-
ప్రేమలతకు ప్రమోషన్...నేపథ్యం ఇదీ
సాక్షి, చైన్నె : దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం(డీఎండీకే) ప్రధాన కార్యదర్శిగా ప్రేమలత విజయకాంత్ ఎంపికయ్యారు. కోశాధికారి పదవి నుంచి ఆమెకు ప్రమోషన్ కల్పిస్తూ డీఎండీకే సర్వ సభ్య సమావేశంలో గురువారం తీర్మానం ఆమోదించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పార్టీ సర్వ సభ్య సమావేశానికి హాజరైన అధ్యక్షుడు విజయకాంత్ నీరసించి ఉండడంతో మహిళా కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. నేపథ్యం ఇదీ.. 2005లో సినీ నటుడు విజయకాంత్ డీఎండీకేను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో తానొక్కడే అసెంబ్లీకి ఎన్నికై నా , ఆయన పార్టీ సాధించిన ఓటు బ్యాంక్ తమిళ రాజకీయాలలో విజయకాంత్ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో చేతులు కలిపి డీఎంకేను చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. 2014 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూసినా ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆతర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది. దీంతో తన వద్ద అదనంగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్కు అప్పగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. మహిళా నేత నుంచి ప్రధాన కార్యదర్శి వరకు విజయకాంత్ ఆస్పత్రిలో మూడు వారాలకు పైగా చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై వదంతులు సైతం వచ్చాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం తిరువేర్కాడులో జరిగిన డీఎండీకే సర్వస సమావేశానికి ఆయన హాజరయ్యారు. చిక్కి శల్యమైన తమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమవుతూ, కరతాళ ధ్వనులతో ఆయన్ని కేడర్ ఆహ్వానించింది. వేదిక మీద కూర్చుని తన దైన శైలిలో హావాభావాలతో అభిమానులు, కేడర్ను విజయకాంత్ పలకరించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో 17 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో కీలక తీర్మానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రేమలత విజయకాంత్కు అప్పగించారు. ఈ సమయంలో తన భర్త, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ నుంచి ప్రేమలత ఆశీస్సులు అందుకున్నారు. ఈ సమయంలో ఆ వేదిక అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. ప్రేమలత విజయకాంత్ డీఎండీకే ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు విజయకాంత్ వెన్నంటి ఉంటూ వచ్చారు. పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా 13 ఏళ్లు పనిచేశారు. 2018 నుంచి డీఎండీకే కోశాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విజయకాంత్ అనారోగ్య పరిస్థితులతో పార్టీని తన భుజాన వేసుకుని నడిపించేందుకు ప్రేమలత సిద్ధమయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తన తొలి ప్రసంగంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లడమే కాకుండా, కేడర్, అభిమానులకు ఎల్ల వేళలా తాను అండగా ఉంటానని విజయకాంత్ బాణిలో ప్రకటించారు. అదే సమయంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పందేరాలు, తదితర నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని మాత్రం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్కు అప్పగించారు. ఇవికాకుండా ఇతర నిర్ణయాలను తీసుకునే అధికారం ప్రేమలతకు కేటాయించారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి హాజరైన విజయకాంత్ చిక్కిశల్యమైన కనిపించడం అభిమానులు, కేడర్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. కుర్చీలో తనకు తానుగా కూర్చునే స్థితి లేక, తరచూ తన దైన శైలిలో సంకేతాన్ని చూపించే ప్రయత్నంలో ముందుకు పడబోయిన ఆయన్ని వెనుక నుంచి తనయుడు విజయ ప్రభాకరన్, పార్టీ నేత పార్థసారథి గట్టిగా పట్టుకునే ఉండడం అభిమానులను కలిచి వేసింది. -
అన్నాడీఎంకేకు ప్రేమలత హెచ్చరిక
సాక్షి, చెన్నై: కూటమి ధర్మానికి కట్టుబడి ఓపికగా ఉన్నాం...అదే నశిస్తే...ఒంటరి పోటీకి రెడీ అని అన్నాడీఎంకేకు డీఎండీకే కోశాధికారి ప్రేమలత హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే ఉందని ఆ పార్టీ పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు అన్నాడీఎంకే వర్గాలు డీఎండీకేతో సీట్ల పందేరం విషయంగా స్పష్టత ఇవ్వలేదు. మమా అనిపించే రీతిలో పయనం సాగుతున్నాయేగానీ, పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు, కూటమి చర్చ సాగలేదు. పలుమార్లు చర్చలకు డీఎండీకే ఆహా్వనించినా అన్నాడీఎంకే దృష్టి అంతా పీఎంకేపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎదురుచూసి తమకు సహనం నశించిందని, ఇక ఒంటరి పోటీకి సిద్ధమయ్యే నిర్ణయం తీసుకోకతప్పదని అన్నాడీఎంకేకు ప్రేమలత విజయకాంత్ ఆదివారం హెచ్చరికలు చేయడం గమనార్హం. ప్రేమలత హెచ్చరిక.. టీనగర్, సైదాపేట, మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాంబళంలో ఆదివారం ప్రేమలత భేటీఅయ్యారు. ఆమె అన్నాడీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. అన్నాడీఎంకే కూటమిలో ఉన్నా కాబట్టే, ఆ కూటమి ధర్మానికి కట్టుబడి చర్చల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కూటమి ధర్మాన్ని తాము గౌరవిస్తున్నామని, అందుకే ఓపికతో, సహనంతో ఉన్నామని, ఇది నశించిన పక్షంలో ఒంటరి పోటీకి సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పటికే 234 నియోజకవర్గాలకు విజయకాంత్ ఇన్చార్జ్లను నియమించారని, వాళ్లనే తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. తాము ఒంటరిగా పోటీ చేసినా పదిహేను శాతం ఓటు బ్యాంక్ దక్కించుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. -
ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత
సాక్షి, చెన్నై: అసెంబీ ఎన్నికల్లో ఒంటరి పోరుకైనా సిద్ధంగానే ఉన్నామని శనివారం డీఎండీకే ప్రకటించింది. ఆదివారం పొత్తుపై ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటన చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమితో ఎన్నికల్ని డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, ఉన్న కాస్త ఓటు బ్యాంక్ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి. అయినా తాము అదే కూటమిలో ప్రస్తుతానికి ఉన్నామని ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత చెబుతున్నారు. 2021 ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది అందరితో చర్చించి ప్రకటిస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓ వైపు స్పందిస్తూ, మరో వైపు చిన్నమ్మ శశికళకు మద్దతుగా గళాన్ని ప్రేమలత వినిపించడం చర్చకు దారి తీసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే ఎటో అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే సైతం డీఎండీకేను పెద్దగా పట్టించుకోనట్టుగా ప్రచారం సాగుతోంది. డీఎండీకే 41 సీట్లు ఆశిస్తుండగా, పది సీట్లు ఇవ్వడానికి అన్నాడీఎంకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో శనివారం డీఎండీకే ఇన్చార్జ్ల సమావేశం జరగడంతో ప్రాధాన్యత నెలకొంది. ఇన్చార్జ్లతో భేటీ.. విజయకాంత్ దూరం.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను డీఎండీకే రంగంలోకి దించిన విషయం తెలిసిందే. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ ఇన్చార్జ్లను నియమించి ఎన్నికల పనుల వేగాన్ని పెంచారు. మొత్తం 320 మంది ఇన్చార్జ్లతో డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ శనివారం కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశానికి అధినేత విజయకాంత్ రాలేదు. ఇందులో అసెంబ్లీ ఎన్నికల పనులు, పట్టున్న నియోజకవర్గాలు, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే పరిస్థితి గురించి సమీక్షించారు. సమావేశం చివర్లో పొత్తు నిర్ణయానికి అధికారాన్ని విజయకాంత్కు అప్పగించారు. ఒంటరి పోటీకైనా డీఎండీకే సిద్ధం అని ప్రకటించారు. పొత్తా, ఒంటరి పయనమా అనే విషయంగా ఆదివారం విజ యకాంత్ ప్రకటన చేస్తారని డీఎండీకే వర్గాలు పేర్కొనడంతో ఎదురుచూపులు పెరిగాయి. -
అమెరికాలోనే ప్రేమలత అంత్యక్రియలు
సాక్షి, పూతలపట్టు(చిత్తూరు రూరల్): ప్రేమలత అంత్యక్రియలను ఆదివారం అమెరికాలోనే పూర్తిచేశారు. పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన ప్రేమలత అమెరికాలో గత మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం కోసం ప్రేమలత కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా నిరీక్షించారు. తమ కుమార్తె మృతదేహం కావాలని ప్రేమలత భర్త, మామతో పట్టుబట్టారు. కడసారి చూపు చాలంటూ రోదించారు. కోవిడ్–19 కారణంగా చూపి అత్తంటివారు.. తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాలేతున్నామని చెబుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు వివరించారు. మన దేశ సమయం ప్రకారం 9 గంటల ప్రాంతంలో అంత్యక్రియలను అక్కడ ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం దహన క్రియలను పూర్తి చేశారు. జూమ్ లింక్ సాయంతో ప్రేమలత అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు వీక్షించారు. ఈ క్రమంలో మృతిరాలి ఇంటి వద్ద రాత్రి విషాదచాయాలు అలుముకున్నాయి. చివరి చూపు కూడా దూరమైందని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి) -
అమెరికాలో చిత్తూరు జిల్లా మహిళ మృతి
సాక్షి, చిత్తూరు రూరల్: అమెరికాలో జిల్లాకు చెందిన ప్రేమలత (32) మంగళవారం రాత్రి మృతి చెందింది. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలతకు, అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడుతో 2016లో వివాహమైంది. 2017లో సుధాకర్ దంపతులు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్ ఉన్నాడు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..) మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కుమార్తెను సుధాకర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడనిమృతురాలి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని పంపించడానికి అల్లుడు నిరాకరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కలెక్టర్ భరత్నారాయణగుప్తాను కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement