతి ర్యాలీలో ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల్లో శాంతి నింపేందుకే ఈ ప్రయత్నమన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement