-
బాబు.. ఓ ‘పిల్స్’ ఫ్యాక్టరీ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు వందలాది తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ‘పిల్స్’ (ప్రజాప్రయోజన వ్యాజ్యాలు) ఫ్యాక్టరీని నడుపుతూ దేశంలో ఏ ప్రభుత్వంపైనా లేనన్ని కేసులు ఈ అభివృద్ధి నిరోధక శక్తులు వేశాయని, వారు తమ స్వార్థం కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా దు ర్వినియోగపరుస్తున్నారని వారు దుయ్యబట్టారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారారని ఆరోపించారు. ‘జగన్ పాలన–న్యాయవాదుల స్పందన’ అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న న్యాయవాదులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిపై ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం రూపొందించిన నివేదిక ముఖ్యాంశాల పోస్టర్లను అవిష్కరించిన అనంతరం వారు తమ మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే.. చంద్రబాబు ఫ్యాక్టరీ నుంచే ‘పిల్స్’.. న్యాయ వ్యవస్థలోని కొందరు కక్షపూరితంగా వ్యవరించారు. జస్టిస్ రాకేష్కుమార్ పదవీ విరమణచేసే రోజు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, తర్వాత అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉన్న ఆయనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే, జగన్పై ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ బట్టు దేవానంద్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించారు. చంద్రబాబు ఒక ‘పిల్ ఫ్యాక్టరీ’ని తయారుచేసి జగన్ ప్రభుత్వంపై సొంత ఖర్చులతో పిల్స్ వేయిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్లడం అభినందనీయం. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ వారికి స్థలాలిచ్చి బీసీలకు ఇవ్వకుండా కోర్టు స్టేనా!? అమరావతిలో బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టు స్టే ఇచ్చింది. కానీ, అదే అమరావతిలో న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు స్థలాలు కేటాయించారు. ఇదేం న్యాయం? పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి సీఎం జగన్ మంచి పనిచేశారు. విదేశీ విద్య పథకంతో సామాన్యులను చదివిస్తున్నారు. 75 ఏళ్లలో ఎవరూ ఇలాంటి పనిచేయలేదు. దేశంలోనే బెస్ట్ సీఎం జగన్. – బి.అశోక్కుమార్, అధ్యక్షుడు, ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కేసులు లేకపోతే మరింత అభివృద్ధి.. ఇన్ఫ్రా రంగంలో రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రతి పక్షాలు, ఒక వర్గం మీడియా పురోగతి ఏమీలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్విసెస్ ఇండియా లిమిటెడ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు రూ.70 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుండగా.. అందులో రూ.6.75 లక్షల కోట్ల విలువైన పనులు ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయి. అలాగే, జగన్ ప్రభుత్వంలో ఆరు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పది హార్బర్లు, నాలుగు పోర్టులు, మూడు ఇండ్రస్టియల్ కారిడార్లు, రెండు మేజర్ ఎయిర్పోర్టులు, 31 చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఇంత పెద్దఎత్తున ఇన్ఫ్రా డెవలప్మెంట్ మరే రాష్ట్రంలోనూ జరగడంలేదు. – వెంకట్ మేడపాటి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ.. ఇటీవల ప్రధాని మోదీ∙కూడా స్వార్థపూరిత ప్రజాహిత వ్యాజ్యాలపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో పారిశ్రామిక రంగంలో 16.36 శాతం, స ర్విస్ సెక్టార్లో 20 శాతం, వ్యవసాయ రంగంలో 13 శాతం వృద్ధిని మన రాష్ట్రం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా సుమారు రూ.20 లక్షల కోట్లు పేదలకు నేరుగా బదిలీ చేయగా, ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు బదిలీచేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. – నారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు, నవరత్నాలు అమలు కమిటీ స్వార్థశక్తుల చేతుల్లో ‘పిల్’ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తరచుగా కోర్టులు జోక్యం చేసుకోవడంవల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. సామాన్యుల కోసం పిల్ సదుపాయం కలి్పస్తే అది స్వార్థశక్తుల చేతిలో ఆయుధంగా మారింది. అనవసరమైన కోర్టు కేసులు లేకపోతే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఉండేది. – నరహరశెట్టి శ్రీహరి, సీనియర్ న్యాయవాది విద్యలో కేరళను దాటేస్తున్నాం.. రాష్ట్రంలో పిలిచి ఉద్యోగాలిస్తున్నారు.. పోర్టులు కడుతున్నారు.. విద్యా వ్యవస్థలో కేరళను దాటి ఏపీ మొదటి స్థానానికి వెళ్తోంది. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పరోక్షంగా న్యాయవాదుల కుటుంబాలు బాగుపడుతున్నాయి. జూనియర్ లాయర్లకు రూ.5వేలు గతంలో ఎవరూ ఇవ్వలేదు. – ధనలక్ష్మి, న్యాయవాది ఈ సర్కారును మళ్లీ గెలిపించుకోవాలి.. విద్యావ్యవస్థలో సీఎం జగన్ ప్రక్షాళన తీసుకొచ్చారు. బడుగులు తెలుగు మీడియంలోనే చదవాలన్నట్లు గత ప్రభుత్వాలు చేశాయి. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలి. – బి. సౌమ్య, న్యాయవాది ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ సీఎం జగన్ నెరవేర్చారు. లాయర్లు, ఆటోడ్రైవర్ల దగ్గర్నుంచి పారిశ్రామికవేత్తల వరకూ, అన్ని వర్గాల వారికీ ఆరి్థక చేయూతనిస్తున్నారు. అలాంటి సీఎంను మళ్లీ మనందరం మద్దతిచ్చి గెలిపించుకోవాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది సంక్షేమ పాలనను లాయర్లు అందరికీ చెప్పాలి.. రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పాలన గురించి న్యాయవాదులు తమ వద్దకు వచి్చన ప్రతి ఒక్కరికీ చెప్పి, వాళ్లకు జరిగిన మేలు గురించి గుర్తుచేయాలి. వారి ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. – జంగా జయలక్ష్మి, సీనియర్ న్యాయవాది లాయర్లకు జగన్ తప్ప ఎవరూ మంచి చేయలేదు.. గతంలో న్యాయవాదులను వాడుకోవడం తప్ప ఏ ప్రభుత్వం మంచి చేయలేదు. జగన్ సీఎం అయ్యాక రూ.100 కోట్లు ఇస్తామన్నారు. అన్నట్లుగానే ఇచ్చారు. నవరత్నాలు అనే పదాన్ని ఎక్కడ చదివారోగానీ ఆ పేరుతో అందరికీ మంచి చేస్తున్నారు. అవి నిలబడాలంటే జగన్ మళ్లీ గెలవాలి. – రమణి, సీనియర్ న్యాయవాది మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లొద్దు.. పధా్నలుగు సంవత్సరాల వనవాసం నుంచి బయటకు వచ్చినట్లుంది జగన్ పాలన. మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే న్యాయవాదులంతా కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్రంలో చెడ్డ వారంతా చంద్రబాబుకి మద్దతిస్తున్నారు. మంచివాళ్లు జగన్ని కోరుకుంటున్నారు. – జీవనజ్యోతి, న్యాయవాది రాష్ట్రంలో అద్భుత ప్రగతి.. జగన్ ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే వెంటనే కేసులు వేసి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. ప్రజాహిత వ్యాజ్యం అనేది సామాన్యుల న్యాయం కోసం రూపొందిస్తే వాటిని పెత్తందారులు హస్తగతం చేసుకున్నారు. 24 నెలల కరోనా కాలం తర్వాత మిగిలిన మూడేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. 2023–24లో 17 శాతం స్ధూల జాతీయోత్పత్తి వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్ధానంలో ఉంది. – చిన్నం రామకృష్ణ, న్యాయవాది -
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
ఏదో ఒక కారణంతో..ఆ పిల్స్ని అదేపనిగా వాడుతున్నారా?!
నిద్రపట్టడం లేదు.. ఆందోళనగా ఉంది. మూడ్ బాగోలేదు.. స్ట్రెస్గా ఉంది. వీటన్నింటికీ మనవాళ్లు ఎంచుకుంటున్న మార్గం ‘పిల్’. ఒక మోతాదులో టాబ్లెట్ వాడితే సమస్య తగ్గిపోతుంది కదా! అనుకుంటారు. ఇది చెడు అలవాటు కాదనుకుంటారు. కానీ, ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు టాబ్లెట్ వేసుకోవడం కూడా వ్యసనమే. నేటి రోజుల్లో చాలామంది వర్క్ టెన్షన్ అనో, స్ట్రెస్ అవుతున్నామనో స్లీపింగ్ పిల్స్కు అలవాటు పడిపోయేవారు పెరుగుతున్నారు. వీటిని ముందుగా డాక్టర్ని కలిసి వారి సలహాతో తీసుకోవడం మొదలుపెడతారు. ఆ టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజులు బాగా అనిపించి, ఆ పాత ప్రిస్క్రిప్షన్ పైన ఆ టాబ్లెట్లను అలాగే కంటిన్యూ చేస్తుంటారు. యాంగ్జైటీ పిల్స్, స్ట్రెస్ పిల్స్, మూడ్ ఎలివేటర్స్.. ఇలా విభిన్న రకాలుగా ఉండే ఈ పిల్స్ను ఆందోళనగా అనిపింనప్పుడల్లా వాడతారు, క్రమేణా వాటికి అలవాటు పడిపోయి మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోతున్నారు. ∙∙ వసుధ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రాజెక్ట్ టీమ్ లీడర్గా బిజీ షెడ్యూల్ తనది. ఓ వైపు కుటుంబం, మరోవైపు ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. కొన్నాళ్లు బాగానే మేనేజ్ చేసినా ఎదురయ్యే సమస్యలు టెన్షన్ పెట్టేవి. దీంతో ఆందోళన పెరిగిపోయేది. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే బాగా నిద్రపోవాలని చెబుతుండేవారు స్నేహితులు. కానీ, ఆ ఒత్తిడి వల్లే నిద్ర పట్టడం లేదనేది వసుధ కంప్లైంట్. ఫ్రెండ్ సలహా మేరకు డాక్టర్ని కలిసింది. కొన్ని రోజులు ఆందోళన తగ్గడానికి ఒక మెడికల్ కోర్సును వాడమని చెప్పాడు డాక్టర్. ఆ కోర్స్ వాడాక తనకు చాలా రిలీఫ్గా అనిపింంది. ఆందోళనగా అనిపించినా, పనిభారంతో తల బరువుగా అనిపించినా అవే టాబ్లెట్స్ తెచ్చుకొని వాడటం మొదలుపెట్టింది. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు టాబ్లెట్ లేనిదే పరిష్కారం కాదు అనేంత స్థాయికి వచ్చేసింది. నిద్ర పట్టడం లేదని రాత్రిళ్లు స్లీపింగ్ పిల్స్ వేసుకునేది. కానీ, ఆఫీసుకు వెళ్లినా ఆ మత్తు ఆమెను వదిలేది కాదు. దీంతో తీసుకున్న ప్రాజెక్ట్ వర్క్స్ చేయడంలో ఆలస్యం అవుతూ ఉండేది. రోజులో ఎక్కువ సమయం మత్తుగా ఉండటంతో జాబ్ పోయే పరిస్థితి ఎదురైంది. లాయర్, డాక్టర్, ఇంజినీర్.. ప్రతీ వృత్తి, ఉద్యోగం చేస్తున్నవారిలో ఎన్నో ఆందోళనలు ఎదుర్కోవడం చూస్తున్నాం. ఈ ఆందోళన స్థాయి వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సమస్యను సాల్వ్ చేసుకోవడానికి టాబ్లెట్స్ను ఆశ్రయించేవారు పెరుగుతున్నారు. శరీరానికి ఏ కొద్దిగా కెమికల్ను బయట నుంచి అలవాటు చేసినా మైండ్ మరికొంత మోతాదు పెంచేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా కెమికల్ మోతాదు శరీరంపై చెడు ప్రభావం చూపడానికి దోహదం చేస్తాయి. సహజమే కానీ.. ఈ సమస్యను ఎదుర్కొనేవారిలో అధిక శాతం చదువుకున్నవారే. ‘ఇదేమీ చెడు అలవాటు కాదు కదా! నేను సరైన విధంగా మానేజ్ చేసుకోగలుగుతున్నాను కదా’ అనుకుంటారు. బయటి వాళ్లకు కూడా వీళ్లు ‘పిల్స్’వాడుతున్నారనే విషయం తెలియదు. కొంత కాలం బాగానే గడిచిపోతుంది. కానీ, సమస్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఏ వ్యక్తిలో అయినా భావోద్వేగాలు మారిపోతుండటం సహజంగా జరుగుతుంది. కొందరు మాత్రం ప్రతిదానికి ఆందోళన పడే వారుంటారు. మన వ్యక్తిత్వం ఇలాంటిది అని అర్థం చేసుకొని, ఈ సమస్యనుం బయటకు రావడానికి నిపుణులు సాయం తీసుకోవాలి. కొందరికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. వీటిని అధిగమించడానికి కూడా టాబ్లెట్స్ని ఆశ్రయిస్తుంటారు. ఇవీ వనసిక సమస్యలే అని గుర్తించాలి. బయటపడాలంటే టెక్నిక్స్: మనకు తెలియదు కానీ, చాలామంది మహిళల పర్సులలో కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. అవి, పెయిన్ కిల్లర్స్, మూడ్ స్టెబిలైజర్స్, స్ట్రెస్ పిల్స్, స్లీపింగ్ పిల్స్... వంటి వాటిలో ఏవైనా ఉండచ్చు. ముందుగా వాటిని బయట పడేయాలి. ఏ సమస్య బాధిస్తోందో దానిని కుటుంబ సభ్యుల మధ్య లేదా నిపుణుల ముందు వ్యక్తం చేయాలి. ఆ సమస్యకు సంబంధించిన బ్లాక్స్ను క్లియర్ చేసుకుంటే సులువుగా బయటపడచ్చు. ప్రతి ఒక్కరిలోనూ సాధారణ ఆందోళనలు ఉంటాయి. కానీ, కొంతమంది మాత్రం ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడిపోతుంటారు. ఇది కొన్నిరోజులకు పెద్ద ఆందోళనగా వరుతుంటుంది. ఆందోళన తగ్గించుకోవడానికి పిల్స్ వాడకం బదులు, దానిని అధిగమించేలా మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. శరీరం కెమికల్ మీద ఎంతవరకు డిపెండ్ అయిందో గుర్తించి దానిని బ్రేక్ చేస్తాం. మైండ్ను రిలాక్స్గా ఉంచే యోగా, ధ్యానంతోపాటు సరైన పోషకాహారం మీదా దృష్టి పెట్టాలి. శరీరం బయట నుంచి తీసుకునే కెమికల్ కాకుండా సహజసిద్ధంగా మార్పులకు లోనయ్యేలా అలవాటు చేసుకున్నప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ రీ యాక్టివేట్ అవుతుంది. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
నేను ప్రెగ్నెంట్ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?
నేను ప్రెగ్నెంట్ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా? – ప్రమోద, నెల్లూరు హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువ ఉన్నప్పుడు మొదటి మూడు నెలల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏడవ నెల నుంచి ప్రసవం వరకు కనీసం 10.5గ్రాములు ఉండాలి. ఇది బ్రిటిష్ కమిటీ ఫర్ స్టాండర్డ్ ఇన్ హెమటాలజీ గైడ్లైన్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ.. ప్రసవంలో కూడా ఫాలో కావాలి. ప్రసవం తరువాత పది గ్రాముల కన్నా తక్కువ ఉంటే కచ్చితంగా మాత్రలు ఇవ్వాల్సిందే. రక్తహీనత వల్ల ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు ప్రసవం తర్వాతా చాలా సమస్యలు వస్తాయి. ఓరల్ థెరపీ అంటే ఓరల్ ఐరన్ మాత్రలను ముందుగా రెండువారాల పాటు ఇస్తారు. వాటితో హిమోగ్లోబిన్ కనుక పెరిగితే తర్వాత మాత్రలను వాడాల్సిన అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీలో అందరికీ 28 వారాలకు సీబీపీ .. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రక్త పరీక్ష చేయాలి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫొరీసస్ అనే రక్తపరీక్షనూ తప్పకుండా చేయించాలి. ఈ టెస్ట్ ద్వారా పుట్టుకతో వచ్చే జెనెటిక్ సమస్యలు సికిల్ సెల్ అనీమియా, తలసీమియావంటి వ్యాధులను.. క్యారియర్ స్టేటస్ని కనిపెట్టవచ్చు. ఈ వ్యాధులు/క్యారియర్స్గా ఉన్నవారికి ఓరల్ థెరపీతో, డైట్తోనే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలా తీసుకుంటేనే అసిడిటీ సమస్యలు తగ్గుతాయి ఐరన్ పెరగడానికి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అలాచేస్తే వాళ్లకు ఐరన్ ఓవర్లోడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మీకు ఆ బ్లడ్ టెస్ట్ చేసి చికిత్స మొదలుపెట్టటం మంచిది. ఈ వైద్య పరీక్షలో కేవలం ఐరన్ లోపం మాత్రమే ఉందని తేలితే అప్పుడు ఐరన్ స్టడీస్ చేస్తారు. సరైన ప్రిపరేషన్తో చికిత్స చేస్తే ఈ ఐరన్ లోపం సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ ఐరన్ మాత్రలను విటమిన్ సీతో గానీ, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్తో గానీ తీసుకుంటే ఆ మాత్రలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఐవీ ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పనిచేస్తాయి. కొంతమందికి కిడ్నీ పరీక్షలనూ సూచిస్తారు. రేనల్ అనీమియా అనేదాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే పేషంట్ పరిస్థితిని బట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తాం. మొదటి మూడునెలల్లో హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కన్నా తక్కువగా ఉంటే హెమటాలజిస్ట్ / ఫిజీషియన్ను సంప్రదించి డైట్, ఐరన్ మాత్రలతో చికిత్స మొదలుపెట్టడం వల్ల ఇటు బిడ్డకు, అటు తల్లికి వచ్చే సమస్యలను నివారించగలుగుతాం. తలనొప్పి, శ్వాస ఆకడపోవడం.. అనీమియాతో బాధపడుతున్న తల్లిలో.. నీరసం, పాల్పిటేషన్స్, తలనొప్పి.. వంటివి ఎక్కువ. శ్వాస ఆడకపోవడం.. కాళ్ల వాపులూ రావచ్చు. బిడ్డ పుట్టిన తరువాత హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండొచ్చు. ప్రసవం తరువాత పాస్ట్పార్టమ్ హేమరేజ్, అబ్రప్షన్ చాన్సెస్ పెరుగుతాయి. అందుకే రక్తహీనతను గుర్తించిన వెంటనే దానికి చికిత్సను అందించాలి. మాత్రలు ఇవ్వాలి. ఒకవేళ దద్దుర్లు వంటి రియాక్షన్ ఏదైనా వస్తే వేరే ప్రిపోజిషన్ని ప్రయత్నించాలి. ఇలా రక్తహీనతకు తగిన చికిత్సతో తల్లి ఆరోగ్యాన్ని కాపాడ్డమే కాదు పండంటి బిడ్డనూ కనొచ్చు. (చదవండి: నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement