-
ఆరని ఇథనాల్ చిచ్చు.. పోలీసుల లాఠీచార్జ్పై సీబీఐ విచారణ చేయాలి
నారాయణ్పేట్: కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాల్సి ఉండగా.. ఇథనాల్ కంపెనీ ఆయా గ్రామాల్లో చిచ్చు పెట్టింది. ఆదివారం జరిగిన ఘటనతో చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల్లో సోమవారం దసరా పండుగ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ఆయా గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి అడవులు, బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు. ఎక్లాస్పూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దగ్గర కంపెనీ నుంచి వ్యర్థాలతో వచ్చిన ఓ ట్యాంకర్ను అడ్డుకొని ధర్నా చేస్తున్న మూడు గ్రామాల ప్రజలు, పోలీసులకు నడుమ జరిగిన ఘర్షణలో 10 మంది గ్రామస్తులు, ఏడుగురు మంది పోలీసులు గాయపడ్డారు. సెల్ఫోన్లలో తీసిన వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నుంచి గాలింపు ప్రారంభించారు. ఇళ్లల్లో ఉన్న వారిని పోలీసు వాహనాల్లో ఇతర మండలాల పోలీస్స్టేషన్లకు తరలించి విచారిస్తున్నారు. మరింత మంది కోసం ప్రత్యేక పోలీసులు గాలింపు ప్రారంభించారు. చిత్తనూర్, ఎక్లాస్పూర్ సర్పంచులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనలో గ్రామస్తులు.. రాత్రిళ్లు స్పెషల్ బెటాలియన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండటంతో చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్పూర్ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు గ్రామాలు వదిలి వెళ్లడంతో ఇళ్ల దగ్గర ఉన్న వృద్ధులు, చిన్నారులు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు. జన సంచారం లేక ఆయా గ్రామస్తులు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్లకు తాళాలు.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన వారి కోసం పోలీసులు రెండ్రోజులుగా ఇల్లిల్లూ జల్లెడ పడుతుండటంతో మూడు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు కొందరు, వ్యవసాయ పొలాలకు మరికొందరు తరలివెళ్లారు. ఇళ్ల వద్ద కేవలం వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. పండుగ కోసం గ్రామాలకు వచ్చిన బంధువులను సైతం రాత్రిళ్లు పోలీసులు చితకబాదినట్లు వివరించారు. ఐజీ, డీఐజీ ఆరా.. ఘర్షణ వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ యోగేష్ గౌతమ్ మరికల్ పోలీస్స్టేషన్కు వచ్చారు. సీఐ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ఎన్నికల్ కోడ్ అమలులో ఉన్నందుకు బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన అంశాలను చర్చించినట్లు తెలిసింది. పోలీసుల లాఠీచార్జ్పై సీబీఐ విచారణ చేయాలి చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని మూసివేయాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కంపెనీ నుంచి వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలన్నారు. ఇథనాల్ కంపెనీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కంపెనీ వ్యర్థాలను సమీపంలోని మన్నె వాగులో వేయడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని.. మూగజీవాలు, మానవళికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయించి బాధిత గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నర్సన్గౌడ్, తిరుపతిరెడ్డి, వేణు ఉన్నారు. గ్రామస్తులపై దాడిని ఖండిస్తున్నాం.. రెండేళ్ల నుంచి కంపెనీ రద్దు కోసం ఉద్యమిస్తున్న గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వీరన్న, కృష్ణయ్య పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. మూడు గ్రామాల ప్రజలపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. బాల్రాం, గోపాల్, సుదర్శన్, మల్లయ్య ఉన్నారు. కేసులు ఎత్తి వేయాలి.. గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ హేయమైన చర్యగా భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలను కూడా చూడకుండా పోలీసులు దాడి చేసి ఆ ప్రాంతాన్ని హింసాత్మకంగా మార్చారని, ఇందుకు వారే బాధ్యత వహించాలన్నారు. గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నారాయణ, కాళేశ్వర్ ఉన్నారు. 20 మందిపై కేసులు నమోదు.. పోలీసులపై దాడి ఘటనలో మూడు గ్రామాల్లోని 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. వీరిని నారాయణపేట కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి.. చిత్తనూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఘర్షణలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మంగళవారం టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ను కలిసి విన్నవించారు. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీతో నీటి, వాయు కాలుష్యం ఏర్పడి సుమారు 26 గ్రామాలకు నష్టం వాటిల్లుతోందన్నారు. రెండేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు కంపెనీని తరలించాలంటూ పోరాడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రజల విజ్ఞప్తులను వినిపించుకోకుండా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారని.. వ్యతిరేకిస్తున్న ప్రజలను కాపాడాలని కోరారు. నిజమైన దోషులను గుర్తించి మిగతా వారిని విడుదల చేయాలని కాంగ్రెస్పార్టీ తరఫున కోరారు. -
AP: కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఏపీఎస్పీ పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా), మద్దిపాడు (ప్రకాశం జిల్లా), చిత్తూరులో కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పోలీసు శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 పోలీస్ బెటాలియన్లు ఉన్నాయి. కాగా, రాష్ట్ర విభజన అనంతరం అవసరాలకు తగినట్లుగా కొత్తగా నాలుగు బెటాలియన్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం కొత్త బెటాలియన్ల ఏర్పాటు అంశాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భూములను కూడా గుర్తించింది. ఎచ్చెర్లలో 80 ఎకరాలు, రాజమహేంద్రవరంలో దాదాపు 30 ఎకరాలు, మద్దిపాడులో 95 ఎకరాలు, చిత్తూరులో దాదాపు 50 ఎకరాలను ఎంపిక చేసింది. మద్దిపాడులోని భూమిని ఇప్పటికే ఏపీఎస్పీ విభాగానికి అప్పగించారు. ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, చిత్తూరులోని భూములు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటిని త్వరలోనే ఏపీఎస్పీ విభాగానికి అప్పగించాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. అనంతరం ఆ నాలుగు కేంద్రాల్లో బెటాలియన్ల ఏర్పాటు కోసం భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులను ఏపీఎస్పీ చేపడుతుంది. ఏడాదిలోగా నాలుగు బెటాలియన్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఏపీఎస్పీ భావిస్తోంది. పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం ఏపీఎస్పీ అధికారులు, జవాన్లతోపాటు కలిపి 1,007 మందితో ఒక్కో బెటాలియన్ను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బెటాలియన్లో ఒక కమాండెంట్, ఒక అదనపు కమాండెంట్, నలుగురు అసిస్టెంట్ కమాండెంట్లు, 10మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 24మంది రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, 70మంది అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, 177మంది హెడ్ కానిస్టేబుళ్లు, 630మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వారితోపాటు మినిస్టీరియల్ స్టాఫ్ 26మంది, ఒక మెడికల్ యూనిట్ (8మంది వైద్య సిబ్బంది), 56 మంది ఇతర సిబ్బందిని నియమిస్తారు. ఆ విధంగా మొత్తం 4,028మందితో నాలుగు బెటాలియన్లను ఏర్పాటు చేస్తారు. ‘కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ తదితర సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అవకాశం కలుగుతుంది’ అని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఇది పోలీసుల హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని కర్నాల్ జిల్లా రాయ్పూర్ జట్టన్ గ్రామానికి చెందిన రైతు సుశీల్ కాజల్ మృతికి పోలీసులే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జ్ వల్లనే రైతు సుశీల్ మరణించాడని ఆయన భార్య సుదేష్ దేవీ, తల్లి విమర్శించారు. ఆయన పోలీసులు చెబుతున్న విధంగా గుండెపోటుతో మరణించలేదని వారు వాదిస్తున్నారు. పోలీసులు, హరియాణా ప్రభుత్వం కావాలనే సుశీల్ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాఠీచార్జ్ సందర్భంగా తగిలిన తీవ్రమైన గాయాలు, నొప్పులతో ఇంటికి చేరుకున్న సుశీల్, తల్లి తీసుకొచ్చిన పసుపు కలిపిన పాలను తాగి... తనకు ఏమీ తినాలని అనిపించట్లేదని చెప్పి పెయిన్ కిల్లర్ మాత్రలను వేసుకొని పడుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే రాత్రి నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు విడిచారని ఆయన భార్య, తల్లి వివరించారు. గాయాలకు, మరణానికి సంబంధం లేదు: కర్నాల్ ఎస్పీ పునియా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు వ్యతిరేకంగా ఆగస్టు 28న కర్నాల్లో జరిగిన నిరసన కార్యక్రమంలోలో సుశీల్ కాజల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ ఘటనలో గాయపడ్డ రైతుల్లో సుశీల్ కాజల్ ఒకరు. అదే రోజు రాత్రి లాఠీచార్జ్లో తగిలిన దెబ్బలతో ఇంటికి వచ్చిన సుశీల్ తెల్లారేసరికి విగతజీవిగా మిగిలిపోయాడు. కాగా కర్నాల్ ఎస్పీ గంగారామ్ పునియా మాత్రం పోలీసులతో జరిగిన ఘర్షణలో తగిలిన గాయాలకు, అతని మరణానికి సంబంధం లేదని ప్రకటించారు. కాగా సుశీల్ స్నేహితులు, కుటుంబం, రైతు సంఘాల నాయకులు మాత్రం ఇది పోలీసుల హత్యేనని అంటున్నారు. రైతు ఉద్యమంలో చురుగ్గా: రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రైతు సుశీల్ కాజల్తో పాటు ఆయన తల్లి, భార్య సుదేష్ దేవి, కుమారుడు సాహిల్, కుమార్తె అన్నూ నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే రైతు ఉద్యమంలో పాల్గొన్న సమయంలో సుశీల్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో ఉంది. కాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కాని, పోలీసులు కాని తమ ఇంటికి రాలేదని, కానీ సుశీల్ మరణాన్ని గుండెపోటులా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుశీల్కు 1.5 ఎకరాల భూమితో పాటు ఉన్న కొద్దిపాటి పాడి వారి జీవనాధారం అని, కుటుంబం వాటిపైనే ఆధారపడి జీవిస్తోందని గ్రామస్తులు తెలిపారు. రూ.లక్ష సాయం అందించిన ఆలిండియా కిసాన్ సంఘం రాయ్పూర్ జట్టన్ గ్రామంలో చనిపోయిన రైతు సుశీల్ కాజల్æ కుటుంబాన్ని ఎఐకెఎస్ ప్రతినిధి బృందం మంగళవారం పరామర్శించి రూ.లక్ష సాయం అందించింది. చెక్కును సుశీల్ భార్య సుధేష్ దేవికి ఎఐకెఎస్ కోశాధికారి పి.కృష్ణప్రసాద్ తదితరులు అందించారు. వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్నాల్లోని బస్తారా టోల్ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. -
ఎవరీ మడవి హిడ్మా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా.. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లింది ఆయనను పట్టుకునేందుకే.. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఇంతమంది పోలీసులను రప్పించి, దాడి చేసిందీ ఆయనే.. ఇంతకుముందు జరిగిన భారీ ఎన్కౌంటర్లు, దాడుల ఘటనల్లో కీలకమూ ఆయనే.. ఛత్తీస్గఢ్లో జరిగిన తాజా ఘటనతో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తోంది. మరి ఇంతకీ ఎవరీ హిడ్మా? ఎక్కడివాడు, ఏం చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)–1వ బెటాలియన్కు కమాండర్గా.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పారీ్టలోనే పనిచేస్తోంది. పీఎల్జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పీఎల్జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. రామన్న తర్వాత హిడ్మా.. ఛత్తీస్గఢ్లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్ఐఏ చార్జీషీట్ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ.. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లుమృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. -
పర్యాటకుల వల్లే కశ్మీర్లో కరోనా!
శ్రీనగర్ : గడిచిన 24 గంటల్లో జమ్ముకశ్మీర్లో అత్యధికంగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 55 మంది పోలీసు సిబ్బంది, ఐదుగురు వైద్యులు కూడా ఉన్నారు. అయితే సోమవారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు చనిపోవడం ఇదే తొలిసారి. వీరిలో 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండగా, ఆయనకు రెండుసార్లు నిర్వహించిన పరీక్షలో నెగిటివ్ అనే వచ్చింది. దీంతో అతనికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు చేధించే పనిలో ఉన్నారు. జమ్మాకాశ్మీర్లో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకున్న సమయంలో ఒక్కరోజులోనే 106 కొత్త కేసులు ప్రబలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో గరిష్టంగా 59 మంది పోలీసులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 77 మంది సాయుధ పోలీసు బలగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 59 మందికి వైరస్ సోకింది. వీరిలో ఒక డిప్యూటీ కమాండెంట్ కూడా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,289కి పెరగగా ప్రస్తుతం 665 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. పర్యటాక కేంద్రం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి పర్యాటకులు రావడంతోనే వైరస్ వ్యాపించిందని పేర్కొన్నారు. (మహా నగరాలే కరోనా కేంద్రాలు )
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement