-
Parliament Budget Session: కాంగ్రెస్కు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు కాలం చెల్లిపోయిందని, ఆ పార్టీకి వారంటీ లేదని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఉత్తరం, దక్షిణం అంటూ రెండుగా విభజించానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ బుధవారం సమాధానమిచ్చారు. దాదాపు 90 నిమిషాలపాటు మాట్లాడారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్లో ఇదే ఆయన చివరి ప్రసంగం కావడం విశేషం. కేంద్రంలో తాము వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పునరుద్ఘాటించారు. ‘మోదీ 3.0 ప్రభుత్వ’ హయాంలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్ల తమ విజన్ను ఆవిష్కరించారు. వికసిత భారత్ పునాదిని పటిష్టం చేస్తామని ప్రకటించారు. మోదీ 3.0 సర్కారు ఏర్పాటు ఇక ఎంతోదూరంలో లేదని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన కాంగ్రెస్ ‘‘దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ ఎప్పటికీ వ్యతిరేకమే. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లేకపోతే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు దక్కేవే కావు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పట్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటే ప్రభుత్వ పరిపాలన దెబ్బతింటుందని నెహ్రూ చెప్పారు. ఓబీసీలకు కాంగ్రెస్ ఎప్పుడూ పూర్తిస్థాయి రిజర్వేషన్లు ఇవ్వలేదు. జనరల్ కేటగిరీలోని పేదలను కూడా పట్టించుకోలేదు. భారతరత్న పురస్కారానికి అంబేడ్కర్ అర్హుడని కాంగ్రెస్ భావించలేదు. సొంత కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డులు ఇచ్చుకున్న చరిత్ర కాంగ్రెస్కు ఉంది. అలాంటి పార్టీ ఇప్పుడు మాకు నీతిపాఠాలు బోధిస్తోంది. మన దేశ భూభాగాలను శత్రు దేశానికి అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత భద్రతపై మాకు ఉపన్యాసాలు ఇస్తోంది. ఆ పార్టీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని గొంతుకోసి చంపేసింది. ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాత్రికి రాత్రే కూలదోసింది. వికసిత భారత్.. మా అంకితభావం కాంగ్రెస్ పాలనలో దేశం సమస్యల వలయంలో చిక్కుకుంది. వాటి పరిష్కారానికే ప్రధానిగా నా రెండు టర్ములను వెచ్చించాను. వికసత భారత్ ఒక పదం కాదు. అది మా అంకితభావం. సబ్కా సాత్ అనేది నినాదం కాదు. అది మోదీ ఇస్తున్న గ్యారంటీ. వారంటీ తీరిపోయినవారు చెప్పే మాటలను దేశం వినిపించుకోదు. గ్యారంటీ బలాన్ని చూపించినవారినే దేశం విశ్వసిస్తుంది. అన్ని వర్గాల సంక్షేమానికి పదేళ్లుగా కృషి ‘యువరాజు’ (రాహుల్)ను స్టార్టప్గా తయారు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ, ఆయనొక నాన్–స్టార్టర్. ఎంత లిఫ్ట్ చేయాలని చూసినా ఫలితం ఉండడం లేదు. కాంగ్రెస్ ఆలోచనావిధానానికి కాలం చెల్లింది. అందుకే ఆ పార్టీ పనులను ఔట్సోర్సింగ్కు ఇచ్చారు. కాంగ్రెస్ నానాటికీ దిగజారిపోతుండడం మాకూ బాధగానే ఉంది. సొంత పార్టీ నేత పట్ల గ్యారంటీ లేని కాంగ్రెస్ మోదీ గ్యారంటీని ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదం. పదేళ్ల యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగే దీన్ని అంగీకరించారు. దేశ సమస్యలేమిటో తెలిసినా వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ఏనాడూ కృషి చేయలేదు. బ్రిటిష్ పాలన నుంచి స్ఫూర్తి పొంది బానిసత్వపు గుర్తులను దశాబ్దాల పాటు కొనసాగించింది. మేము అధికారంలోకి వచ్చాక సమస్యల సుడిగుండం నుంచి దేశాన్ని బయటపడేశాం. మా గళానికి ప్రజలు బలమిచ్చారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు దేశమంతటా 40 సీట్లు కూడా రావన్న సవాలు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది. ఇప్పుడున్న 40 సీట్లను కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నా. విపక్షాల ప్రతి మాటను మేం చాలా సహనంతో వింటున్నాం. కానీ, మేము చెప్పేది ప్రతిపక్షాలు వినడం లేదు. మా గళాన్ని మీరు అణచివేయలేరు. దానికి దేశ ప్రజలు చాలా బలమిచ్చారు’’. దయచేసి ఆ భాష మానుకోండి ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. భారత్ను ఉత్తర, దక్షిణంగా ముక్కలు చేయడానికి కొత్తకొత్త ప్రకటనలు చేస్తోంది. ఉత్తరం, దక్షిణం అనే విభజన రేఖ తీసుకురావడం కాంగ్రెస్, కర్ణాటక ప్రభుత్వం మానుకోవాలి. దేశ భవిష్యత్తుతో చెలగాటం వద్దు. ‘మా పన్నులు, మా డబ్బులు’ అంటూ మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఇలాంటి భాష బాధగా ఉంది. దయచేసి ఆ భాష మానుకోండి. దీనివల్ల దేశానికి నష్టం తప్ప లాభం ఉండదు. దేశమంటే కొన్ని భూభాగాల సమ్మేళనం కాదు. ఒక అంగం పనిచేయకపోతే శరీరమంతా స్తంభిస్తుంది. అలాగే దేశంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేస్తే దేశమంతా అభివృద్ధి చెందలేదు’’. -
‘అవినీతిపై కేంద్రం నిరంతరం పోరాడుతోంది’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగాన్ని ద్రౌపది ముర్ము.. పార్లమెంట్ సభ్యుల సాక్షిగా దేశానికి వినిపించారు. ఈ క్రమంలో దేశం అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్న ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్నది ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది. వన్ నేషన్ వన్ రేషన్ మంచి కార్యక్రమం. భారత్ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పెద్ద భరోసా. పేదల ఉపాధి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. మూడు కోట్ల మంది పేదలకు కేంద్రం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మూడేళ్లలో 11 కోట్ల మందికి ఇంటింటికీ మంచినీరు అందించింది. దేశ ప్రజలకు కోవిడ్ నుంచి విముక్తి కల్పించింది ప్రభుత్వం. నిరుపేద కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అన్ని విధాలుగా కోవిడ్ కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేసింది. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాళ్ల అభివృద్ధికి పాటుపడుతోంది. ఓబీసీల సంక్షేమం కోసం కీలక ముందడుగు వేసింది. గిరిజన నేతలకు మంచి గుర్తింపు లభిస్తోంది. బాగా వెనుకబడిన గ్రామాలను కేంద్రం అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. భేటీ బచావ్-భేటీ పడావ్ నినాదం ఫలితాన్నిచ్చింది. దేశంలో తొలిసారిగా మహిళల సంఖ్య పెరిగింది. పీఎం ఆవాస్ యోజన పథకం సత్ఫలితాలు ఇచ్చింది. బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. అంతరిక్ష ప్రయోగాలతో భారత్ అత్యద్భుత ప్రగతి సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అతిపెద్ద శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ ఫార్మా హబ్గా భారత్ ఎదుగుతోందని కొనియాడారామె. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పొరుగు దేశాల సరిహద్దుల్లోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. దేశంలో అవినీతిపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తన ప్రసంగంలో కేంద్రంపై ప్రశంసలు గుప్పించారామె. -
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు రామ్నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సంస్కృతి నేటి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దం భారత్దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కాన్పుర్ దేహాత్ జిల్లా పరౌఖ్ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరినట్లు కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన శాయశక్తుల మేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. తనకు సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సోమవారం ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: ఉద్ధవ్ థాక్రేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. ఆయన తలరాత ఆ రోజే ఖరారైంది -
లోక్సభ టాప్ గేర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై చర్చలు మొదలుకుని బిల్లుల ఆమోదం తదితర అన్ని అంశాల్లోనూ ప్రస్తుత లోక్సభ చక్కని పనితీరు కనబరుస్తోంది. చర్చల నిడివి, వాటిలో పాల్గొన్న సభ్యుల సంఖ్యతో పాటు ఆమోదించిన బిల్లుల విషయంలోనూ 14, 15, 16వ సభలతో పోలిస్తే ప్రస్తుత 17వ లోక్సభ మెరుగ్గా రాణించింది. అన్నింటా ముందే... 17వ లోక్సభ 2019 మే 25న కొలువుదీరింది. జూన్ 17న తొలి సమావేశం జరిగింది. మూడేళ్లలో ఎనిమిదిసార్లు సమావేశమైంది. ఎన్నో అరుదైన రికార్డులు సాధించింది. ఏకంగా 995 గంటల పాటు కార్యకలాపాలు జరిపింది. అవి ఎన్నోసార్లు అర్ధరాత్రి దాకా కొనసాగాయి. ఆ లెక్కన 106 శాతం ఉత్పాదకత సాధించింది. ఇది 16వ లోక్ సభ కంటే 11 శాతం, 15వ సభ కంటే 35 శాతం ఎక్కువ! 15వ సభలో చర్చలకు తీసుకున్న సగటు సమయం 85 నిమిషాలు, పాల్గొన్న సభ్యుల సంఖ్య 921 కాగా ఈ సభలో సగటు సమయం 132 నిమిషాలకు పాల్గొన్న సభ్యుల సంఖ్య ఏకంగా 2,151కి పెరగడం విశేషం. రాష్ట్రపతి ప్రసంగంపై 14వ సభలో 266 మంది సభ్యులు మాట్లాడగా ఈసారి 518 మందికి పెరిగింది. సభ్యులు 377 రూల్ కింద 3,099, జీరో అవర్లో 4,648 అంశాలు ప్రస్తావించారు. టెక్నాలజీ వాడకంతో రూ.668.86 కోట్లు ఆదా చేసింది. స్టాండింగ్ కమిటీలు 419 సమావేశాలు జరిపి 4,263 సిఫార్సులు చేశాయి. 2,320 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. కొత్తవారికి ప్రోత్సాహం మూడేళ్ల సభా కార్యకలాపాలు పూర్తి తృప్తినిచ్చాయి. చర్చలు గతంకన్నా మెరుగ్గా జరిగాయి. కొత్త సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశాలిచ్చాం. ఎన్నోసార్లు సభా సమయాన్ని పొడిగించి ప్రత్యేక ప్రస్తావనల అంశాలకు చాన్సిచ్చాం. పార్లమెం ట్ కొత్త భవన నిర్మాణం చకచకా సాగుతోంది. ఈ ఏడాది శాతాకాల సమావేశాలు అందులోనే జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం – స్పీకర్ ఓం బిర్లా -
రైతుల ఉద్యమం పవిత్రమైనదే.. కానీ: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు చేస్తోన్న ఉద్యమం పవిత్రమైనదే కానీ.. ఆందోళన జీవి వల్ల అది దారి తప్పుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్సభలో సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ.. వివిధ అంశాలపై సుధీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా రైతుల ఉద్యమానికి సంబంధించి మోదీ చేసిన ఆందోళన జీవి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతుండటంతో ఆయన దీనిపై స్పందించారు. ‘‘రైతుల చేస్తోన్న ఉద్యమం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆందోళన జీవులు రైతుల ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. వారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను.. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని, నక్సల్స్ను, ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ ఆందోళన జీవులు రైతులకు మేలు చేసే వారు ఎలా అవుతారు’’ అని మోదీ ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఆందోళన ముఖ్యం. కాని జనాలు ప్రజాస్వామ్యం, నిజమైన ఆందోళనకారుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. పంజాబ్లో మొబైల్ టవర్లను ధ్వంసం చేయడం ఏంటి.. వ్యవసాయ చట్టాలతో దానికి సంబంధం ఏంటి’’ అని మోదీ ప్రశ్నించారు. ప్రైవేట్ రంగం కూడా కీలకమే ‘‘ప్రభుత్వ రంగం అనివార్యమే ఒప్పుకుంటాను. కానీ అదే సమయంలో ప్రైవేట్ రంగం కూడా కీలకమే’’ అని ప్రధాని పేర్కొన్నారు. టెలికాం, ఫార్మా సహా ఏ రంగం తీసుకున్నా ప్రైవేట్ రంగం పాత్ర విస్మరించలేమని తెలిపారు. ప్రైవేట్ రంగాన్ని కించపరుస్తూ మాట్లాడే సంస్కృతికి కాలం చెల్లిందన్నారు. గతంలో ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని పార్టీలకు ఓట్లు పడేవి. కానీ ఇప్పుడా రోజులకు కాలం చెల్లిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులతో సేద్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రయోజనమే తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదని మోదీ స్పష్టం చేశారు. చదవండి: ప్రధాని మోదీకి చిదంబరం గట్టి కౌంటర్ హలధారులే కానీ.. హంతకులు కారు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement