-
కులగణనకు నాంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు బుధవారం నాంది పలకనుంది. రాష్ట్రంలో ఐదు సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా కుల గణన చేపట్టనుంది. బుధ, గురువారాల్లో రెండు రోజులు గ్రామీణ ప్రాంతాల్లో మూడు గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో రెండు వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడానికి ఈ నెల 3న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కుల గణన ముందస్తు షెడ్యూల్ను రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి ఎం. గిరిజా శంకర్ ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేస్తూ యూవో నోట్ విడుదల చేశారు. ముందస్తుగా ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో అవసరమైతే మార్పులు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. సిబ్బందికి శిక్షణ రాష్ట్రవ్యాప్తంగా కుల గణనలో ఎన్యూమరేటర్లుగా వ్యవహరించే సచివాలయాల సిబ్బందితో పాటు సూపర్వైజర్లు, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు, పర్యవేక్షణ చేసే జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు మూడు విడతల్లో ఈ నెల 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్వంలో మంగళ, లేదా బుధవారం శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచే రౌండ్ టేబుల్ సమావేశాలు కుల గణనపై ప్రభుత్వం బుధవారం నుంచి జిల్లాలవారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనుంది. బుధ, గురువారాల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత భాగస్వామ్యులతో ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదు ప్రాంతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో, 20న విశాఖ, విజయవాడలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రాంతీయ సదస్సులు జరిగే ఐదు జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లా స్థాయి రౌండ్టేబుల్ సమావేశాలు ఉండవని రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పష్టం చేసింది. -
AP: డిసెంబర్ నాటికి రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047
సాక్షి, అమరావతి: వికసిత్ భారత్–2047లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో రాష్ట్ర ను డిసెంబర్ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల వృద్ధికి ఆయా శాఖలవారీగా దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు అందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం వర్క్షాప్ ప్రారంభమైంది. మూడు రోజులపాటు దీన్ని నిర్వహిస్తారు. తొలి రోజు వర్క్షాప్ నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్–2047 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీని ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడంతో పాటు ఆధునిక భారతదేశ నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులను కేంద్రం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పురోగతిపైనే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షలపైన కూడా దృష్టి సారించిందన్నారు. అందుకనుగుణంగా రాష్ట్ర విజన్ ప్రణాళిక – 2047ను రూపొందించేందుకు రాష్ట్ర అధికారులకు అవసరమైన శిక్షణను నీతి ఆయోగ్ అందిస్తోందని చెప్పారు. దీన్ని రాష్ట్ర అధికారులు సద్వినియోగం చేసుకుని రాష్ట్ర విజన్ ప్రణాళికను సమగ్రంగా సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని కోరారు. వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు కాగా తొలి రోజు వర్క్షాప్లో ఉదయం సామాజిక రంగం, మధ్యాహ్నం ప్రాథమిక రంగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను ఆయా శాఖల అధికారులు నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వర్క్షాప్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో హరీందిర ప్రసాద్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.నరసింహం తదితరులతోపాటు నీతి ఆయోగ్ సలహాదారు సీహెచ్ పార్థసారధి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ – మూల్యాంకన నిపుణులు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ డైరెక్టర్ అంకష్ వథేరా తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలను రూపొందిస్తున్నాం.. రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్–2047 కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల్లో వ్యూహాత్మక వృద్ధిని సాధించేందుకు అవసరమైన దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక రంగంలో.. వ్యవసాయం, పశుసంవర్థకం, డెయిరీ, ఫిషరీస్, ఉద్యానవనం, సెరికల్చర్, మార్కెటింగ్, సహకారం, అటవీ, జలవనరులు, భూగర్భ జలాలు, చిన్ననీటి పారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి వంటి అంశాల్లో దృక్కోణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ద్వితీయ రంగంలో.. ఇంధనం, రవాణా, ఐటీ, పర్యాటకం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, ఆహార శుద్ధి, గనుల తవ్వకం, చేనేత–జౌళి, గృహ నిర్మాణం, టిడ్కో తదితర అంశాలపైన సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. సామాజిక రంగం అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, పౌర సరఫరాలకు సంబంధించిన అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. -
చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్కు ప్రణాళిక శాఖ మెమో జారీ
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు ఏపీ ప్రణాళిక శాఖ మెమో జారీ చేసింది. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అనుమతి లేకుండా విదేశాలకు పారిపోవడంపై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో ఇచ్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో విచారించేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారయ్యాడు. అనుమతి లేకుండానే అమెరికా చెక్కేశాడు. అయితే స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో శ్రీనివాస్ను కీలక వ్యక్తిగా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవెలప్మెంట్ స్కాం వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారపోయిన విషయం తెలిసిందే. నోటీసుల గురించి తెలుసుకున్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లినట్లు అధికారులు గుర్తించగా..పలు కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ కూడా సెప్టెంబర్ 5న దేశం విడిచి దుబాయ్ వెళ్లారు. యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్కు సంబంధాలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ ఇప్పటికే తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైంది. పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని ఇప్పటికే ఐటీ నోటీసుల ద్వారా వెల్లడయింది అరెస్ట్ సందర్భంగా చంద్రబాబుకు వాట్సాప్ స్క్రీన్షాట్లు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్తో జరిగిన వాట్సాప్ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసు అధికారులు ఇటీవల చంద్రబాబుకు చూపించారు. ఇవి చూపించగా.. తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ బాబు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. చదవండి: రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి -
జిల్లాల స్థూల ఉత్పత్తిలో ‘కృష్ణా’ ఫస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల స్థూల ఉత్పత్తిలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కృష్ణాజిల్లా మొదటి ర్యాంకు సాధించింది. విశాఖపట్నం జిల్లా రెండో ర్యాంకులో ఉండగా తూర్పుగోదావరి జిల్లా మూడవ స్థానంలో ఉంది. విజయనగరం జిల్లా చివరి 13వ ర్యాంకులో నిలిచింది. జిల్లాల స్థూల ఉత్పత్తికి (ఆదాయాల) సంబంధించిన గణాంకాలను ప్రణాళికా శాఖ ఇటీవల రూపొందించింది. జిల్లాల ఆదాయ సూచికలు సమతుల్య అభివృద్ధి సాధనకు దోహదపడతాయని ప్రణాళికా శాఖ పేర్కొంది. అలాగే, జిల్లాల మధ్య అసమానతనలు పరిశీలించడంతో పాటు ఆయా జిల్లాల అభివృద్ధికి సరైన ప్రణాళికలు రూపొందించడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయని ప్రణాళికా శాఖ నివేదికలో వివరించింది. జిల్లాల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరును అంచనా వేయడానికి కూడా ఈ స్థూల ఉత్పత్తి గణాంకాలు అవసరమని ప్రణాళికా శాఖ తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ.. మరోవైపు.. ప్రస్తుత ధరల ప్రకారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14.64 శాతంతో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా 14.22 శాతంతో రెండో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా 10.00 శాతంతో మూడోస్థానంలో ఉంది. అలాగే, పారిశ్రామిక రంగంలో విశాఖ జిల్లా 18.43 శాతంతో మొదటి ర్యాంకులో, 13.82 శాతంతో తూర్పుగోదావరి జిల్లా రెండవ ర్యాంకులో ఉండగా చిత్తూరు జిల్లా 9.33 శాతంతో మూడవ ర్యాంకులో ఉంది. ఇక సేవా రంగంలో 15.69 శాతంతో విశాఖ జిల్లా మొదటి ర్యాంకులో ఉంది. కృష్ణాజిల్లా 14.98 శాతంతో రెండో ర్యాంకులో ఉండగా.. తూర్పుగోదావరిజిల్లా 9.51 శాతంతో మూడో స్థానంలో ఉంది. -
ఏపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది: విజయ్కుమార్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement