-
బాలీవుడ్ మరో స్కామ్ బండారం బయటపెట్టిన 'యానిమల్' నిర్మాత
బాలీవుడ్లో నెపోటిజం దగ్గర నుంచి చాలారకాల దందాలు నడుస్తుంటాయి. స్టార్ హీరోలు, వాళ్ల పిల్లలకు మాత్రమే ఛాన్సుల్లాంటివి వస్తుంటాయి. ఇక కొందరు రివ్యూయర్స్ కూడా సౌత్ సినిమాలు, దర్శకుల్ని కావాలనే టార్గెట్ చేస్తుంటారు. ప్రస్తుతం 'సలార్' మీద కూడా అలాంటి దాడే జరుగుతోంది. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు, రివ్యూయర్లకు వంగా బ్రదర్స్ ఇచ్చిపడేస్తున్నారు. మొన్నీ మధ్య సందీప్ రెడ్డి వంగా రెచ్చిపోగా.. తాజాగా ఇతడి అన్న, 'యానిమల్' నిర్మాత ప్రణయ్ రెడ్డి.. బాలీవుడ్లోని మరో స్కామ్ గురించి రివీల్ చేశాడు. తాజాగా తెలుగులో ఓ మీడియా ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా.. 'కార్పొరేట్ బుకింగ్స్' స్కామ్ అనేది బాలీవుడ్లో ఉంటుందని, దాన్ని ఫాలో అయ్యుంటే తమ 'యానిమల్' మూవీ.. ఎప్పుడో రూ.1000 కోట్ల కలెక్షన్స్ దాటేసి ఉండేదని చెప్పుకొచ్చాడు. కానీ మేం అలా చేయలేదని.. 'యానిమల్' సినిమా వసూళ్లన్నీ పూర్తిగా నిజమని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అసలేంటి 'కార్పొరేట్ బుకింగ్స్' స్కామ్ అని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' వీకెండ్ కలెక్షన్స్.. ఏకంగా రూ.400 కోట్ల దాటేసి..!) 'కార్పొరేట్ బుకింగ్ స్కామ్' అంటే.. బాలీవుడ్లో స్టార్ హీరో సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి. దానికి బజ్ తక్కువగా ఉన్నా లేదంటే ఓపెనింగ్స్ పెద్దగా రావనే డౌట్ ఉంటే.. నిర్మాతలు బల్క్ బుకింగ్స్పై ఆసక్తి చూపిస్తారు. అంటే.. ఓ పెద్ద సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరికీ సదరు కంపెనీనే ఫ్రీగా టికెట్స్ ఇస్తుంది. ఈ సంస్థకు నిర్మాత లేదా హీరోకి సంబంధించిన ఎవరో ఒకరి నుంచి టికెట్స్కి సంబంధించిన డబ్బు వస్తుంది. దీంతో బుకింగ్ యాప్స్లో షోలన్నీ ఫుల్ అయినట్లు కనిపిస్తాయి. సినిమా నిజంగా హిట్ ఏమో అని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు. ఇలా బాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు.. ఈ రకంగా పలు కంపెనీలతో మాట్లాడుకుని ఎక్కువ టికెట్స్ అమ్ముడయ్యేలా చూస్తారు. తద్వారా రూ.1000 కోట్ల మార్క్ అనేది చాలా సులభంగా రీచ్ అవుతారు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు ఇది తెలియొచ్చు కానీ బయటవాళ్లకు ఇది తెలిసే ఛాన్స్ లేదు. తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చెప్పడంతో దీని బండారం బయటపడింది. ఇదే ఇంటర్వ్యూలో ప్రణయ్ మాట్లాడుతూ.. 'కార్పొరేట్ స్టార్' అని కూడా అన్నాడు. ఇది షారుక్ని ఉద్దేశించి అన్నట్లే అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
‘నారాయణ’లో చదువుకోలేను..
– రెండు నెలలుగా మొండికేసిన ప్రణయ్రెడ్డి – ఫీజులు చెల్లించాం.. అక్కడే చదువుకోవాలంటూ తల్లిదండ్రులు బుజ్జగింపు – గత నెలలో తిరుపతికి పారిపోయి కొంతకాలం హోటల్లో పని – తండ్రి కోరిక మేరకు తిరిగొచ్చి చదువు కొనసాగింపు – ఒత్తిడి తట్టుకోలేక రైలు కింద పడి బలవన్మరణం కర్నూలు: ఒత్తిడితో చదువుకోలేక ఓ విద్యార్థి గురువారం ఆనంద్ థియేటర్ సమీపంలోని హంద్రీ బ్రిడ్జిపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులో సంచలనం రేపింది. దేవనగర్ సమీపంలోని విఠల్ నగర్లో హంద్రీ నది ఒడ్డున ఉన్న ప్రగతి అపార్ట్మెంట్లో దేవేందర్రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు సంతానం. దేవేందర్రెడ్డి దొడ్ల పాలడైరీలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు ప్రణయ్రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కుమార్తె జీపిక 1వ తరగతి చదువుతోంది. ప్రణయ్రెడ్డి(16) నగరంలోని ఆర్ఎంకే ప్లాజా క్యాంపస్లో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి సైకిల్పై కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి మధ్యాహ్నం రైలు పట్టాలపై శవమై తేలాడు. బ్రిడ్జి ప్రక్కన పుస్తకాల సంచి, టిఫిన్ బాక్సు, కొద్ది దూరంలో సెల్ఫోన్ ఉంచి రైలు కింద పడటంతో తల, మొండెం వేర్వేరు అయ్యాయి. రైలు ట్రాక్పై మతదేహం ఉన్నట్లు గ్యాంగ్మెన్ కనుగొని స్టేషన్ మేనేజర్కు సమాచారం ఇచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు రైల్వే ఎస్ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించాడు. పుస్తకాల్లో ఉన్న అడ్రస్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. చదువుకోవడం ఇష్టం లేకనే బలవన్మరణం : తండ్రి దేవేందర్రెడ్డి చదువుకోవడం ఇష్టం లేకనే తన కుమారుడు రైలు కిండ పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి దేవేందర్రెడ్డి రైల్వే పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నారాయణ కళాశాలలో చదువుకోలేను.. మరో కాలేజీలో చేర్పించండి.. అక్కడ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాను అని మొండికేశాడు. గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ హోటల్లో కొంతకాలం పనిచేశాడు. పట్టుకొచ్చి మళ్లీ కాలేజీకి పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మౌనంగా ఉండేవాడని, చదువుకోవాలని చెబితే తమనే కసురుకునేవాడని తెలిపారు. ప్రణయ్రెడ్డి కళాశాలకు రాలేదంటూ ఫోన్ చేసి యాజమాన్యం సమాచారం అందిన వెంటనే కుమారునికి ఫోన్ చేస్తే బయట ఉన్నానని చెప్పాడని, గంట వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులను సమాచారం అందిందన్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి సాయంత్రం వరకు కోమాలోకి వెళ్లారు. వారికి ఆసుపత్రిలో వైద్యచికిత్సలు చేయించారు. కోలుకున్న అనంతరం రైల్వే పోలీస్స్టేషన్కు పిలిపించి ఎస్ఐ జగన్ విచారణ జరిపారు. తండ్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మార్చురీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన... ప్రణయ్రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిన వెంటనే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాసులు, మహేంద్ర, ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు మోహన్ ఆధ్వర్యంలో మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థి మతికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడితో ప్రణయ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా పది మంది ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement