-
ఖైదీల ఆత్మహత్యల నివారణకే వంద ప్రశ్నలు
సంగారెడ్డి క్రైం: రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీల ఆత్మహత్యలను నిరోధించడానికి వంద ప్రశ్నల కార్యక్రమం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా జైలు నుంచి శ్రీకారం చుట్టారు. మంగళవారం నాటికి ఈ కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. జైళ్లశాఖ డీజీ వినయ్కుమార్సింగ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ సైకాలజిస్టు, తెలంగాణ జైళ్లశాఖ, ఉన్నతి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మీనా నేతృత్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలపై వంద ప్రశ్నల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉద్ధ్యేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలాంటి తప్పులు చేయకుండా శిక్షణ అనుభవించే ఖైదీలు, జీవితకాలం శిక్ష పడ్డా ఖైదీలు మెంటల్ హెల్త్ సంబంధిత విషయాలపై వారి సత్ప్రప్రవర్తనను గుర్తించడానికి వంద ప్రశ్నల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఖైదీలు ఏ వయస్సులో ఉన్నారు వారు ఏ విధమైన నేరాలు చేశారనే విషయాన్ని ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వారికి సంబంధిత విషయాలపైనే వందప్రశ్నలు తయారు చేస్తామన్నారు. చాలా మంది శిక్షను అనుభవించే వారిలో డిప్రెషన్కు గురై అఘాయ్యితాలకు చేసుకుంటున్నారన్నారు. వీటి నివారణకే ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి జిల్లా జైలును ఎంపిక చేయడం జరిగిందన్నారు. చాలా చోట్ల ఎలాంటి నేరం చేయకుండా జైళ్లకు వచ్చి శిక్షను అనుభవించే ఖైదీలు మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి ఆత్మహత్యలను నివారించడానికే ఈ వంద ప్రశ్నల కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందులో మూడు విభాగాలుగా విభజిస్తామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలపై వంద ప్రశ్నలు ప్రయోగించి అందులో మూడు విభాగాలు విభజిస్తామన్నారు. ఖైదీలు ఎక్కువగా డిప్రెషన్లో ఉన్న వారికి ఒక విభాగం, సాధారణంగా ఉన్న వారిని మరో విభాగం, తక్కువగా ఉన్న వారిని మరో విభాగంగా విభజించి వారికిచ్చే కౌన్సెలింగ్ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. ఈ విషయాన్ని కంప్యూటర్లో ఎప్పుటికప్పుడు పొందుపరుస్తామని తెలిపారు. కంది జిల్లా జైలులో 180 మంది ఖైదీలు ఉండగా వారికి మూడు రోజుల్లో వంద ప్రశ్నల కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా పాకిస్తాన్లోని లాతూర్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్, రచయిత డాక్టర్ కంచెన్సెతు, ప్రస్తుత హైదరాబాద్ నివాసి అయిన జైళ్లలో ఉన్న ఖైదీల వ్యక్తిగతాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించి జిల్లా జైలుకు తగిన సూచనలు అందించారు. అదే విధంగా ఉన్నతి ప్రోగ్రాం ద్వారా ఎందరో ఖైదీలు మానసిక ప్రవర్తన పొంది ఇతరులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఉన్నతి ద్వారా అనేక మంది ఖైదీలు నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే సంఖ్య తగ్గిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సరోజా ఆర్య, డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ నిరంజన్రెడ్డి, స్రవంతి, రజిత, జైలు కౌన్సిలర్ హరిశంకర్తో పాటు జైలు సూపరింటెండెంట్ సంతోష్రాయ్, జైలర్ కాళిదాసు పాల్గొన్నారు. -
'ఖైదీల ఆత్మహత్యలు నివారించాలి'
హైదరాబాద్: చర్లపల్లి కారాగారంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని నిరోధించడానికి పటిష్టమైనచర్యలు తీసుకోవాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది. రెండురోజుల్లో రెండు ఆత్మహత్యలు జరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. నేరస్తులు, ముద్దాయిలుగా రిమాండ్లో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన నైతికబాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఖైదీలు ఆత్మహత్యలు చేసుకోకుండా, వారిపై ఇతరులు దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతను జైలు సంస్కరణలు గుర్తుచేస్తూనే ఉంటాయన్నారు. ఈ అంశాలపై అధికారులకు తగిన ఆదేశాలివ్వాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement