-
ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి తాతా మధుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. -
కన్నీరు పెట్టిన మంత్రి
టీఆర్ఎస్ నేత కలీం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి ప్రశాంత్రెడ్డి బుధవారం హామీ ఇచ్చారు. భీమ్గల్లో కలీం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సాక్షి, నిజామాబాద్: మండంలలోని బాబాపూర్లో రెండు రోజుల క్రితం హత్యకు గురైన ఖలీం కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటామని, వారికి అండగా ఉంటామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన భీమ్గల్ పట్టణంలోని కర్నె గల్లీలో కలీం ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఖలీం భార్య, కూతురు, కుమారుడితో పాటు, నెలల బాలుడిని చూపి దుఖం ఆపుకోలేక విలపించారు. వారిని ఓదార్చరు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చారు. వారు ఎంతటివారైనా వదిలేదిలేదన్నారు. తాను వివరాలు కనుక్కున్నానని, అధికారులు వేగంగా విచారిస్తున్నారన్నారు. ఖలీం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందించేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. తక్షణ సాయం కింద రూ.లక్ష నగదును అందజేశారు. ఖలీం హత్యకు కారణమైన భూవివాదం విషయంలో న్యాయ పరంగా, రెవెన్యూ పరంగా సహాయం చేస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదన్నారు. స్వతహాగా ప్రొఫెషనల్ చిత్రకారుడైన ఖలీం గీస్తున్న, సగం పూర్తయిన మంత్రి వేముల చిత్రపటాన్ని మృతుడి సోదరులు మంత్రికి చూపించారు. ఖలీం తన కుటుంబానికి లేకపోయినా కాలనీవాసుల మంచి చెడ్డలు చూసేవాడన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అప్పుచేసి మరీ వేసవిలో కాలనీవాసులకు ట్యాంకర్ ద్వారా నీరు అందించాడన్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే ఖలీం మృతితో అతడి కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. తామె విరాళాలు వేసి అందజేసామని కాలనీవాసులు పేర్కొన్నారు. తాను అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ వెగ్గలం రఘు, సీఐ సైదయ్య, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య ఉన్నారు. -
మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఇక రాయదుర్గం వరకు ప్రయాణించనుంది. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మె ట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తుతం ఈ మార్గం లో హైటెక్ సిటీ వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.5 కి.మీ మేర అన్ని పనుల పూర్తితో పాటు రైల్వే సేఫ్టీ అనుమతులు రావడంతో 29న రైలు చివరి పాయింట్ వరకు చేరుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 26, 27 తేదీల్లో మెట్రోరైల్ సేఫ్టీ అధికారి జనక్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి రైళ్లను పరిశీలించి 29న ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. భార్యతో కలిసి మంత్రి మెట్రో జర్నీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి ఎర్రమంజిల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. బంధువు ల వివాహానికి ఆయన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లా డి సౌకర్యాల గురించి వాకబు చేశారు. అనంతరం ఎన్వీఎస్ రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ.. సమ యం ఆదాతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న మెట్రో సిబ్బందిని అభినందించారు. -
మంత్రి ప్రశాంత్రెడ్డికి ఘన స్వాగతం
సాక్షి, నిజామాబాద్: వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెంతకు చేరిన కాళేశ్వరం జలాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. కాళేశ్వరం పథకం రూపకల్పనలో తానుకూడా భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమని, ఇది ఈ జన్మకు చాలంటూ మంత్రి భావోద్వేగంతో మట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం నీరు ఎస్సారెస్పీకి చెంతకు చేరాయి. దీంతో పూజలు చేసేందుకు మంగళవారం విచ్చేసిన రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి ప్రశాంత్రెడ్డి రైతులు, అధికారులు, టీఎన్జీవోస్ నాయకులు ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ముప్కాల్, మెండోరా ఎంపీపీలు సామ పద్మ, బురుకల సుకన్య, జెడ్పీటీసీ సభ్యులు బద్దం నర్సవ్వనర్సారెడ్డి, తలారి గంగాధర్, పార్టీ బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు దాసరి వెంకటేశ్, సామవెంకట్రెడ్డి, శేఖర్రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ఎస్సారెస్పీ అధ్యక్షుడు జాన్సుభాకర్ తదితరులులు పాల్గొన్నారు. -
ఏయే గ్రామాలకు బస్సుల్లేవు..?
సాక్షి, హైదరాబాద్: ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాల గురించి మంత్రి వాకబు చేయటంతో ఉన్నతాధికారులు ఆగ మేఘాల మీద వివరాల సేకరణకు పూనుకున్నారు. డిపోలవారీగా ఆర్టీసీ బస్సు వసతిలేని గ్రామాల వివరాలు పంపాలంటూ రీజినల్, డిపో మేనేజర్లను ఆదేశించారు. యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యంలేక విద్యార్థినులు లిఫ్ట్ అడిగి పాఠశాలకు వెళ్లే క్రమం లో కొందరు అత్యాచారాలు, హత్యలకు గురైన నేపథ్యంలో రవాణాశాఖ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు సౌకర్యంలేని గ్రామాల గోడును కళ్ల ముందు నిలుపుతూ మూడురోజుల క్రితం ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఎంపీటీసీ ఎన్నికల బిజీలో ఉన్న మంత్రి ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మతో ఫోన్లో మాట్లాడారు. సంబంధిత వివరాల గురించి వాకబు చేశారు. యుద్ధప్రాతిపదికన సాధ్యమైనన్ని గ్రామాలకు బస్సు వసతి కల్పించాలని, ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలో దీనికి సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అయితే, 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ గుర్తించింది. ఆ సంఖ్య అంతేనా, మరిన్ని గ్రామాలున్నాయా, అనుబంధ గ్రామాల పరిస్థితి ఏంటి, రహదారులు లేని గ్రామాలు, ప్రధాన రోడ్డుకు చేరువగా ఉన్న గ్రామాలు... తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఏడాదిలో 58 గ్రామాలకు... గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 58 గ్రామాలను ఆర్టీసీ బస్సులతో అనుసంధానించినట్టు ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మార్చి నాటికి రాష్ట్రంలో బస్స సౌకర్యం లేని గ్రామాల సంఖ్య 902 ఉండేదని, 2019 మార్చి నాటికి ఆ సంఖ్యను 844 కు తగ్గించినట్టు పేర్కొన్నారు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు వసతి లేనందున వాటిని పక్కన పెట్టి, రహదారి వసతి ఉన్న 428 గ్రామాలకు సాధ్యమైనంత తొందరలో బస్సు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. హాజీపూర్ గ్రామానికి కుషాయిగూడ డిపో నుంచి ఇప్పటికే బస్సులు ఆరు ట్రిప్పుల మేర నడుస్తుండగా అదనంగా మరో ట్రిప్పు పెంచామని, యాదగిరిగుట్ట నుంచి రెండు ట్రిప్పులు నడుస్తున్నాయని పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement