-
కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ హీరోయిన్.. 2 సార్లు నెగెటివ్
Alaya F Recovered From Covid 19 Reveals Two Times Negative: భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకీ తన ఉనికిని చాటుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ తేడా లేకుండా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ బాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అర్జున్ కపూర్, కరీనా కపూర్, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే బీటౌన్లో ప్రముఖులు కరోనా చేతులకి చిక్కగా బాలీవుడ్ బ్యూటీ అలయ ఎఫ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాను కొవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలయ తన ఇన్స్టా స్టోరీలో అందరికీ నమస్కారం. 'నేను ఒక వారం క్రితం కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అప్పుడు నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. నా చుట్టూ ఉన్న వారిలో కూడా లేవు. కాకపోతే నేను చాలా చోట్లకు ఎక్కువగా ప్రయాణిస్తాను కాబట్టి కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తెలిసాక ఐసోలేట్ అయ్యాను. ఆరోగ్యం బాగా ఉందని నాకు అనిపించాక డిసెంబర్ 30, జనవరి 1న రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకున్నాను. రెండుసార్లు నెగెటివ్ అని వచ్చింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నేను సంప్రదింపులు జరుపుతున్నాను. మాస్క్ ధరించి సురక్షితంగా ఉండండి.' అని పేర్కొంది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా, పూజా బేడి కుమార్తె అయిన అలయ 2020 లో 'జవానీ జనేమాన్' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ -
నా మాజీ భర్త వల్లే సినిమాలకు దూరం: నటి
'విషకన్య' చిత్రంతో వెండితెరపై అడుగు పెట్టింది బాలీవుడ్ నటి పూజా బేడీ. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుందావిడ. తెలుగులో 'చిట్టమ్మ మొగుడు', 'శక్తి' సినిమాల్లోనూ సహాయక పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన పూజా బేడీ దీనికి తన మాజీ భర్త ఫర్హాన్, అతడి కుటుంబమే కారణమని చెప్తోంది. 'నా మాజీ భర్త ఫర్హాన్ పెళ్లికి ముందే నాతో ఈ విషయం చెప్పాడు. అతడి కుటుంబం సాంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తుందని, పెళ్లయ్యాక నేను సినిమాల్లో నటించడం కుదరదన్నాడు. అప్పుడు నాకు నా తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. మీరేం చేసినా అందులో 100 శాతం ఇవ్వాల్సిందేనని అమ్మ మాకు పదే పదే చెప్పేది. ఇక అప్పుడు నేను సాధారణ గృహిణిగానే ఉండిపోతానని ఫిక్సయ్యా. అప్పటివరకు సాగిన సినీప్రయాణాన్ని వదిలేసి, కొత్త జర్నీ మొదలు పెట్టాలనుకున్నాను. అనుకున్నట్లుగానే అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేసి ఉత్తమ భార్యనయ్యాను' అని పూజా చెప్పుకొచ్చింది. కాగా పూజా బేడీ ఫర్హాన్ను 1994లో పెళ్లి చేసుకుంది. వీరికి ఆలయ, ఒమర్ అని ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తర్వాతి కాలంలో పూజా, ఫర్హాన్ మధ్య సఖ్యత కుదరకపోవడంతో 2003లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె జలక్దిక్లాజా 1, నాచ్ బలియే 3, హిందీ బిగ్బాస్ 5వ సీజన్స్లో కంటెస్టెంట్గా బుల్లితెర మీద నానా హంగామా చేసింది. చదవండి: సోనమ్ను ఏడిపిస్తారా? అంటూ హీరో ప్రతాపం! చివరికి.. ఆగిన MI-7 షూటింగ్..టామ్ క్రూజ్కి కరోనా! -
ఐశ్వరీ ఠాక్రేతో అలయ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి
బాలీవుడ్ సీనియర్ నటి పూజ బేడీ ఐశ్వరీ ఠాక్రేతో తన కూతురు, నటి అలయ ఎఫ్ ప్రేమ వ్యవహరంపై స్పందించింది. జవానీ జానెమాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలయా ఎఫ్ గత కొంతకాలంగా దివంగత శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే మనవడైన ఐశ్వరీ ఠాక్రేతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది అలయ తన బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఐశ్వరీ ఠాక్రేతో కలిసి దుబాయ్లో సందడి చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బీ-టౌన్లో టాక్. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా బేడీ ఈ రూమర్స్పై మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో అలయకు సంబంధించిన ప్రతి విషయం వార్తల్లో నిలుస్తుందన్నారు. ‘అలయ వ్యక్తిగతం జీవితంపై, ఆమె ఎవరెవరితో డేటింగ్ చేస్తుంది ఇలా చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటికి తన డేటింగ్పై దాదాపు 7 వార్తలు చూశాను. ఆపై తను ఎవరితో ఉండాలనుకుంటుంది అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత రోజుల్లో నటిగా ఏ వయసులో ఎలా ఉండాలి అంటూ వారిని ఓ నిర్థిష్ట పద్దతిలో అంచనా వేయనవసరం లేదు. నా సమయంలో అయితే రిలేషన్షిప్లో లేని మహిళ ఖచ్చితంగా కన్య అయి ఉండాలి, అవివాహితురాలై ఉండాలి. కానీ ఇప్పటి కాలంలో అలాంటి పట్టింపులు లేవు. కానీ ఇప్పుడ ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కు తనకుంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక హీరోయిన్ కరీనా కపూర్ను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడుతూ... కరీనా చూడండి వివాహ ఆనంతరం ఆమె ఆనందంగా లేదాని, కాబట్టి ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అలాగే సోషల్ మీడియా వల్ల ప్రేక్షకుల చూసే విధానంలో కూడా అనుహ్యా మార్పులు వచ్చాయంటూ పూజా స్పష్టత నిచ్చింది. అయితే అలయ ఐశ్వరీ ఠాక్రేతో పలు విందువినోదాలకు, లేట్నైట్ డిన్నర్లకు వెళ్లడం, అంతేగాక ఈ ఏడాది ప్రారంభంలో ఐశ్వరీతో పాటు అతడి తల్లి స్మిత ఠాక్రేతో కలిసి ఆమె ఓ రెస్టారెంట్కు వెళ్లడంతో వీరిద్దరి రిలేషపై వస్తున్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అంతేగాక ఆ మధ్య అలయ ఐశ్వరీ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ చేసిన కామెంట్లను కొట్లిపారెసిన సంగతి తెలిసిందే. చదవండి: నా లోపం చాలా చిన్నది, అందుకే వద్దనుకున్న: అలయ -
నా లోపం చాలా చిన్నది, అందుకే వద్దనుకున్న: అలయ
తన లోపం చాలా చిన్నదని, దాన్ని ప్రజలు అంగీకరిస్తారో లేదో తను తెలియదు కానీ సర్జరీకి మాత్రం వెళ్లనంటోంది బాలీవుడ్ భామ అలయ. బాలీవుడ్ సీనియర్ నటి పూజ బేడీ గారాల పట్టి అయిన అలయ జవాని జానేమన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సినీ తారలంతా తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు ప్రత్యేక సర్జరీలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. పాత తరం నుంచి నేటి తరం హీరోయిన్లు సైతం కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుని తమ అందానికి మెరుగులందుకుంటున్నారు. అయితే నేటి తరం హీరోయిన్ అలయ మాత్రం తాను సర్జరీలు చేయించుకోనని తెల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ముక్కకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నట్లు వెల్లడించింది. ‘అవును నేను నా ముక్కుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాను. ఎందుకంటే నా ముక్కు ఒకవైపు ఎత్తుగా ఉంటుంది. మరోవైపు బాగుంటుంది. అయితే ఇది చాలా చిన్న విషయమనిపించింది. అందుకే సర్జరీ చేయించుకోవాలన్న ఆలోచన మానుకున్నాను. ప్రజలు ఇలా చూస్తారో లేదో నాకు తెలియదు.కానీ నేను మాత్రం సర్జరీ చేయించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు కాస్మెటీకి సర్జరీకి వెళ్లి అందాన్ని మరింత పెంచుకుంటున్నప్పటికి తాను మాత్రం చేయనని చెప్పింది. కాగా నటుడు ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా, పూజా బేడి కుమార్తె అయిన అలయ 2020 లో జవానీ జనేమాన్ చిత్రం బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. అలయ తదుపరి ఏక్ జౌర్ గజాబ్ కహానీలో నటిస్తోంది. చదవండి: షాకింగ్: నటికి సర్జరీ మిస్ఫైర్ కావడంతో ఫ్యాట్ సర్జరీ.. సగం రక్తం కోల్పోయా: నటి -
30 ఏళ్లలోపు పెళ్లి వద్దే వద్దు: నటి
పెళ్లి మాట ఎత్తితే చాలు హీరో హీరోయిన్లు మొహం చాటేస్తారు. మరీ గుచ్చి గుచ్చి అడిగితే.. అప్పుడే పెళ్లేంటి? అన్నట్లు ఓ లుక్కిస్తారు. పోనీ, ఎప్పుడు చేసుకుంటారో చెప్పండి అంటే.. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంటూ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదన్నట్లుగా మాట్లాడతారు. చిత్ర పరిశ్రమలో లేటు పెళ్లిళ్లు, అసలు పెళ్లిళ్లే చేసుకోకపోవడాలు అనేవి సర్వసాధారణం. అయితే ఏది ఏమైనా 30కు ముందు పెళ్లి చేసుకోవద్దంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ. పెళ్లికి అంత తొందర అవసరం లేదని, లేటుగా పెళ్లి చేసుకోమని తన పిల్లలు ఆలియా, ఒమర్లకు సూచనలిస్తున్నారు. ఈ విషయాన్ని ఆలియా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. (చదవండి: సినిమాల్లో నటించను: షాహిద్ భార్య) 'నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగాలి అని నా తల్లిదండ్రులు ఎప్పుడూ నాకు చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా అందరి పేరెంట్స్లా పెళ్లి చేసుకోమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. పైగా ముప్పై ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని హెచ్చరించేవాళ్లు. ముందుగా చేసే పని మీద, కెరీర్ మీద ధ్యాస పెట్టమని సూచించేవాళ్లు" అని ఆలియా చెప్పుకొచ్చారు. కాగా ఆలియా ఐదేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు పూజా బేడీ - ఫర్హాన్ ఫర్నిచర్ వాలా విడిపోయారు. అనంతరం ఫర్హాన్.. ఫిరోజ్ ఖాన్ కూతురు లైలా ఖాన్ను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ కూడా జన్మించింది. ఇక ఆలియా సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు నితిన్ కక్కర్ తెరకెక్కించిన ‘జవానీ జానేమన్’ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో నటించనున్నట్లు సమాచారం. (చదవండి: ‘మా నాన్న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు’)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement