-
కొడుకును తప్పించేందుకు ఓ తల్లి సాహసం
న్యూఢిల్లీ : కొడుకు రాజైనా, పేదయినా, చివరకు నేరస్థుడైనా అతనిపై తల్లికి ప్రేముంటుందని అంటారు. ఈ నిజాన్ని మరోసారి నిర్ధారించింది ఉక్రెయిన్లోని దక్షిణ జపోరిజియా ప్రాంతంలో నివసిస్తున్న ఓ తల్లి ఉదంతం. హత్య కేసులో నేరం రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కొడుకును జైలు నుంచి తప్పించేందుకు ఆ తల్లి అనూహ్య నిర్ణయం తీసుకుంది. జైలు పక్కన పది అడుగుల లోతులో ఏకంగా 35 అడుగుల పొడవైన సొరంగాన్ని ఒంటరిగా తవ్వింది. అది కూడా సాధారణ చేతి పరికరాలు, పనిముట్లను ఉపయోగించి ఆ పని చేసింది. ఆ తల్లి ముందస్తు వ్యూహంతో జైలుకు సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకుంది. జైలుకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో సొరంగం తవ్వకానికి స్థలాన్ని ఎంపిక చేసుకుంది. పగలు చేస్తే జనం దష్టిలో పడతాననే ఉద్దేశంతో ఆమె కేవలం రాత్రి పూటే మూడు వారాల పాటు కష్టపడి పది అడుగుల లోతు నుంచి జైలు ప్రహారీ గోడల లోపలి వరకు సొరంగ మార్గాన్ని తవ్వింది. అలా తవ్వడం ద్వారా వచ్చిన దాదాపు మూడు టన్నుల మట్టిని సమీపంలో ఉన్న నిరుపయోగ చెత్తకుండిలో పారవేసింది. ఆమె వద్ద రెండు చక్రాలు కలిగిన చెత్తను మోసుకుపోయే ఇనుప లాగుడు బండి ఉందని, దానిలో తట్టా, పార వేసుకొని జైలుకు సమీపంలో అప్పుడప్పుడు కనిపించిందని జైలు సెక్యూరిటీ గార్డు తెలిపారు. మూడు వారాల అనంతరం ఆమె సొరంగ మార్గాన్ని తవ్వుతూ జైలు సెక్యూరిటీ గార్డులకే పట్టుబడింది. అంతకుముందు ఐదు కిలోమీటర్ల దూరంలోని మైకలోవ్ ప్రాంతంలో తల్లి కొడుకులు నివసించేవారట. కొడుకు ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి జైలుకు రావడంతో ఆ తల్లి ఈ సాహసానికి ఒడిగట్టింది. ఆమె పేరునుగానీ, ఆమె కొడుకు పేరునుగానీ వెల్లడించేందుకు ఉక్రెయిన్ జైలు అధికారులు నిరాకరించారు. ఉక్రెయిన్ ప్రజలు మాత్రం ఆ మాతమూర్తిని ప్రశంసలతో ముంచెత్తారు. కొడుకు కోసం ఆ తల్లి చేసిన సాహసాన్ని వారు మెచ్చుకున్నారు. -
బండిపై హలో.. జైలుకి చలో..!
సాక్షి, అమరావతిబ్యూరో: సెల్ఫోన్లో మాట్లాడుతూ రోడ్డుపై వాహనం నడుపుతున్నారా? అయితే మీ డ్రైవింగ్ లెసెన్స్ రద్దుతోపాటు మీరు జైలుకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే.. సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందంటూ కోర్టులకు నివేదించనున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఇలాంటి కేసుల తీవ్రతను పరిశీలిస్తున్న న్యాయమూర్తులు జరిమానాతో పాటు జైలుశిక్షలు విధిస్తున్నారు. ఇటీవల నగర కమిషనరేట్ పరి«ధిలోనూ సెల్ఫోన్ చూస్తూ వాహనదారులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఈ ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదాల కారణాలు.. నగర ట్రాఫిక్ పోలీసులు వాహనచోదకులు సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, హెల్మెట్లో ఫోన్ను ఉంచుకుని వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని పట్టుకుంటున్నారు. పోలీసులు లేని చోట్ల కమాండ్ కంట్రోల్కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 2019 జనవరి నుంచి 2020 జనవరి వరకు 5,388 మందిపై సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న చోదకులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో కొన్ని ప్రత్యేక బృందాలు వాహనచోదకుల తీరును గమనిస్తున్నాయి. సెల్ఫోన్తో మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు చోదకుల ప్రవర్తనల్లో మార్పులను బృందం సభ్యులు పరిశీలించారు. ఫోన్ మోగగానే... ద్విచక్రవాహనచోదకులు వెంటనే దాన్ని చేతికి తీసుకుని మరో చేత్తో వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు అవతలి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వినిపించకపోవడంతో ఫోన్ దగ్గరగా పట్టుకునే ప్రయత్నంలో యాక్సిలేటర్ ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. మూడేళ్లలో వెయ్యిమందికిపైగా మృత్యువాత.. విజయవాడలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తే 80 శాతంపైగా ప్రమాదాలు సెల్ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలోనే చోటుచేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. 2017లో 349 మంది వాహనచోదకులు మృత్యువాత పడగా.. 2018లో 359 మంది, 2019 నుంచి 2020 జనవరి నాటి వరకూ 375 మంది మరణించారు. కఠిన చర్యలు ఉంటాయి.. అధిక శాతం మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించకకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడపుతున్నారు. దీనివల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి కారకులవుతున్నారు. అత్యధిక శాతం ప్రమాదాలు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సందర్భంలోనే జరిగాయి. గత పదమూడు నెలల కాలంలో నగరంలో 5,388 మంది వాహనచోదకులు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడుపుతుండటం వల్ల వారిపై కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు కేవలం జరిమానాలతో సరిపెట్టాం. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. – టీవీ నాగరాజు, విజయవాడ ట్రాఫిక్ డీసీపీ -
చెరసాలేనా చిన్నమ్మ?
నాలుగేళ్ల శిక్ష ముగింపు దశకు చేరుకుంది. జైలు నుంచి విముక్తిపై శశికళ చుట్టూ కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. జరిమానా రూపంలో చిన్నమ్మ చిక్కుల్లో పడ్డారు. జరిమానా చెల్లించనట్లయితే అదనంగా ఏడాది పాటు జైలు జీవితం తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్లో ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పింది. ఇదే కేసులో సహ నిందితులైన జయ నెచ్చెలి శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏడాదిపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై రెండేళ్ల పాటు అప్పీళ్లపై అప్పీళ్లతో శిక్ష అమలులో జాప్యం చోటుచేసుకుంది. 2016 డిసెంబర్లో జయలలిత కన్నుమూయగా 2017 ఫిబ్రవరి నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిమానాకు గురైన వారు శిక్ష ముగిసే సమయంలోనే చెల్లిస్తారు. శశికళ వ్యవహారంలో చెక్ లేదా డీడీ రూపంలో జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియబరుస్తూ ఆదాయపు పన్నుశాఖకు ఆదారాలు చూపి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను జతచేసి చెల్లించాలి. ఖైదీగా ఉన్న కాలంలో జైలు నిబంధనలకు అనుగుణంగా, క్రమశిక్షణతో వ్యవహరించినవారు శిక్షా కాలం నుంచి మినహాయింపు పొంది ముందుగానే విడుదలయ్యే వెసులుబాటు ఉంది. ఈ కేటగిరి కింద శశికళ నాలుగేళ్లు ముగిసేలోపే విడుదలవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దోపిడీ, హత్య, అత్యాచారం కేసుల్లో 14 జైలుశిక్ష పడిన వారికి మాత్రమే ముందస్తు విడుదల వెసులుబాటు వర్తిస్తుంది. అవినీతి కేసులో శిక్ష పడినవారు అందుకు అనర్హులని అంటున్నారు. శశికళ రూ.10 కోట్ల జరిమానా చెల్లించిన పక్షంలో 2021 జనవరి 25వ తేదీన జైలు నుంచి విడుదల అవుతారు. జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 15వ తేదీ వరకు జీవితం గడపక తప్పదని జైళ్లశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు రెండేళ్ల కిత్రం శశికళ సొంత వ్యాపారాలు, బంధువుల వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు చేసి రూ.5వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు. ఈ పరిస్థితిలో రూ.10 కోట్ల జరిమానాను కరెన్సీ రూపంలో శశికళ చెల్లించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ శశికళ బంధువులు, స్నేహితులు చెల్లించినా వారికి సైతం ఐటీ అధికారుల బెడద ఉంటుంది. శశికళ తరఫున అంతపెద్ద మొత్తాన్ని కట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. శశికళ రూ.10 కోట్లు జరిమానా చెల్లించి వచ్చే ఏడాది విడుదల అవుతారా..? లేక మరో ఏడాది పాటు జైల్లోనే ఉండిపోతారా..? అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. -
లైంగిక దాడి యత్నం; తండ్రికి పదేళ్ల జైలు
విశాఖ లీగల్: కన్న కూతురుపై లైంగిక దాడికి యత్నించిన తండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ నగరంలోని ఒకటో అదనపు జిల్లా కోర్టు(పోక్సో చట్ట పరిధిలోని నూతన న్యాయస్థానం) న్యాయమూర్తి ఎ.వి.పార్థసారథి శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.వేణుగోపాలరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు డారక్ హయిస్(37) నగరంలోని బీచ్ రోడ్డులో ఉంటున్నాడు. అతనికి వివాహం జరిగి, 12 ఏళ్ల కుమార్తె ఉంది. నేరం జరగడానికి ముందు కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు చట్టరీత్యా విడిపోయారు. బాధితురాలి తల్లి విదేశాల్లో ఉంటున్నారు. బాలిక తన అమ్మమ్మ దగ్గర ఉంటోంది. కుమార్తెను చూడడానికి నిందితునికి కోర్టు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో బాలిక తరచూ తండ్రి దగ్గరకు వెళ్లేది. ఇదే అదునుగా నిందితుడు డారక్ హయిస్ 2014 అక్టోబర్ 22వ తేదీ రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి కూడా యత్నించినట్టు ఆమె కోర్టులో వివరించింది. బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి అప్పటి ఏసీపీ నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ కీలకమైన ఐదుగుర్ని విచారించింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. విశాఖలో గత అక్టోబర్ 2న ఏర్పాటైన పోక్సో చట్టం–2012 పరిధిలోని నూతన న్యాయస్థానంలో ఇదే తొలితీర్పు కావడం విశేషం. -
నిత్య పెళ్లికూతురు తండ్రికి రెండేళ్ల జైలు
ఖాజీపేట: ఒకరికి తెలియకుండా మరొకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని వంచనకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు కేసులో ఆమె తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే లో వివాహమైంది. అమ్మాయి బాగుండడంతో ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. కొద్ది నెలల పాటు వీరు సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత ఆగస్టు 25న అనంతరెడ్డి వచ్చి తమ కూతురిని పుట్టింటికి తీసుకెళతానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త రామకృష్ణారెడ్డి ఆగస్టు 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె వాడుతున్న సెల్ నంబర్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్లో ఆమెతో పాటు చంటినాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కొమ్మలూరుకు చెందిన వ్యక్తికి వివాహం చేసుకునే ముందు ఆమెకు నలుగురితో వివాహమైందని, ఇతన్ని వివాహం చేసుకుని పారిపోయిన తర్వాత హైదరాబాద్కు చెందిన వ్యక్తిని ఆరో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. మైదుకూరు కోర్టులో ఏడాది పాటు కేసు విచారణ జరిగింది. కిలాడీ లేడి తండ్రి అనంతరెడ్డిని దోషిగా గుర్తించిన కోర్టు ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మౌనికతో పాటు చంటినాయక్ కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వారు దొరికితే వారు చేసిన నేరంపై కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement