-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్ల నిండా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 77,369 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా శ్రీవారికి రూ. 2.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
వైకుంఠం క్యూకాంప్లెక్స్లో కుప్పకూలిన భక్తుడు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటు రావడంతో క్యూకాంప్లెక్స్లోనే కుప్పకూలి పడిపోయాడు. వరంగల్ పట్టణానికి చెందిన వినోద్ (40) తన స్నేహితుడు లక్ష్మీ నారాయణతో కలసి స్వామివారి దర్శనం కోసం వచ్చాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో ఉండగా శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. -
వైకుంఠం క్యూకాంప్లెక్స్లో భక్తురాలి మృతి
తిరుమల : ఏడుకొండలవాడిని చూద్దామనుకున్న ఆ భక్తురాలి ఆశ ఫలించలేదు. దర్శనం కోసం క్యూకాంప్లెక్స్లో వేచి ఉండగానే ఆమె ప్రాణాలు పోయాయి. వివరాల్లోకి వెళ్తే... మంగళవారం సాయంత్రం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తురాలు బర్షన్ కౌర్ (54) గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు మహారాష్ట్రలోని పూణె పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనతో బర్షన్కౌర్ కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది. -
అమ్మవారి ఆలయంలో మినీ క్యూకాంప్లెక్స్
రూ.5కోట్లతో తోళప్ప గార్డెన్లో అన్నదానం క్యాంటీన్ వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి..? తిరుచానూరు: అమ్మవారి దర్శనానికి వ చ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుం ఠం తరహాలో ఇక్కడ కూడా క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. మినీ క్యూకాంప్లెక్స్కు అనువైన స్థలాన్ని ఆల య అధికారులు, టీటీడీ ఇంజినీరింగ్ విభాగపు అధికారులు సంయుక్తంగా పరిశీలిస్తున్నారు. అనుకున్నట్లు సాగితే వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందు కు తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్ త రహాలోనే ఇక్కడ కూడా మినీ క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఇదివరకే టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించా రు. దీనికోసం తిరుపతి జేఈవో పోలా భాస్కర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఇక్కడున్న పాఠశాలను తొలగించి క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని తొలుత అధికారులు భావించా రు. అయితే పాఠశాలను తరలించడం పై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎ దురవడంతో టీటీడీ అధికారులు వెన క్కు తగ్గారు. ప్రత్యామ్నాయంగా పుష్కరిణి సమీపంలోని స్పెషల్గ్రేడ్ డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ భవనాన్ని తొలగించి మినీ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అది కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాలని ఇం జనీరింగ్ అధికారులు యోచిస్తున్నారు. అన్నదానం క్యాంటీన్ ప్రస్తుతం అమ్మవారి ఆస్థాన మండపం కింది భాగంలో అన్నదానం క్యాంటీన్ నడుస్తోంది. రోజుకు దాదాపు 3 నుంచి 5 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచాలని, అం దుకు అనుగుణంగా తోళప్పగార్డెన్లో అత్యాధునిక వసతులతో అన్నదానం క్యాంటీన్ నిర్మించాలని టీటీడీ పాలకమండలి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రూ.5 కోట్లు కేటాయించారు. టెండర్లను కూడా ఆహ్వానించారు. నూతన బోర్డు ఏర్పడగానే తోళప్పగార్డెన్లోని కల్యాణమండపాలను తొలగించి అన్నదాన క్యాంటీన్ పనులు ప్రారంభించనున్నారు. దీన్ని కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేయనున్నారు. రోడ్డు విస్తరణ పనులు చంద్రగిరి-రేణిగుంట బైపాస్రోడ్డు నుంచి రంగనాధం వీధి, తోళప్పగార్డెన్, శంకర్నాయుడుకాలనీ మీదుగా పూడి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వాహన రాకపోకల రద్దీని తగ్గించడానికి అనువుగా ఈ విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు. అలాగే శ్మశానవాటిక వద్ద శాశ్వత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ పనులన్నింటిని ఈ ఏడాది బ్రహ్మోత్సవాల అనంతరం చేపట్టి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
వైకుంఠంలో ఇకపై సెల్ఫోన్లు నిషేధం
సాక్షి, తిరుమల: తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లటంపై ఇప్పటికే నిషేధం ఉంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జేఈవో శ్రీనివాసరాజు శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వద్ద సెల్ఫోన్లు ఉండటం వల్ల దర్శన దందా అడ్డూ అదుపూ లేకుండా పోతోందని జేఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫోన్లతోనే దర్శనాల దందా శ్రీవారి దర్శనానికి మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్లే ప్రధాన ప్రవేశ మార్గాలు. ఇక్కడ ఏఈవో స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకు, ఇతరత్రా భద్రతా సిబ్బంది వందల సంఖ్యలో పని చేస్తుంటారు. భద్రతా కారణాలతో శ్రీవారి ఆలయంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్లలో సెల్ఫోన్లను నిషేధించారు. అయితే ఈ ఉత్తర్వుల అమలు అంతంత మాత్రంగానే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అన్ని విభాగాల సిబ్బంది దర్శనాల దందాకు వినియోగిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీనిపై ఈవో, జేఈవోలకు ఫిర్యాదులు కూడా అందాయి. అక్రమ దందాల్లో పాత్రధారులైన అన్ని విభాగాల సిబ్బందిని ఏరివేసే కార్యక్రమానికి తెరతీసారు. రెండు రోజుల ముందు దర్శన దందా చేస్తూ పట్టుబడిన ఓ సూపరిండెంటెంట్తో పాటు మరో పోటు కార్మికుడిపై వేటు వేయాలని నిర్ణయించారు. వైర్లెస్ సెట్లతోనే విధులు నిర్వహించాలి వైకుంఠం క్యూకాంప్లెక్స్లలో దర్శన దందాలకు సెల్ఫోన్లు కూడా ఓ కారణంగా ఉందని జేఈవో భావించారు. గతంలో ఉన్న నిషేధాజ్ఞలనే ఇకపై కచ్చితంగా అమలు చేయాలని శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో డెప్యూటీ ఈవో, ఏఈవో అధికారుల మినహా మిగిలిన సిబ్బంది అందరూ టీటీడీ వైర్సెల్ సెట్ల ద్వారానే సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అలా కాదని అతిక్రమిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement