-
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Plastic Currency: దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? చాలా కాలంగా చర్చ సాగుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు పార్లమెంటులో ఎదురైన ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. అలాగే పేపర్ కరెన్సీ , ప్లాస్టిక్ నోట్లు ప్రింటింగ్ ఖర్చుపైనా పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022-23 నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు మొత్తం రూ. 4682.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్లు క్లోజ్! కాగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ఆలోచనను సెంట్రల్ బ్యాంక్ కొన్నేళ్ల కిందటే చేసింది. ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం.. రూ.10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు పది లక్షల నోట్లను కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని భావించారు. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును అటకెక్కించింది. -
నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న పది మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట పోలీస్లు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.90 లక్షల ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు, రూ.60 వేల నగదు, ఒక కారు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫన్టైం రోడ్డులోని విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ వర్మ ఈ కేసు వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు..ఈ నెల 19న పటమట పోలీస్ పరిధిలోని మారిస్ స్టెల్లా కాలేజీ సమీపంలోని యాక్సిస్ బ్యాంకులో ఎనిమిది రూ.500 నకిలీ ప్లాస్టిక్ కట్టలను అంతర్రాష్ట్ర ముఠా ఏటీఎం డిపాజిట్ మిషన్లో వేసింది. నకిలీ నోట్లు అన్ని మిషన్లోకి రావడాన్ని గమనించిన బ్యాంకు అధికారులు పటమట పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులను పట్టుకునేందుకు విజయవాడ సీపీ రాణా 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న విజయవాడ భారతీనగర్కు చెందిన తాతపూడి రాజు, జి.కొండూరు మండలం వెలగలేరుకి చెందిన రమేష్బాబు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన ఆంజనేయులు, సుజాత, సాయిమణికంట, రాజు, బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన అబ్రహం, పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన హనుమంతరావు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మధుమంచి ప్రసాద్, చిలుకూరి మరియదాస్ను బుధవారం పటమట పోలీస్ స్టేషన్ పరిధి భారతీనగర్లో టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను అసలు నోట్లుగా మార్చి, తక్కువ నగదుకు ఎక్కువ నగదు పొంది వాటితో జల్సాలు చేద్దామనే ఉద్దేశంతో నిందితులు ఈ వ్యవహారానికి పాల్పడ్డారు. వీరిలో ఆంజనేయులు, రమేష్బాబు, అబ్రహం, రాజు నకిలీ నోట్ల చలామణీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
డిజిటల్ కోటలో ప్లాస్టిక్ పాగా
రెండో మాట ప్లాస్టిక్ కరెన్సీ రంగంలోకి వచ్చినంత మాత్రాన అవినీతికి కళ్లెం పడుతుందనీ, దొంగ ప్లాస్టిక్ నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి రాజాలవనీ తీర్మానించుకోరాదు. ఇందుకు ఉదాహరణ–అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనేక సంవత్సరాలుగా ఆదాయపు పన్ను శాఖ కన్నుకప్పి అమెరికా ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడిచానని ఒప్పుకోవటం. ఇలాంటి ఒప్పుకోళ్లు రహస్య రాజకీ యాలకు అలవాటుపడిన బీజేపీకి పడవు. కానీ నేటి ప్లాస్టిక్ కరెన్సీ ఉత్పత్తికి దాని పునర్ము ద్రణకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని నిపుణులు నిర్ధారించారని మరవరాదు. చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 పెద్ద నోట్లను రద్దు చేసి; రూ. 2,000 నోటును ముద్రించడానికి తీసుకున్న నిర్ణయాన్ని ‘125 కోట్ల మంది భారతీయులు స్వాగతించా’రని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించుకున్నారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని ఆయన ఈ ఎన్నికలలో తురుపు ముక్కగా ఉపయోగించుకున్నారు కూడా. ఇప్పుడు మరోసారి పేద, మధ్యతరగతి ప్రజలను మళ్లీ మభ్య పెట్టేందుకు మోదీ సరికొత్త ఎత్తుగడకు దిగుతున్నట్టు వార్త. రూ. 10 విలువగల ప్లాస్టిక్ (పోలి మర్) నోట్లను త్వరలో ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ (17–3–17) ప్రకటించారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ఐదు నగరాలను ఎంపిక చేసి ప్రయోగాత్మ కంగా ఈ నోట్లను ప్రవేశపెడుతున్నట్టు కూడా ఆయన చెప్పారు. నోట్ల రద్దుతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇంకా తెరిపిన పడకముందే, ప్రజల మీద మరింత భారాన్ని మోపే తీరులో ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు తొందరపడడం ఎంత వరకు సబబు? చెట్టులెక్కగలవా.....? ఈ అంశాన్ని చర్చించే ముందు బీజేపీ పరివార్ పాలనలో ఉన్న రాజస్తాన్లోని బాగోతం గురించి తెలుసుకోవాలి. అక్కడి బడుగు బలహీన వర్గాలు మారు మూల గ్రామాలలో అనుభవిస్తున్న కష్టాల గురించి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక ప్రచురించిన వార్తా కథనం,‘ఓ చెట్టు కథ’ వెనుక విషాదాన్ని గమ నించాలి. రేషన్ సరుకుల కోసం ప్రజలను చెట్లెక్కించే మన పాలకులకు ఇంగిత జ్ఞానం (కామన్సెన్స్) ఉందా అని ప్రశ్నించిన కథనమది. ‘‘ఇక్కడ రేషన్ సరుకు తీసుకోవాలంటే ఓ చెట్టు ఎక్కాలి. ఓ కొమ్మ మీద కూర్చోవాలి. మీ వంతు రాగానే వేలిముద్ర వేయాలి. తరువాత ఓ చిట్టీ ఇస్తారు. అది తీసుకుని జాగ్రత్తగా చెట్టు మీద నుంచి దిగాలి. ఆపై మరో చిట్టీ ఇస్తారు. ‘‘చెట్టెక్కాలంటే భయమా? మీరు వృద్ధులా? వికలాంగులా? అయ్యో! మీరింకా చెట్టెక్కడం నేర్వలేదా? ‘‘అయితే మీకు రేషన్ లేదు. పరేషాన్ లేదు పో! ‘‘ఇలాంటి పరిస్థితి ఎక్కడ? అనే కుతర్కాల జోలికి పోకండి! ఇలాంటి కామన్సెన్స్ లేని నిర్ణయాలను అమలు చేసేది కేవలం ఇండియాలోనే. చేతిలో ఒక కొత్తనోటు కూడా లేకుండా 56 శాతం పాత నోట్లను రద్దుచేసి పారెయ్ లేదా మనం! ‘ఇది కొట్రా అనే ప్రాంతం–ఉదయ్పూర్కి కొంచెం దూరంలోనే ఉంటుం దిలెండి. ఇప్పుడక్కడ చాలా గ్రామాలలో అకస్మాత్తుగా జనం చెట్లెక్కడం నేర్చుకుంటున్నారు, అర్జెంటుగా. ఎందుకంటే చెట్లెక్కి కూర్చుంటే, ఆపైన ఉన్న చిటారుకొమ్మ దగ్గర రేషన్ డీలర్ ఉంటాడు. ఈ దృశ్యం మీ దృష్టికి ఎందుకొచ్చిందీ అంటే......? ‘మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. ఈ ప్రాంతంలో 76 రేషన్ దుకాణాలు ఉంటే, వాటిలో 13 దుకాణాల పరిధిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ నికృష్టంగా ఉంది. మరేం చేయాలి? మనం ఇప్పటికీ ఫోన్ సిగ్నల్ అందకపోతే ఏ భవంతి పైకో, ఆరుబయటకో వచ్చి మాట్లాడు కుంటాం కదా! అలా అక్కడ కాస్త కనెక్టివిటీ కోసం చెట్లెక్కి పీఎస్ఓ యంత్రం పెట్టుకున్నారు. ఇక అక్కడి ఊళ్లు–మెర్పార్, బిబర్వాడీ, మాల్వియా, కాకర్యా, పీస్లా, భూరిదుద్వార్, బీరకు, పాల్చా, ఉమర్యా, సామ్దీ–ఇలా. అన్ని చోట్లా ఇదే దుస్థితి. కాస్త కనెక్టివిటీ దొరికేదాకా ఆగడం, లేదా అక్కడే ఏ కొమ్మ మీదనో నిరీక్షిస్తూ గడపడం. ఇంకా చెప్పాలా? ఆ ఏరియాలో ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్లు లేని ఇళ్లున్నాయి. చాలా చోట్ల రోడ్లు కూడా లేవు. కడుపు నొచ్చినా, కాళ్లు నొచ్చినా మందు గోలీయే దొరకదు. ఇక చదువుకోవాలంటే మైళ్ల కొద్దీ నడవాలి. వయసులో ఉన్నవాళ్లంతా దూరంగా బతుకుతున్నారు. ఆ ఊళ్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు కనిపిస్తుంటారు. అలాంటి చోట కూడా ఇంటర్నెట్ ఆధారిత రేషన్ను నిర్బంధంగా అమలు చేయవలసిన అవసరం ఉందా? అందుకే మొదట మన పాలకులకు కామన్సెన్స్ ఉండదని చెప్పేది. ‘‘ఇక రాబోయే కాలంలో చూడండి! నగదు రహిత అనే ఓ పిచ్చి నినాదం సరిగా ఈ తరహాలోనే ఆవాసాల్లో మరిన్ని కష్టాలకు ఎలా కారణం కాబోతున్నదో! గుట్టలూ, అడవులూ అధికంగా ఉండే ప్రాంతాలలో డిజిటల్ కరెన్సీ అనేది తుగ్లక్ చర్యలా ఎలా పరిణమించబోతున్నదో! ’’ ఇదా సమయం? స్థూలంగా నోట్ల రద్దు తరువాత ప్రజా బాహుళ్యానికి (సంపన్న వర్గాలు, వారి అనుయాయులు, కోటీశ్వరులు, బడా కార్పొరేటర్లు గుట్టుగా నల్లధ నాన్ని, పాత కరెన్సీ రూపంలో కొత్త కరెన్సీని కనుమరుగు చేసుకున్న తర్వాత) మిగిలింది హళ్లికి హళ్లి, సున్నకు సున్న. పైపెచ్చు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట ‘నో క్యాష్’ బోర్డులు ఇప్పటికీ ఖాతాదార్లను వెక్కిరిస్తూనే ఉన్నాయి. బ్యాంకులకు రూ. 2 వేల కరెన్సీ నోట్లు తిరిగి రాలేదు. నెల రోజులుగా ఆర్బీఐ నుంచి నగదు పంపిణీ బంద్ అయింది. లావాదేవీల నిర్వహణకు క్యాష్ చాలని ఈ తరుణంలో పాలకులకు పుట్టుకొచ్చిన లేదా ఎరువు తెచ్చుకున్న ఆలోచన ప్లాస్టిక్ (పోలిమార్) కరెన్సీ. ప్రపంచంలోని 200 దేశాల్లో కేవలం 20 దేశాలు ప్రవేశపెట్టి, ఖర్చులు తడిసి మోపెడైన ప్లాస్టిక్ కరెన్సీ ఇది. అందుకే కొన్ని దేశాలు వెనుకడుగు వేశాయి (ఉదా. కెన్యా. మొదటిసారిగా కెనడా, ఆస్ట్రేలియాల తర్వాత ఈ కరెన్సీని ప్రవేశపెట్టి క్రమంగా ఉపసంహరించు కుంది). పత్తి ఆధారిత నారపీచు సాయంతో తయారయ్యే కాగితపు (పేపర్) కరెన్సీ కన్నా ప్లాస్టిక్ కరెన్సీ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని మంత్రి మేఘావాల్ చెబుతున్నారు. కానీ పేపర్ కరెన్సీ మాదిరిగా మడతపెట్టి జేబులో పెట్టుకోడానికి వీలుగా ఉండదు ప్లాస్టిక్ కరెన్సీ. ఇది మృదువుగా, మడతకు వీలుగా ఉండదు గనుక మామూలు పర్సు (వాలెట్) లాభం లేదని నిపుణుల అంచనా. నోట్ల రద్దు తరువాత రూ. 2 వేలు, రూ. 500 నోట్లను అనవసరంగా ముద్రించడానికే రూ. 20,000 కోట్లను ముద్రణాలయాలపైనే వెచ్చించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్లు అమెరికా ఆర్థిక సంక్షోభ నివారణలో భాగంగా ప్రపంచ దేశాలపై రుద్దిన ఆర్థిక సంస్కరణ లలో పేపర్ కరెన్సీ స్థానే ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టడం ఒక భాగమని మరచిపోరాదు. బడా అమెరికన్ మల్టీ నేషనల్ కార్పొరేట్ కంపెనీల లావాదే వీలకు అనుగుణంగానే ఈ ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోగం ముందుకొచ్చింది. డిజిటల్ కరెన్సీలో లావాదేవీల కోసమని కరెన్సీ నోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధనం (బ్లాక్మనీ) ఆగిపోలేదు. అంతేగాదు, దేశీయ సుప్రసిద్ధ ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్లు నోట్ల రద్దు అనాలోచితమైనదిగా ప్రకటించిన సమయంలోనే అమెరికన్ విదేశాంగ ప్రతినిధి మార్క్ టోనర్ ‘భారత ప్రభుత్వ చర్య బ్లాక్మనీని అరికట్టడానికి దోహదపడుతుంద’ని సమర్థించాడు. మోదీ చర్య యూపీ ఎన్నికలలో బీజేపీ ప్రచార లబ్ధి్ద కోసం ఉద్దేశించినదేగానీ బ్లాక్మనీని వెలికితీయడానికి గానీ, అవినీతిని అరికట్టడానికిగానీ దోహదపడలేదనీ, కనీసం బ్యాంకులకు బడా కార్పొరేట్లు (ఇవే ఎన్నికల్లో బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలకు ప్రధాన పోషకులు) బకాయి పడిన రూ. 8 లక్షల కోట్ల రుణాలలో ఒక్క పైసా ఇంత వరకూ తిరిగి ప్రభుత్వం రాబట్టలేక పోయిందనీ రుజువైపోయింది. ప్లాస్టిక్ కరెన్సీ రంగంలోకి వచ్చినంత మాత్రాన అవినీతికి కళ్లెం పడుతుందనీ, దొంగ ప్లాస్టిక్ నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి రాజాలవనీ తీర్మానించుకోరాదు. ఇందుకు ఉదాహరణ–అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనేక సంవత్సరాలుగా ఆదాయపు పన్ను శాఖ కన్నుకప్పి అమెరికా ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడిచానని ఒప్పు కోవటం. ఇలాంటి ఒప్పుకోళ్లు రహస్య రాజకీయాలకు అలవాటుపడిన బీజేపీకి పడవు. ఆదరణ ఎందుకు లేదు? ఈ సందర్భంగా ఇక్కడో ప్రశ్న సహజం–ప్లాస్టిక్ కరెన్సీ దీర్ఘకాలం మన్నికగా ఉండడం నిజమైతే, నకలు సృష్టించడం కష్టమన్న మాట కూడా నిజమే అయితే–చాలా ప్రపంచ దేశాలు పేపర్ కరెన్సీని వదిలి ప్లాస్టిక్ కరెన్సీకి ఎందుకు మళ్లడం లేదు? మొదటిసారిగా ఆస్ట్రేలియా 10 ఆస్ట్రేలియన్ డాలర్ల నోటును ప్లాస్టిక్ నగదుగా ప్రవేశపెట్టింది. ఉష్ణ ప్రదేశాల్లో ప్లాస్టిక్ చెక్కు చెదరదు, నీరు దాన్ని చెనకదు. కానీ ప్లాస్టిక్ నోట్లు ఒక దానికొకటి అతక్కు పోయి, పేపర్ కరెన్సీ మాదిరిగా వేగంగా లెక్కపెట్టడానికి వేళ్లకు చిక్కవు. పేపర్ కరెన్సీ ఉత్పత్తి కన్నా ప్లాస్టిక్ కరెన్సీ ఉత్పత్తి భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్లాస్టిక్ బ్యాంకు నోట్ల సైజు (నిడివి) పేపర్ నోట్ల సైజు కన్నా పొడుగు. కెనడా ప్లాస్టిక్ కరెన్సీకి భద్రతా ప్రమాణాలు పటిష్టమని భావిం చినా, దానికే నకిలీ దొంగనోట్లు బెడద తప్పలేదు. ప్రపంచంలో కేవలం 20 దేశాలే ప్లాస్టిక్ కరెన్సీని అమలులోకి లె చ్చాయి. పైగా అందులో ఆరు దేశాల ప్రభుత్వాలు మాత్రమే అన్నిరకాల డినామినేషన్లను ప్లాస్టిక్ కరెన్సీలోకి మార్చారు. ఏ విధంగా చూసినా ప్లాస్టిక్ కరెన్సీ కన్నా, పేపర్ కరెన్సీయే భద్రత గల కరెన్సీ అని, బ్రిటిష్ మ్యూజియం ద్రవ్య కరెన్సీ ప్రదర్శన విభాగానికి చెందిన క్యూరేటర్ హాకెన్హాల్ పేర్కొన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ పుణ్యమే! కరెన్సీ యుద్ధాలకు పెట్టుబడిదారీ వ్యవస్థ తెరతీసినది మొదలు సాధా రణ పేపర్ కరెన్సీల స్థానంలో ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారం ముసుగులో ప్లాస్టిక్ కరెన్సీయేగాదు, ‘బిట్’ కాయిన్స్ లాంటి మోసపూరిత కరెన్సీ రంగంలోకి దిగుతూ ఉంది (ఇది ఉత్తరోత్తరా పరిశీలించదగిన ప్రత్యేక చర్చ). ధన వ్యాప్తిలో మారక మాధ్యమాలు అనాదిగా ఎన్ని రూపాంతరాలు పొందాయో తోలు నాణాల నుంచి టెంకాయ చిప్పలు, ముత్యపు చిప్పలు, శంఖు, అపురూప లోహాలు, పత్తి కాగితం నుంచి ఇటీవలి ప్లాస్టిక్ కరెన్సీ దాకా వచ్చిన పరిణామం రుజువు చేస్తుంది. కానీ నేటి ప్లాస్టిక్ కరెన్సీ ఉత్పత్తికి దాని పునర్ముద్రణకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని కరెన్సీ నిపుణులు నిర్ధారించారని మరవరాదు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్లాస్టిక్ నోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి, వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఆ సమాధానంలో చెప్పారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ, వాటిపై రూ. 10 నోట్ల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను రిజర్వు బ్యాంకుకు ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లయితే ఎక్కువ కాలం మన్నుతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు రిజర్వు బ్యాంకులు ప్రస్తుతమున్న నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్, ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి ప్రయత్నాలు చేస్తున్నాయి. తద్వారా నోట్ల జీవితకాలం పెంచాలన్నది వాటి లక్ష్యం. -
ఇక ప్లాస్టిక్ నోట్లు
ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంట్లో ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ: ఒకవైపు పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో గందరగోళం కొనసాగుతుండగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై ప్లాస్టిక్ కరెన్సీ ముద్రించాలని నిర్ణయించి నట్లు శుక్రవారం పార్లమెంట్లో తెలిపింది. కరెన్సీ నోట్లను ప్లాస్టిక్ లేదా పాలిమర్స్తో ముద్రించాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జన్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టాలని కొన్నాళ్ల క్రితం రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. పది రూపాయల విలువ గల వందకోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా దేశంలోని భౌగోళిక వైవిధ్యం గల కొచ్చి, మైసూర్, భువనేశ్వర్, జైపూ ర్, సిమ్లా నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు 2014లో ప్రభుత్వం పార్లమెంట్కు తెలిపిందని, దానికి కొనసాగింపు ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మేఘ్వాల్ మరోప్రశ్నకు సమాధానమిస్తూ 2015 డిసెంబర్లో ఎటువంటి సెక్యూరిటీ త్రెడ్ లేని వెయ్యి రూపాయల నోట్లు కొన్ని తమకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపిందని, ఇవి నాసిక్లోని కరెన్సీ ముద్రణా కేంద్రం నుంచి వచ్చాయని, హోసంగాబాద్లోని సెక్యూరిటీ పేపర్ మిల్ సరఫరా చేసిన పేపర్పై ఈ నోట్లు ముద్రించినట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచామని మంత్రి పేర్కొన్నారు. ప్లాస్టిక్ నోట్ల జీవితకాలం ఐదేళ్లవరకూ ఉంటుంది. వీటికి నకిలీలు తయారుచేయడం కూడా చాలా కష్టం. అదీగాక పేపర్ కరెన్సీ కంటే ప్లాస్టిక్ నోట్లు పరిశుభ్రంగా ఉంటాయి. నకిలీ నోట్ల బారినుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ నోట్లను తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement